వర్క్‌ ఫ్రమ్‌హోంలో ఉద్యోగులు..పెరిగిన సైబర్‌ దాడులు! | Companies Suffered Cyberattacks Due To Work From Home In 2021 | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రమ్‌హోంలో ఉద్యోగులు..పెరిగిన సైబర్‌ దాడులు!

Published Wed, Aug 3 2022 9:49 PM | Last Updated on Wed, Aug 3 2022 9:50 PM

Companies Suffered Cyberattacks Due To Work From Home In 2021 - Sakshi

గతేడాది కరోనా కారణంగా ఎక్కువ శాతం కంపెనీల కార్యకలాపాలన్నీ రిమోట్‌గానే నడిచాయి. దీంతో దేశంలో 45 శాతం సైబర్‌ క్రైం పెరిగాయని, ఈ ఏడాది 22శాతానికి పెరిగినట్లు వెరిజోన్‌ మొబైల్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌-2022 నివేదిచింది. 

సైబర్‌ దాడుల కారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువ ప్రభావితం అయ్యాయని తెలుస్తోంది. మూడు నుంచి ఐదు కంపెనీల వరకు 61 శాతం దెబ్బతిన్నాయని,  43 శాతం దేశీయ సంస్థలపై ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేరాలు ముఖ్యంగా ఆర్థిక సేవల్లో 93 శాతం, రిటైల్ 88 శాతం, ఆరోగ్య సంరక్షణ 87 శాతం, ప్రభుత్వ రంగం, విద్య 87 శాతం, తయారీ, నిర్మాణం, రవాణా రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.  

ఈ సందర్భంగా వెరిజోన్ బిజినెస్ సీఈఓ సంపత్ సౌమ్యనారాయణన్ మాట్లాడుతూ..రిమోట్‌ వర్క్‌ కారణంగా సంస్థలు సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా లేవని అన్నారు. కాబట్టే సైబర్‌ దాడులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement