యువకుడిని కొట్టి బంగారం చోరీ | robbery in bhuvanagiri | Sakshi
Sakshi News home page

యువకుడిని కొట్టి బంగారం చోరీ

Published Tue, Jan 19 2016 11:53 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

నల్గొండ జిల్లా భువనగిరిలోని తారకరామనగర్‌లో ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు పడి బంగారు చోరీ చేశారు.

భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరిలోని తారకరామనగర్‌లో ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు పడి బంగారు చోరీ చేశారు. స్థానికంగా ఉండే రేణుక తెల్లవారుజామున లేచి పనికి వెళ్లిపోయింది. ఇంట్లో ఆమె కుమారుడు నవీన్ నిద్రపోతుండగా జొరబడిన దొంగలు నవీన్‌ను కొట్టి, తాడుతో కట్టేసి బీరువాలో ఉన్న 5 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు.
 
రేణుక పనులు ముగించుకుని ఇంటికొచ్చి చూడగా తలుపునకు గొళ్లెం పెట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా కొడుకును కట్టేసి ఉండటంతో విషయం బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటిని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement