Top Stories
ప్రధాన వార్తలు

పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత
సాక్షి, ఖమ్మం: జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న మొక్కల ప్రేమికుడు ఈయన. కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది.

డీఎంకే మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు.. పార్టీ పదవి నుంచి తొలగింపు
చెన్నై: శైవ, వైష్ణవాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధిష్టానం పార్టీ పదవి నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. పొన్ముడిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అయితే, శైవ, వైష్ణవాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే క్రమంలో మహిళలను కూడా అవమానించేలా పొన్ముడి మాట్లాడారు. పలువురు మహిళలను ఉదహరిస్తూ ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యల తాలూకు వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వాటిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొన్ముడి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. మరోవైపు.. ఆయనను మంత్రి పదవి నుంచి కూడా వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు. హిందూ ధర్మంపై దాడులు చేస్తున్న డీఎంకే వ్యవస్థ ఆసాంతం అసభ్యకరంగా తయారైందన్నారు. పొన్ముడికి వివాదాలు కొత్తేమీ కాదు. హిందీ మాట్లాడే వారినుద్దేశించి పానీపురీ అమ్ముకుంటారంటూ గతంలోనూ ఆయన అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తమిళనాడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. This is DMK’s standard of political discourse in Tamil Nadu. Thiru Ponmudi was once the Higher Education Minister of Tamil Nadu & now Minister for Forests and Khadi, and the youth of Tamil Nadu are expected to tolerate this filth? Not just this Minister, the entire DMK ecosystem… pic.twitter.com/ENMq47hiPf— K.Annamalai (@annamalai_k) April 11, 2025కాగా.. పొన్ముడి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చడం విమర్శలకు దారితీసింది. ఇక, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయనకు మద్రాసు హైకోర్టు జైలుశిక్ష కూడా విధించింది. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. అనంతరం శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తిరిగి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.

రాణా గుప్పిట కీలక రహస్యాలు!
పదిహేడేళ్ల క్రితం ముంబై మహానగరంలో 10 మంది ఉగ్రవాదులు 78 గంటలపాటు విచక్షణా రహితంగా దాడులకు తెగబడి 166 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర ఉదంతంలో కీలక కుట్ర దారైన తహవ్వుర్ రాణా ఎట్టకేలకు మన దేశంలో అడుగుపెట్టాడు. రానున్న 18 రోజుల్లో మన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో అతగాడు ఆ ఘోర ఉదంతానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తాడన్నది చూడాలి. ఆ ఉగ్రవాదులు బాంబులూ, ఇతర మారణాయుధాలతో పాకి స్తాన్లోని కరాచీ నుంచి సముద్ర మార్గంలో ముంబై చేరుకుని ఆ నగరంలో అనేకచోట్ల తుపాకు లతో, గ్రెనేడ్లతో చెలరేగిపోయారు. ఆ దాడుల్లో సాధారణ పౌరులూ, కర్కరే వంటి పోలీస్ ఉన్నతాధి కారులూ ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదిమంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హత మార్చగా, ఉగ్రవాది కసబ్ పట్టుబడ్డాడు. విచారణానంతరం 2012లో అతన్ని ఉరితీశారు. రాణా వెల్లడించేఅంశాలు మన నిఘా వర్గాల దగ్గరున్న సమాచారంతో ధ్రువీకరించుకోవటానికీ, మరో ఉగ్రవాది, ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న డేవిడ్ హెడ్లీపై మరిన్ని వివరాలు రాబట్టడానికీ తోడ్పడుతాయి.రాణా అప్పగింత అతి పెద్ద దౌత్యవిజయమని మన ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు అమెరికా కూడా ఉగ్రదాడుల్లో హతమైనవారికీ, ఇతర బాధితులకూ న్యాయం చేకూర్చటంలో ఇది కీలకమైన ముందడుగని ప్రకటించింది. కావచ్చు. అయితే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై చెబుతున్నట్టు ‘అతగాడి దగ్గర చెప్పడానికేం లేదు గనుకనే...’ అప్పగించారా? రాణా పాత్ర కూడా తక్కువేం కాదు. దాడులకు పక్షం రోజుల ముందు భార్యతో కలిసి ముంబైలో చాలా ప్రాంతాలు వెళ్లి చూశాడు. అతను ఎంపిక చేసిన ప్రాంతాలను హెడ్లీ భార్యాసమేతంగా వచ్చి తనిఖీ కూడా చేశాడు. ఇంచుమించు ఆ ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. రాణా ముంబైతోపాటు ఢిల్లీ, కొచ్చి వంటి నగరాలకు కూడా పోయాడు. 1971 నాటి యుద్ధవీరులకై నిర్మించిన ముంబైలోని జల వాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్లో భార్యతో కలిసి బస చేశాడు. ఆ కాంప్లెక్స్ పేల్చివేతకు అవకాశం ఉందా లేదా చూసుకుని, అసాధ్యమని నిర్ణయించుకున్నాక భారత్ నుంచి వెళ్లిపోయాడని అంటారు. పిళ్లై వాదన పూర్తిగా కొట్టిపారేయదగింది కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో రాణాతో పోలిస్తే అసలు సిసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ. ప్రస్తుతం రాణా అప్పగింత కీలకమైన ముందడుగుగా చెబుతున్న అమెరికా హెడ్లీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకంటే అతగాడు అమెరికా మాదకద్రవ్య నియంత్రణ విభాగం (డీఈఏ) ఏజెంట్గా పని చేశాడు. అదే సమయంలో ఐఎస్ఐకీ, లష్కరే తొయిబా (ఎల్ఈటీ)కీ కూడా ఏజెంట్గా ఉన్నాడు. ఇవన్నీ అమెరికా నిఘా సంస్థలకూ తెలుసు. అంతేకాదు... ముంబై మారణకాండ పథక రచన మొదలుకొని అన్ని విషయాలపైనా అమెరికా దగ్గర ముందస్తు సమాచారం వుంది. ఆ సంగతలా వుంచి భారత్లో సేకరించిన సమస్త సమాచారాన్నీ, ముంబైకి సంబంధించిన జీపీఎస్ లోకేషన్లనూ హెడ్లీకి రాణా అందించాడు. దాని ఆధారంగానే కొలాబా తీరప్రాంతంలోని బధ్వర్ పార్క్ దగ్గర ఉగ్రవాదులు బోట్లు దిగారు. రాణా ఇచ్చిన సమాచారాన్ని హెడ్లీ పాకిస్తాన్ పోయి అక్కడ ఐఎస్ఐ తరఫున తనతో సంప్రదిస్తున్న మేజర్ ఇక్బాల్ అనే వ్యక్తికి అందజేశాడని ఇప్పటికే మన నిఘా సంస్థలకు రూఢి అయింది. ఉగ్రవాదులకు ఐఎస్ఐ ఇచ్చిన శిక్షణేమిటో హెడ్లీకి తెలుసు. వీటిపై అమెరికా భద్రతా సంస్థలకు క్షణ్ణంగా తెలిసినా మన దేశాన్ని ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదన్న సంశయాలున్నాయి. ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అమెరికా ఏవో సాకులు చెబుతోందన్నది వాస్తవం. సందేహం లేదు... రాణా కన్నా హెడ్లీ అత్యంత కీలకమైనవాడు. అతను ఎల్ఈటీలో చేరడమే కాక, ముంబై దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, లఖ్వీల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ముంబై దాడుల సమయంలో దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉగ్రవాదులకు ఎప్పటి కప్పుడు ఫోన్లో లఖ్వీ ఆదేశాలివ్వటం వెనక హెడ్లీ ప్రమేయం వుంది. తమకు ఏజెంటుగా పని చేసినవాడిని అప్పగించరాదని అమెరికా భావించటం మూర్ఖత్వం. అదే పని భారత్ చేస్తే అంగీకరించగలదా? హెడ్లీని అప్పగిస్తే తమ గూఢచార సంస్థల నిర్వాకం బయటపడుతుందని అది సంకోచిస్తున్నట్టు కనబడుతోంది. రాణా అప్పగింత ప్రక్రియ తమ హయాంలోనే మొదలైందని గర్వంగా చెబుతున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హెడ్లీ విషయంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలి. వికీలీక్స్ పత్రాలు ఈ సంగతిని చాన్నాళ్ల క్రితమే వెల్లడించాయి. హెడ్లీ అప్పగింతకు పట్టుబట్టవద్దని అప్పటి మన జాతీయ భద్రతాసలహాదారు ఎంకే నారాయణన్ను నాటి అమెరికా రాయబారి తిమోతీ రోమెర్ కోరినట్టు అందులో ఉంది. అలా అడిగినట్టు కనబడకపోతే తమకు ఇబ్బందులొస్తాయని నారాయణన్ బదులిచ్చినట్టు కూడా ఆ పత్రాల్లో ఉంది. హెడ్లీ ఎలాంటివాడో అతని కేసులో 2009లో తీర్పునిచ్చిన అమెరికా న్యాయమూర్తే చెప్పారు. ‘హెడ్లీ ఉగ్రవాది. అతని నుంచి ప్రజలను రక్షించటం నా విధి. మరణశిక్షకు అన్నివిధాలా అర్హుడు. కానీ ప్రభుత్వ వినతి మేరకు 35 ఏళ్ల శిక్షతో సరిపెడుతున్నాను’ అన్నారాయన. ఎటూ పాకిస్తాన్ తన రక్షణలో సేద తీరుతున్న లఖ్వీ, సయీద్లను అప్పగించదు. ఆ దేశంతో మనకు నేరస్థుల అప్పగింత ఒప్పందం కూడా లేదు. కానీ అమెరికాతో ఆ మాదిరి ఒప్పందం ఉంది గనుక హెడ్లీ కోసం మన దేశం గట్టిగా పట్టుబట్టాలి. అది సాధిస్తేనే నిజమైన విజయం దక్కినట్టవుతుంది.

ఒక్క క్లిక్తో క్షణాల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11గం. సమయంలో రిజల్ట్స్ను వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్తో www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే.. ఇంటర్లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించనున్నారు. AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్ చేయండి.➤ "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్పై క్లిక్ చేయండి.➤ మీ హాల్టికెట్ నెంబర్ను ఎంటర్ చేయండి.➤ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ను క్లిక్ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్లో ఫలితాలు డిస్ప్లే అవుతాయి.➤ భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి.

సన్రైజర్స్కో విజయం కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్లలో పరాజయం... భారీ అంచనాలు పెట్టుకున్న టాప్–3 వరుసగా విఫలం...టోర్నీలో అన్ని జట్లకంటే చెత్త ఎకానమీ (10.73) నమోదు చేసిన బౌలర్లు... బౌలింగ్ సగటు కూడా అన్నింటికంటే ఎక్కువ (41.47)... బ్యాటర్ల నుంచి పరుగులు రావడం లేదు... బౌలర్ల ప్రదర్శన పేలవం... ఇలా అన్నీ సమస్యలే! ఇలాంటి స్థితిలో సన్రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో నేడు జరిగే సమరంలో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ తలపడుతుంది. ఆడిన నాలుగు మ్యాచ్లో మూడు విజయాలతో ఫామ్లో ఉన్న పంజాబ్ను రైజర్స్ ఏమాత్రం నిలువరిస్తుందనేది చూడాలి. మ్యాచ్ ముందు రోజు నగరంలో కాస్త చల్లటి వాతావరణం ఉన్నా... శనివారం రోజు వర్షసూచన లేదు. వరుస వైఫల్యాలు... హైదరాబాద్లో ఆడిన తొలి మ్యాచ్లో రాజస్తాన్పై 286 పరుగుల స్కోరుతో సీజన్ను సన్రైజర్స్ ఘనంగా ప్రారంభించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి నాలుగు మ్యాచ్లలో జట్టు వరుసగా 190, 163, 120, 152 పరుగులు చేసింది. అయితే ఇవేవీ విజయానికి సరిపోలేదు. తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీని మినహాయిస్తే ఓవరాల్గా ఈ నాలుగు మ్యాచ్లలో కలిపి రైజర్స్ నుంచి 2 అర్ధసెంచరీలు నమోదయ్యాయి. క్లాసెన్ గరిష్టంగా 152 పరుగులే చేయగా... హెడ్ 148, అభిషేక్ 51 పరుగులు సాధించడం బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. నితీశ్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. స్కోర్లు మాత్రమే కాదు, జట్టు ఆటగాళ్లలో ఒక రకమైన నిరాసక్తత కనిపిస్తోంది. మైదానంలో చురుకుదనం లోపించగా... గత ఏడాది తరహాలో పరుగులు సాధించాలనే తపన, కసి బ్యాటర్లలో కనిపించడం లేదు. వరుస ఓటముల ప్రభావం కూడా ఆటగాళ్లపై పడింది.అయితే దీని నుంచి కోలుకొని మళ్లీ చెలరేగేందుకు ఈ మ్యాచ్కు మించి మంచి అవకాశం లభించదు. కెపె్టన్ కమిన్స్ వికెట్లు తీయకపోవడంతో పాటు ఏకంగా 11.16 ఎకానమీతో పరుగులు ఇస్తున్నాడు. షమీలాంటి ప్రధాన పేసర్ కూడా 9.29 ఎకానమీతో పరుగులు ఇవ్వడం చూస్తే బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. ఈసారి ఓడితే మాత్రం కోలుకొని ప్లే ఆఫ్స్ రేసులోకి రావడం సన్రైజర్స్కు దాదాపు అసాధ్యం కావచ్చు. జోరు మీదున్న కింగ్స్... శ్రేయస్ అయ్యర్, ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య... పంజాబ్ గెలిచి మూడు మ్యాచ్లలో వీరు ముగ్గురు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచిన ఆటగాళ్లు. అంటే జట్టు ఏ ఒక్కరి బ్యాటింగ్పైనే ఆధారపడటం లేదు. పరిస్థితిని బట్టి ఒక్కో ప్లేయర్ బాధ్యత తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురికి తోడు నేహల్ వధేరా, శశాంక్ సింగ్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అద్భుత ఫామ్లో ఉన్న అయ్యర్ 200 పరుగులు స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించాడు. స్టొయినిస్, మ్యాక్స్వెల్లాంటి ఆటగాళ్లు రాణించకపోయినా పంజాబ్ మెరుగైన స్థితిలో ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే జట్టు మరో సారి భారీ స్కోరు సాధించడం ఖాయం. బౌలింగ్లో అర్ష్ దీప్, ఫెర్గూసన్ ముందుండి నడిపిస్తుండగా... యశ్ ఠాకూర్ కూడా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 ఓవర్లు వేసి ఒకే ఒక వికెట్ తీసిన చహల్ మాత్రం ఇంకా లయ అందుకోలేదు. అతనూ రాణిస్తే రైజర్స్ను కట్టడి చేయవచ్చు. తుది జట్లు (అంచనా) సన్రైజర్స్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్, కమిందు, అన్సారీ, హర్షల్, షమీ, రాహుల్ చహర్. పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్, వధేరా, శశాంక్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, యాన్సెన్, చహల్, అర్ష్ దీప్, ఫెర్గూసన్, యశ్ ఠాకూర్.

ఎండల్లో చెప్పులు లేకుండా తమన్నా నటించారు: డి. మధు
‘‘ఓదెల 2’ చిత్రకథ వినగానే తమన్నా ఎగ్జైట్ అయ్యారు. తొలిసారి ఆమె నాగసాధువు పాత్ర చేశారు. అద్భుతంగా నటించడంతో పాటు ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారామె. ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనూ చెప్పులు లేకుండా షూటింగ్లో పాల్గొన్నారు. సరైన టైమ్లో సరైన కథ తమన్నా దగ్గరకెళ్లిందని నమ్ముతున్నాను’’ అని నిర్మాత డి. మధు అన్నారు. తమన్నా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, హిందీలో విడుదలవుతోంది.ఈ సందర్భంగా డి. మధు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీ నాకు బాగా నచ్చింది. అనుకోకుండా ఓ రోజు సంపత్ నందిగారు ‘ఓదెల 2’ కథని నాకు చెప్పడం... చాలా నచ్చడంతో ఈప్రాజెక్టు మొదలైంది. ‘ఓదెల 2’ కథ లాజికల్గా ఉంటుంది. అశోక్ తేజ చక్కగా తీశారు. ఇందులో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తాయి.అజినీష్ లోక్నాథ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం చాలా బాగుంటాయి. సౌందర్ రాజన్గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వశిష్ఠ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, హెబ్బా పటేల్ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని, అలాగే మంచి సక్సెస్ అందుకోవాలనే ప్యా షన్తో బడ్జెట్ గురించి ఆలోచించకుండా ‘ఓదెల 2’ని గ్రాండ్గా తీశాం. ఇక భావోద్వేగాలున్న చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్ కథలంటే నాకు ఇష్టం’’ అన్నారు.

అప్పు చేసి ఫీజులు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన మన పార్టీ కార్యకర్త కుమార్తె పి.పుష్పిత నూజివీడు పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. రూ.30 వేలు ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు. దయచేసి హాల్ టికెట్ ఇప్పించి పరీక్ష రాసేలా సాయం చేయగలరని ప్రార్థన..! – మంత్రి లోకేశ్కు ‘ఎక్స్’ ఖాతాలో ఓ టీడీపీ కార్యకర్త అభ్యర్థన ఇదీ!! పిల్లల ఫీజుల విషయం రచ్చకెక్కడంతో వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఆ ఒక్క విద్యార్థినికి మాత్రం హాల్టికెట్ విడుదల చేసింది. కానీ ఫీజులు మంజూరుకాక, కాలేజీకి వెళ్లలేక మౌనంగా కుమిలిపోతున్న లక్షల మంది పిల్లల గోడును పట్టించుకునేవారే కరువయ్యారు. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఫీజు డబ్బులు అందుకుని ఆత్మ విశ్వాసంతో చదువులపై దృష్టి సారించిన విద్యార్థులంతా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దిక్కు తోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఒకపక్క విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఫీజుల డబ్బులు అందకపోవడం, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతుండగా.. కొందరు విద్యార్థులు చదువులకు దూరమై కూలీలుగా మారిపోయి పొలం పనులకు వెళుతున్న దుస్థితి మళ్లీ కనిపిస్తోంది. రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.7,800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా వసతి దీవెన కింద ఏప్రిల్లో మరో రూ.1,100 కోట్ల చొప్పున హాస్టల్ ఖర్చుల కోసం అందచేయాలి. అంటే ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు విద్యార్థులకు ఇవ్వాలి. మొత్తంగా రెండేళ్లలో రూ.7,800 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పలు దఫాలు తల్లిదండ్రులు, పిల్లలు నిలదీయడంతో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా అవి తమకు చేరలేదని చాలా కాలేజీలు అంటున్నాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఫీజులకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాజకీయాలకు అతీతంగా చదువులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పిల్లలను బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల వేధింపులపై ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎక్కడా స్పందన కనిపించట్లేదు. పైగా దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యా మండలి అధికారాలకు త్వరలో కత్తెర వేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. క్వార్టర్కే దిక్కులేదు.. సెమిస్టర్ బాంబు..! గత ప్రభుత్వం విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పిస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఫీజులను విద్యార్థుల తల్లులు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానాన్ని తెచ్చింది. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడంతో కళాశాలలపై ఆర్థిక భారం చాలావరకు తగ్గింది. టీడీపీ కూటమి సర్కారు వచ్చాక పారదర్శకతకు పాతరేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకే ఫీజులు చెల్లిస్తామని చెప్పి అది కూడా అమలు చేసిన పాపాన పోలేదు. త్రైమాసికం వారీగా ఫీజులు చెల్లించటానికే ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇకపై సెమిస్టర్ వారీగా ఇస్తామని ప్రకటించడంతో ప్రైవేట్ విద్యా సంస్థల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేట్ పీజీ రీయింబర్స్మెంట్ గాలికి.. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలిచ్చారు. దీన్ని నమ్మి ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా అప్పులు చేసి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.3 వడ్డీకి రూ.20 వేలు అప్పు చేశా మా అమ్మాయి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో మూడు రూపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పు చేసి కాలేజీకి కట్టా. ప్రతి నెలా రూ.600 వడ్డీ కడుతున్నా. నా భర్త పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యాడు. పనులు దొరకడం లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. – కె.కుమారి, ఇంటర్ విద్యార్థిని తల్లి, విజయవాడ అప్పు చేసి రూ.40 వేలకు పైగా కట్టాంతిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి రూ.40 వేలకు పైగా కాలేజీకి కట్టాం. నా భర్త మేస్త్రీ పని చేస్తారు. ఆయన కూలితోనే కుటుంబం గడవాలి. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే ఆశతో పెద్దబ్బాయిని ఇంజనీరింగ్లో చేర్పించాం. ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. ఇంకో అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. – ప్రభావతమ్మ, ఇంజినీరింగ్ విద్యార్థి తల్లి, తిరుపతి జగన్ హయాంలో ఆదుకున్నారిలా..జగనన్న విద్యా దీవెన: రూ.12,609.68 కోట్లు వసతి దీవెన : రూ.4,275.76 కోట్లు 2017-19 మధ్య టీడీపీ పెట్టిన బకాయిల చెల్లింపు: రూ.1,778 కోట్లు ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.18,663.44 కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ - ఎంటీఎఫ్) విభాగం చెల్లింపులు(ఒక్కో విద్యార్థికి) ఐటీఐ రూ.10 వేలు పాలిటెక్నిక్ రూ.15 వేలు డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు రూ.20 వేలు (నోట్: వీలైనంత ఎక్కువ మందిని అర్హులుగా చేర్పించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలకు ఉండేది. 2019 - 24 మధ్య వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధి చేకూర్చారు)

ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: పౌర్ణమి తె.4.22 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: హస్త సా.5.11 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: రా.2.01 నుండి 3.44 వరకు,దుర్ముహూర్తం: ఉ.5.47 నుండి 7.26 వరకు, అమృతఘడియలు: ఉ.10.34 నుండి 12.22 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10.మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. విందువినోదాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అరుదైన పురస్కారాలు.వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనులలో అవాంతరాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో మార్పులు.కర్కాటకం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.కన్య: శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి.గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.తుల: ధనవ్యయం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు.వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో ఊహించని ఉన్నతి.ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు.సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.మకరం: కొత్తగా అప్పులు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పదు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.కుంభం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.మీనం: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. దైవదర్శనాలు. ఆస్తిలాభ సూచనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి. ఏ కారణాలూ చూపకుండా వారి వీసాలను రద్దు చేయడం, సంబంధిత యూనివర్సిటీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వారి స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సి స్టం (సెవిస్) రికార్డులను గల్లంతు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వి భాగానికి సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. డీహెచ్ఎస్ మంత్రి క్రిస్టీ నోయెమ్తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కూడా లేఖ ప్రతిని పంపాయి. విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్ మిషెల్ డిమాండ్ చేశారు. ‘‘స్వీయ డీపో ర్టేషన్ ద్వారా దేశం వీడండంటూ విద్యార్థులకు వస్తున్న ఈ మెయిళ్లు, మెసేజీల ద్వా రా మాత్రమే విషయం తెలుస్తోంది. అందుకు కారణాలైనా చెప్పకపోవడం మరీ దారుణం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభ్యంతరకర సోషల్ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం దారుణం’’అంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘మీ తీరుతో అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది మన దేశానికి కూడా మంచిది కాదు’’అని ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం 300 మందికి పైగా పాలస్తీనా సానుభూతిపరులైన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు రూబి యో ఇటీవల వెల్లడించారు. గతంలో ఏ కారణంతోనైనా విద్యార్థి వీసాలను రద్దు చేసినా విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఇప్పుడు మాత్రం వీసా రద్దుతో పాటు సెవిస్ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో బాధిత విద్యార్థులు తక్షణం అమెరికాను వీడటం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. వర్సిటీల్లోనూ ఆందోళన విద్యార్థి వీసాల రద్దు అమెరికా యూనివర్సిటీలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. చాలాసార్లు ఈ ఉదంతాలు తమ దృష్టికి కూడా రావడం లేదని ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ పేర్కొంది. ‘‘మేం స్వయంగా పూనుకుని మా విద్యార్థుల రికార్డులను పరిశీలించాల్సి వస్తోంది. మా వర్సిటీకీ చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్న మరో ఇద్దరి వీసాలను రద్దు చేసినట్టు తెలియగానే వారికి న్యాయ సాయాన్ని సిఫార్సు చేశాం’’అని వెల్లడించింది. అరిజోనా స్టేట్ వర్సిటీలో 50 మంది విదేశీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదరైంది. వారి వీసాల రద్దుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నార్త్ ఈస్టర్న్ వర్సిటీలోనూ 40, కాలిఫోర్నియా వర్సిటీలో 35 మంది విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మసాచుసెట్స్ వర్సిటీ చాన్స్లర్ వాపోయారు. విదేశీ విద్యార్థులే కీలకం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్ డోర్స్’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టమని అక్కడి విద్యా సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

కౌంట్ డౌన్: ఐకానిక్ మహిళల అంతరిక్ష యాత్ర
ఆరుగురు ఐకానిక్ మహిళలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్ లేకుండానే పనిచేస్తుంది. సబ్ ఆర్బిటల్ ప్రయాణానికి ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు. సుమారు 11 నిమిషాల పాటు పయనించి భూమికి 62 మైళ్ల ఎత్తులో ఉన్న కార్మాన్ రేఖను దాటుతుంది. దీన్ని అంతరిక్షానికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు.ఈ ప్రయాణంలో ప్రయాణికులు గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభూతిని పొందుతారు. క్యాప్సూల్కు సంబంధించిన పెద్ద కిటికీల ద్వారా భూమి విహంగ వీక్షణను ఆస్వాదిస్తారు. ‘న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్’ను చిన్న చిన్న గగన యాత్రల కోసం రూపొందించారు. ఇది బిఇ–3 పిఎమ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ ఎన్.ఎస్.–31 మిషన్ టెక్నాలజీ ఫీట్ మాత్రమే కాదు ఒక చారిత్రాత్మక ఘట్టం కూడా.‘నా భయాన్ని పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తున్నాను’ అంటోంది గేల్ కింగ్.‘కాస్త భయంగా ఉంది. అయినా చాలా ఉత్సాహంగా ఉంది’ అంటోంది లారెన్ సాంచెజ్.ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఆరుగురు ఐకానిక్ మహిళల అంతరిక్షయాత్ర హాట్ టాపిక్గా మారింది.అయేషా బోవ్నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయిన అయేషా బోవ్ మిచిగన్ యూనివర్శిటీ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో డిగ్రీ, స్పేస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసే ‘స్టెమ్ బోర్డ్’ అనే ఇంజినీరింగ్ కంపెనీకి అయేషా బోవ్ సీఈవో.అమంద గుయెన్హార్వర్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్లో పనిచేసింది అమంద గుయెన్. లైంగిక బాధితులకు అండగా నిలబడి పోరాడిన గుయెన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. టైమ్ మ్యాగజైన్ ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్కు ఎంపికైంది. తొలి వియత్నామీస్, ఆగ్నేయాసియా మహిళా వ్యోమగామిగా ఈ అంతరిక్ష యాత్రతో గుయెన్ చరిత్ర సృష్టించనుంది. ‘సేవింగ్ ఫైవ్: ఎ మెమోరియల్ ఆఫ్ హోప్’ అనే పుస్తకాన్ని గత నెలలో విడుదల చేసింది.లారెన్ సాంచెజ్ లారెన్ సాంచెజ్ రచయిత్రి, పాత్రికేయురాలు. ఎన్నో వార్తా సంస్థలలో యాంకర్గా పనిచేసింది. లారెన్ హెలికాప్టర్ పైలట్ కూడా. ‘బ్లాక్ ఆప్స్ ఏవియేషన్’ సంస్థను స్థాపించింది. ఇది మహిళా యాజమాన్యంలో నిర్వహితమవుతున్న తొలి ఏరియల్ ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ. ‘ది ఫ్లై హూ ఫ్లై టు స్పేస్’లాంటి ఎన్నో పిల్లల పుస్తకాలు రాసింది.గేల్ కింగ్మేరీల్యాండ్ యూనివర్శిటీ నుండి సైకాలజీలో పట్టా పొందిన గేల్ కింగ్కు రేడియో, టెలివిజన్, ప్రింట్ మీడియాలలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ‘గేల్ కింగ్ ఇన్ ది హౌజ్’ అనే రేడియో షోని హోస్ట్ చేసింది. ఉత్తమ రేడియో టాక్ షో కోసం ఇచ్చే ‘అమెరికన్ ఉమెన్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ గ్రేసి అవార్డ్’ను సొంతం చేసుకుంది. టైమ్ మ్యాగజైన్ ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2019’లో చోటు సాధించింది.కేటీ పెర్రీఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్లలో పాప్ స్టార్ కేటీ పెర్రీ ఒకరు. 2010లో విడుదలైన ఆమె మొదటి ఆల్బమ్ రికార్డ్లు బ్రేక్ చేసింది. 13 గ్రామీ అవార్డ్లకు కేటీ నామినేట్ అయింది. బిల్బోర్డ్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్–2012’ అవార్డ్ అందుకుంది. ‘ఫైర్ వర్క్ ఫౌండేషన్’ మొదలుపెట్టి యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా సేవలు అందిస్తోంది.కెరియానే ప్లిన్కెరియానే ప్లిన్ నిర్మాత. డాక్యుమెంటరీలు, చిత్రాలు తీసింది. హాలీవుడ్లో ఆమె తీసిన దిస్ చేంజెస్ ఎవ్రీ థింగ్ (2018), లిల్లీ (2024) చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్లిన్కు అంతరిక్ష ప్రయాణాలపై ఆసక్తి. ‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అంటోంది తన అంతరిక్ష ప్రయాణం గురించి.
బెస్ట్ ఎయిర్పోర్టు ‘చాంగీ’
ఒమన్లో నేడు ఇరాన్–అమెరికా అణు చర్చలు
బెంగాల్లో ‘వక్ఫ్’ ఉద్రిక్తతలు
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
అధ్యక్ష బరిలో మ్యుంగ్
ఎయిర్పోర్ట్ ఆపరేటర్ల ఆదాయాలు రయ్..
జోరుగా గ్యాస్ వినియోగం
తెలుగు పంచాయితీ తేలేదెన్నడు?
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
ఐపీఎల్కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్పై ఏడాది నిషేధం
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
వచ్చేవారం స్టాక్మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
వరుస షాక్లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
అంతుచిక్కని ఆచూకీ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది?
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’
గూగుల్లో ఆగని లేఆఫ్లు.. మళ్లీ వందలాది తొలగింపులు
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్లో సంచలన విషయాలు
బట్టతల పర్లేదు..! ఎయిర్పోర్ట్లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
2035 కల్లా భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లు
ఖజానాకు భూమ్
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ప్లాట్ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
ఇక చంద్రుడే కనిపిస్తాడు!
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్పై ఫ్యాన్స్ ఫైర్
నేడు, రేపు వానలు
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
టార్గెట్ చైనా ఎందుకంటే..!
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
తెలంగాణ పంటల విధానం మారాలి!
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో దిల్ రాజు భేటీ!
నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
AP: రియల్.. ఢమాల్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
నాడు కసబ్ కోసం పెట్టిన ఖర్చు ఇదే.. ఇప్పుడు రాణా కోసం ఇంకెంత ఖర్చు చేయాలో?
రెండోసారి విడాకులు.. నాతో ఎవరూ పనిచేయట్లేదు: నటి ఆవేదన
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్లోకి..
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్పై ఫ్యాన్స్ ఫైర్
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
సీఎస్కేతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ ఓపెనర్ పై వేటు! అతడి ఎంట్రీ?
భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి సేఫ్టీ నెట్లోకి..!
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
జగన్ అద్భుత నాయకుడు
అప్పు చేసి ఫీజులు
ఎల్2 ఎంపురాన్ మరో రికార్డ్.. 15 రోజుల్లోనే వంద కోట్ల మార్క్!
BCCI: హై పెర్ఫార్మెన్స్ శిబిరానికి త్రిష, ధృతి
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
బెస్ట్ ఎయిర్పోర్టు ‘చాంగీ’
ఒమన్లో నేడు ఇరాన్–అమెరికా అణు చర్చలు
బెంగాల్లో ‘వక్ఫ్’ ఉద్రిక్తతలు
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
అధ్యక్ష బరిలో మ్యుంగ్
ఎయిర్పోర్ట్ ఆపరేటర్ల ఆదాయాలు రయ్..
జోరుగా గ్యాస్ వినియోగం
తెలుగు పంచాయితీ తేలేదెన్నడు?
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
ఐపీఎల్కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్పై ఏడాది నిషేధం
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
వచ్చేవారం స్టాక్మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
వరుస షాక్లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
అంతుచిక్కని ఆచూకీ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది?
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’
గూగుల్లో ఆగని లేఆఫ్లు.. మళ్లీ వందలాది తొలగింపులు
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్లో సంచలన విషయాలు
బట్టతల పర్లేదు..! ఎయిర్పోర్ట్లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
2035 కల్లా భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లు
ఖజానాకు భూమ్
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ప్లాట్ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
ఇక చంద్రుడే కనిపిస్తాడు!
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్పై ఫ్యాన్స్ ఫైర్
నేడు, రేపు వానలు
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
టార్గెట్ చైనా ఎందుకంటే..!
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
తెలంగాణ పంటల విధానం మారాలి!
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో దిల్ రాజు భేటీ!
నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
AP: రియల్.. ఢమాల్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
నాడు కసబ్ కోసం పెట్టిన ఖర్చు ఇదే.. ఇప్పుడు రాణా కోసం ఇంకెంత ఖర్చు చేయాలో?
రెండోసారి విడాకులు.. నాతో ఎవరూ పనిచేయట్లేదు: నటి ఆవేదన
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్లోకి..
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్పై ఫ్యాన్స్ ఫైర్
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
సీఎస్కేతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ ఓపెనర్ పై వేటు! అతడి ఎంట్రీ?
భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి సేఫ్టీ నెట్లోకి..!
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
జగన్ అద్భుత నాయకుడు
అప్పు చేసి ఫీజులు
ఎల్2 ఎంపురాన్ మరో రికార్డ్.. 15 రోజుల్లోనే వంద కోట్ల మార్క్!
BCCI: హై పెర్ఫార్మెన్స్ శిబిరానికి త్రిష, ధృతి
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
సినిమా

రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో అభిమానులను అలరిస్తున్నారు. పుష్ప-2లో కీ రోల్ ప్లే చేసిన జగ్గు భాయ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన సన్నీ డియోల్ జాట్ మూవీలోనూ కనిపించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే సోషల్ మీడియా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. సరదా పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవల ఉగాది సందర్భంగా ఇంటికెళ్లిన ఆయన.. తన మాతృమూర్తి చేతుల మీదుగా ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తాజాగా మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు జగపతిబాబు. వీధుల్లో సామాన్యుడిలా నడుచుకుంటూ వెళ్లారు. ఓ మొబైల్ షాప్కు వెళ్లేందుకు అందరిలాగే కాలి నడకన రోడ్డుపై నడుస్తూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నా ప్రయాణం బ్లాక్ అండ్ వైట్లోకి అని మీకు తెలియజేస్తున్నా అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో మీరు ఏంటి సార్ ఇంత సింపుల్గా ఉన్నారంటూ ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Naa payanam black & white loki ani miku telichestuna.. pic.twitter.com/U5M8PF8CVZ— Jaggu Bhai (@IamJagguBhai) April 11, 2025

నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తన రెండో పెళ్లిపై మీకు ఎంత ఆసక్తి అని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? అని రేణు దేశాయ్ నిలదీశారు. సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె మండిపడ్డారు.కాగా.. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడారు. దీంతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై కూజా మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి కేవలం తన రెండో పెళ్లినే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ రేణు దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు.రేణు దేశాయ్ సోషల్ మీడియాలో రాస్తూ..' మీడియా వాళ్లు నా రెండో పెళ్లి గురించి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నారని నాకు అర్థమైంది. నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్కాస్ట్లో మన సమాజానికి ఉపయోగమైన చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడా. కానీ వాటిని గురించి చర్చ చేయరు. సమస్యల కంటే నా రెండో పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒక్కటే.. దయ చేసి ఈ 44 ఏళ్ల మహిళ వివాహం గురించి మీ దృష్టిని మరల్చండి'అని పోస్ట్ చేశారు.

'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ పెద్దగా ఫేమస్ అవ్వరు. కానీ కొన్నిరోజుల క్రితం జానీ మాస్టర్(Jani Master)పై పోలీస్ కేసు పెట్టి వార్తల్లో నిలిచింది శ్రష్ఠి వర్మ(Shrasti Verma) అనే కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఈమె కొత్త కారు కొనుగోలు చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) ఢీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శ్రష్ఠి వర్మది మధ్యప్రదేశ్. షోలో పాల్గొన్న తర్వాత కొన్నాళ్లకు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టడం వరకు వెళ్లింది.మరోవైపు పుష్ప 2(Pushpa 2 Movie)మూవీలోనూ కొన్ని పాటలకు ఈమె కొరియోగ్రాఫీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలా బన్నీ సినిమాతో ఫేమ్ సంపాదించిన శ్రష్ఠి.. ఇప్పుడు హుండాయ్ కారు కొనుకున్నానని తెగ సంతోషపడిపోతుంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి)

ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
తమిళంలో మాత్రం కోట్లాది మంది అభిమానులున్న హీరో అజిత్. సదరు ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie). తెలుగులో జనాలకు పెద్దగా నచ్చలేదు గానీ తమిళంలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్లే వసూళ్లలో అజిత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.(ఇదీ చదవండి: తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?)అజిత్ (Ajith) వన్ మ్యాన్ షో చేసిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో చాలావరకు ఎలివేషన్ షాట్సే ఉంటాయి. దీనికి తోడు అజిత పాత సినిమాల రిఫరెన్సులు కూడా గట్టిగానే ఉంటాయి. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.30.9 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్(Day 1 Collection) వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.ఈ వసూళ్లతో అజిత్.. తొలిరోజు వసూళ్లలో తన గత చిత్రాల కంటే ఎక్కువ సాధించాడు. సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. గతంలో పలు చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రాలేదు. తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తీసిన ఈ సినిమాకు లాంగ్ రన్ లో వంద రెండొందల కోట్లకు పైగా వసూళ్లు రావడం గ్యారంటీ ఏమో!(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) (ఇదీ చదవండి: తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial)
న్యూస్ పాడ్కాస్ట్

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు
క్రీడలు

చెపాక్లో చెన్నై చిత్తుగా...
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో పరాజయం... మొదటిసారి సొంతగడ్డ చెపాక్ మైదానంలో వరుసగా మూడో ఓటమి... ధోని కెపె్టన్సీ పునరాగమనంలో సీఎస్కే మరింత పేలవ ప్రదర్శన కనబర్చింది. కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) పదునైన బౌలింగ్ ముందు చేతులెత్తేసిన సీఎస్కే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫటాఫట్గా 61 బంతుల్లోనే లక్ష్యాన్ని అందుకున్న కోల్కతా రన్రేట్ను ఒక్కసారిగా పెంచుకొని దూసుకుపోయింది. చెన్నై: ఐపీఎల్ 18వ సీజన్లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సొంత మైదానంలో బ్యాటింగ్ వైఫల్యంతో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కోల్కతా నైట్రైడర్స్ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేయగలిగింది. శివమ్ దూబే (29 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, విజయ్శంకర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అనంతరం కోల్కతా 10.1 ఓవర్లలో 2 వికెట్లకు 107 పరుగులు సాధించి గెలిచింది. సునీల్ నరైన్ (18 బంతుల్లో 44; 2 ఫోర్లు, 5 సిక్స్లు) శుభారంభంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం జట్టు సొంతమైంది. పేలవ బ్యాటింగ్... ఓపెనర్లు కాన్వే (12), రచిన్ (4) ఒకే స్కోరు వద్ద వెనుదిరగ్గా... రెండు సార్లు అదృష్టం కలిసొచ్చిన విజయ్ శంకర్ కొన్ని పరుగులు రాబట్టాడు. 0, 20 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్లను నరైన్, వెంకటేశ్ అయ్యర్ వదిలేశారు. రాహుల్ త్రిపాఠి (16) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత చెన్నై 9 పరుగుల తేడాతో అశ్విన్ (1), జడేజా (0), దీపక్ హుడా (0), ధోని (1) వికెట్లను కోల్పోయింది. 71/6 వద్ద బ్యాటింగ్ కుప్పకూలే పరిస్థితి ఉండటంతో చెన్నై ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బ్యాటర్ హుడాను తీసుకు రాగా, అతనూ డకౌటయ్యాడు. వరుసగా 63 బంతుల పాటు జట్టు ఫోర్ కొట్టలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరో ఎండ్లో నిలబడిన దూబే తన 20వ బంతికి గానీ తొలి ఫోర్ కొట్టలేకపోయాడు. చివరి ఓవర్లో అతను మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఎట్టకేలకు స్కోరు 100 పరుగులు దాటింది. చకచకా లక్ష్యం వైపు... ఛేదనలో కోల్కతాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 23; 3 సిక్స్లు), నరైన్ ధాటిగా ఆడుతూ 26 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. ఖలీల్ ఓవర్లో డికాక్ 2 సిక్స్లు బాదగా, అశ్విన్ ఓవర్లో నరైన్ ఫోర్, సిక్స్ కొట్టాడు. ఖలీల్ తర్వాత ఓవర్లో కేకేఆర్ 2 సిక్స్లు, ఫోర్తో 18 పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. ఆపై అశ్విన్ ఓవర్లో నరైన్ మరో 2 సిక్స్లు బాదాడు. విజయానికి 19 పరుగుల దూరంలో నూర్ అహ్మద్ అతడిని అవుట్ చేసినా... అజింక్య రహానే (17 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రింకూ సింగ్ (12 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి పని పూర్తి చేశారు. ధోని అవుటా...నాటౌటా! ఎప్పటిలాగే అభిమానులు ఎదురు చూసేలా చేసీ చేసీ చివరకు 9వ స్థానంలో ధోని బ్యాటింగ్కు దిగాడు. నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను నరైన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ అవుట్గా ప్రకటించగా ఈ నిర్ణయంపై ధోని ‘రివ్యూ’ కోరాడు. బంతి బ్యాట్ను దాటుతున్న సమయంలో ‘స్నికో’లో కాస్త కదలిక కనిపించినా... టీవీ అంపైర్ వినోద్ శేషన్ దీనిని లెక్కలోకి తీసుకోకుండా అవుట్గా ఖాయం చేశాడు. దీనిపై ఫోర్త్ అంపైర్ తన్మయ్ శ్రీవాత్సవను కలిసి చెన్నై కోచ్ ఫ్లెమింగ్ తన అసంతృప్తిని ప్రదర్శించడం కనిపించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) రహానే (బి) హర్షిత్ 4; కాన్వే (ఎల్బీ) (బి) అలీ 12; త్రిపాఠి (బి) నరైన్ 16; విజయ్ శంకర్ (సి) అలీ (బి) వరుణ్ 29; శివమ్ దూబే (నాటౌట్) 31; అశ్విన్ (సి) అరోరా (బి) హర్షిత్ 1; జడేజా (సి) డికాక్ (బి) నరైన్ 0; హుడా (సి) అరోరా (బి) వరుణ్ 0; ధోని (ఎల్బీ) (బి) నరైన్ 1; నూర్ (సి) వరుణ్ (బి) అరోరా 1; అన్షుల్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 103. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–59, 4–65, 5–70, 6–71, 7–72, 8–75, 9–79. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–31–1, మొయిన్ అలీ 4–1–20–1, హర్షిత్ రాణా 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 4–0–22–2, సునీల్ నరైన్ 4–0–13–3. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) అన్షుల్ 23; నరైన్ (బి) నూర్ 44; రహానే (నాటౌట్) 20; రింకూ సింగ్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 5; మొత్తం (10.1 ఓవర్లలో 2 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–46, 2–85. బౌలింగ్: ఖలీల్ 3–0–40–0, అన్షుల్ 2–0–19–1, అశ్విన్ 3–0–30–0, నూర్ 2–0–8–1, జడేజా 0.1–0–9–0. ఐపీఎల్లో నేడులక్నో x గుజరాత్ వేదిక: లక్నోమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి హైదరాబాద్ x పంజాబ్ వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్పై ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో సీఎస్కే వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. శుక్రవారం చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. మరోసారి సీఎస్కే బ్యాటర్లు తేలిపోయారు. కేకేఆర్ బౌలర్ల దాటికి చెన్నై బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా కేకేఆర్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 44) టాప్ స్కోరర్గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) తమ వంతు పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో ధోని ఔట్ చర్చనీయాశంగా మారింది. ధోని ఔట్గా ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది.ధోనిది ఔటా? నాటౌటా?సీఎస్కే ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్లో మూడో బంతిని ధోని ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్కు దగ్గరగా వెళ్తూ ధోని ప్యాడ్కు తాకింది. వెంటనే బౌలర్తో పాటు వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేశారు.దీంతో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గాఫ్నీ ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో ధోని అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ తొలుత అల్ట్రా ఎడ్జ్ను చెక్ చేశాడు. అయితే బంతి బ్యాట్ను దాటినప్పుడు కాస్త కదలిక కన్పించింది. దీంతో అంపైర్ నాటౌట్గా ప్రకటిస్తాడని అంతాభావించారు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం క్లియర్గా బ్యాట్, బాల్కు మధ్య గ్యాప్ ఉందని థర్డ్ అంపైర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత బాల్ ట్రాకింగ్లో బంతి స్టంప్లను తాకుతోందని స్ఫష్టం కావడంతో అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీంతో చెపాక్ మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కామెంటేటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ అయిపోయారు. అంపైర్ నిర్ణయాన్ని చాలా మంది తప్పు బడతున్నారు. అది క్లియర్గా నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ధోని కేవలం ఒక్క మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.చదవండి: IPL 2025: నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ

నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది. మరోసారి సీఎస్కే బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు కీలక మూడు వికెట్లు పడగొట్టి సీఎస్కే పతనాన్ని శాసించాడు. నరైన్తో పాటు హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు, వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. కెప్టెన్ ధోని(1) సైతం తీవ్రనిరాశపరిచాడు.సునీల్ నరైన్ విధ్వంసం..అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 44) టాప్ స్కోరర్గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) రాణించారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా సీఎస్కేకు వరుసగా ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే

సునీల్ నరైన్ అరుదైన ఫీట్.. రెండో బౌలర్గా రికార్డు
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన స్పిన్ మయాజాలంతో సీఎస్కే బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం ఎవరి తరం కాలేదు. త్రిపాఠి, రవీంద్ర జడేజా, ధోని వంటి కీలక వికెట్లను పడగొట్టి సీఎస్కేను దెబ్బతీశాడు.నరైన్ తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో సునీల్ నరైన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా నరైన్ రికార్డులెక్కాడు.సునీల్ ఇప్పటివరకు చెన్నై జట్టుపై 26 వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ హార్బజన్ సింగ్(24) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భజ్జీ రికార్డును సునీల్ బ్రేక్ చేశాడు.ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ(31) ఉన్నాడు. ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక వికెట్లు బౌలర్లు వీరే31 - లసిత్ మలింగ26 - సునీల్ నరైన్24 - హర్భజన్ సింగ్ 22 - పీయూష్ చావ్లా103 పరుగులకే..ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సీఎస్కే.. కేకేఆర్ బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు.
బిజినెస్

అమెరికాతో ఒప్పందంలో మన ప్రయోజనాలకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో (బీటీఏ) దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే అత్యంత ప్రాధాన్యం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆ దిశగా చర్చలు సానుకూల ధోరణిలో జరుగుతున్నాయని చెప్పారు. ఈ అంశంలో తొందరపాటుతనంతో వ్యవహరించడం శ్రేయస్కరం కాదని ఆయన వివరించారు. ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే దిశగా ఇరు దేశాలు బీటీఏపై చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొలి విడత ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్ నాటికి ముగియవచ్చని అంచనాలు ఉన్నాయి. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక బంధాలు మరింత పటిష్టమయ్యేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ వేగవంతమయ్యేందుకు నిర్మాణాత్మకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. భారత్–ఇటలీ సంబంధాలు మరింత బలపడేందుకు ఐఎంఈసీ (భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ కారిడార్) తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగే దిశగా అవరోధాలను తొలగించడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే పక్షంలో 90 రోజుల్లోపే అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
ప్రీమియం ఫోన్లలో ఐఫోన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫోన్ను ఉపయోగించాలని చాలా మందికి ఉంటుంది. అయితే దాని అధిక ధర కారణంగా ఐఫోన్ను కొనడం అందరికీ వీలుకాదు. కానీ ఇప్పుడు అతి తక్కువ ధరకు లేటెస్ట్ ఐఫోన్ను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.2023లో విడుదలైనప్పటి నుండి యాపిల్ ఐఫోన్ 15.. వివిధ అమెజాన్ డీల్స్ స్థిరంగా లిస్ట్ అవుతూ వస్తోంది. సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్లు పెద్దగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించనప్పటికీ, ఇప్పటికీ ఆ ఫోన్ను కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రం ఈ సారి డీల్ విలువైన అవకాశాన్ని అందిస్తోంది.ఐఫోన్ 15 అమెజాన్ డీల్రాబోయే ఐఫోన్ 16 సిరీస్తో అమెజాన్ ఇప్పుడు ఐఫోన్ 15పై గణనీయమైన ధర తగ్గింపును ప్రవేశపెట్టింది. ఇది గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా ఉంది. యాపిల్ ఐఫోన్ 15 (128 జీబీ, బ్లాక్) ప్రస్తుతం అమెజాన్లో రూ .79,900 ప్రారంభ ధర, దానిపై 23 శాతం డిస్కౌంట్తో రూ.61,400 ధరకు లిస్ట్ అయింది. ఇంకా ఎక్కువ పొదుపు చేయాలనుకునేవారు అమెజాన్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోవచ్చు.ఉదాహరణకు, ఉపయోగించిన పాత ఐఫోన్ 14 ప్లస్ (512 జీబీ) ను మంచి స్థితిలో ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ .29,500 తగ్గింపు లభిస్తుంది. ఇలా ఐఫోన్ 15 నికర ధర రూ .31,000 కు తగ్గుతుంది. అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ .3,070 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇది తుది ధరను కేవలం రూ .28,830 కు తగ్గిస్తుంది.ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లుఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. యాపిల్ మునుపటి మోడళ్ల డిజైన్ ఉన్నప్పటికీ సాంప్రదాయ నాచ్ కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నాచ్ ను ప్రవేశపెట్టింది. ఇది ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో మంచి ఆదరణ పొందింది.ఈ మోడల్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. ఇది పగటిపూట, తక్కువ-కాంతి, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి మెరుగ్గా ఉంటుంది.ఐఫోన్ 15 "ఆల్ డే బ్యాటరీ లైఫ్" కలిగి ఉందని యాపిల్ పేర్కొంది. అయితే వాస్తవ వినియోగంలో ఇది సగటు వినియోగంతో 9 గంటలకు పైగా ఉంటుందని సూచిస్తుంది. ఇందులో యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది.ఇది యాపిల్ ఎ16 బయోనిక్ చిప్ తో పనిచేస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లలో ఉపయోగించిన ఎ15 చిప్ నుండి అప్ గ్రేడ్ యఅయింది.

కాంపా ప్రచారకర్తగా ‘పెద్ది’
రిలయన్స్ ఆధ్వర్యంలోని ప్రముఖ బేవరేజ్ బ్రాండ్ కాంపా హీరో రామ్ చరణ్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం బ్రాండ్ కొత్త మార్కెటింగ్కు ఎంతో తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది. కాంపా కొత్త వేరియంట్ ‘వలీ జిడ్’ ప్రచారానికి ఈ నియామకం సహకరిస్తుందని పేర్కొంది. జెన్ జెడ్, మిలినియల్స్లో బ్రాండ్ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. రామ్ చరణ్ నటుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కనుంది.ప్రమోషన్లో స్టార్లు అవసరమేనా..?సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం సెలబ్రిటీల బ్రాండ్ ఎండార్స్మెంట్లు కంపెనీలకు కీలకంగా మారాయి. అయితే బ్రాండ్ ప్రమోషన్ కోసం సంస్థలు సెలబ్రిటీలను ఎందుకు ఎంచుకుంటున్నాయో తెలుసుకుందాం.నమ్మకం, విశ్వసనీయతను పెంపొందించడం: సెలబ్రిటీలను తరచుగా రోల్ మోడల్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్లుగా భావిస్తారు. కాబట్టి తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్ పట్ల వినియోగదారులకు సానుకూలత రావడానికి, దాన్ని వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. ఇది కంపెనీల సేల్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.బ్రాండ్ విజిబిలిటీని పెంచడం: సెలబ్రిటీ ప్రమోషన్ల ద్వారా స్టార్ల ఫాలోయింగ్ను కంపెనీలు ఆసరాగా చేసుకుంటాయి. దాంతో బ్రాండ్ ఉత్పత్తుల విజిబిలిటీని పెంచాలని లక్ష్యంగా చేసుకుంటాయి. ముఖ్యంగా ఫ్యాషన్, స్పోర్ట్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ఇది ప్రభావం చూపుతుంది.ఎమోషనల్గా కనెక్ట్ చేయడం: అభిమానులు తరచుగా తమ ఫెవరెట్ స్టార్లతో పరోక్షంగా భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారు. సెలబ్రిటీలు ఒక బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆయా ఉత్పత్తులపై వినియోగదారుల భావోద్వేగాలు తోడవుతాయి. దాంతో కంపెనీ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..సవాళ్లు లేవా..సెలబ్రిటీల బ్రాండ్ ప్రమోషన్లలో కంపెనీలకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. స్టార్ల జీవన విధానం బ్రాండ్లపై ప్రభావం చూపుతుంది. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఆ సెలబ్రిటీలు ఏదైనా వివాదాల్లో చిక్కుకుంటే కంపెనీ ఉత్పత్తులపై దాని ప్రభావంపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది బ్రాండ్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చు. అందువల్ల సెలబ్రిటీ ఎంపిక కీలకంగా మారుతుంది.

గూగుల్లో ఆగని లేఆఫ్లు.. మళ్లీ వందలాది తొలగింపులు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్లో (Google) లేఆఫ్లు కొనసాగుతున్నాయి. తన ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగం నుంచి తాజాగా వందలాది మంది ఉద్యోగులను తొలగించిందని ( layoff )ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లో పనిచేసే ఉద్యోగులు ఇందులో ఉన్నారని ‘ది ఇన్ఫర్మేషన్’ అనే వార్తా నివేదిక పేర్కొంది. అయితే ఎంత మంది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారన్న వివరాలు వెల్లడి కాలేదు.తొలగింపు వెనుక కారణం..కార్యకలాపాలను క్రమబద్ధీకరణ, సామర్థ్య పెంపు కోసం గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది గూగుల్ తన ఆండ్రాయిడ్, క్రోమ్ టీమ్లను పిక్సెల్ అండ్ డివైజెస్ గ్రూప్ కింద విలీనం చేయడంతో ప్రారంభమైన సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయి. జనవరిలో కంపెనీ స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ తాజా ఉద్యోగ కోతలు ఆ చొరవకు కొనసాగింపు అని సూచిస్తున్నాయి.గూగుల్ ప్రకారం.. చురుకుదనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడమే పునర్నిర్మాణం లక్ష్యం. ఇది కంపెనీ తన ప్రధాన ఉత్పత్తులు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. వందలాది ఉద్యోగులకు నష్టం కలిగించే ఈ చర్య వ్యయ తగ్గింపు, వనరుల ఆప్టిమైజ్ కోసం మొత్తం టెక్ పరిశ్రమ అవలంభిస్తున్న ధోరణిని ప్రతిబింబిస్తోంది.ఇన్నోవేషన్ పై ప్రభావంపునర్ వ్యవస్థీకరణకు గూగుల్ తీసుకున్న నిర్ణయం ఉత్పత్తుల అభివృద్ధి, ఆవిష్కరణలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. కీలక బృందాల్లో తక్కువ మంది ఉద్యోగులతో, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పురోగతిలో గూగుల్ ఎలా ముందుకు వెళ్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియామకాలు జరుగుతున్నాయని, ఇన్నోవేషన్ పై పూర్తిగా వెనక్కి తగ్గకుండా వనరులను పునర్వినియోగం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.టెక్ పరిశ్రమలో తొలగింపులుఉద్యోగాల కోత, పునర్నిర్మాణ చర్యలను అమలు చేస్తోన్న టెక్ కంపెనీ గూగుల్ ఒక్కటే కాదు. ఆర్థిక అనిశ్చితి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వరకు కారణాలను చూపుతూ అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా పలు బడా టెక్ కంపెనీలు గత ఏడాది ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి.
ఫ్యామిలీ

