Top Stories
ప్రధాన వార్తలు

వైఎస్సార్సీపీ కార్యకర్తను చూసినా బాబుకు భయమే: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: జగన్ మంచి చేశాడు కాబట్టి చంద్రబాబు(chandrababu) మరింత చేస్తాడని ప్రజలు నమ్మారని.. కానీ, నిత్యం అబద్ధాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. మంచి చేశాం కాబట్టే ఇవాళ వైఎస్సార్సీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లాం. ఆ ప్రస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్సీపీ(YSRCP) ఎదిగింది. ఆరోజు నుంచీ నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్సార్సీపీ. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈరెండింటిని చూసి నాతోపాటుగా మీరంతా అడుగులో అడుగు వేశారు. 👉రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవ్వాళ్టికీ కూడా వైఎస్సార్సీపీకి చెందిన ఏ నాయకుడైనా గర్వంగా కాలర్ ఎగరవేసుకుని ప్రజల వద్దకు వెళ్లగలడు. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ మన నాయకులకు మాత్రమే ఉంది. మనం రాకముందు రాజకీయాలు ఒకలా ఉండేవి. మనం వచ్చిన తర్వాత రాజకీయాలకున్న అర్ధాన్ని మార్చాం. ఇచ్చిన మాటకు ఎవరైనా కట్టుబడి ఉండాలని చెప్పాం. రాజకీయ అవసరాలకోసం గతంలో ఇష్టం వచ్చినట్టు మేనిఫెస్టో ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. మనం వచ్చాక, మేనిఫెస్టోను ఒక పవిత్రమైన గ్రంధం మాదిరిగా భావించాం. ప్రతి అంశాన్నీ నెరవేర్చాలని తపన, తాపత్రయం పడ్డాం. కోవిడ్ ఉన్నా సరే అన్ని హామీలను నెరవేర్చాం. సంక్షోభం ఉన్నా, ఏరోజూ సాకులు వెతుక్కోలేదు. 99శాతం పైచిలుకు హామీలను నెరవేర్చాం. గడపగడపకూ ప్రతి ఇంటికీ వెళ్లాం. ఇన్ని చేసినా మనం ఓటమి చెందాం. 👉చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. ప్రతి ఇంటికీ తన మనుషులను చంద్రబాబు పంపాడు. కరపత్రాలు, బాండ్లు చంద్రబాబు పేరిట పంచారు. ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. దీనివల్ల పదిశాతం ప్రజలు చంద్రబాబును నమ్మారు. జగన్ చేశాడు కాబట్టి, చంద్రబాబుకూడా చేస్తాడని నమ్మారు. జగన్కన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మారు. చంద్రబాబు మారాడేమోనని ప్రజలు నమ్మారు. అందుకే 50శాతం నుంచి 40శాతానికి మన ఓటు షేరు తగ్గింది. కానీ, చంద్రబాబు వచ్చి 11 నెలలు అయిపోయింది. రెండు బడ్జెట్లు పెట్టాడు(Chandrababu Budgets). చంద్రబాబు నాయుడు హామీలు నెరవేరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. మాట ఇచ్చాను కాని, ఇప్పుడు భయం వేస్తుందని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. రాష్ట్రానికున్న అప్పులపై అబద్ధాలు చెప్తున్నారు. ప్రతిరోజూ అబద్ధాలు చెప్తునే ఉన్నారు. 👉జగన్ ఉన్నప్పుడు నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లాయని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు ఉన్న ప్లేటును చంద్రబాబు లాగేశాడని అనుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తి తిరోగమనం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీకి రూ.3,500 కోట్లు బకాయి పెట్టారు. దీంతో వైద్యం చేయలేమని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడంలేదు. రైతులకు పెట్టుబడి సహాయం అందడంలేదు. ఫీజు రియింబర్స్మెంట్, వసతి దీవెన అందడంలేదు. పరిపాలనలో పారదర్శకత పూర్తిగా పక్కకు పోయింది. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన(Red book Rule) కొనసాగుతోంది. అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు, బెల్టుషాపులు యధేచ్చగా వెలిశాయి. పేకాట క్లబ్బలు, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయి. వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటికీ పార్టీ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా నిలవాలి. గ్రామస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పార్టీ ఉండాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలి.చంద్రబాబుగారూ.. ప్రజలకు మంచి చేయొచ్చు కదా?. ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చు కదా?. ఇంతలా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా?. ఏపీ పూర్వపు బిహార్ రాష్ట్రంలా తయారయ్యింది. అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు?. ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తున్నారు?. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు భయం. వైయస్సార్ సీపీ కార్యకర్త అంటే కూడా చంద్రబాబుకు భయం. చంద్రబాబు హామీల అమల్లో, పాలనలో ఘోరంగా విఫలమయ్యారు. టీడీపీ కేడర్, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకు దగ్గరకు వెళ్తే కచ్చితంగా నిలదీస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తున్నాం. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్ 2.O పాలన కచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి కార్యకర్తకు జగన్ భరోసాగా ఉంటాడు. విలువలు, విశ్వసనీయతకు దర్పణంలా పార్టీని నిలుపుదాం అని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ అన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణా(Tahawwur Rana) భారత్కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్లో చికాగో ఎయిర్పోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్ సయ్యద్ గిలానీ(డేవిడ్ కోల్మన్ హెడ్లీ) 1960లో వాషింగ్టన్లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ సలీం గిలానీ పాక్ దౌత్య వేత్త. తల్లి అలైస్ సెర్రిల్ హెడ్లీ వాషింగ్టన్లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్మైండ్ డేవిడ్ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు.

యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైందని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్ అని అన్నారు. సైనిక్ స్కూల్కు ధీటుగా పోలీస్ స్కూల్ను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆయన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. పోలీసు శాఖపై మాకు స్పష్టమైన ఆలోచన ఉంది. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవే. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహారావు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్ఇండియా పోలీస్ స్కూల్కు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ను సమకూర్చుకోవాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం అంటే వైఎస్సార్ గుర్తుకువస్తారు. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం. పోలీసు స్కూల్ విషయంలో రాజకీయం లేదు.వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి.. ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.

పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఒకడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తన అద్భుత ఆట తీరుతో టెస్టుల్లో భారత జట్టు ఓపెనర్గా పాతుకుపోయాడు.అరంగేట్రంలోనే శతక్కొట్టిన జైసూ.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా విశేషం. టెస్టుల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 23 మ్యాచ్లు పూర్తి చేసుకుని 723 పరుగులు సాధించాడు. అయితే, దాదాపు ఏడాది కాలంగా మళ్లీ టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు.మరోసారి విఫలంగతేడాది ఐపీఎల్లోనూ యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పదహారు ఇన్నింగ్స్లో కలిపి 435 పరుగులు చేయగలిగాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం ఇంత వరకు తన మార్కు చూపలేకపోయాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.అహ్మదాబాద్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 107 (1, 29, 4, 67, 6 )పరుగులే చేశాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లోనూ జైసూ తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు.తొలి టెస్టులో సెంచరీ (161), ఆఖరి టెస్టులో హాఫ్ సెంచరీలు (82, 84) మినహా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. తర్వాత రంజీ బరిలో దిగి విఫలమయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చి జైస్వాల్.. అరంగేట్రంలోనే తేలిపోయాడు. తన మొదటి వన్డేలో కేవలం పదిహేను పరుగులే చేశాడు.పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ యశస్వి జైస్వాల్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి కడుపు నిండిపోయింది. అంటే.. ఇప్పటి వరకు సాధించిన దానితో సంతృప్తి పడిపోయాడు. జైస్వాల్ ప్రస్తుతం క్రికెట్పై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు.అతడికి ఇదే నా సందేశం.. క్రికెట్ను నిన్ను గొప్ప స్థాయికి చేర్చగలదు. అదే సమయంలో.. అదే రీతిలో ఏడిపించగలదు కూడా! ఒక్కసారి పృథ్వీ షా పరిస్థితి చూడు. ఇప్పటికైనా మునుపటిలా క్రికెట్ను ప్రేమించు. అదే ప్యాషన్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టు’’ అని బసిత్ అలీ జైసూకు సూచించాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జైస్వాల్ స్థానం గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నాడు.విరాట్ కాస్త తొందరపడ్డాడు.. కానీభారత్లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదువలేదని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో కొత్త స్టార్లు పుట్టుకు వస్తున్నారు కాబట్టి జైసూ ఇప్పటికైనా జాగ్రత్తపడాలని బసిత్ అలీ సలహా ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా.. ‘‘అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగి రోహిత్, విరాట్ మంచి పని చేశారు.నాకైతే విరాట్ కాస్త తొందరపడ్డాడు అనిపించింది. అయితే.. సరైన సమయంలో అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. యువ ఆటగాళ్లు దూసుకువస్తున్న తరుణంలో ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించి వారికి మార్గం సుగమం చేశారు’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు. కాగా చిన్న వయసులోనే సత్తా చాటి భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా.. టీమిండియా ఓపెనర్గా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించి ఐపీఎల్ వేలంలో కూడా అమ్ముడుపోని స్థితికి దిగజారిపోయాడు.చదవండి: అతడికి కాస్త మర్యాద నేర్పండి.. చీప్ జోకులు వద్దు: సెహ్వాగ్పై ఫ్యాన్స్ ఫైర్

అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి, సాక్షి: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్లూరుపేట పోలీసులు పోసానిని విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపురి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. సూళ్ళూరు పేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సీఐ మురళీ కృష్ణపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి(IO) వ్యవహరించారని, కేసులో అదనంగా 111 సెక్షన్ పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది. అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐ మురళీ కృష్ణకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 24కి పోసాని పిటిషన్పై విచారణ వాయిదా వేసింది.

Michelle Obama: ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(barack obama) సతీమణి మిషెల్లీ విడాకుల ప్రచారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరురాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బహిరంగంగా బరాక్ ఖండించినప్పటికీ.. మిషెల్లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన టైంలో, అంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిషెల్లీ ఒబామా(michelle obama) గైర్హాజరు అయ్యారు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీసమేతంగా(ఫస్ట్ లేడీ కాబట్టి) హాజరు కావడం అక్కడి ఆనవాయితీ. అయితే బరాక్ ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని ఒబామా గత నాలుగు నెలల కాలంలో విడాకుల రూమర్లను(Divorce Rumours) రెండుసార్లు ఖండించారు. ఇప్పుడు మిషెల్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు.నటి సోఫియా బుష్ నిర్వహించే పాడ్కాస్ట్లో మిషెల్లీ మాట్లాడుతూ.. విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారామె. ‘‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు’’ అని అన్నారామె.ఇక్కడ.. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించలేకపోయారు. మహిళలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవే. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు గ్రహించలేకపోయారు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకున్నారు అని మిషెల్లీ అన్నారు.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 3వ తేదీన హమిల్టన్ కాలేజీలో ఓ ఈవెంట్కు హాజరైన బరాక్ ఒబామా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు.

కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వ అరాచకాలు, రెడ్బుక్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు సృష్టిస్తున్న విధ్వంసంపై ప్రజలు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డి పల్లిలో హత్యకు గురైన కురబ లింగమమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంగా ప్రజల ఆదరణ చూస్తే కూటమిపై వారి వ్యతిరేకత ఏమిటి? ఎంతస్థాయిలో ఉన్నదీ స్పష్టమవుతుంది.వైఎస్ జగన్ పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం పన్నిన అన్ని కుట్రలూ ఇక్కడ విఫలమయయ్యాయి. పోలీసులు సృష్టించిన అడ్డంకులన్నింటినీ తొలగించుకుని మరీ జనసందోహం ఒక సునామీలా జగన్కు తన మద్దతు తెలిపింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలతో జగన్ పర్యటన విజయవంతమైంది. ప్రజాగ్రహంపై ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ అయ్యింది!.ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు ఇప్పటివరకూ నెరవేర్చకపోవడం.. వీటి గురించి ప్రశ్నించిన వారిని రెడ్బుక్ పేరుతో అణచివేతకు గురి చేస్తూండటం కూడా ప్రజల ఆగ్రహానికి కారణం. రాష్ట్రస్థాయి నాయకులు ఒక చిన్న గ్రామానికి వెళితే ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల వారు వెళ్లడం పరిపాటి. కానీ, జగన్ పాపిరెడ్డి పల్లి పర్యటనలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉండటం గమనార్హం. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కూటమి చేతిలో మోసపోయిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం తీవ్రత ఏమిటో తేటతెల్లమవుతుంది. జగన్ కార్యక్రమానికి తరలివస్తున్న ప్రజల దృశ్యాలు చూస్తుంటే తెలుగుదేశం వారి గుండెలలో రైళ్లు పరుగెత్తి ఉండాలి. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వందల మంది పొలాలకు అడ్డం పడి మరీ పరుగులు తీసుకుంటూ రావడం కనిపిస్తుంది. ప్రత్యేకంగా సభ ఏమీ లేకపోయినా, ఈ స్థాయిలో జగన్ అభిమానులు వచ్చారంటే దానికి కారణం చంద్రబాబు, లోకేశ్ల ప్రభుత్వ అరాచకపు పాలనపై నిరసనను చెప్పడానికే అన్నది స్పష్టం.వైఎస్ జగన్ మాజీ సీఎం అయినప్పటికీ ఆయనకు తూతూ మంత్రంగా కల్పించిన భద్రత కూడా ఈ పర్యటన సందర్భంగా ప్రభుత్వం తీరుపై పలు విమర్శలకు కారణమైంది. జగన్ వచ్చిన హెలికాఫ్టర్ వద్దకు జనం చొచ్చుకుపోయారంటే పోలీసుల సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంత ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, వాటిని ఎల్లో మీడియా మొదటి పేజీలో ప్రచురించడాన్ని బట్టి ఏపీలో ఉన్నది పోలీసు రాజ్యం అని, కింది స్థాయి పోలీసులపై అధికారులకు కంట్రోల్ లేదని స్పష్టమవుతుంది. ఇది ఆ ఎస్ఐ క్రమశిక్షణ రాహిత్యమైనప్పటికీ రెడ్బుక్ పాలనలో అలాంటివారికి ప్రోత్సాహం లభిస్తుండటం దురదృష్టకరం. ఆ ఎస్ఐ గత ఎన్నికలలో టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించి, లోకేశ్తో సహా పలువురు టీడీపీ నేతలను కలిశారని స్పష్టమైనప్పటికీ అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోగా, టీడీపీ ఎమ్మెల్యే కోరినట్లు పోస్టింగ్ ఇస్తే, అతను ఆ పార్టీ ఏజెంట్గా కాకుండా, ప్రజల కోసం పనిచేసే పోలీసుగా ఎందుకు వ్యవహరిస్తారు? ఇలాంటి వారు టీడీపీకి అనుకూలంగా పనిచేయరన్న గ్యారెంటీ ఏముంటుంది?.పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. ఏపీలో బీహారును మించిన భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి బీహారులో ఇలా రెడ్ బుక్ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై హింసకు దిగడం లేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ మాదిరి మారవద్దని బీహారులో అక్కడి రాజకీయ పార్టీలు చెప్పుకోవాలి. తప్పుడు కేసులు ఎలా పెట్టాలి? ప్రతిపక్ష నేతలను, పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని ఎలా వేధించాలి? సినీ నటులను సైతం వదలకుండా ఒకటికి ఇరవై కేసులు పెట్టి, వందల కిలోమీటర్ల దూరం ఎలా నిత్యం తిప్పాలి? ఎప్పుడో ఏదో జరిగిందని, ఏళ్ల తర్వాత మనోభావాలు గాయపడ్డాయంటూ చిత్రమైన కేసులు ఎలా పెట్టాలి? అన్న వాటిలో ఏపీ పోలీసులు ఆరితేరుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పిచ్చి పాలన ఏపీలో మాత్రమే ఉంటుందేమో!.వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా రెడ్బుక్ పాలన సాగుతోందని అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్యలకు గురైన తీరు, వారి వివరాలు, తప్పుడు కేసులలో రోజుల తరబడి వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైళ్లలో నిర్భంధిస్తున్న విధానం, స్థానిక ఉప ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యకాండ, బలం లేకపోయినా పోలీసుల సాయంతో గెలవాలన్న దుర్నీతి, మొదలైన వాటిని సోదాహరణంగా వివరించారు. వాటిలో ఒక్కదానికైనా ప్రభుత్వపరంగా మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ, గత జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర అంశాలను పక్కనబెట్టి, పోలీసులపై జగన్ చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ టూర్ను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా ఒకటే ఏడుపుతో కధనాలు ఇచ్చిందని చెప్పాలి.పచ్చ చొక్కాలతో పనిచేసే పోలీసుల బట్టలూడదీస్తామని, అధికారంలోకి వచ్చాక చట్టం ముందు నిలబెడతామన్నది జగన్ భావన అయితే ఏదో రకంగా పోలీసులలో తప్పుడు అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వార్తలు ఇచ్చాయి. తమ ఏడుపుగొట్టు వార్తల ద్వారా జగన్ టూర్కు జనం అశేష సంఖ్యలో వచ్చారని ఎల్లో మీడియా పరోక్షంగా అయినా ఒప్పుకోక తప్పలేదు. గతంలో చంద్రబాబు, లోకేశ్లు, అచ్చెన్నాయుడు తదితరులు విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు, దూషణలు చేసింది అందరికీ తెలుసు. లోకేశ్ అయితే రెడ్ బుక్ పేరుతో జిల్లా ఎస్పీలనే బెదిరిస్తూ చేసిన ప్రకటన సంగతేమిటి?.పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలోనే పోలీసుల వ్యాన్ పైనే రాళ్లదాడి చేసినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్నుపోతే కనీసం సానుభూతి అయినా చూపిందా?. అచ్చెన్నాయుడు కుప్పంలో పోలీసులను బూతులతోనే దూషించారే. ఈ ఎల్లోమీడియా అసలు ఆ ఘటనలపై వార్తలనైనా ఇచ్చిందా?. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అన్నట్లు అధికార టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తుంటే, వారికి ఎల్లో మీడియా భజన చేస్తోంది. ఏది ఏమైనా జగన్ టూర్ ద్వారా ఒక విషయం బోధపడుతుంది. రెడ్ బుక్ అన్న దానిని ఒక పిచ్చికుక్క మాదిరి ఎంత ఎక్కువగా ప్రయోగిస్తే ప్రజలలో అంత నిరసన వస్తుందని, అంత స్థాయిలో తిరుగుబాటు వస్తుందని తేలింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
తన ఎక్స్ ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. మియావాకి అడవి అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ డాక్టర్ నాయర్ గురించి తెలియదు అని పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక అడవిని చూడవచ్చు. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి అడవిని డాక్టర్ నాయర్ ఎలా సృష్టించారో నాకు తెలియదు. సుస్థిరతకు ప్రాధాన్యం లేని ఈ రోజుల్లో.. మన మధ్య ఇలాంటి హీరోలు ఉండటం గర్వకారణం అని ఆయన ట్వీట్ చేశారు.నాయర్ నిర్మించిన అడవిగుజరాత్లోని కచ్లో నాయర్ సుమారు 470 ఎకరాల విస్తీర్ణంలో అడవిని నిర్మించారు. ఇందులో 3,00,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. ఈ అడవిని జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో సహజ పర్యావరణ వ్యవస్థలను అనుకరించడానికి వివిధ రకాల స్థానిక వృక్ష జాతులను దగ్గరగా నాటడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇవి సాధారణ మొక్కలకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.ఎవరీ డాక్టర్ నాయర్డాక్టర్ నాయర్ పర్యావరణవేత్త & ఎన్విరో క్రియేటర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. 2014లో ఈయన 1500 చెట్లతో.. మియావాకి అడవిని ప్రారభించడం మొదలుపెట్టారు. ఇలాంటి అడవులను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నిర్మించారు. వీటిలో చెప్పుకోదగ్గది కచ్లోని స్మృతివన్ మియావాకి అడవి. దీనిని 2001 గుజరాత్ భూకంప బాధితులకు నివాళిగా నిర్మించారు. కాగా 2030 నాటికి 100 కోట్ల చెట్లను నాటడమే లక్ష్యంగా డాక్టర్ నాయర్ ముందుకు సాగుతున్నారు.మియావాకి పద్దతి1970లో జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో మొక్కలను దగ్గరదగ్గరగా నాటుతారు. కాబట్టి ఇవి సాధారణ చెట్ల కంటే 10 రేట్లు వేగంగా పెరుగుతాయి. ఈ పద్దతిలో మొక్కలను పెంచడం వల్ల మట్టి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది.I knew what a Miyawaki forest was but had no idea about Dr Nair and how he had created the world’s largest such forest in India. At a time when the U.S has taken sustainability off its priority list I am just grateful that we have such heroes amongst us…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/WNra4TnhVP— anand mahindra (@anandmahindra) April 9, 2025

ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
బాలీవుడ్ హిట్ సినిమా 'ఛావా' ఓటీటీ ప్రకటన సడెన్గా వచ్చేసింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, సినిమాకు మంచి ఆదరణ రావడంతో మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదలపై మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' చిత్రం నెట్ఫ్లిక్స్లో(Netflix) 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, హిందీ, తెలుగు రెండు భాషలలో విడుదల చేస్తారా లేదా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తారా..? అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రెండు భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.750 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్ను క్రియేట్ చేసిన ఛావా కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd— Netflix India (@NetflixIndia) April 10, 2025

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!
ప్రతి మనిషికీ ప్రాణవాయువు తరువాత అత్యంత ప్రామాణికమైనది నీరు. మనిషి దేహంలో సుమారు 60 నుంచి 70 శాతం నీరు ఉంటుంది. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలమేమో కానీ, నీరు అందకుంటే మాత్రం ప్రాణాపాయమే. అయితే ఇంతటి ప్రామాణికమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారిన విషయం విదితమే. నీటిని కూడా లీటర్ల చొప్పున అమ్మడం, మనం కొనడం సాధరణమైపోయింది. అయితే ఇటీవల నగరంలో జరిగిన సినిమా వేడుకలో ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో ఓ వాటర్ బాటిల్తో నీరు తాగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్లు ఉండే ఈ వాటర్ బాటిల్ ధర అక్షరాలా 130 నుంచి 160 రూపాయలట. అంటే ఆ బ్రాండ్ ఒక లీటర్ నీరు సుమారు రూ.500. నిజంగా హైదరాబాద్లో వందలు, వేలు ఖర్చు చేసి ఒక లీటర్ నీటిని కొంటున్నారా.. అంటే? ఔననే సమాధానం వస్తుంది. వందలు వేలు కాదు.. కొందరు ప్రముఖులు ఏకంగా లక్షల రూపాయలు విలువైన వాటర్ బాటిళ్లు కొని మరీ తాగుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20లు. ఫ్లేవర్డ్ వాటర్ బాటిల్ లేదా స్పార్లి్కంగ్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.30 నుంచి 50 వరకూ ఉంటుంది. ప్రీమియం నేచురల్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.40 నుంచి 100 వరకూ ఉంటుంది. వాటర్ బాటిళ్ల అమ్మకం ఐఎస్ఐ మార్క్, బ్రాండింగ్, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాల పై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి సహజ వనరైన నీటిని ఇంత ధరల్లో అమ్మడం కూడా అనైతికమని పలు సంస్థలు, సామాజిక వేత్తలు నినదిస్తున్నారు. కానీ హైదరాబాద్ వంటి మహానగరంలో నీటిని వేలకు వేలు పెట్టి మరీ తాగున్నారనే విషయం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా కొన్ని రెస్టారెంట్లకు వెళితే బయట 20 రూపాయలకు లభించే లీటర్ వాటర్బాటిల్ ధర 40 నుంచి 80 ఉంటుంది. దీనికి సొంత బ్రాండింగ్, నీటి స్వచ్ఛత, మినరల్స్ మిక్సింగ్ వంటి అంశాలను వెల్లడిస్తారు. దీనికి మించి నగరంలోని కొన్ని స్టార్ హోటళ్లలో 250 నుంచి 300 మి.లీ వాటర్బాటిల్ ధర సుమారు 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నేచురల్ మినరల్ వాటర్ అని, నేచురల్లీ ఆల్కలైన్ వాటర్ అనీ విభిన్న పద్ధతుల్లో ఈ నీటిని అందిస్తున్నారు. ఎన్విరాన్మెంటల్లీ సర్టిఫైడ్ బ్రాండ్స్ అంటూ లీటర్కు సుమారు వెయ్యిరూపాయల వరకూ ధర నిర్ణయిస్తున్నారు. నగరంలోని 3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో జరిగే బిజినెస్ మీటింగ్స్, ఫంక్షన్స్లో ఈ తరహా వాటర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అంతే కాదు.. సాధారణంగా లంచ్ లేదా డిన్నర్ కోసం వెళ్లిన నగరవాసులు సైతం ఈ నీటిని సేవిస్తుండటం విశేషం. నార్వేలోని భూగర్భ జలాల నుండి సేకరించిన వోస్ ఆర్టేసియన్ వాటర్ (12 బాటిళ్ల ప్యాక్ సుమారుగా 6,600), ఆరావల్లి పర్వత శ్రేణి నుంచి సేకరించిన ఆవా సహజ అల్కలైన్ వాటర్, క్రికెటర్ కోహ్లీ తాగే ఎమియన్ వంటి ఖరీదైన బ్రాండ్స్ నగరంలో లభిస్తుండటం విశేషం. వజ్రాల బాటిల్స్లో తాగే నీరు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరుగా బెవర్లీ హిల్స్ 90 ఏ20 డైమండ్ ఎడిషన్ గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్ లగ్జరీ కలెక్షన్ డైమండ్ ఎడిషన్ బాటిల్ ధర రూ.65 లక్షల వరకూ ఉంది. ఈ బాటిల్లో 600 జీ/వీఎస్ తెల్ల వజ్రాలు, 250కు పైగా నల్ల వజ్రాలతో అలంకరించిన బంగారు టోపీ సెట్ ఉంటుంది. ఆక్వా డీ క్రిస్టల్లో ట్రిబ్యూటో మోడిగ్లియాని అనే బ్రాండ్ వాటర్ బాటిల్ ధర రూ.44 లక్షలకు పైమాటే. ఈ బాటిల్ 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకుంది. ఫిజియన్, ఫ్రెంచ్ స్ప్రింగ్స్–ఐస్లాండ్ హిమ నదీ నుంచి సేకరించిన ఈ నీటిని 750 మి.లీ పరిమాణంలో 24–క్యారెట్ల బంగారు బాటిల్లో అందిస్తారు. దక్షిణ కాలిఫోరి్నయాలోని పలోమర్ పర్వతం నుంచి సేకరించే బ్లింగ్ హెచ్20 ధర 2 లక్షల వరకూ ఉంది. నెవాస్ గ్లో–ఇన్–ది–డార్క్ బాటిల్ వాటర్ మాగ్నమ్ ధర దాదాపు రూ.1.32 లక్షలు. వంద శాతం సహజమట..! వందలు వేలు కాదు.. ప్రపంచవ్యాప్తంగా తాగే నీటిని లక్షల విలువ చేసే బాటిళ్లలో అమ్మడం కూడా మొదలైంది. ఇంతటి ఖరీదైన వాటర్ బాటిళ్లు మన దేశంలో కూడా కొని తాగుతున్నారు కొందరు ధనవంతులు, సెలబ్రిటీలు. ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునే ఏవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ మాత్రమే తాగుతాడు. ఈ నీరు వంద శాతం సహజ నీరు, ఫ్రాన్స్లోని ఏవియన్–లెస్–బెయిన్స్ సమీపంలోని సహజ వనరుల నుంచి సేకరించినవి. ఈ స్వచ్ఛమైన నీటిలో సహజ ఖనిజాలంటాయని, అంతేకాకుండా ఎలాంటి రసాయనాలతో కలుషితం కాదని నిర్థారించినవి. విరాట్ కోహ్లీ ప్రతి యేటా సుమారు రూ.4.3 లక్షల వరకూ ఈ నీటి కోసం వెచ్చిస్తాడని సమాచారం. (చదవండి: 'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ..అనుబంధాలకు ప్రతీక..!)
లక్షలు పెట్టి టికెట్ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్పై అభిమానుల ఫైర్
యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్: రేవంత్
26/11 టార్గెట్లో జల వాయు విహార్.. తహవ్వుర్ రాణా కీలక పాత్ర?
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
RCB VS DC: హిట్మ్యాన్ సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లి
‘బాబూ.. వృద్ధిరేటు బాగుంటే అప్పులెందుకు?.. సూపర్ సిక్స్ ఎక్కడ?’
470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
11న వారణాసికి ప్రధాని మోదీ.. రూ. 3.880 కోట్ల విలువైన ప్రాజక్టులకు శంకుస్థాపన
మేం ఉద్యోగం చేయలేం
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
ప్లాట్ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
Jack Movie Review: ‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
‘కేకేఆర్ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్లో టీసీఎస్..
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్రౌండర్ సంచలన వ్యాఖ్యలు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
అమెరికాకు షాకిచ్చిన చైనా
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
అమెరికా వీసా, గ్రీన్కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు
ఏడు అడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
ఆమెకు 30.. అతడికి 18.. ముగ్గురు పిల్లులున్నా భర్తను కాదని..
పాపికొండల్లో అలుగుల సందడి
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
ఒకేసారి రూ.2940 పెరిగిన గోల్డ్ రేటు: నేటి కొత్త ధరలు ఇవే..
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
GT Vs RR: ఆర్చర్ దెబ్బకు స్పీడ్ గన్కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్ డెలివరీ
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
నంబర్ వన్గా కొనసాగుతున్న శుభ్మన్ గిల్
17 ఏళ్లుగా పరారీలోనే!
ఏప్రిల్ వేతనాలేవీ?
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ!
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
ఒకరి వెంట మరొకరు
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
ట్రంప్ దూకుడు.. అమెరికాలోని చైనీయులకు చైనా హెచ్చరిక
లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు!
టారిఫ్లకు ట్రంప్ బ్రేక్
నా స్పీచ్తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
‘అహం’ పనికిరాదు.. నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలు: కోహ్లి
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
మందులపైనా టారిఫ్లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
చాహల్తో ఆర్జే మహ్వశ్ డేటింగ్.. కన్ఫార్మ్ చేసేసింది!
కానిస్టేబుల్ యశోద అనుమానాస్పద మృతి.. జైలులో ఏం జరిగింది?
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్కు మతి పోయింది..!
కొనేది.. తినేది విషమే!
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్ను రమ్మన్నారు
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
స్కిల్ కేసులో అటకెక్కిన చార్జిషీట్లు!
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
వెస్టిండీస్కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
AP: రియల్.. ఢమాల్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
లక్షలు పెట్టి టికెట్ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్పై అభిమానుల ఫైర్
యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్: రేవంత్
26/11 టార్గెట్లో జల వాయు విహార్.. తహవ్వుర్ రాణా కీలక పాత్ర?
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
RCB VS DC: హిట్మ్యాన్ సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లి
‘బాబూ.. వృద్ధిరేటు బాగుంటే అప్పులెందుకు?.. సూపర్ సిక్స్ ఎక్కడ?’
470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
11న వారణాసికి ప్రధాని మోదీ.. రూ. 3.880 కోట్ల విలువైన ప్రాజక్టులకు శంకుస్థాపన
మేం ఉద్యోగం చేయలేం
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
ప్లాట్ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
Jack Movie Review: ‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
‘కేకేఆర్ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్లో టీసీఎస్..
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్రౌండర్ సంచలన వ్యాఖ్యలు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
అమెరికాకు షాకిచ్చిన చైనా
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
అమెరికా వీసా, గ్రీన్కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు
ఏడు అడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
ఆమెకు 30.. అతడికి 18.. ముగ్గురు పిల్లులున్నా భర్తను కాదని..
పాపికొండల్లో అలుగుల సందడి
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
ఒకేసారి రూ.2940 పెరిగిన గోల్డ్ రేటు: నేటి కొత్త ధరలు ఇవే..
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
GT Vs RR: ఆర్చర్ దెబ్బకు స్పీడ్ గన్కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్ డెలివరీ
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
నంబర్ వన్గా కొనసాగుతున్న శుభ్మన్ గిల్
17 ఏళ్లుగా పరారీలోనే!
ఏప్రిల్ వేతనాలేవీ?
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ!
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
ఒకరి వెంట మరొకరు
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
ట్రంప్ దూకుడు.. అమెరికాలోని చైనీయులకు చైనా హెచ్చరిక
లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు!
టారిఫ్లకు ట్రంప్ బ్రేక్
నా స్పీచ్తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
‘అహం’ పనికిరాదు.. నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలు: కోహ్లి
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
మందులపైనా టారిఫ్లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
చాహల్తో ఆర్జే మహ్వశ్ డేటింగ్.. కన్ఫార్మ్ చేసేసింది!
కానిస్టేబుల్ యశోద అనుమానాస్పద మృతి.. జైలులో ఏం జరిగింది?
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్కు మతి పోయింది..!
కొనేది.. తినేది విషమే!
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్ను రమ్మన్నారు
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
స్కిల్ కేసులో అటకెక్కిన చార్జిషీట్లు!
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
వెస్టిండీస్కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
AP: రియల్.. ఢమాల్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
సినిమా

'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) నేడు ఏప్రిల్ 10న థియేటర్స్లోకి వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్లో మొదటి ఆట పూర్తి కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ఎక్స్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో పంచుకుంటున్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని నిర్మించారు. ఇందులో అజిత్కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. రీసెంట్టా విడాముయార్చి సినిమాలో ఈ జోడి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్ షోల తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా గురించి ఎలాంటి టాక్ వచ్చిందో తెలుసుకుందాం..ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్కు బాగా నచ్చుతుంది అని అంటున్నారు. పూర్తిగా మాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించాడని నెటిజన్లు తెలుపుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ఒక బెస్ట్ సినిమాను అజిత్ ఇచ్చారంటూ కొందరు రివ్యూవర్స్ చెబుతున్నారు. వింటేజ్ మాస్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు. చాలామంది నెటిజన్లు చెబుతున్న మాట ఒక్కటే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కేవలం అభిమానులకు మాత్రమే అంటూ పేర్కొనడం విశేషం. సినిమా చూసిన వారందూరు కూడా పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. సినిమాలో అజిత్ పాత్రను దర్శకుడు చాలా చక్కగా చూపించాడని చెబుతున్నారు. అయితే, ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్లు ఇద్దరూ కూడా పెద్దగా ప్రభావం చూపలేదని కామెంట్లతో తెలుపుతున్నారు. అసలు వారిద్దరినీ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం అజిత్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే సీన్ అజిత్ కెరీర్లోనే బెస్ట్గా ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ తర్వాత కాస్త కథ నెమ్మదిస్తుందని తెలుపుతున్నారు. జీవి ప్రకాష్ బీజీఎమ్ బాగన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సీన్కు ఎమోషనల్ కనెక్ట్ లేదని అభిప్రాయపడుతున్నారు. సినిమా మొత్తంగా అజిత్ ఫ్యాన్స్కు పండుగలాంటిదని తెలుపుతున్నారు. సినిమా గురించి ఒక్కమాటలో 'గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్.. ఒకే ఫర్ ఆడియెన్స్.. బ్యాడ్ ఫర్ అజిత్ హేటర్స్' అంటూ రివ్యూవర్స్ చెబుతున్నారు. From Overseas Premieres..#GoodBadUgly : An Out and Out Mass Entertainer..Best #AK movie in years..Mega Blockbuster.. Vintage Mass Ajith is Back! .— Ramesh Bala (@rameshlaus) April 10, 2025Fans after the movie. Tells you about the result 🔥🔥🥵💥😁 #GoodBadUglypic.twitter.com/Vrv5BJ8FV2— Trollywood 𝕏 (@TrollywoodX) April 10, 2025GOOD - For Fans 💥BAD - For Neutrals😐UGLY - For Haters😭Strictly & Only for AK Fans!#GoodBadUgly— Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2025#GoodBadUgly is an Alright Out and Out Mass Entertainer that works in parts and is a pure fan service to Ajith. After a Solid 1st half, the second half starts well with a flashback episode but has nothing much to offer after that and feels dragged till the end. A few mass…— Venky Reviews (@venkyreviews) April 10, 2025#GoodBadUgly Movie Review🍿 : - A Madness Mass Entertainer which surely satisfies all class of audience🔥- #AK 's career best intro 🌟⚡- #Ajithkumar𓃵 as Red Dragon 👌 Shoulders this Film with his terrific screen presence 🥵- #GVPrakash is the Second Hero of the film💥 He… pic.twitter.com/TmPmG0ugeX— k (@Gabbafied) April 10, 2025#GoodBadUgly Review : IT’S Thala RAMPPAGEE SHOW - 3.25/5 💥🔥Thala #AjithKumar IS PERFECTLY VINTAGE MARANAMASS 🔥🔥🔥💥💥💥💥🙌🙌🙌🙌🏆🏆🏆🏆Mainly @gvprakash BGM AND MUSIC IS SEEMAA MASSS DA 🥵🥵🥵🥵🥵🥵🔥🔥🔥🏆🏆🏆💥💥KUDOS TO DIRECTOR @Adhikravi FOR SHOWING HIS FANISM ON… pic.twitter.com/yFRV31KSzg— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) April 10, 2025Cringe title card loading 🤣😂🔥#GoodBadUgly #GoodBadUglyFromApril10 pic.twitter.com/iMdtorGBsq— VJ WARRIORS (@Vijay_fans_army) April 9, 2025#GoodBadUgly - Pakka Fanboy Sambavam 💯🔥 AK broke all his barriers and screen presence Vera level 🔥Adhik surprise elements vera level particularly climax AK Look , every fan's dream 🥵💥Don't miss the theatre experience pic.twitter.com/J40Mfbifql— Kolly Corner (@kollycorner) April 10, 2025

నటుడు దర్శన్పై జడ్జి ఆగ్రహం.. సాకులు చెప్పొద్దంటూ హెచ్చరిక
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టు జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. బెయిల్ ఇస్తున్న సమయంలో విచారణకు తప్పకుండా హాజరుకావాలని కోర్టు షరతులను మరోసారి న్యాయస్థానం గుర్తుచేసింది. అయితే, విచారణ సమయంలో దర్శన్కు వెన్నునొప్పి ఉందని, అందుకే రాలేదని ఆయన తరఫు వకీలు చెప్పారు. సాకులు చెప్పి కోర్టుకు హాజర్ కాకుంటే ఎలాగని జడ్జి ఘాటుగా ప్రశ్నించారు. విచారణ ఉన్నప్పుడు నిందితులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఇలా చేయడం తప్పని మందలించారు. దర్శన్ ఇంటిలో పోలీసులు జప్తు చేసిన రూ.75 లక్షల డబ్బులను విడుదల చేయాలని న్యాయవాది మనవి చేశారు. ఐటీ శాఖ వాదనలు విన్న తరువాత పరిశీలిస్తామని జడ్జి తెలిపారు. కేసు విచారణను మే 20కి వాయిదా వేశారు. సీజ్ చేసిన మొబైల్ఫోన్లను తిరిగి ఇవ్వాలని దర్శన్ న్యాయవాది అర్జీ వేశారు. మొదటి నిందితురాలు, నటి పవిత్రగౌడతో పాటు ఇతర నిందితులందరూ కోర్టుకు వచ్చారు. తన సోదరునితో కలిసి పవిత్ర ఆర్ఆర్ నగర ఇంటి నుంచి కారులో కోర్టుకు వచ్చారు.

అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్కు ఛాన్స్.. అందుకేనా ఈ కామెంట్?
ఇటీవల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న నటి సమంత తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. అయితే వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. అంతకన్నా షోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. త్వరలో మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా పుష్ప– 2 చిత్రంతో ప్రపంచ స్థాయిలో దుమ్మురేపిన నటుడు అల్లు అర్జున్ తాజాగా అంతకు మించిన చిత్రం చేయడానికి రెడీ అయ్యిపోయారు. ఆయన నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రానికి సబంధించిన ప్రకటన అట్టహాసంగా వెలువడిన విషయం తెలిసిందే. చేసిన ఐదు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న యువ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ నటించనున్నారు. కోలీవుడ్లో చిత్రం చేయాలన్నది అల్లు అర్జున్ చిరకాల కోరిక. చాలా కాలం క్రితమే లింగుసామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబధించిన ప్రకటనను గ్రాండ్గా వెల్లడించారు. అయితే కారణాలేమైనా ఆ చిత్రం సెట్పైకి రాలేదు. అలాంటిది తాజాగా అల్లుఅర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ రూ.600 కోట్ల బడ్జెట్లో ప్లాన్ చేస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్ర యూనిట్కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో నటి సమంత కూడా ఉన్నారు. ఆమె ఇంతకు ముందు నటుడు అల్లు అర్జున్కు జంటగా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. అదే విధంగా దర్శకుడు అట్లీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈయన ఇంతకు ముందు దర్శకత్వం వమించిన మెర్సల్, తెరి చిత్రాల్లో నాయకిగా నటించారన్నది గమనార్హం. ఇకపోతే నటి సమంత నటుడు అల్లు అర్జున్ గురించి తన ఇన్స్ట్రాగామ్లో చేసిన పోస్ట్లో మళ్లీ ఒక ఏడాది.ఈ అద్భుతమైన నటుడి ఎదుగుదలను చూడటానికి సహనం పాటించలేకపోతున్నాను. తెరపై మిమ్మల్ని ఎప్పుడు చూసినా మధురమైన దిగ్భ్రాంతి. ప్రతిసారి హద్దులు దాటిన చర్యలకు ధన్యవాదాలు. మీ ఆరోగ్యం బాగుండాలి. ఆసక్తి తగ్గకుండా మీరు ప్రేమించే కార్యాలను వరుసగా చేయాలని భగవంతుడు ఆశ్వీదించా అని నటి సమంత పేర్కొన్నారు. సమంత పోస్ట్ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా అల్లుఅర్జున్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈభారీ చిత్రంలో నటి సమంత కూడా భాగం కానున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

Jack Movie Review: ‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘బేబీ’బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జాక్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి ఎక్స్(ట్విటర్)లో మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన నెటిజన్స్.. తమ అభిప్రాయాన్ని ఎక్స్లో తెలియజేస్తూ.. యావరేజ్ సినిమా అంటున్నారు. మరికొంతమంది అయితే సిద్ధు ఖాతాలో తొలిసారి డిజాస్టర్ పడిందని చెబుతున్నారు. ఇంకొంత మంది సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. నెటిజన్ల అభిప్రాయాలపై ఓ లుక్కేయండి. #Jack Only for Siddu!!Just some comedy scenes and Siddu role, Nothing worked in film. Siddu dialogues, Comedy timing, Action helped film atleast for a One time watch. Stroy, Screenplay, Music, Songs, BGM, cinematography Everything 👎Only for Siddu Character and Some One…— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) April 10, 2025 ‘జాక్ సినిమా కేవలం సిద్ధుదే. కొన్ని కామెడీ సీన్లు, సిద్ధు క్యారెక్టర్ తప్ప మిగతావేవి ఆకట్టుకోలేవు. సిద్ధు డైలాగ్స్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ, స్క్రీన్ప్లే, మ్యూజిక్, పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ..ఏది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు.#JACK - Half baked story which lacks connectivityRAW ni Royal ga chupinchali ila Rotha kadhu 🙏😭Prathi sari one liners tho cinema workout avvadhu Ani Inka yeppatiki ardam avvudho emo 🥱Intha cheppinaka kuda Theatre lo chusta ante velli ma laga Bugga avvandi #Tollywood pic.twitter.com/JX8h1lCMXD— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) April 9, 2025 జాక్ సగం వండి వదిలేసిన అన్నంలా ఉది. ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదు. ‘రాక్షని రాయల్గా చూపించాలి కానీ ఇలా రోతలా కాదు. ప్రతిసారి వన్లైనర్తో సినిమా వర్కౌట్ అవ్వదని ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటారో. ఇంత చెప్పినా కూడా థియేటర్లో సినిమా చూస్తా అంటే మీ ఇష్టం అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.Bhaskar’s attempt at a commercial mix fails due to weak writing and a messy screenplay. Siddhu tries hard, but dull scenes and flat dialogues drag him down. The spy plot is bland, comedy rarely clicks, music is forgettable, and poor visuals make it hard to sit through. #jack pic.twitter.com/jcIDJYqxdj— Dingu420 (@dingu420) April 10, 2025 భాస్కర్ తొలిసారి ప్రయత్నించిన కమర్షియల్ మిక్స్ వీక్ రైటింగ్, స్క్రీన్ప్లే కారణంగా ఫెయిల్ అయింది. సిద్దు హార్డ్ వర్క్ చేశాడు కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడం కారణంగా అతని పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదు. మ్యూజిక్ గురించి మర్చిపోవాలి. విజువల్స్ కూడా పూర్గా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#Jack is a spy action comedy that disappoints big time as both the spy portions and comedy fail to deliver for the most part. Director Bhaskar tried to pack all commercial aspects in this film but none of them could make a solid impact because of the clumsy screenplay and weak…— Venky Reviews (@venkyreviews) April 9, 2025 జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ. కానీ అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదు.బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చాలనుకున్నాడు. కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ అయ్యేలా లేదు.గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే.. వీక్ రైటింగ్తో బోరింగ్ అనిపిస్తుంది అని ఇంకో నెటిజన్ ట్వీట్ చూస్తూ 2 రేటింగ్ ఇచ్చాడు.#Jack: StarBoy for a Reason? Not Quite!Rating: ⭐️⭐️Jack ends up being a major disappointment in the spy genre. Director Bhaskar seems lost between what he wrote and what he tried to direct. The film feels like a comic spoof of spy thrillers but falls flat with a boring and…— Chay Reviews (@chay_reviews) April 10, 2025It's mind-boggling to see movies like #Jack and #Spy just deliberately use the patriotism angle but execute it in an extremely poor way which ultimately looks/feels like they're demeaning or humiliating our army, police, the RAW and the Indian Government 😥— LoneBatman (@SampathGNV) April 10, 2025#JackReview:Heavily banks on Siddhu’s performance and a quirky lead character. While the theme is decent, the execution falls flat. Filled with illogical scenes, weak action, poor cinematography, cheap VFX and forgettable songs, it ends up as a half baked— Adesh Neradi (@AdeshNerad31345) April 9, 2025Show completed:- #jack My rating 2.25/5Half baked Raw movie Illogical scenes in 2nd half pic.twitter.com/1Xq7al7OoY— venkatesh kilaru (@kilaru_venki) April 9, 2025
న్యూస్ పాడ్కాస్ట్

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసింది మరొకటి: సంజూ ఆగ్రహం!
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) స్పందించాడు. డెత్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడమే తన పరాజయానికి ప్రధాన కారణం అని పేర్కొన్నాడు. తమకు శుభారంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా బుధవారం గుజరాత్- రాజస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.సాయి సుదర్శన్ ధనాధన్అహ్మదాబాద్లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్.. ఆతిథ్య గుజరాత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే టైటాన్స్ కెప్టెన్, ఓపెనర్ శుబ్మన్ గిల్ (2) వికెట్ తీసి జోష్ నింపాడు. అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఆ ఆనందాన్ని ఎంతో సేపు నిలవనీయలేదు.సాయి మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. భారీ స్కోరకు పునాది వేశాడు. అతడికి తోడుగా జోస్ బట్లర్ (25 బంతుల్లో 36), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 36), రాహుల్ తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి గుజరాత్ 217 పరుగులు చేసింది.రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే, మహీశ్ తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (6) వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే వన్డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా (1) కూడా పెవిలియన్ చేరాడు.సంజూ, హెట్మెయిర్ పోరాటం సరిపోలేదుఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 28 బంతుల్లో 41 పరుగులతో ధాటిగా ఆడుతున్న సమయంలో ప్రసిద్ కృష్ణ సంజూను అవుట్ చేసి రాజస్తాన్ను దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. ధ్రువ్ జురెల్ (5) పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, షిమ్రన్ హెట్మెయిర్ (32 బంతుల్లో 52) మాత్రం కాస్త వేగంగా ఆడి స్కోరును 150 దాటించగలిగాడు.అయితే, అప్పటికే సమయం దాటిపోయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లంతా కలిసి కనీసం ఇరవై పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 19.2 ఓవర్లలో రాజస్తాన్ 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 58 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, రషీద్ ఖాన్, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ ఖెజ్రోలియా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసింది మరొకటిఈ నేపథ్యంలో ఓటమి అనంతం రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగానే ఉంది. జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే శుబ్మన్ గిల్ వికెట్ తీసి శుభారంభం అందించాడు. పవర్ ప్లేలోనే వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలన్నది మా ప్లాన్. అయితే, డెత్ ఓవర్లలో మాత్రం అనుకున్న విధంగా రాణించలేకపోయాం.నిజానికి మేము ప్రిపేర్ అయింది ఒకటి.. అక్కడ అయిందొకటి.. మా ఆలోచనలు ఓ రకంగా ఉంటే... మా బౌలర్లు అమలు చేసింది మరొకటి’’ అని ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో పేర్కొన్నాడు. ఇక లక్ష్య ఛేదనలో తాను, హెట్మెయిర్ అవుటైన తర్వాత పరిస్థితి చేయిదాటి పోయిందని.. పొరపాట్లపై సమీక్ష నిర్వహించి.. సరికొత్త ఉత్సాహంతో ముందుకు వస్తామని సంజూ అన్నాడు.చదవండి: సంజూ శాంసన్కు భారీ షాక్!🔝 of their Game. 🔝 of the Table. 💙#GT roar to the top of the points table with another strong display of cricket 💪Scorecard ▶ https://t.co/raxxjzYH5F#TATAIPL | #GTvRR | @gujarat_titans pic.twitter.com/ZDRsDqoMAT— IndianPremierLeague (@IPL) April 9, 2025

విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
నూట ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028 సందర్భంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, పురుషుల విభాగం నుంచి ఆరు జట్లు భాగం కానున్నాయి. పదిహేను మంది సభ్యులతోఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వర్గాలు ధ్రువీకరించాయి. అదే విధంగా.. 2032లో బ్రిస్బేన్లో జరిగే ఒలింపిక్స్లోనూ క్రికెట్ ఓ క్రీడాంశంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇక 2028 ఒలింపిక్స్లో పాల్గొనబోయే క్రికెట్ జట్లకు గరిష్టంగా పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసుకోవచ్చు.ఇక ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మిగతా జట్లను మాత్రం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్కు జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.ర్యాంకింగ్స్ ఇలాప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ మెన్స్ ర్యాంకింగ్స్లో టాప్లో కొనసాగుతున్నాయి. అదే విధంగా.. మహిళల పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో 12 పూర్తి స్థాయి జట్లు ఉండగా.. 90కి పైగా అసోసియేట్ దేశాల జట్లు టీ20 ఫార్మాట్లో ఆడుతున్నాయి. కాగా విశ్వక్రీడల్లో చివరగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కోహ్లి, రోహిత్ లేకుండానే..?!టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక రోహిత్ వారసుడిగా టీ20 కెప్టెన్గా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసింది. ఈ ముంబైకర్ సారథ్యంలో యువ జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఒలింపిక్స్ 2028లో జరుగనున్నాయి. అప్పటికి కోహ్లి, రోహిత్ నలభైవ పడిలోకి వచ్చేస్తారు. కాబట్టి వారు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఫిట్నెస్ దృష్ట్యా విశ్వక్రీడల్లో కనిపించడం సాధ్యంకాకపోవచ్చు.చదవండి: సంజూ శాంసన్కు భారీ షాక్!

సింధు శుభారంభం
నింగ్బో (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు 21–15, 21–19తో ప్రపంచ 36వ ర్యాంకర్ ఎస్తర్ నురుమి వొర్డోయో (ఇండోనేసియా)పై గెలిచింది. 44 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్ల్లో విజృంభించిన సింధు... 19 ఏళ్ల ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–11తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. ఇతర మ్యాచ్ల్లో ఆకర్షి కశ్యప్, అనుపమ, మాళవిక ఓటమి పాలై ఇంటిదారి పట్టారు. ఆకర్షి 13–21, 7–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యూ (చైనా) చేతిలో... అనుపమ 13–21, 14–21తో ప్రపంచ 13వ ర్యాంకర్ రచనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్) చేతిలో... మాళవిక 14–21, 8–21తో గావ్ ఫెంగ్ జై (చైనా) చేతిలో ఓడారు. ప్రిక్వార్టర్స్లో కిరణ్, ప్రియాన్షు... పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే పరాజయం పాలవగా... కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. తొలి రౌండ్లో లక్ష్యసేన్ 18–21, 10–21తో లీ చయ్ హౌ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రణయ్ 16–21, 21–12, 11–21తో జూ గువాంగ్ లూ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి 21–16, 21–8తో దిమిత్రి పనారిన్ (కజకిస్తాన్)పై, ప్రియాన్షు 20–22, 21–12, 21–10తో వాంగ్చరోయెన్ (థాయ్లాండ్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్లో ప్రియా–శ్రుతి మిశ్రా జోడీ 11–21, 13–21తో షూ యెన్ సంగ్–చైన్ హుయి యూ (చైనా) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో హరిహరన్–రూబన్ ద్వయం 21–3, 21–12తో మధుక దులంజన–లహిరు వీరసింఘే (శ్రీలంక) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించగా... పృథ్వీ–సాయి ప్రతీక్ జంట 19–21, 12–21తో చై సియాంగ్ చైవాంగ్ చీ లిన్ (చైనా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి ని్రష్కమించింది.

సంజూ శాంసన్కు భారీ షాక్!
ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)కు మరో షాక్ తగిలింది. ఐపీఎల్ పాలక మండలి అతడికి రూ. 24 లక్షల మేర జరిమానా విధించింది. అదే విధంగా.. గుజరాత్ టైటాన్స్ (GT vs RR)తో బుధవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకు కూడా ఫైన్ వేసింది.ఎదురుదెబ్బలుకాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయం నుంచి కోలుకున్న సంజూ.. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్లలో కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ జట్టును ముందుండి నడిపించాడు.ఈ క్రమంలో శనివారం (ఏప్రిల్ 5) నాటి మ్యాచ్ నుంచి కెప్టెన్గా సంజూ శాంసన్ అందుబాటులోకి వచ్చాడు. అతడి సారథ్యంలో ఈ సీజన్లో తొలుత పంజాబ్ కింగ్స్తో తలపడ్డ రాజస్తాన్.. 50 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది.159 పరుగులకేఅహ్మదాబాద్లో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో ఆతిథ్య గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్ మాత్రం 159 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్ల దెబ్బకు సంజూ సేన 19.2 ఓవర్లలోనే ఆలౌట్ అయి.. 58 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.సంజూకు రూ. 24 లక్షల జరిమానాఇదిలా ఉంటే.. గుజరాత్తో మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున రాజస్తాన్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పనిష్మెంట్ ఇచ్చింది. గతంలో రియాన్ పరాగ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లోనూ రాజస్తాన్ ఇదే తప్పిదానికి పాల్పడింది. అప్పుడు అతడికి రూ. 12 లక్షల ఫైన్ వేసిన బీసీసీఐ... రాజస్తాన్ మరోసారి ఇదే తప్పు పునరావృతం చేసినందున నిబంధనల ప్రకారం సంజూకు రూ. 24 లక్షల జరిమానా విధించింది.ఇందుకు సంబంధించి.. ‘‘గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు రూ. 24 లక్షల జరిమానా విధిస్తున్నాం.వారికి కూడాఅదే విధంగా.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ప్రతి ఆటగాడు రూ. లక్షల జరిమానా కట్టాలి లేదంటే వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర చెల్లించాలి. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అదే వర్తిస్తుంది’’ అని ఐపీఎల్ మీడియా ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకుని కేవలం రెండే గెలిచింది.ఐపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ రాజస్తాన్👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉గుజరాత్ స్కోరు: 217/6 (20)👉రాజస్తాన్ స్కోరు: 159 (19.2)👉ఫలితం: 58 పరుగుల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82).చదవండి: KKR: చేతులు జోడించి అడుగుతున్నా.. రింకూని కాస్త ముందే పంపండి! 🔝 of their Game. 🔝 of the Table. 💙#GT roar to the top of the points table with another strong display of cricket 💪Scorecard ▶ https://t.co/raxxjzYH5F#TATAIPL | #GTvRR | @gujarat_titans pic.twitter.com/ZDRsDqoMAT— IndianPremierLeague (@IPL) April 9, 2025
బిజినెస్

భారత్లో పెట్టుబడులకు భారీ అవకాశాలు
లండన్: భారత్లో వివిధ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి అపార అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. బ్యాంకింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.లండన్లో జరిగిన భారత్-బ్రిటన్ ఇన్వెస్టర్ రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. వివిధ పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలకు చెందిన 60 పైచిలుకు ఇన్వెస్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రకటన ప్రకారం.. సుస్థిర ఆర్థిక వృద్ధి సాధన, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను ఏర్పర్చేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. నిబంధనల భారాన్ని తగ్గించి, వ్యాపారాలు.. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో విదేశీ బ్యాంకులు మరింతగా విస్తరించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి‘ అని మంత్రి చెప్పారు.పటిష్టమైన పాలసీల దన్ను..మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండటం, స్థిరమైన..పటిష్టమైన పాలసీలు అమలవుతుండటం తదితర అంశాల ఊతంతో 2024–2028 మధ్య కాలంలో భారత బీమా మార్కెట్ వార్షికంగా 7.1 శాతం మేర వృద్ధి చెందనున్నట్లు ఆమె వివరించారు. 2032 నాటికి ఆరో అతి పెద్ద ఇన్సూరెన్స్ మార్కెట్గా ఎదగనున్నట్లు తెలిపారు.ఇక టీప్లస్1 సెటిల్మెంట్ను 2023లోనే ప్రవేశపెట్టడం ద్వారా ఈ విధానాన్ని అమలు చేసిన అతి కొద్ది బడా సెక్యూరిటీస్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని ఇన్వెస్టర్లకు వివరించారు. 4.6 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో భారత సెక్యూరిటీస్ మార్కెట్ అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్–ఐఎఫ్ఎస్సీ) గురించి కూడా మంత్రి వివరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.2025 మార్చి నాటికి బ్యాంకులు, బీమా, ఫిన్టెక్, ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్, షిప్ లీజింగ్ మొదలైన రంగాలకు చెందిన 800 పైచిలుకు సంస్థలు గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు మంత్రి వివరించారు. స్థూల దేశీయోత్పత్తికి డిజిటల్ ఎకానమీ దన్నుగా నిలుస్తున్న తీరును తెలిపారు. ప్రభుత్వ సానుకూల విధానాలు, వినూత్నమైన స్టార్టప్ల తోడ్పాటుతో దేశీయంగా ఫిన్టెక్ వ్యవస్థ పటిష్టంగా మారిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత అయిదేళ్లలో ఫిన్టెక్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. దేశీ యూనికార్న్ల సంఖ్యపరంగా అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు సీతారామన్ చెప్పారు.

అక్కడ పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్!
ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. దీనికి మంత్రి వర్గం నుంచి ఆమోదం లభించిన తరువాత.. పెట్రోల్, డీజిల్ సీఎన్జీ బైకులను పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఢిల్లీ సర్కార్ అడుగులువేస్తుంది.ఈవీ పాలసీ 2.0 అమలులోకి వచ్చిన తరువాత.. వచ్చే ఏడాది నుంచే పెట్రోల్, సీఎన్జీ బైకులను బ్యాన్ చేయనున్నారు. 2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో వందశాతం ఎలక్ట్రిక్ వాహనాలను నడపాలని ఉద్దేశ్యంతోనే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ బైకులతో పాటు, సీఎన్జీ ఆటోలను కూడా నిషేదించనున్నట్లు సమాచారం. ఫ్యూయెల్ కార్లను ఎంతవరకు నిషేధిస్తారు అనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.2025 ఆగస్టు 15 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్జీ ఆటో రిక్షా రిజిస్ట్రేషన్లను, రెన్యువల్స్ అనుమతించరు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఆ తరువాత దశల వారీగా పెట్రోల్, సీఎన్జీ వాహనాలను తొలగించనున్నారు. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాల్సి ఉంది.బైకులు, ఆటోలు మాత్రమే కాకుండా.. ఢిల్లీలో చెత్తను సేకరించే వాహనాలు, సిటీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అయి ఉండాలి చెబుతున్నారు. కాగా మార్చి 31తో ముగిసిన 'ఈవీ పాలసీ'ని ఢిల్లీ ప్రభుత్వం మరో 15 రోజులు పెంచింది. ఆ తరువాత ఈవీ పాలసీ 2.0 అమలులోకి వస్తుంది. ఫ్యూయెల్ వాహనాలను.. ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడమే ఈ కొత్త పాలసీ లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు.ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభందేశ రాజధానిలో చాలా సంవత్సరాలుగా తీవ్రమైన వాయు కాలుష్య సంక్షోభం నెలకొంది. శీతాకాలంలో గాలి నాణ్యత (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఇది మరింత తీవ్రమవుతుంది. వాహనాల ఉద్గారాలు, నిర్మాణ పనుల నుంచి వచ్చే దుమ్ము, కర్మాగారాల నుంచి వచ్చే పొగ.. పంజాబ్, హర్యానా వంటి సమీప రాష్ట్రాలలోని రైతులు గడ్డిని తగలబెట్టడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. పండుగల సమయంలో పటాకులు కాల్చడం, వ్యర్థాలను కాల్చడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. వాయుకాలుష్యం కారణంగా పిల్లలు, వృద్ధులలో శ్వాస సమస్యలు, ఉబ్బసం, గుండె జబ్బులకు కారణమవుతాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాక్స్ పేయర్లకు లాస్ట్ ఛాన్స్: ఆ స్కీమ్ తుది గడువు ప్రకటించిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి తీసుకువచ్చిన వివాద్ సే విశ్వాస్ పథకానికి ఆదాయపన్ను శాఖ తాజాగా తుది గడువును ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు 2025 ఏప్రిల్ 30లోగా పథకాన్ని వినియోగించుకునేందుకు డిక్లరేషన్ను సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. తద్వారా 2024 అక్టోబర్1న ప్రవేశపెట్టిన ఈ పథకానికి తొలిసారి తుది గడువును సీబీడీటీ నోటిఫై చేసింది.పన్ను సంబంధ బకాయిలపై ప్రత్యక్ష పన్నుల పథకాన్ని ఆశ్రయించేవారు ఈ నెల 30లోగా డిక్లరేషన్ను ఇవ్వవలసి ఉంటుందని ఆదాయపన్ను శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. పన్ను సంబంధిత వివాదాలు లేదా వివిధ అప్పీళ్లలో భాగమైన పన్ను చెల్లింపుదారులు పథకాన్ని తుది గడువులోగా వినియోగించుకోవచ్చునని వివరించింది.సుమారు 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్ల ద్వారా రూ. 35 లక్షల కోట్లు వివిధ వివాదాలలో నమోదైన నేపథ్యంలో పథకానికి ప్రాధాన్యత ఏర్పడింది. పన్ను చెల్లింపుదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలంటే.. వివాదంలో ఉన్న పన్నుపై 110 శాతాన్ని చెల్లించవలసి ఉంటుంది. 2024 వివాద్ సే విశ్వాస్ పథకానికి 2024–25 బడ్జెట్లో తెరతీశారు. 2024 అక్టోబర్ 1న నోటిఫై చేశారు.

