water level
-
వదలని వరద.. తొలగని బురద
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షిప్రతినిధి): ఊహకందని విలయం..మాటలకందని విషాదం నుంచి ఎనిమిది రోజులైనా విజయవాడ నగరం తేరుకోలేకపోతోంది. బుడమేరు చేసిన వరద గాయం నుంచి మానకపోగా, బురద చేస్తున్న కొత్త గాయాలతో అల్లాడుతోంది. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకూ కంటిమీద కునుకు లేకుండా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్న సింగ్నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీలతో పాటు వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీ, పాలఫ్యాక్టరీ ఫ్లై ఓవర్ కింద రామరాజ్యనగర్, పంజాసెంటర్, చిట్టినగర్ సొరంగం, కబేళారోడ్డు, సితార సెంటర్, నిజాంగేట్ సెంటర్, వించిపేట, కంసాలిపేటలో వరద తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. బుడమేరు ఉగ్రరూపంగత నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి పరీవాహకప్రాంతం నుంచి బుడమేరుకు భారీగా నీరు వచ్చి చేరింది. మూడు చోట్ల గండి పడింది. వెలగలేరు నుంచి ఆ వరదంతా వచ్చి విజయవాడ నగరాన్ని ఈనెల 1వ తేదీ ఉదయం ముంచెత్తింది. ఆ వరద నీరు ముందుగా ప్రవేశించిన వైఎస్సార్కాలనీ, జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతానికి చేరుకున్న తొలిమీడియా ‘సాక్షి’కి అడుగడుగునా బాధితుల కష్టాలు కనిపించాయి. అక్కడ బుడమేరు నేటికీ ఉగ్రరూపంలోనే ఉంది. పూర్తిగా మునిగిపోయిన ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. రాకపోకలు లేక అక్కడి ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఎనిమిది రోజులుగా నీటిలోనే ఇళ్లు నానిపోతుండటంతో గోడలు ఏ క్షణాన కూలిపోతాయోనని తప్పనిసరై పై అంతస్తుల్లోనే ఆశ్రయం పొందుతున్న బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.కన్నీరేగాని... మంచి నీరేదిబుడమేరు వరదలకు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మందికి తమ భవిష్యత్తు ఏమిటో అర్ధం కావడం లేదు. ముంపు ప్రాంతాల్లో చిధ్రమైన వారి జీవితాలు ఇప్పట్లో కోలుకునేలా లేవు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజల కన్నీరు ఇంకిపోతుందేమోగానీ ఆ అభాగ్యుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు. కనీసం బురదైనా తొలగడం లేదు. వన్టౌన్ ప్రాంతంలో వరద నీటిలో రోజుల తరబడి మునిగిపోయిన కాలనీలు, వీధులు, రోడ్లు, ఇళ్లు బురద, చెత్తతో నిండిపోయాయి. ఆదివారం ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో వాటిని తొలగించుకునేందుకు బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. సింగ్నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, కంసాలిపేటలో బురదతో పాటు డ్రెయినేజీ నీటితో పాటు, కాలకృత్యాలు కూడా అదే నీటిలో కలిసిపోవడంతో అదంతా భారీగా దుర్ఘందాన్ని వెదజల్లుతోంది.