అమిత ప్రతిభ
అడ్వర్టైజింగ్, సినిమా ఫీల్డ్ల గురించి అమ్మాయిలకు ఆసక్తి ఉంటే...‘అడ్వర్టైజింగ్ ఫీల్డ్కు వెళతావా! సినిమా ఫీల్డ్కు వెళతావా!!’ అని ఆశ్యర్యపోయే కాలం అది. అలాంటి కాలంలో అడ్వర్టైజింగ్ ఆ తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన అమిత మద్వాని.‘ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చావు!’ అని ఒకరు వెటకారం చేశారు. ‘తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను’ అని సమాధానం ఇచ్చింది అమిత.అవును... ఎన్నో దశాబ్దాలుగా ఆమె నేర్చుకుంటూనే ఉంది. ఆ నిరంతర ఉత్సాహమే అమితను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ కేతనం ఎగరేసేలా చేసింది.తన కమ్యూనిటీలోని సాంస్కృతిక వేడుకలు, మారాఠీ నాటకరంగ ప్రభావం కళల పట్ల అమితలో ఆసక్తిని పెంచింది. 1980 దశకంలో అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఉన్న కాలంలో ఆమె తన కెరీర్ను మొదలు పెట్టింది. ‘ఇది నువ్వు ఎంచుకోవాల్సిన రంగం కాదు’ అంటూ కొద్దిమంది ఆమెను వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదు.‘ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాను’ అంటూ ముందుకు కదిలింది. నేర్చుకోవాలనే కుతూహలం ఆమె వేగంగా నడిచేలా చేసింది. ప్రారంభ రోజులు... కష్టపడడంలో ఉన్నప్రాముఖ్యత గురించి చెప్పాయి. ‘నేను ఎంచుకున్న ప్రయాణం అడుగడుగునా సవాలుతో కూడుకున్నదనే విషయం తెలిసినా రాజీ పడలేదు. సినిమా సెట్లో బ్యాగులు ΄్యాకింగ్ చేయడం దగ్గర్నుంచి 35 ఎం.ఎం. సినిమా ఎడిటింగ్ మెళకువలను అర్థం చేసుకోవడం వరకు ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది అమిత.ఒగిల్వి, లియో బర్నెట్లాంటి అడ్వర్టైజింగ్ దిగ్గజ సంస్థలలో పనిచేయడం ఆమె అనుభవ జ్ఞానాన్ని విస్తృతం చేసింది. సినీ పరిశ్రమను అడ్వెర్టైజింగ్ ఏజెన్సీల కోణం నుంచి చూడడానికి ఆమెకు ఉపకరించాయి. క్యాంపెయిన్ బిల్డింగ్, క్లయింట్ సర్వీసింగ్, క్రియేటివ్, ప్రొడక్షన్ బృందాల మధ్య సమన్వయం.... ఇలా ఎన్నో విషయాలలో నైపుణ్యాన్ని సాధించింది.ఈ అనుభవ, నైపుణ్యజ్ఞానంతో ‘ఈక్వినాక్స్ ఫిలిమ్స్’లో కో–వోనర్, నిర్మాతగా ప్రయాణం ప్రారంభించింది. మంచి పేరు తెచ్చుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వచ్చిన విరామంలో...‘ఏం చేస్తున్నాం? ఏం చేయకూడదు’ అనే కోణంలో ఆలోచించి సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి... స్టోరీ టెల్లింగ్, డిజిటల్–ఫస్ట్ స్ట్రాటజీలను ఒకే వరుసలోకి తీసుకురావడం. భారీ బడ్జెట్తో కూడిన టెలివిజన్ వాణిజ్య ప్రకటనల నుంచి రీల్స్, డిజిటల్ ప్రకటనల ప్రస్తుత యుగం వరకు మన ప్రకటనల రంగంలో నాటకీయ మార్పులను అమిత ప్రత్యక్షంగా చూసింది.‘విజయపథంలో ప్రయాణించాలంటే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరింత నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. వర్తమానం గురించే కాదు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కూడా ఆలోచనలు చేయాలి. నేను ఎంచుకున్న పని నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. అయితే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేదాన్ని. మారుతున్న కాలానికి అనుగుణంగా నాలోని నైపుణ్యాలకు పదును పెట్టాను’ అంటుంది అమిత మద్వాని.ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా...మనం ఎంచుకున్న మార్గం కఠినం, సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ... నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపన ఉంటే విజయం సాధించవచ్చు. నేను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఏమీ తెలియదు. చాలా ఓపికగా నేర్చుకున్నాను. పది సెకన్ల డిజిటల్ స్పాట్ అయినా, మూడు గంటల ఫీచర్ ఫిల్మ్ అయినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూడడమే ప్రధానం. సోషల్ మీడియా ఫ్రెండ్లీ ఫార్మట్లను ఏకీకృతం చేయడం ద్వారా, ప్రేక్షకులకు ఎండ్–టు–ఎండ్ పరిష్కారాలను అందించడం ద్వారా ఈక్వినాక్స్ ఫిల్మ్స్ ముందంజలో ఉంది. టీమ్ అంకితభావం మా విజయానికి కారణం.– అమిత మద్వాని

వేగాన్ వర్సెస్ నాన్వెజ్ డైట్: ఈ ట్విన్స్ ప్రయోగంలో ఏ డైట్ మంచిదంటే..?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. సోషల్మీడియా పుణ్యామా..? అని రకరకాల డైట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఏది మంచిది అని డిసైడ్ చేసుకోలేని కన్ఫూజన్లో పడేసేలా ఊదరగొడుతున్నాయి. అయితే ఆ సమస్యకు చెక్పెట్టేలా ఈ ఇద్దరు కవలలు ఓ ప్రయోగానికి పూనుకున్నారు. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే ఈ కవల సోదరులు వేగాన్ వర్సెస్ నాన్వెజ్ డైట్లో ఏది బెటర్ అనే దాని గురించి తమ శరీరాలపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఏ డైట్ ఆరోగ్యకరమైనదో వైద్యపరంగా నిర్థారించి మరీ చెప్పారు.యూకేలోని డెవాన్లోని ఓ గ్రామానికి చెందిన రాస్, హ్యూగో టర్నోర్ అనే కవలలు ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. ఈ ఇద్దరు ఆహారం, ఫిట్నెస్కి సంబంధించి పలు ప్రయోగాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈసారి మొక్కల ఆధారిత వర్సెస్ జంతువుల ఆధారిత డైట్లలో ఏది ఆరోగ్యానికి మంచి ఫలితాలనిస్తుంది దాని గురించి తమపైనే ప్రయోగాలు చేసుకుని మరీ నిర్థారించి చెప్పారు. అందుకోసం ఆరు నెలలపాటు ఈ 36 ఏళ్ల కవలలు దాదాపు ఒకేలాంటి జీవనశైలిని అనుసరించారు. అయితే తీసుకునే ఆహారంలోనే వ్యత్యాసం ఉంటుంది. హ్యూగో సముద్రపు ఆల్గే , మొక్కల ఆధారిత ఒమేగా 3 నూనెలు, మొక్కల ఆధారిత సప్లిమెంట్లు తదితరాలు తీసుకున్నాడు. రాస్ సాంప్రదాయ జంతు ఆధారిత విటమిన్లు తీసుకున్నాడు. అయితే ఆరు నెలల తదనంతరం ఇరువురిలో అద్భుతమైన మార్పులు, ఫలితాలు కనిపించాయి. ఇక్కడ హ్యూగో రక్తం పోషకాలతో కనిపించింది. కీలకమైన విటమిన్లు డీ3, కొవ్వు ఆమ్లాలు సమస్థాయిలో ఉన్నాయి. ఇక రాస్ తీసుకున్న నాన్ వెజ్ ప్రోటీన్లకు మించి హ్యగో శరీరంలో మెరుగైన స్థాయిలో విటమిన్లు ఉన్నాయి. వారిద్దరూ కూడా ఈ డైట్లలో ఇంత తేడా ఉంటుందని అనుకోలేదట. రక్తపరీక్షల్లో హ్యూగో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఒమేగా-3, విటమిన్ D3 పుష్కలంగా ఉన్నాయి హ్యూగో బాడీలో. కేవలం రక్తపరీక్షలే గాక, కొవ్వులు, ఆమ్లలాల స్థాయిలతో సహా ప్రతీది ట్రాక్ చేశారు. అయితే ఈ డైట్లలో మొక్కల ఆధారిత వెర్షన్ మెరుగైన ఫలితాలనిచ్చింది. రాస్ తిన్న సాల్మన్ చేపల కంటే సముద్రపు పాచి సప్లిమెంట్లోనే విటమిన్ డీస్థాయిలు, మంచిరోగ నిరోధక శక్తిని హ్యూగోకి అందించాయి. అంతేగాదు శాకాహారం శరీరంలో కొవ్వుని తగ్గించి మెరుగైన శక్తి స్థాయిలను ప్రోత్సహించదని తేలింది. ఇలాంటి ప్రయోగాలు ఆ కవలలకు తొలిసారి కాదు. గతంలో అధిక కార్బ్ వర్సెస్ అధిక కొవ్వు ఆహారాలలో ఏది మంచిదో తెలుసుకోవాలని ప్రయోగాలు చేశారు కూడా. దానిలో రాస్ పాస్తా, బియ్యం వంటి కార్బొహైడ్రేట్లు తీసుకోగా, హ్యూగో గుడ్లు, వెన్న వంటి వాటిని తీసుకున్నారు. అయితే రాస్ కొలస్ట్రాల్ని కోల్పోగా, హ్యూగో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పైగా అందులో ప్రమాదకరమైన చెడెకొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఉన్నాయి. చివరగా ఈ కవల ఫిట్నెస్ ప్రయోగాల వల్ల మొక్కల ఆధారిత సప్లిమెంట్స్ ప్రయోజనాలు హైలెట్ చేయడమే గాక సాంప్రదాయ పోషకాహారం గురించి చాలకాలం నుంచి ఉన్న అపోహలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అంతేగాదు మన ఆరోగ్యంలో ఆహారం ఎంత కీలకపాత్ర పోషిస్తుందని అనేది తేటతెల్లమైంది కూడా. View this post on Instagram A post shared by 𝗧𝗛𝗘 𝗧𝗨𝗥𝗡𝗘𝗥 𝗧𝗪𝗜𝗡𝗦 (@theturnertwiins) (చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!)

వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్ పీరియడ్ సైకిల్) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్టాక్ యూజర్ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్ విటమిన్ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వంటి స్కానింగ్లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్టాక్ ఫాలోవర్స్ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం)

ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం..
ఆంధ్రా అయోధ్యగా... అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ ప్రచారంలో ఉంది. అయితే ఆలయానికి అభిముఖంగా సంజీవరాయస్వామి పేరుతో ఒంటిమిట్ట క్షేత్రపాలకుడుగా ఆంజనేయస్వామి ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో స్వామివారు సీతారామలక్ష్మణులకు ఎదురుగా నిలబడి అంజలి ఘటిస్తున్నట్లుగా ఎత్తైన విగ్రహంతో నిలచి, భక్తులను కాపాడుతూ ఉంటారు. స్థలపురాణం...ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపాడట. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ... అయితే ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షించేవారు. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని అడగగా, ఇక్కడ రామాలయం కట్టించమని కోరారట. రాజు ఈ ప్రదేశాన్ని పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లి΄ోయాడు. వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటు చేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు. ఎందరో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినా... ఆంధ్రావాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలను సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆ భక్తుడు టెంకాయ చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు పది లక్షల రూపాయలు సేకరించాడట.విశేష పూజలు...మూడు గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుంటుంది. శేషాచల పర్వత పంక్తిలో ఆదిశేషుని తలభాగంగా తిరుమల క్షేత్రం మధ్యభాగంగా దేవుని గడప (కడప), ఒంటిమిట్ట, అహోబిలం తోకభాగంగా శ్రీశైల క్షేత్రాలను అభివర్ణిస్తారు. దేవుని కడప క్షేత్రాన్ని సందర్శించి తిరుమలకు వెళ్లే భక్తులు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయాన్ని దర్శించి వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, సుందరమైన మండపాలు, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలిపే రమణీయ శిల్పసంపద ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంది.ఈ ఆలయాన్ని అద్భుత ధామంగా తీర్చిదిద్డడంలో చోళరాజులు, విజయనగర పాలకులు ఇతోధికమైన కృషి చేశారు. దేవాలయ ముఖమండపంలో రామాయణ, భారత, భాగవతాలలోని వివిధ ఘట్టాలను కనులకు కట్టే శిల్పాలున్నాయి. సీతాదేవికి అంగుళీయకాన్ని చూపిస్తున్న హనుమంతుడు, లంకకు వారధిని నిర్మించే వానరులు, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తే దృశ్యం, వటపత్రశాయి, శ్రీ కృష్ణుని కాళీయ మర్ధనం, నర్తకీమణుల బొమ్మలు ఉన్నాయి. అలాగే ముఖద్వారంపై దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసే దృశ్యం, ఒక బొమ్మలో ఏనుగు– ఆవు కనిపించేలా చెక్కిన సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయ ద్వారపాలకులుగా అంజలి ముద్రతో శోభిల్లే జయవిజయుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతోపాటూ శ్రీరామనవమి సమయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు. చతుర్దశి నాడు కల్యాణం, పౌర్ణమిరోజు రథోత్సవం నిర్వహిస్తారు. బమ్మెర పోతనామాత్యుడు ఒంటిమిట్ట కేంద్రంగా భాగవత రచన చేసి, ఆ కావ్యాన్ని ఒంటిమిట్ట కోదండ రామునికే అంకితం ఇచ్చారట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో పోతన విగ్రహం కూడా ఉంది. – డి.వి.ఆర్. (చదవండి: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు..! ఏకంగా 108 మంది రాణులు..)
ఫొటోలు


నల్లగండ్లలో సందడి చేసిన నితీష్, స్టోయినిష్ (ఫోటోలు)


రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ.. చెర్రీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ను ఇప్పుడు చూస్తే..! (ఫొటోలు)


వైట్ గౌన్ లో అందాలు ఆరబోస్తున్న నేహా శెట్టి (ఫోటోలు)


సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


‘కృష్ణ లీల’ మోషన్పోస్టర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం (ఫొటోలు)


రిచెస్ట్ ప్లేయర్గా పీవీ సింధు.. ఏడాది సంపాదన ఇన్ని కోట్లా?( ఫోటోలు)


స్నేహితురాలితో సాయిపల్లవి హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)


అంబానీ ఇల్లు ‘అంటిలియా’.. అబ్బురపరిచే లోపలి ఫొటోలు


అందంతో అభిమానుల మనసు కొల్లగొట్టేస్తున్న దివ్యభారతి (ఫోటోలు)
అంతర్జాతీయం

‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536
వాషింగ్టన్: అమెరికాలో కోడి గుడ్లు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నెల నెలా రేటు పెరుగుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో డజను కోడి గుడ్లు ధర 5.90 డాలర్లు (భారత కరెన్సీలో రూ.508.76) ఉండగా మార్చి నెలలో 6.23 డాలర్లకు (రూ.536) చేరింది. అయితే, అమెరికాలో కోడి గుడ్లు ధరలు ఆకాశాన్ని తాకడం వెనుక బర్డ్ ఫ్లూ ఓ కారణం. బర్డ్ ఫ్లూని అరికట్టేందుకు అమెరికా గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించింది. ఆ ప్రభావం రిటైల్ మార్కెట్లోని గుడ్ల ధరలపై పడింది. ట్రంప్ వరుస ప్రకటనలు ఫలితంగా గుడ్లు తేలేసేలా.. కొండెక్కిన కోడిగుడ్ల ధరలతో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనలపై.. గత కొన్ని వారాలుగా తన పాలనలో గుడ్లు ధరల్ని తగ్గించామంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోల్సేల్ గుడ్ల ధరలు 59శాతం నుంచి చివరికి 79 శాతానికి తగ్గాయని చెప్పారు’ అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీఇదే విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లి సైతం ప్రస్తావించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడి గుడ్ల సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై మేం తీసుకున్న చర్యలు ఫలితాల్ని ఇస్తున్నాయి’ అని పేర్కొన్నారు. గుడ్ల ధరలపై భిన్నాభిప్రాయాలు అమెరికాలో అమాంతం పెరిగిపోతున్న గుడ్ల ధరలపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఆహార ఆర్థిక నిపుణుడు డేవిడ్ ఓర్టెగా మాట్లాడుతూ.. హోల్సేల్ ధరలు తగ్గినా, ఆ ప్రభావం రిటైల్ ధరలపై పడేందుకు కొన్ని వారాలు సమయం పడుతుందన్నారు. పాల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల హోల్సేల్ ధరలు తగ్గినప్పటికీ.. రిటైల్ ధరలు ఎంత తగ్గుతాయో అంచనా వేయడం కష్టం’ అని కార్నెల్ యూనివర్శిటీకి ఆర్థిక నిపుణుడు క్రిస్టఫర్ బి. బారెట్ చెప్పారు.

భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరైన పత్రాలతోనే వచ్చారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. హెచ్–1బీ వీసా పొందిన వారిపైనా నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన వర్సిటీలపై దృష్టిఅమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23లో 2,68,923 మంది వెళ్తే, 2023–24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్ల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజెల్స్ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. తలనొప్పిగా ఓపీటీ అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు (ఇవి కూడా స్కిల్డ్ మాత్రమే) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున రూ.35 లక్షల నుంచి రూ.49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ఏఐతో పటిష్టమైన డేటా ప్రతి విదేశీ విద్యార్థిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్లో ఉన్నాడు? ఆ లొకేషన్స్లో మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు. కన్సల్టెన్సీలపై నిఘా అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. పత్రాలన్నీ చూస్తున్నారు ఇండియా నుంచి విచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. – విక్రమ్ శశాంక్, ప్రవాస భారతీయుడు. ఓపీటీ తీసేస్తే పరిస్థితి ఏమిటి? రూ.45 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్ టైం జాబ్ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తే తిరిగి ఇండియా వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. – అఖిలేష్ పూనాటి, అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన విద్యార్థి. హెచ్–1బీకీ తిప్పలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడివాళ్లకే (అమెరికన్లకు) అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలవారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్ వెళ్తున్నారు. భవిష్యత్లో హెచ్–1బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్, హెచ్–1బీ వీసాపై అమెరికా వెళ్లిన ఎంఎన్సీ ఉద్యోగిని. అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులున్న వర్సిటీలు యూనివర్సిటీ ప్రాంతం విద్యార్థుల సంఖ్య న్యూయార్క్ వర్సిటీ న్యూయార్క్ 27,247 నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ బోస్టన్ 21,023 కొలంబియా వర్సిటీ న్యూయార్క్ 20,321 అరిజోనా స్టేట్ వర్సిటీ టెంపే 18,430 యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ 17,469.

న్యూయార్క్లో హెలికాప్టర్ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. న్యూయార్క్ కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3:17 నగరంలోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. బెల్-206 అనే హెలికాప్టర్ నీటిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న పైలట్ కుటుంబం చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతిచెందిన వారిని స్పెయిన్లోని సిమెన్స్ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, వారి ముగ్గురు పిల్లలుగా అధికారులు గుర్తించారు. ఇక, విమానం న్యూయార్క్ డౌన్టౌన్ మాన్హట్టన్ హెలిపోర్ట్ నుండి బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. Tracking: looks like a Bell 206L Long Ranger Helicopter. Appears main rotor & tail are detached when the main fuselage impacts the Hudson River in NYC. The main nut/pin that holds the main rotor onto the helicopter’s fuselage is called the ‘Jesus Nut.´pic.twitter.com/o4N23RY5kZ— Mikey Kay 🏴 (@MikeyKayFilms) April 10, 2025ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనా స్థలంలో బోట్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. వెస్ట్ సైడ్ హైవే మరియు స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో హడ్సన్ నదిలో హెలికాప్టర్ క్రాష్ కారణంగా, చుట్టుపక్కల ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. BREAKING: Agustin Escobar, President and CEO of Siemens in Spain, along with his wife and their three children, were identified as the victims of the helicopter that plunged into the Hudson River in New York City on Thursday, according to the New York Post. The New York… pic.twitter.com/Jnw8EIiioH— Bruce Snyder (@realBruceSnyder) April 11, 2025హెలికాప్టర్ నుంచి రోటర్ బ్లేడ్ విడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దృశ్యాల్లో విమానం భాగాలు విరిగిపోవడం, అది నీటిలో కూలిడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ‘బెల్ 206 హెలికాప్టర్ న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిలో కూలి మునిగిపోయింది’ అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, ఎఫ్ఏఏ దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొంది.🇪🇦🇺🇸 Agustin Escobar, President and CEO of Siemens in Spain, along with his wife and their three children, were identified as the victims of the helicopter that plunged into the Hudson River in New York City on Thursday, according to the New York Post.The New York Helicopter… pic.twitter.com/Inp6NckoAu— Dan-i-El (@Danielibertari0) April 11, 2025 న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతానికి ఆరుగుర్ని నదిలో నుంచి వెలికితీశామని, దురదృష్టవశాత్తూ వాళ్లంతా చనిపోయారు’ అని తెలిపారు. ఇది హృదయ విదారక, విషాదకరమైన ప్రమాదమని అభివర్ణించారు. ఘటనా స్థలికి పడవల్లో చేరుకున్న రెస్క్యూ సిబ్బంది నదిలో గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. కాగా, నౌకలు ఎక్కువగా ప్రయాణించే హడ్సన్ నదిలో అమెరికా ఎయిర్వేస్కు చెందిన విమానం 2009లో నాటకీయంగా ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందులోని 155 మంది ప్రాణాలతో బయటపడటంతో ఇది ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ గా గుర్తింపు పొందింది.

ఒక్క గుడ్డు 44 రూపాయలు!
వాషింగ్టన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో స్థానిక చిరువ్యాపారుల వద్ద ఒక కోడిగుడ్డు ధర ఐదారు రూపాయల మధ్యే తిరుగుతుంటుంది. అమెరికాలో మాత్రం ఒక్క గుడ్డు ధర ఏకంగా 44 రూపాయలకు పెరిగింది. అమెరికాలో డజను గుడ్ల ధర 6.23 డాలర్ల(దాదాపు రూ.536)కు చేరుకుంది. మార్చి నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీలో గుడ్ల ధరను అమెరికా ప్రభుత్వం గురువారం వెల్లడించడంతో గుడ్ల కొరత అంశం మరోసారి తెరమీదకొచ్చింది. గత కొన్నాళ్లుగా అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో వ్యాధి వ్యాప్తి కట్టడే లక్ష్యంగా కోట్లకొలదీ కోళ్లను వధించారు. దీంతో గుడ్ల కొరత విపరీతమైంది. అందుకు తగ్గట్లే డజను గుడ్ల ధర కొండెక్కింది. ఫిబ్రరిలో ఒక దశలో డజను గుడ్ల ధర ఏకంగా 7.34 డాలర్లకు పెరిగి మళ్లీ దిగొచ్చింది. ఇప్పుడది మళ్లీ 6 డాలర్లను దాటింది. ఈస్టర్ పండుగ సందర్భంగా గుడ్లకు గిరాకీ ఎక్కువైంది. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ఈస్టర్ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ తేదీదాకా ధరల ఉరవడి ఆగకపోవచ్చని తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ భయాలతో జనవరి, ఫిబ్రవరిలో ఏకంగా 3 కోట్లకుపైగా గుడ్లు పెట్టే కోళ్లను వధించడంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. కోళ్లఫారాలను పూర్తిగా శానిటైజ్చేసి, కొత్త కోళ్లను సాకుతున్నారు. దీంతో కొత్త కోళ్లతో గుడ్ల దిగుబడి పెరిగితే ధరలు కిందకు దిగొచ్చే వీలుంది.
జాతీయం

