కరీంనగర్: యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావాలంటే ఇండియా కూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి అన్నా రు. ఆదివారం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలో యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ పదేళ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేశ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ప్రచారానికి దిగడం సిగ్గుచేటు
కరీంనగర్టౌన్: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక గాడిద గుడ్డు అంటూ సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారానికి దిగడం సిగ్గుచేటని బీజేపీ రా ష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జగిత్యాల జిల్లా ప్ర ధాన కార్యదర్శి మధూకర్ అన్నారు. ఆదివారం ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం 9 లక్షల కోట్లు ఇచ్చిందని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ తీరు మార లేదన్నారు. కటకం లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
భగీరథ గేట్వాల్ను ఢీకొట్టిన లారీ
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్దుంపూర్–చెర్లభూత్కుర్ రోడ్లోని మిషన్ భగీరథ గేట్వాల్ను ఆదివారం రాత్రి లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో గేట్వాల్ విరిగి కింద పడడంతో నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. సమాచారం అందుకున్న భగీరథ సిబ్బంది గేట్వాల్ను పరిశీలించి నీటి సరఫరాను నిలిపివేశారు.