pakhala
-
ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. (చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు) -
పర్యాటకుల.. సందడి
మండలంలోని పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలతో సరస్సు మత్తడి పోస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు కావడంతో సుమారు 5వేల మంది తరలివచ్చి మత్తడి అందాలను తిలకించి జలకాలాడారు. అలాగే సరస్సులో బోటు షికారు చేసి ఆనందంగా గడిపారు. కట్టమైసమ్మ వద్ద పూజలు చేసి కోళ్లు, యాటలు బలిచ్చి వనభోజనాలు చేశారు. - ఖానాపురం -
ఖుషీఖుషీగా
మండలంలోని పాకాలలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాకాల సరస్సు నీటిమట్టం 19.6 ఫీట్లకు చేరుకుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చి పాకాల అందాలను వీక్షించారు. నర్సంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఖానాపురం ఎస్సై దుడ్డెల గురుస్వామి కుటుంబ సమేతంగా సరస్సును సందర్శించారు. అనంతరం కాసేపు బోటింగ్ షికారుచేసి ఆనందంగా గడిపారు. – ఖానాపురం