‘ప్రభుత్వం తప్పు చేస్తే శిక్ష మేం భరించాలా’, రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016 నిర్వహించిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమీషన్ (ssc)లో అవకతవకలు జరిగాయంటూ సుమారు 26 వేల మంది టీచర్ల నియామకాల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే ఈ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిన 26వేలమంది టీచర్లలో సుమారు 500 మంది రోడ్డెక్కారు.తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమబెంగాల్ సీల్దా, సెంట్రల్ అవెన్యూ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోగ్యో శిక్షక్ మంచ్ (అర్హత గల ఉపాధ్యాయుల ఫోరం) ప్రతినిధి మెహబూబ్ మండల్ మాట్లాడుతూ.. ‘పరీక్షలో మంచి స్కోరు సాధించినా, నియామకాల్లో జరిగిన అవినీతి వల్ల మేం అర్హులమే అయినప్పటికీ ఉద్యోగాలు పోయాయి ఇది మా తప్పా?' అని ఆవేదన వ్యక్తం చేశారు. #WATCH | West Bengal: A large number of teachers in Purulia district locked the gates of Purulia District Education Department and protested in the wake of 26,000 teachers in Bengal schools losing their jobs following a Supreme Court order. pic.twitter.com/F0x3x9bnXw— TIMES NOW (@TimesNow) April 10, 2025అయితే, మా ఉద్యోగం మాకు తిరిగి ఇవ్వండి. లేదంటే అర్హులు, అవినీతి పరుల్ని గుర్తించాలని కోరుతూ చేసిన ఈ ధర్నాలో బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పలువురిపై దాడి చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దాడి,లాఠీఛార్జీపై ఆందోళన కారులు మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో మేము శాంతియుతంగా నిరసన తెలపలేకపోతే, న్యాయం కోసం మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. Kolkata Police officer using “mild force” to “violent mob” who happens to be teachers terminated from jobs due to ruling party’s monumental scam. #SSCScam pic.twitter.com/N2yd4u0acP— Aparna (@chhuti_is) April 9, 2025అవినీతికి శిక్ష, న్యాయానికి గౌరవం దక్కాలన్నదే మా డిమాండ్. త్వరలో మరింత మంది అర్హులైన ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరపనున్నాం. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.టీచర్ల నియామకం రద్దు.. తీర్పు వెలువరించిన సుప్రీం అంతకుముందు పశ్చిమబెంగాల్ టీచర్ స్కాంపై సుప్రీం కోర్టు ఏప్రిల్ 3న విచారణ చేపట్టింది. అనంతరం తుదితీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. విద్యాశాఖ మంత్రితో సహా పలువురి అరెస్ట్2016లో పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు రంగంలోకి దిగాయి. దర్యాప్తు చేపట్టి పశ్చిమ బెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీ , రాష్ట్రస్కూల్ సర్వీస్ కమిషన్ పదవులు నిర్వహించిన మరికొందరు అధికారులను అరెస్ట్ చేశాయి.

ముంబై ఉగ్రదాడి: తహవ్వుర్ హుస్సేన్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ
ఢిల్లీ: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పాటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.వివరాల ప్రకారం.. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట ఎన్ఐఏ అధికారులు హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది.2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు.అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు.

విమానం ల్యాండైన వెంటనే అనారోగ్యంతో పైలట్ మృతి
న్యూఢిల్లీ: విమానం ల్యాండయిన కొద్ది సేపటికే అస్వస్థతకు గురైన పైలట్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన బుధవారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం బుధవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ల్యాండయిన కొద్దిసేపటికే పైలట్(30) అస్వస్థతగా ఉందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. అనారోగ్య కారణాలతో ఆ పైలట్ చనిపోయినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు వివరించారు. ఇతర వివరాలను వెల్లడించలేదు. ‘ఈ సమయంలో గోప్యతను గౌరవించాలని, అనవసర ఊహాగానాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో సంబంధిత అధికారులకు సహకరించేందుకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు.

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వామపక్ష తీవ్రవాద(ఎల్డబ్ల్యూఈ) ప్రాంతాల అభివృద్ధికి ప్రైవేటు రంగం కూడా భాగస్వామిగా ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సంబంధిత రాష్ట్రాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు మొదలు అభివృద్ధి పనుల వరకు ప్రైవేటు సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపింది. 2015లో ఇందుకు సంబంధించిన జాతీయ విధానం, కార్యచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల లోక్సభలో తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల బెటాలియన్లు, శిక్షణ, రాష్ట్ర పోలీసు దళాల ఆధునీకరణకు నిధులు, పరికరాలు, ఆయుధాలు, నిఘా భాగస్వామ్యం, పోలీస్స్టేషన్ల నిర్మాణంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రైవేటు రంగాలతో కలసి సహకారం అందిస్తుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో 17,589 కిలోమీటర్ల రోడ్లు మంజూరు కాగా, 14,618 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. టెలికాం కనెక్టివిటీ కోసం 10,505 మొబైల్ టవర్లను మంజూరు చేయగా 7,768 టవర్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసం ఆమోదం పొందిన 48 పారిశ్రామిక శిక్షణ సంస్థలు, 61 నైపుణ్య అభివృద్ధి కేంద్రాల్లో 46 ఐటీఐలు, 49 ఎస్డీసీలు పనిచేస్తున్నట్లు వివరించారు. ఆయా జిల్లాల్లో బ్యాంకింగ్ సేవలతో తపాలా శాఖ 5,731 పోస్టాఫీసులను ప్రారంభించినట్లు మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు.
ఎన్ఆర్ఐ

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
క్రైమ్

అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
‘‘అమ్మా.. ఇక సెలవు.. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటున్నా’’ అంటూ ఓ కొడుకు రాసిన సూసైడ్ లెటర్ ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలో బుధవారం ఘోరం జరిగింది. భర్తపై కక్ష గట్టి మరీ ఆ భార్య అతని కటకటాలపాలు చేసింది. అది భరించలేకపోయిన ఓ భర్త.. పైగా ఆ విషయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.రాజ్ ఆర్య, సిమ్రాన్లకు ఏడాది కిందట వివాహం జరగ్గా.. ఈ జంటకు నెలల బాబు ఉన్నాడు. అయితే గతకొంతకాలంగా ఆ కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఓ వివాహ వేడుకకు భార్యతో పాటు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో రాజ్, అతని తండ్రి షాహ్జన్పూర్లోని సిమ్రాన్ ఇంటికి వెళ్లాడు. అయితే సిమ్రాన్ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని సిమ్రాన్ సోదరులంతా రాజ్, అతని తండ్రిపై దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దర బరేలీకి తిరిగి వచ్చారు. ఈలోపు..ఇంటికొచ్చి మరీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారంటూ రాజ్, అతని తండ్రిపై సిమ్రాన్ కేసు పెట్టింది. దీంతో విచారణ పేరిట బుధవారం రాజ్ను పోలీస్ స్టేషన్కు పిలిచారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రాజ్.. తనకు నిద్రగా ఉందంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. స్టేషన్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని, అది భరించలేక పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే.. సిమ్రాన్ వివాహేతర సంబంధమే దీనంతటికి కారణమని రాజ్ సోదరి అంటోంది. పైగా రాజ్పై ఫిర్యాదు చేయడానికి ముందు.. చేశాక.. ‘ఇక ఊచలు లెక్కపెట్టు’ అంటూ ఇన్స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టులను ఆమె బయటపెట్టింది. అంతేకాదు పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు రాత్రంతా రాజ్ను పీఎస్లో ఉంచి చితకబాదాడని, ఆ అవమానాన్ని తన సోదరుడు భరించలేకపోయాడని ఆరోపించిందామె. ఇక ఈ ఘటనపై రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. In the suicide case of #RajArya, a resident of #AkankshaEnclave under the #Izzatnagar police station area in #UttarPradesh's #Bareilly, an FIR has been registered against seven individuals, including his wife #Simran.The report was filed by the deceased's brother, Suresh,… https://t.co/Z4MGrKhyEt pic.twitter.com/otNGtaMmvs— Hate Detector 🔍 (@HateDetectors) April 10, 2025 ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

వరకట్న వేధింపులకు వివాహిత బలి!
విడవలూరు: వరకట్నం కోసం వేధించడంతో కల్లాపిరంగు పొడిని నీటిలో కలిపి తాగి వివాహిత మృతిచెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బోగోలు మండలం తాటిచెట్లపాళెం గ్రామానికి చెందిన బచ్చింగారి సుగుణ (23)కు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన హరికృష్ణతో 2021లో వివాహమైంది.వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన ఏడాది తర్వాత అదనపు కట్నంగా రూ.7 లక్షలు తీసుకురావాలని భర్తతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్ష్మి కలిసి సుగుణను వేధించడం మొదలుపెట్టారు. ఇవి బుధవారం తారస్థాయికి చేరాయి. మనస్తాపంతో సుగుణ ఇంటి ముందు చల్లే కల్లాపిరంగు పొడిని నీళ్లలో కలిపి తాగింది. సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇరుగుపొరుగున్న బంధువులు ఇది గుర్తించి ఈ సమాచారాన్ని సుగుణ తల్లి అన్నమ్మకు తెలిపారు.వారు వెంటనే పెద్దపాళెం గ్రామానికి చేరుకుని సుగుణను రాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమార్తె మరణంపై అనుమానం ఉందంటూ హరికృష్ణతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్షి్మలపై అన్నమ్మ గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో గ్రామంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో హరికృష్ణ, అతని తండ్రి నాగూరు కూడా ఉన్నారు. వీరు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారని, కట్నం కోసం సుగుణను వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది.

ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.బీహార్ సమస్తిపూర్(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్ కుమార్ సింగ్(Mukesh Singh Kumar) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయసాగింది. ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్ సింగ్ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం..

భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
యశవంతపుర(కర్ణాటక): వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినఘటన బెంగళూరుని హెబ్బాళ కనకనగరలో సోమవారం సాయంత్రం జరిగింది. బషీర్ ఉల్లా, బాహర్ అస్మా(29) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అస్మా అనుమానించింది. ఇదే విషయంపై తీవ్ర మనో వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అస్మా ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు వచ్చి పరిశీలించారు. అస్మాను చంపి ఉరివేసినట్లు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బషీర్ ఉల్లాను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
వీడియోలు


Magazine Story: రోత మాటలు, అశ్లీల పోస్టులు.. సైకో ఫ్యాక్టరీ


Big Question: కూటమి పాపమే తిరుమల కొండకు శాపమా?


గోరంట్ల మాధవ్ పై పెట్టిన కేసులు ఇవే... అరెస్ట్ పై పొన్నవోలు కామెంట్స్


పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు... లావు శ్రీకృష్ణదేవరాయులపై పేర్ని నాని ఫైర్


టీడీపీ సోషల్ మీడియా అరాచకం పీక్స్ కు వెళ్లింది


మరి ఆ రోజు అనితపై ఎందుకు కేసు పెట్టలేదు: Syamala


ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన


ఆపరేషన్ 2026 ఎలక్షన్స్ ... అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు


Dharmapuri Arvind: ఇచ్చిన ఒక్క హామీ కాంగ్రెస్ పూర్తి చేయలేదు


వైఎస్ జగన్ పై వంగలపూడి అనిత వ్యాఖ్యలకు దిమ్మతిరిగేలా పేర్ని నాని కౌంటర్