వరద నీటిలోనే రోజుల తరబడి నరకయాతన అనుభవించిన వారిలో కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే, మరికొందరు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ వీరికి కనీసం తాగేందుకు మంచి నీరు దొరకడం లేదు. వంట సరుకులు, కూరగాయలు తెచ్చుకున్నాగానీ వాడుకునేందుకు నీళ్లు లేక పొయ్యి వెలిగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీరూ మురుగుతో నిండి ఉంటోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధుల భయంతో చాలా మంది ఇళ్లకు తిరిగిరావడం లేదు. దీంతో వారంగా వేలాది ఇళ్లకు తాళాలు వేసే ఉన్నాయి. పూర్తిగా ఇళ్లు కూలిపోయి గూడు కోల్పోయిన వారిలో కొందరు చిట్టినగర్ వద్ద సొరంగంలో తలదాచుకుంటున్నారు. స్ఫూర్తినింపుతున్న ప్రజలువరద వల్ల లక్షలాది మంది ఉపాధి, వ్యాపారాలు లేక రోడ్డున పడ్డారు. వారిలో కొందరు చిరు వ్యాపారులు విషాదం నుంచి తేరుకుంటున్నారు. దుకాణాల్లో పేరుకుపోయిన బురదను తొలగించుకుని, పాడైపోయిన వస్తువులు, సరుకులు బయటపడేసి మళ్లీ కొత్తగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోలుకోలేని కష్టం నుంచి తేరుకుని దుకాణాలను తెరిచి స్ఫూర్తినింపుతున్నారు. వృద్ధులు, చిన్నారులను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సితార సెంటర్, కబేళ రోడ్డు, రామరాజ్య నగర్, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీలు నేటికీ వరద నీరు పూర్తిగా తొలగలేదు.ఇక్కడ పలు వీధులకు ఇప్పటికీ ప్రజల రాకపోకలకు అవకాశం లేదు. అలాంటి చోటికి ప్రభుత్వం నుంచి ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు చేరడం లేదు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ వేలాది వాహనాలు నీళ్లలోనే ఉండిపోయాయి. అవన్నీ పాడైపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వదిలేస్తున్నారు. తరలించేందుకు అవకాశం ఉన్నవాటిని అతి కష్టం మీద మరమ్మతులకు తీసుకువెళుతున్నారు. ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నప్పటికీ అవి నీటిలో మొరాయిస్తున్నాయి.సర్వం కోల్పోయాం ఆదుకోవాలిమేము కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆదివారం ఉదయం బుడమేరు వరద ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కట్టుబట్టలతో బిల్డింగ్పైకి పరుగులు పెట్టాం. రెండు రోజుల పాటు ఆహారం, మంచినీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాం. కరెంట్ లేదు. ప్రభుత్వ సహాయక చర్యలు మాదాకా రాలేదు. తెలిసిన వాళ్ల ద్వారా పడవను తెప్పించుకుని ఒడ్డుకు చేరాం. బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నాం. వారం రోజుల తర్వాత ఇంటిలోకి వెళ్లి చూస్తే గృహోపకరణాలన్నీ వరదలో తడిసి పాడైపోయాయి. ఇళ్లంతా బురద పేరుకుపోయింది. సర్వం కోల్పోయి తీవ్రంగా నష్ట పోయాం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి. – రేగాని సామ్రాజ్యం, వాంబేకాలనీ, సింగ్నగర్ లంటీర్లు ఉంటే ఈ కష్టాలు ఉండేవి కాదుఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. వరదలో ఇల్లు మునిగిపోయింది. ఆటో వరదలో మునిగి పాడైపోయింది. మా దగ్గర చిల్లిగవ్వలేదు. వారం రోజులుగా ఆహారం లేక, మంచినీరు అందక నరకం చూస్తున్నాం. వలంటీర్లు ఉంటే కుటుంబంలో అందరికీ ప్రభుత్వంఅందిస్తున్న సహాయ చర్యలు సక్రమంగా అందేవి. ఇప్పుడు ప్రధాన రోడ్డు వరకే ట్రాక్టర్ వస్తోంది. అక్కడకు వెళితే భోజనం ప్యాకెట్లు, వాటర్ ఇస్తున్నారే తప్ప చిన్న వీధుల్లోకి రావడం లేదు. భోజనం ప్యాకెట్లు తెరిచి చూస్తే వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. – పలిశెట్టి సురేష్, సింగ్నగర్ -
నాగార్జునసాగర్ అధికారుల పొంతన లేని లెక్కలు
-
శాంతించిన గోదావరి..
-
భారీగా పెరిగిన గోదావరి నీటిమట్టం
-
ఉగ్ర గోదావరి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలు, పోటెత్తుతున్న ఉప నదులు కలసి దిగువ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ గోదావరిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. దానికి దిగువన కడెం ప్రాజెక్టు నుంచి, వాగుల నుంచి వస్తున్న వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది.అయితే దాని దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ (లక్షి్మ) బరాజ్కు 9,54,130 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహానికి ఇతర ఉప నదులు, వాగులు కలసి.. తుపాకులగూడెం (సమ్మక్క), దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్ల వద్ద మరింత ఎక్కువగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు 50.20 అడుగులుగా...భద్రాచలం వద్దకు వచ్చేసరికి గోదావరి ఉగ్ర రూపం దాల్చు తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 50.20 అడుగుల నీటిమట్టంతో 13 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. భద్రాచలం నుంచి వెళ్తున్న నీరంతా పోలవరం, ధవళేశ్వరం మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వరద ప్రమాదకర స్థాయికి పెరిగే చాన్స్ మధ్య గోదావరి సబ్ బేసిన్తోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశాలలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నీళ్లన్నీ గోదావరిలోకి చేరేందుకు ఒక రోజు పడుతుంది. దీంతో మంగళవారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరవచ్చని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. భద్రాచలం వద్ద వరద 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన ములుగు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం పర్యటించారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి నది, సామాజిక ఆస్పత్రిని, పలు వరద ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలుమహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వానలతో గోదావరి నది పోటెత్తుతోంది. కొన్ని నెలలుగా సరిగా వానల్లేక, నీటికి కటకటతో ఇబ్బందిపడగా.. ఇప్పుడు భారీగా వరదలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తేయడం, నీటి ఎత్తిపోతలు చేపట్టకపోవడంతో నీళ్లన్నీ వృధాగా వెళ్లిపోతున్నాయి. మరోవైపు ఎగువ గోదావరిలో పెద్దగా ప్రవాహాలు లేక ఎల్లంపల్లిలోకి నీటి చేరిక మెల్లగా కొనసాగుతోంది.మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే.. అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లిని నింపుకొని, అక్కడి నుంచి మిడ్మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ తదితర రిజర్వాయర్లను నింపుకొనే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. కానీ గోదావరి నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేక వరద అంతా సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం.. గోదావరిలో ఈ నెల 17 నుంచి సోమవారం సాయంత్రం వరకు 200 టీఎంసీల మేర నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఎగువ నుంచి నీళ్లు రాక, కాళేశ్వరం లిఫ్టింగ్ లేక.. ఈసారి ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమేనన్న చర్చ జరుగుతోంది. -
వాగులూ... వంకలూ..
సాక్షి, నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది. ⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.వాగులో ఇద్దరు గల్లంతుచెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్కు సాయంత్రం వచ్చారు.పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది. -
Heavy Rains: హుసేన్ సాగర్ కు పోటెత్తిన వరద..
-
వరద గోదారి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. 6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలుమేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిపేరుకు పోటెత్తిన వరదభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది. -
డెడ్ స్టోరేజీకి ‘నాగార్జున సాగర్’!.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు వరకే... గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది. చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు! సాగర్ 570 అడుగులకు చేరితేనే.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్లోని బ్యాక్వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నారు ఎండిపోతోంది పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. – పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్పల్లి, మిర్యాలగూడ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా... ►2019- ఆగస్టు 12 ►2020- ఆగస్టు 8 ►2021- ఆగస్టు 2 ►2022 - జూలై 28 ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో) గరిష్టం ప్రస్తుతం శ్రీశైలం 885 864.57 నాగార్జున సాగర్ 590 515.4 -
క్షణక్షణం పెరుగుతోన్న ప్రాణహిత నది నీటి మట్టం!
-
భద్రాచలం వద్ద గోదావరికి పెరిగిన నీటి మట్టం
-
ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి
-
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
మండే ఎండల్లోనూ నిండుగా నీళ్లు
కేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం ఉదయం ఒక క్రస్టు గేటును పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. జూన్ మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారని చెపుతున్నారు. గత ఏడాది జూన్ 27న గేట్లు ఎత్తారు. గత నెల రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాలలో కురిసిన అకాల వర్షాలతో ఈ ప్రాజెక్టు వేసవిలోనే నిండుకుండలా మారింది. నెల రోజుల నుంచి మూసీ, బిక్కేరు వాగుల ద్వారా నిరంతరాయంగా నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా సోమవారం ఉదయానికి నీటిమట్టం 644.60 అడుగులకు (4.36 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టులోకి 240 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలోకి రావటంతో డ్యామ్ అధికారులు మూడో నంబర్ క్రస్ట్ గేటును అర అడుగు మేర పైకి ఎత్తి 330 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. 644.5 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
అడుగంటిపోతున్న భూగర్భ జలాలు.. భవిష్యత్తులో పరిస్థితి అంతే!
సాక్షి, రంగారెడ్డి: భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కాలువల నుంచి నీటి ప్రవాహం లేకపోవడం, సామర్థ్యానికి మించి బోరు తవ్వకాలు జరుపుతుండటం, ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో మూడు మీటర్ల లోతునే నీటి ఆనవాళ్లు ఉండగా.. ప్రస్తుతం పది మీటర్లు దాటినా కనిపించడం లేదు. భూ పొరల్లో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు పని చేయడం లేదు. బావులు, చెరువుల కింద వరి, ఇతర పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వేగంగా.. జిల్లాలో 68 ఫిజో మీటర్లు ఉన్నాయి. 2022 మార్చిలో జిల్లా వ్యాప్తంగా సగటు భూగర్భ నీటి మట్టం స్థాయి 8.60 మీటర్లు ఉండగా, 2023 మార్చి నాటికి 8.89 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా తొమ్మిది మండలాల్లో నీటి లభ్యత మెరుగుపడగా, మరో 18 మండలాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరానికి సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వీటికి సమీపంలో కొత్తగా అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా అపార్ట్మెంట్వాసులు, వాణిజ్య సముదాయాలు భూగర్భజాలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, సరూర్నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో వంద ఫీట్లలోపే నీరు సమృద్ధిగా లభిస్తుండగా, మరికొన్ని కొన్ని ప్రాంతాల్లో వెయ్యి ఫీట్లకుపైగా లోతు బోర్లు తవ్వుతున్నారు. అయినా చుక్క నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. వేగంగా పడిపోతున్నాయి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే నీటి వాడకం అధికంగా ఉంది. చెరువులు, కుంటలు కూడా చాలా తక్కువ. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం 350 నుంచి 400 ఫీట్ల లోతు వరకు బోరు తవ్వుకునేందుకు అనుమతి ఉంది. కానీ చాలామంది అనుమతి పొందకుండా నిపుణుల సూచనలు పాటించకుండా 1000 నుంచి 1,200 ఫీట్లు తవ్వుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం స్థాయి మరింత లోతుకు పడిపోతుండటానికి ఇదే ప్రధాన కారణం. నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయ బావుల వద్ద పొలాల్లో చెక్డ్యాంలు, వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. లేదంటే భవిష్యత్తులో నష్టాలు చవి చూడక తప్పని పరిస్థితి. -
884.80 అడుగులకు చేరిన ‘శ్రీశైలం’ నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం సాయంత్రం 884.80 అడుగులకు చేరుకుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,19,093 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. మూడు గేట్లను 10 అడుగుల మేర తెరిచి 83,949 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ఇక ఆదివారం నుంచి సోమవారం వరకు కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 66,566 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 95,562 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 5 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు సాగర్ జలాశయం నుంచి 1,60,129 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589.10 అడుగులుండగా 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు అయితే.. నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. -
మూసీ నదికి తగ్గిన వరద
-
శ్రీశైలం డ్యాం.. అందాలు చూడటానికి సిద్దమా!