ప్రముఖ కంపెనీలో 1600 ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ తమ నెదర్లాండ్స్ ప్లాంటు కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. మేనేజ్మెంట్, సపోర్ట్ విధులకు సంబంధించి 1,600 ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు సంస్థ తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని, మార్జిన్లను మెరుగుపర్చుకోవడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.స్థానిక మేనేజ్మెంట్ బోర్డులో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషయాలను సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్తో పాటు ట్రేడ్ యూనియన్లకు కూడా తెలియజేసినట్లు కంపెనీ వివరించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో నెదర్లాండ్స్ ప్లాంటు 6.75 మిలియన్ టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేసింది.భౌగోళిక.. రాజకీయ పరిణామాల వల్ల యూరప్లో డిమాండ్ నెమ్మదించడం, వాణిజ్యం.. సరఫరా వ్యవస్థల్లో అవాంతరాలు ఏర్పడటం తదితర అంశాలు నిర్వహణ వ్యయాలపైనా, అంతిమంగా ఆర్థిక పనితీరుపైనా ప్రభావం చూపాయి. నెదర్లాండ్స్ ప్లాంటులో హరిత టెక్నాలజీలను అమల్లోకి తేవడానికి కట్టుబడి ఉన్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ దశాబ్దం ఆఖరు నాటికి రెండు బ్లాస్ట్ ఫర్నేస్ల స్థానంలో అధునాతన పర్యావరణహిత ఫర్నేస్లను ఏర్పాటు చేయనున్నట్లు, దీనితో ఏటా 5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నట్లు వివరించారు.
ఫ్యామిలీ

వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
తమన్నా తన రాబోయే చిత్రం ఓదెల- 2 ను ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్లో చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ ప్రమోషన్స్కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. మరీ ముఖ్యంగా ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షింస్తోంది. తమన్నా సెక్యూరిటీ పోలీసు అధికారిణి అద్భుతమైన భద్రతా నైపుణ్యాలు విశేషంగా నిలుస్తోంది.తమన్నా ప్రమోషన్ ఈవెంట్కు హాజరవ్వడం కోసం ముంబైలోని తన నివాసం నుంచి బయటకు వచ్చింది. రెడ్ డ్రెస్లో మెరిసిపోతూ ఉన్న తమన్నాకు మించి ఆమెకు ఎస్కార్ట్గా ఉన్న పోలీసు ఆఫీసర్ అందర్నీ ఆకర్షించింది. తమన్నాకు రక్షణ కల్పిస్తూ...రద్దీ రోడ్లో ఆమెకు మార్గాన్ని క్లియర్ చేసింది. అక్కడున్న వారిని తప్పుకోమని కోరుతూ.. సైడ్ సైడ్ అంటూ తమన్నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ‘సైడ్ సైడ్’ అంటూ అక్కడున్న వారిని నియంత్రిస్తున్న ఆమె వీడియో వైరల్గా మారింది.ఆమె పని తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. డ్యూటీలో ఆమె అంకితభావానికి, నైపుణ్యానికి ముగ్ధులయ్యారు, వాటే పోలీస్ ఆఫీసర్ అని ఒకరు, "మహారాష్ట్ర లేడీ పోలీస్ ఆఫీసర్" మరో యూజర్ కమెంట్ చేశారు. దీంతో హీరోయిన్ తమన్నాకు మించి క్రేజ్ సంపాదించుకుంది ఈ మహిళా పోలీసు అధికారి. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap)

పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
‘వేయి అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యమన్నారు’ అనేది సామెత. ఈ సామెత ఎలా పాపులర్ అయిందనేది పక్కన బెడితే, ఈ మధ్య కాలంల పెళ్లిళ్లలో మోసాలు ఆందోళనకరంగా మారింది. అధిక కట్నం కోసం ఫేక్ సర్టిఫికెట్లతో వధువు, వారి కుటుంబాన్ని మెప్పించేందుకు నానా తంటాలు పండతారు. తీరా అసలు విషయం తెలిశాక గొడవలు, విడాకులు తెలిసిన సంగతే.. ఈనేపథ్యంలోనే ఒక స్టోరీ నెట్టింట్ తెగ సందడి చేస్తోంది.వివాహ సంబంధాల్లో మోసాలు, విడాకులు కేసులు, నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు పెళ్లి సంబంధాలు చూడటం, పెళ్ళిళ్లు చేయడం పెద్ద సవాల్గా మారింది. తన మనసుకు నచ్చిన భాగస్వామిని తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అందులోనూ మాట్రిమమోనియల్ వెబ్సైట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న తరుణంలో అప్రమత్తత చాలా అవసరం.కొందరు తమ సంబంధాల గురించి అబద్ధం చెబుతుండగా, మరికొందరు తమ విద్యార్హతలు, వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక స్థితి గురించి అబద్ధం చెబుతారు. దీంతో ఆ జంట, వారి కుటుంబాల మధ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిమీదే ఎక్స్(ట్విటర్)లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాలరీ స్లిప్పులు అడగడం, అవునో కాదో ధృవీకరించు కోవాలా వద్దా? అనే ప్రశ్నపై చర్చ మొదలైంది. ప్రొఫైల్స్ వెరిఫికేషన్ పై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ పోస్ట్ పై నెటిజనుల స్పందనప్రపంచంలో పుష్కలంగా మంచితనం ఉందని నమ్మినా, వివాహం లాంటి కీలక అడుగు వేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలపై స్పస్టత తెచ్చుకోవాలి. "జాతకానికి బదులుగా ITRని చెక్ చేయడం మంచిది. సీరియస్గా చెప్పాలంటే, ఇద్దరి మధ్యా ప్రముఖ ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్య పరీక్ష నివేదిక , ITR తనిఖీ కనీసం జరగాలని ఒకరన్నారు. మరొకరు ఇలా రాశారు, "అవును, కొంతమంది పురుషులు జీతం గురించి అబద్ధం చెబుతారు. డిఫాల్టర్ కాకపోతే, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడగాలి, అతి ముఖ్యమైనది మెడికల్ సర్టిఫికేట్! అన్నాడు. మరొకాయన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. తెలుసుకోవాలి. ఎందుకంటే బాగా సంపాదిస్తున్నామని చెప్పి లెక్కలేనన్ని పెళ్లి కొడుకు కుటుంబాలు, అమ్మాయిల కుటుంబాలను మోసం చేశాయి. అదృష్టవశాత్తూ, ఇప్పుడు సాలరీ స్లిప్లు ఉన్నాయి. పాత కాలంలో, ఇలాంటివేమీ లేవు కదా. అప్పట్లో లెక్చరర్గా ఉన్న నా సొంత మౌసి (ఇప్పుడు మరణించింది), తాను పోలీసు అధికారినని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తీరా అతను మామూలు సేవకుడు, పైగా అతనికి అప్పటికే పెళ్లి అయింది. ఒక బిడ్డకూడా ఉన్నాడు. అంతే ఈ విషయం తెలిసి ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. మళ్లీ అతని గుమ్మం తొక్కలేదు. తన జీవితాన్ని విద్యకు అంకితం చేసింది, 2 పీహెచ్డీలు చేసింది, బోధనా వృత్తిలో ఉంది. మనస్తత్వశాస్త్ర పుస్తకాలు రాసింది. అని చెప్పాడు.ఒక యూజర్ ఇలా వ్రాశాడు, "నా స్నేహితుల్లో ఒకరు నియామక ప్రొఫైల్ ఉద్యోగంలో పనిచేశారు.. ఆమె కొన్నిసార్లు మ్యాట్రిమోనియల్ సైట్లలో పేర్కొన్న ప్యాకేజీలను క్రాస్ చెక్ చేసేది. దాదాపు అన్నీ కల్పిత సమాచారంతో నిండిఉన్నాయనీ, ప్యాకేజీలు చాలావరకు అబద్ధం మని గుర్తించింది. "వెరిఫైడ్ జీతం స్లిప్పులు అడిగితే అబ్బాయి పారిపోవాలి" అని ఒక యూజర్ అన్నారు. ఆ మాత్రం నమ్మకంలేకపోతే ఎలా?మరో కామెంట్ ఏంటంటే.. నన్ను ఒకమ్మాయి ఇలానే అడిగింది. పంపాను కానీ పెద్దలు కుదిర్చిన వివాహానికి నో చెప్పాను. నేను పొందుతున్న జీతం మీద కూడా వాళ్ళు నమ్మకం లేకపోతే, భవిష్యత్తులో దేన్ని నమ్ముతారు?"దీనిపై మీరేమనుకుంటున్నారు. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్ఎక్స్ స్పీకర్గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మంచి సక్సెస్ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్సైట్ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?)

ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్!
సోషల్ మీడియాలో రీల్స్ మోజులో విచక్షణ మర్చిపోతున్నారు. కంటెంట్ కోసం, వ్యూస్ కోసం వాళ్లు సృష్టించా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక పిచ్చి పనికి లక్షల కొద్దీ వ్యూస్ రావడంతో ఇక అందరూ అదే బాటపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ ఈ రీల్స్ పురాణం చాలా పెద్దదే. తాజాగా నాగర్కర్నూల్కు చెందిన ఇద్దరు యువకులు పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్తోనే రీల్స్ చేశారా యువకులు. ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ.. రీల్స్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వివాదా స్పద మయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా ఈగలపెంటలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాలోని ఈగలపెంట పోలీస్స్టేషన్కు చెందిన ఇన్నోవా టీఎస్ 09 పీఏ 4622 వాహనాన్ని మంగళవారం ఇద్దరు యువకులు నడుపుతూ రీల్స్ చేశారు. ఈగలపెంట పోలీస్స్టేషన్కు చెందిన ఓ అధికారి బంధువులే.. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన రీల్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగర్కర్నూల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఫొటోలు


హనుమాన్ పూజలో కేటీఆర్.. స్వాములతో కలిసి భోజనం (ఫొటోలు)


చీరలో స్టన్నింగ్ లుక్స్తో కవ్విస్తోన్న హెబ్బా పటేల్ (ఫోటోలు)


‘జాక్’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)


‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)


రామ్ చరణ్ తో పెళ్లి బంధం సీక్రెట్ రివీల్ చేసిన ఉపాసన.. వారంలో ఒక రోజు తప్పనిసరి! (ఫోటోలు)


కాబోయే భర్తతో కలిసి అభినయ బ్యాచ్లరేట్ పార్టీ (ఫోటోలు)


పట్టుచీర, నగలతో స్నేహ లుక్ అదిరిందిగా (ఫోటోలు)


చీర కట్టు.. చిరునవ్వుతో మదిని దోచేస్తున్న పూనమ్ బజ్వా (ఫోటోలు)


విజయ్ దేవరకొండ నాన్న వర్ధన్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన టీమ్ (ఫోటోలు)


చీరకట్టులో కుందనపు బొమ్మలా కవ్విస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోస్
అంతర్జాతీయం

అమెరికాకు షాకిచ్చిన చైనా
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్మెయిలింగ్కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

సానుకూల దిశగా చైనా-భారత్ సంబంధాలు
న్యూఢిల్లీ, బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.మరోవైపు.. ట్రంప్ టారిఫ్ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 104 శాతం టారిఫ్లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనతో సంప్రదింపులు జరిపేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన.నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసెషనల్ కమిటీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఏరకంగా చూసుకున్నా పార్లమెంట్(Congress) కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఆయా దేశాలు నాకే ఫోన్లు చేస్తున్నాయి. సుంకాల విషయంలో ఊరట కోసం బతిమాలుకుంటున్నాయి.(ఈ క్రమంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు). ప్లీజ్ సర్.. మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామంటూ దిగజారిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అలాగే..సుంకాల దేశాలతో ఒప్పందం కోసం పార్లమెంట్ను అనుమతించాలని కొందరు రిపబ్లికన్ పార్టీలో కొందరు రెబల్ నేతలు కోరుతున్నారు. అదే జరిగి ఉంటే.. చైనా మీద ఇవాళ 104 శాతం సుంకాలు విధించాల్సి వచ్చేది కాదు. చైనా ఎంతో సంతోషంగా ఉండి ఉండేది. పైగా అమెరికానే సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. పైగా మన దేశాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో చట్టసభ సమర్థవంతంగా పని చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నా.. నాలా మీరెవరూ మధ్యవర్తిత్వం వహించలేరు’’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఫార్మా రంగం.. భారత్కు ట్రంప్ బిగ్ షాక్

ఐదేళ్ల తర్వాత రష్యాకు మోదీ.. కారణం ఇదే..
మాస్కో: రష్యా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని మాస్కోలో మే 9న జరగబోయే విజయ దినోత్సవ (విక్టరీ డే) పరేడ్కు ఆహ్వానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 80వ విజయదినోత్సవ వార్షికోత్సవం జరగనుంది.ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని రెడ్ స్క్వేర్లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రుడెంకో తెలిపారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు ఐదేళ్ల తరువాత మరోమారు మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ ఆహ్వానం భారత్-రష్యా లమధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధాని మోదీ రష్యా పర్యటన గురించి భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.రష్యాలో నిర్వహించే విజయ దినోత్సవం ఆ దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా సైనిక పరేడ్, యుద్ధ వీరులకు సన్మానం, చారిత్రక ఘటనలను స్మరించుకునే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ నేతలను ఆహ్వానించడాన్ని రష్యా తన సంప్రదాయంగా కొనసాగిస్తోంది. 2005లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా విజయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!
జాతీయం

మరీ ఇంత మతిమరుపా!
ఎయిర్పోర్టుకు వెళ్లినప్పుడు పాస్పోర్ట్. రోజంతా కష్టపడి షాపింగ్ చేశాక ఇంటికొచ్చే దారిలో పెళ్లి చీర. కష్టించి సంపాదించిన డ బ్బుతో కొన్న బంగారు బిస్కెట్. ఇలాంటివన్నీ క్యాబ్లో మర్చిపోతే! అంత విలు వైన వస్తువులు ఎవరైనా మర్చిపోతా రా అని కొట్టిపారేయకండి. భారతీయులు ఉబర్ క్యాబ్ల్లో మర్చిపోయిన వస్తువుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఉబెర్ 9వ ‘లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్’విడుదల చేసిన గణాంకాల్లో ఇ వన్నీ ఉన్నాయి. భార త్లో అత్యంత మతిమరుపు నగరంగా ముంబై నిలిచిందని నివేదిక తేల్చింది. బ్యాగులు, పర్సులు, తాళాలు, కళ్లద్దాలు, ఇయర్ ఫోన్స్ వంటివాటిని మర్చిపోవడం పరిపాటే. కానీ కొందరు మాత్రం మతిమరుపును మరో లెవల్కు తీసుకెళ్లారు. వీల్ చైర్, 25 కిలోల నెయ్యి డబ్బా, యజ్ఞకుండం, పెళ్లి చీర, బంగారు బిస్కెట్ల వంటివాటిని కూడా క్యాబ్లో మర్చిపోయారు. వినియోగదారులు కోల్పోయిన వస్తువులను గుర్తించే ఇన్–యాప్ ద్వారా ఆయా వస్తువులను ఉబర్ వారికి తిరిగి చేర్చిందన్నది వేరే విషయం. 2024లో అత్యంత ’మతిమరుపు’ నగరాల జాబితాలో ముంబై తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యధిక ‘మతిమరుపు’నగరాల్లో పుణే, బెంగళూరు, కోల్కతా కూడా ఉన్నాయి. హైదరాబాద్ మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ప్రయాణికులు వస్తువులను మర్చిపోయింది చాలా తక్కువట. 2024లో అత్యధిక మతిమరుపు రోజులు→ ఆగస్టు 3 (శనివారం, శివరాత్రి), సెపె్టంబర్ 28 (శనివారం), మే 10 (శుక్రవారం, అక్షయ తృతీయ) మరిచిన టాప్ 10 వస్తువులు → బ్యాక్ ప్యాక్/బ్యాగ్, ఇయర్ ఫోన్స్/స్పీకర్, ఫోన్, వాలెట్/పర్స్, కళ్లద్దాలు/సన్ గ్లాసెస్, తాళంచెవులు, బట్టలు, లాప్టాప్, వాటర్ బాటిల్, పాస్పోర్ట్ మర్చిపోయిన అరుదైన వస్తువులు→ విగ్, టెలిస్కోప్, గ్యాస్ బర్నర్ స్టవ్, 25 కిలోల నెయ్యి, వీల్చైర్, పిల్లనగ్రోవి, పెళ్లి చీర, గోల్డ్ బిస్కెట్, కుక్కలు మొరగకుండా నియంత్రించే పరికరం, యజ్ఞకుండం శనివారం జాగ్రత్త శనివారం ప్రయాణాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండండి. వారంలో అత్యంత మతిమరుపు రోజు ఇదేనని ఉబర్ నివేదిక తేల్చింది. అందులోనూ శనివారం సాయంత్రాలు మతిమరుపు పీక్స్లో ఉంటోందట. ప్రయాణికులు అత్యధికంగా వస్తువులను క్యాబ్ల్లో మర్చిపోయింది ఆ రోజే. ఈ విషయంలో పండగ రోజులూ తక్కువేమీ కాదు. పర్వదినాల్లో కూడా ప్రయాణికులు ఉబర్లో అత్యధికంగా వస్తువులు మరిచిపోయారు. ‘‘మర్చిపోయిన వస్తువులను సులభంగా తిరిగి పొందేందుకు ఉబర్ క్యాబ్ల్లో ఇన్–యాప్ ఆప్షన్ ఇచ్చాం. అయినా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి’’అని ఉబర్ ఇండియా దక్షిణాసియా కన్జ్యూమర్ అండ్ గ్రోత్ డైరెక్టర్ శివ శైలేంద్రన్ సూచించారు. వస్తవులన్నింటినీ ఒకే బ్యాగ్లో వేసుకోవడం, క్యాబ్ దిగేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మేలని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్

పనిచేయండి లేదా వైదొలగండి
అహ్మదాబాద్: అత్యంత కీలకమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) జాతీయ సమావేశం వేళ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతూ పనిచేయని నేతలు పక్కకు తప్పుకోవాలని హితవు పలికారు. అప్పగించిన బాధ్యతలను విస్మరిస్తున్న నేతలు రాజకీయ సన్యాసం చేయాలని కటువుగా మాట్లాడారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతీ నదీ తీరంలో బుధవారం జరిగిన 84వ ఏఐసీసీ జాతీయ సమావేశంలో ఖర్గే సుదీర్ఘ ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీకి సాయపడకపోతే తప్పుకోండి ‘‘పార్టీకి ఉపయోగపడని నేతలు తప్పుకోవాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. పదవుల్లో అలంకారప్రాయంగా తిష్టవేసిన నేతలు రాజకీయ సన్యాసం చేయాలి. పార్టీని బలోపేతం చేయడంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలది ఇకపై అత్యంత క్రియాశీలక పాత్ర. డీసీసీ అధ్యక్షులకు అదనపు అధికారాలను కట్టబెడతాం. కొత్త డీసీసీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు అత్యంత ప్రతిభావంతులైన నేతలతో బూత్ కమిటీ, మండల్ కమిటీ, బ్లాక్ కమిటీ, జిల్లా కమిటీలను ఎన్నుకోవాలి. ఈ ప్రక్రియలో వివక్షకు తావులేదు. అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో జిల్లా అధ్యక్షులనూ భాగస్వాములను చేస్తాం’’ అని అన్నారు. ‘‘ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ఇలాగే అక్రమంగా గెలిచింది. అందుకే మళ్లీ బ్యాలెట్ పేపర్కు మారడం ఉత్తమం. పార్టీలు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను ఎత్తిచూపితే వాటిని ఆపాల్సిన ఎన్నికల సంఘం ఆ పార్టీలనే తప్పుబడుతోంది. 500 ఏళ్లనాటి పాత విషయాలను తవి్వతీసి మతవిద్వేషాలను బీజేపీ ప్రభుత్వం రాజేస్తోంది’’ అన్నారు. ‘‘మరో స్వాత్రంత్య్ర పోరాటానికి వేళైంది. అన్యాయం, అసమానత, వివక్ష, పేదరికం, మతతత్వం అనే శత్రువుల చెర నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకొద్దాం. గతంలో విదేశీపాలకులు ఈ అన్యాయం, అసమానత, వివక్షలను ఎగదోస్తే ఇప్పుడు సొంత(బీజేపీ) ప్రభుత్వమే ఈ దారుణాలకు ఒడిగడుతోంది. నాడు విదేశీయులు మతతత్వాన్ని అనుకూలంగా మల్చుకున్నారు. ఇప్పటి(బీజేపీ) ప్రభుత్వాలూ అదే పనిచేస్తున్నాయి. నాడు గెలిచాం. నేడూ గెలిచి తీరతాం’’ అని ఖర్గే అన్నారు. ప్రైవేటీకరణపై.. ‘‘మోదీ సర్కార్ ఇటీవలికాలంలో అవకాశం చిక్కిన ప్రతిసారీ కొత్త నినాదం ఇస్తోంది. ప్రజల దృష్టి మరల్చడమే వాళ్ల అసలు ఉద్దేశం. ప్రజాస్వామ్యాన్ని చాలా నెమ్మది నెమ్మదిగా అంతంచేస్తున్నారు. దేశ సంపదను కొద్దిమంది బడా వ్యాపారవేత్తలకే ధారాదత్తం చేస్తున్నారు. మొత్తం ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను నిరుపయోగంగా మారుస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం, మోదీ కలసి ఏకంగా దేశాన్నే అమ్మేయడం ఖాయం. లోక్సభలో విపక్షనేతకే పార్లమెంట్లో మాట్లాడే అవకాశం దక్కకపోతే ఇక ప్రజల వాణి ఎలా పార్లమెంట్లో ప్రతిధ్వనించగలదు?’’ అని లోక్సభ స్పీకర్ను పరోక్షంగా ఖర్గే విమర్శించారు. తొలిసారిగా ‘గుజరాత్’ తీర్మానం సాధారణంగా ఏఐసీసీ సమావేశంలో జాతీయ అంశాలపై కాంగ్రెస్ నేతలు తీర్మానాలు చేస్తారు. కానీ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రం(గుజరాత్)ను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక తీర్మానం చేయడం గమనార్హం. గుజరాత్లో దాదాపు 30 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పునర్వైభవమే లక్ష్యంగా ‘‘ గుజరాత్లో కాంగ్రెస్ ఎందుకు ఆవశ్యమంటే?’ పేరిట ఈ తీర్మానం చేశారు. ‘నూతన గుజరాత్, నూతన కాంగ్రెస్’ నినాదంతో ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీకి గెలిపిస్తే గుజరాత్లో సామాజిక న్యాయమే ధ్యేయంగా దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మైనారిటీల్లో కులగణన చేపడతామని పార్టీ హామీ ఇచ్చింది. న్యాయపథ్ పేరిట మరో కీలక తీర్మానాన్నీ పార్టీ ఆమోదించింది. ‘‘ ప్రజలందరి ఐక్యత సాధనే కాంగ్రెస్ జాతీయత. ప్రభుత్వం ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ వర్గాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేయడంతోపాటు ఘోర నేరానికి పాల్పడుతోంది’’ అని తీర్మానించారు.క్రైస్తవులు, సిక్కుల హక్కులనూ హరిస్తారు: రాహుల్ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడారు. ‘‘ వక్ఫ్ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. మతస్వేచ్ఛపై దాడి ఇది. బీజేపీ–ఆర్ఎస్ఎస్లు త్వరలోనే క్రైస్తవులు, సిక్కుల మత హక్కులనూ హరించబోతున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ మేగజైన్లో వ్యాసం చదివితే మీకూ ఈ విషయం అర్థమవుతుంది. ట్రంప్ సృష్టించిన సుంకాల సునామీ భారత్ను చుట్టేయనుంది. వైట్హౌస్లో మోదీ, ట్రంప్ ఫొటో సెషన్ గమనించారా?. ఈసారి ప్రేమగా హత్తుకోవడానికి బదులు సుంకాలతో సరిపెడతానని మోదీ ముఖంమీదే ట్రంప్ చెప్పారు. అయినా మోదీ ఒక్కమాట మాట్లాడలేకపోయారు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ మోదీ ఎదుటే భారత్పై అభాండాలు మోపుతుంటే ప్రధాని నోట మాట రాలేదు. 56 అంగుళాల ఛాతీ ఎటుపోయింది?’’ అని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ పొగిడారు. ‘‘ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచీగా మారింది. ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల ఫలాలు ఇస్తోంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గోడను కేంద్రంలో మేం బద్దలుకొడతాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

భారత్కు రాణా తరలింపు!
న్యూఢిల్లీ: 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు తరలిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాణాను తీసుకొని భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి బుధవారం రాత్రి 7.10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నంకల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రాణాను అధికారికంగా అరెస్టు చేస్తుంది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను తీహార్ జైలుకు తరలిస్తారు. రాణా భద్రత కోసం జైలులో ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో రాణాపై విచారణ ప్రారంభం కానుంది. కేసు విచారణ ఢిల్లీలోనే జరుగుతుంది కాబట్టి రాణాను ముంబైకి తరలించే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా నుంచి రాణా తరలింపు ప్రక్రియను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తనను ఇండియాకు అప్పగించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తిరస్కరించింది. దాంతో అతడిని ఇండియాకు అప్పగించేందుకు అవరోధాలు తొలగిపోయాయి.

మరో 26 రఫేల్ జెట్లు
న్యూఢిల్లీ: ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నావికాదళాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరే ఈ భారీ ఒప్పందం విలువ రూ.63,000 కోట్లు. ఒప్పందంపై త్వరలో సంతకాలు చేసే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 26 ఫైటర్ జెట్లలో 22 సింగిల్–సీటర్ జెట్లు, 4 ట్విన్–సీటర్ జెట్లు ఉన్నాయి. భారత నావికా దళానికి ఈ యుద్ధ విమానాలు సరఫరా చేయడంతోపాటు వాటి నిర్వహణ, మరమ్మతులు, విడిభాగాల సరఫరా, సిబ్బందికి శిక్షణ కూడా ఒప్పందంలో భాగమే. కీలకమైన ఈ డీల్కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెక్యూరిటీ కేబినెట్ కమిటీ బుధవారం ఆమోద ముద్ర వేసింది. 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల అప్పగింత ప్రక్రియ రాబోయే ఆరేళ్లలో పూర్తి కానుంది. మొదటి బ్యాచ్ యుద్ధవిమానాలు 2029లో ఫ్రాన్స్ నుంచి భారత నేవీకి అందుతాయి. 2031 నాటికి అన్ని విమానాల అప్పగింత పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రెండు దేశాల ప్రభుత్వాల మధ్యే ఒప్పందం కుదరనుంది. విమానాల అప్పగింత, వాటి నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆ నిర్ణయం తీసుకున్నారు. సముద్ర గగనతలంపై పట్టు రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్–29కే యుద్ధ విమానాలు భారత నావికా దళానికి సేవలందిస్తున్నాయి. వీటి స్థానంలో రఫేల్ ఫైటర్ జెట్లను దశలవారీగా ప్రవేశపెట్టబోతున్నారు. భారత విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వీటిని ఆపరేట్ చేస్తారు. అత్యాధునిక ఎల్రక్టానిక్, ఆయుధ వ్యవస్థతో కూడిన రఫేల్ ఫైటర్ జెట్లతో సముద్ర గగనతలంపై భారత నావికాదళం పట్టు మరింత పెరుగనుంది. మరోవైపు సముద్ర ఉపరితలంపైనే కాకుండా సముద్ర అంతర్భాగంలోనూ పోరాట పటిమను పెంచుకొనే దిశగా ఇండియన్ నేవీ అడుగులు వేస్తోంది.
ఎన్ఆర్ఐ

సింగపూర్లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

కూతురిని చంపి.. తల్లి ఉరేసుకుని..
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. అక్షరాభ్యాసం చేయించి.. రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది.

16 రోజుల్లో.. ఉగ్ర విధ్వంసం
సాక్షి, హైదరాబాద్: ఒక సూత్రధారి.. మరో సహాయకుడు.. నలుగురు పాత్రధారులు.. 16 రోజుల ఆపరేషన్.. 25 కేజీల పేలుడు పదార్థం... వెరసీ.. 18 ప్రాణాలు. 2023 ఫిబ్రవరిలో జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నేపథ్యమిదీ. ఈ కేసులోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫాస్ట్ట్రాక్ కోర్టు ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు విధించిన ఉరి శిక్షను మంగళవారం హైకోర్టు సమర్థించిన విషయం విదితమే. పాక్ నుంచి కథ నడిపిన రియాజ్... పాకిస్థాన్లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యాసీన్ భత్కల్కు ఈ–మెయిల్ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. ఇతడు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, వఖాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్లను రంగంలోకి దింపాడు. అప్పటి వరకు వీరంతా మంగుళూరులోనే ఉన్నారు. పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం 16 రోజుల ముందు (2013 ఫిబ్రవరి 5న) నగరానికి చేరుకున్న మోను అబ్దుల్లాపూర్మెట్లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. హడ్డీ అదే నెల 10న హైదరాబాద్ చేరుకున్నాడు. గదితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి సంతృప్తి చెందిన హడ్డీ తిరిగి మంగుళూరు వెళ్లాడు. భత్కల్స్ ఆదేశాల మేరకు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి 25 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం, 30 డిటొనేటర్లు ఉన్న బంగారం రంగు బ్యాగ్ ఇతడికి అందింది. సైకిళ్లు, కుక్కర్లు ఇక్కడే కొనుగోలు.. ముందు హడ్డీతో పాటు వఖాస్ సైతం పేలుడు పదార్థాలతో సిటీకి వచ్చారు. మలక్పేట, అబిడ్స్, దిల్సుఖ్నగర్ల్లో రెక్కీ చేసినా.. దిల్సుఖ్నగర్నే టార్గెట్ చేశారు. 2013 ఫిబ్రవరి 19న చిన్న బాంబు తయారు చేసిన హడ్డీ అబ్దుల్లాపూర్మెట్ కొండల్లో టెస్ట్ బ్లాస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజు (2013 ఫిబ్రవరి 20) హడ్డీ, వఖాస్, మోను ముగ్గురూ కలిసి మలక్పేట వెళ్లి... యశోదా ఆస్పత్రి నుంచి టీవీ టవర్ వైపునకు వచ్చే మార్గంలో ఉన్న ఓ సైకిల్ రిపేరింగ్ దుకాణం నుంచి పాత సైకిల్ కొన్నారు. మరొకటి కావాలనగా దాని యజమాని పాత బస్తీలోని జుమ్మేరాత్ బజార్ వెళ్లాలని సూచించాడు. మలక్పేట రైల్వేస్టేషన్లో పార్క్ చేసి.. ఆ సైకిల్ను మలక్పేట రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేసి.. ముగ్గురూ ఆటోలో లక్డీకాపూల్ వెళ్లి మంగుళూరు వెళ్లేందుకు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అబ్దుల్లాపూర్మెట్కు తిరిగి వస్తూ బాంబుల తయారీకి ఎల్బీ నగర్లో రెండు ప్రెషర్ కుక్కర్లు, ఆ సమీపంలోని పండ్ల వ్యాపారుల నుంచి కొన్ని ఖాళీ చిన్న సైజు అట్ట పెట్టెలు కొనుగోలు చేశారు. బి–డే (బ్లాస్ట్ డే) అయిన 2013 ఫిబ్రవరి 21 ఉదయం వఖాస్కు బాంబుల తయారీ బాధ్యతల్ని అప్పగించిన హడ్డీ, మోను 11 గంటల ప్రాంతంలో పాతబస్తీలోని జుమ్మేరాత్బజార్కు చేరుకున్నారు. అక్కడ మరో పాత సైకిల్ కొనుగోలు చేసి దాన్ని కూడా తీసుకుని మలక్పేట రైల్వేస్టేషన్ పార్కింగ్లో మొదటి సైకిల్ పెట్టిన చోటే పెట్టి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు బాంబుల తయారీ పూర్తయింది. విధ్వంసానికి ముందే గది ఖాళీ.. రెక్కీ ప్రకారం ఏ–1 మిర్చ్ సెంటర్, దాని వెనుక రోడ్డులో అనునిత్యం రద్దీగా ఉండే మద్యం దుకాణం వద్ద బాంబులు పెట్టాలి. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ త్రయం అబ్దుల్లాపూర్మెట్లోని గదిని ఖాళీ చేసింది. రెండు కుక్కర్ బాంబుల్ని పట్టుకున్న ముగ్గురూ షేర్ ఆటోలో ఎల్బీనగర్కు, అక్కడ నుంచి ప్రత్యేక ఆటోలో మలక్పేట వచ్చారు. రైల్వేస్టేషన్ పార్కింగ్ నుంచి సైకిళ్లను తీసుకున్నారు. ప్యాక్ చేసిన బాంబుల్ని వాటిపై పెట్టుకున్న ముగ్గురూ దిల్సుఖ్నగర్కు వచ్చారు. మొదటి సైకిల్ తీసుకుని మోను, రెండో సైకిల్తో వఖాస్ వెళ్లగా... హడ్డీ గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద ఎదురు చూశాడు. మోను నేరుగా వెళ్లి ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్ పెట్టాడు. మద్యం దుకాణం వరకు చేరే సమయం లేదని నిర్థారించుకున్న వఖాస్ 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెళ్లిపోయాడు. పేలుళ్లు జరిగిన అనంతరం హడ్డీ, మోను గడ్డిఅన్నారం చౌరస్తా నుంచి ఆటోలో లక్డీకాపూల్లోని ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి ట్రావెల్స్కు చెందిన షటిల్ సరీ్వస్ వ్యానులో రేతి»ౌలి చౌరస్తా చేరుకుని అక్కడ నుంచి ట్రావెల్స్ బస్సులో మంగుళూరు వెళ్లిపోయారు. సైకిల్ పెట్టిన తరవాత వేరే మార్గంలో మోను నగరాన్ని దాటి వెళ్లిపోయాడు.

Hyderabad: క్షణికావేశం..పెను విషాదం!
హయత్నగర్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఇరువురి ఉసురు తీసింది. 11 నెలల బాలుడిని అనాథను చేసింది. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు పోలీసులు తెల్పిన మేరకు ఇలా ఉన్నాయి. సంపంగి నగేష్ (25), శిరీష(20) భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 నెలల కుమారుడు ఉన్నాడు. హయత్నగర్ ముదిరాజ్ కాలనీలో నివసిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులుగా పని చేస్తున్నారు. మంగళవారం భార్యా భర్తల మధ్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష క్షణికావేశంలో..ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పూచీకత్తుతో రాత్రి 9 గంటలకు వదిలి పెట్టారు. ఆవేదనతో భర్త ఆత్మహత్య... భార్య మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన నగేష్ బుధవారం తెల్లవారుజామన హయత్నగర్లోని రిలయన్స్ డిజిటల్ షోరూం భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..నగేష్ ఒక్కడే భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పాపం పసికందు... భార్యా భర్తలిద్దరూ ఒక రోజు తేడాలో ఆత్మహత్యకు పాల్పడడంతో ముదిరాజ్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన 11 నెలల బాలుడిని చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
దొడ్డబళ్లాపురం: ఆమెకు వివాహం జరిగి 13 ఏళ్లయ్యింది. భర్త, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబం ఏదో సాఫీగా సాగిపోతోంది. అయితే సోషల్ మీడియా అనే భూతం జీవితంలో చిచ్చు పెట్టింది. ఇన్స్టాలో పరిచయమైన యువకునితో ఆమె వెళ్లిపోవడంతో భర్త లబోదిబోమంటున్నాడు. వారం రోజుల కిందట అతడిని వివాహం చేసుకుని సదరు వీడియో ఇన్స్టాలో పోస్టు చేసి భర్తకు షాక్ ఇచ్చింది. ఇంటి నుంచి వెళ్లిపోయి.. అచ్చం సినిమా స్టోరీని తలపించే ఈ సంఘటన బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా జక్కసంద్రలోని రాఘవేంద్రనగరలో చోటుచేసుకుంది. నేత్రావతి ఈ స్టోరీలో సూత్రధారి. నేత్రావతికి 13 ఏళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. నెల క్రితం నేత్రావతి భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె సంతోష్ అనే యువకున్ని పెళ్లి చేసుకుని వీడియోను ఇన్స్టాలో పోస్టు చేసింది. అది చూసి మొదటిభర్త నెలమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుని మోసం చేసిందని, న్యాయం చేయాలని కోరాడు. గోడు వెళ్లబోసుకుంటున్న రమేశ్, అత్తమామలు మోసం చేసింది: అత్తమామలు రమేశ్, అతని తల్లిదండ్రులు ఠాణా వద్ద మీడియాతో మాట్లాడారు. కోడలు తమను మోసం చేసిందని, రెండేళ్లుగా ఇన్స్టా ప్రియునితో దందా సాగిస్తోందని వారు ఆరోపించారు. తమ మనవన్ని కూడా తీసుకెళ్లిందని, ఆ చిన్నారి ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని వాపోయారు. ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినలేదని అన్నారు. నేత్రావతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అనాథ అనే జాలితో పెళ్లి చేసుకుంటే ఇలా చేసిందని రమేశ్ వాపోయాడు. తన భార్యకు రూ.50 లక్షల విలువ చేసే పొలం ఉందని, రెండో భర్త దానిపై కన్నేశాడని చెప్పాడు. పోలీస్స్టేషన్కు నేత్రావతి ఈ కేసులో ట్విస్టులు ఇంకా ఉన్నాయి. నేత్రావతి, తన లాయరుతో బుధవారం నెలమంగళ ఠాణాకు వచ్చింది. భర్త ఇంటిలో ఉన్న తన వస్తువులను తీసుకెళ్లడానికి పోలీసులు తనకు భద్రత కల్పించాలని కోరింది. మొదటి భర్త రోజూ తాగి వచ్చి కొడతాడని, అతనితో కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. ఇటీవలే అతనిపై కేసు కూడా పెట్టినట్లు తెలిపింది. జిల్లాలో ఇది సంచలనమైంది.
వీడియోలు


పోసాని కృష్ణమురళీకి హైకోర్టులో ఊరట


ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ


క్రిష్ 4లో హృతిక్ ట్రిపుల్ రోల్


యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్: సీఎం రేవంత్ రెడ్డి


BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్


పరిటాల సునీతే నీ చొక్కా ఊడదీసి రోడ్డుపై నిలబెడుతుంది చూసుకో..


మరికొన్ని గంటల్లో భారత్ కు తహవూర్ రాణా


అనితకు రిపోర్టర్ల షాక్.. మధ్యలోనే ఎస్కేప్


వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి వేడుకలు


మార్వెల్ రేంజ్ మూవీ తీస్తున్న బన్నీ, అట్లీ