IPL 2025: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. | Virat Kohli becomes highest run-scorer vs Chennai Super Kings | Sakshi
Sakshi News home page

IPL 2025: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

Published Fri, Mar 28 2025 10:09 PM | Last Updated on Sat, Mar 29 2025 9:42 AM

Virat Kohli becomes highest run-scorer vs Chennai Super Kings

ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి ప‌ర్వాలేద‌న్పించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 30 బంతులు ఎదుర్కొన్న విరాట్‌.. 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 31 ప‌రుగులు చేశాడు. త‌ద్వారా కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లి నిలిచాడు.

కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 34 మ్యాచ్‌ల్లో 1068 ప‌రుగులు సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉండేది. ధావ‌న్ చెన్నైపై 29 మ్యాచ్‌ల్లో 44.04 సగటుతో మొత్తం 1,057 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచ‌రీతో పాటు,  8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో 3 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ధావ‌న్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి, ధావ‌న్ త‌ర్వాతి స్దానాల్లో వ‌రుస‌గా రోహిత్ శ‌ర్మ‌(896), డేవిడ్ వార్న‌ర్‌(696), కీరన్ పొలార్డ్(583) ఉన్నారు. 

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ర‌జిత్ పాటిదార్‌(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఫిల్ సాల్ట్‌(32), విరాట్ కోహ్లి(31), ప‌డిక్క‌ల్‌(27) రాణించారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో టిమ్ డేవిడ్‌( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప‌తిరానా రెండు, ఖాలీల్ అహ్మ‌ద్‌, అశ్విన్ త‌లా వికెట్ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement