ఖుషీఖుషీగా
మండలంలోని పాకాలలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాకాల సరస్సు నీటిమట్టం 19.6 ఫీట్లకు చేరుకుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చి పాకాల అందాలను వీక్షించారు. నర్సంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఖానాపురం ఎస్సై దుడ్డెల గురుస్వామి కుటుంబ సమేతంగా సరస్సును సందర్శించారు. అనంతరం కాసేపు బోటింగ్ షికారుచేసి ఆనందంగా గడిపారు. – ఖానాపురం