శ్రీశైలం ప్రాజెక్ట్(నంద్యాల జిల్లా): శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో శనివారం గేట్లు ఎత్తనున్నారు. గురువారం సాయంత్రానికి డ్యాం నీటి మట్టం 880.20 అడుగులకు చేరుకుంది. మరో 4.80 అడుగులు పెరిగితే గరిష్టస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 1,65,255 క్యూసెక్కుల వరద ప్రవాహం డ్యాంకు వస్తోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సగటున 40 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం నాటికి జలాశయ నీటిమట్టం 882 అడుగులకు పైబడి చేరుకోనుంది. దీంతో ఆదే రోజు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం ప్రాజెక్ట్ చేరుకుని డ్యాం రేడియల్క్రస్ట్ గేట్లను తెరచి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 597 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయగా, ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. (క్లిక్: మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!) -
శ్రీశైలానికి పోటెత్తిన వరద!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో వరదతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక పెరిగింది. నీటిమట్టం డెడ్ స్టోరేజీ (854 అడుగులు)ని దాటింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జూరాల నుంచి 1,52,368 క్యూసెక్కులు, తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1,61,988 క్యూసెక్కులు.. కలిపి 3,14,256 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులకు, నిల్వ 90 టీఎంసీలకు పెరిగింది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 125 టీఎంసీలు అవసరం. వరద ఉద్ధృతి ఇదేస్థాయిలో కొనసాగితే ఆరు రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశముంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో తుంగభద్రలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు కూడా నిండి ఉండటంతో వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. దీనితో మరో రెండు, మూడు రోజులు శ్రీశైలంలోకి ప్రస్తుత స్థాయిలోనే ప్రవాహం కొనసాగనుంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువన ఉన్న నాగార్జున సాగర్కు 31,784 క్యూసెక్కులు (రోజుకు 2.75 టీఎంసీలు) వదులుతోంది. ఇక నాగార్జునసాగర్కు దిగువన వర్షాలు తెరిపి ఇవ్వడంలో పులిచింతల ప్రాజెక్టులోకి వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజీకి కూడా ప్రవాహం 11,081 క్యూసెక్కులకు పడిపోయింది. కృష్ణా డెల్టా కాల్వలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగతా 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం
-
శ్రీశైలంలోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఎట్టకేలకు కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటి మట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కృష్ణా బేసిన్లో ఎగువన శనివారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ వరద కనీసం వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, దాని ఉపనదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టిలోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో.. దిగువకు అంతే స్థాయిలో వరదను వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్లోనూ అదే పరిస్థితి. జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో విద్యుదుత్పత్తి చేస్తూ.. స్పిల్వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో టీబీ డ్యాంలోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దాంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. టీబీ డ్యాం నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లో టీబీ డ్యాం నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు ఎత్తేసి.. వరదను దిగువకు విడుదల చేస్తారు. ఆ జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. దిగువకు విడుదల చేస్తున్న నీటిలో సాగర్కు 29305 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/బూర్గంపాడు: భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 8 గంటలకు 43.10 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ రాత్రి 11.00 గంటల సమయంలో 48.50 అడు గులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. దీంతో దేవస్థానం వైపు కరకట్ట దిగువ భాగాన ఉన్న స్నానఘాట్లు పూర్తిగా మునిగిపోగా, కల్యాణ కట్టపైకి వరద చేరింది. కరకట్టల వద్ద స్లూయిస్లను మూసివేయటంతో భద్రాచలంలో వరద నీరు ఆగిపోయింది. ఆలయం పడమర మెట్ల వద్దకు చేరిన వరద నీరు దీంతో రామాలయ నిత్యాన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరుకుంది. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు లోతట్టు కాలనీల ప్రజలను తరలించారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం 12 గేట్ల ద్వారా 13,888 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. చర్ల, వెంకటాపురం మండలాల నడుమ ప్రధాన రహదారిపై నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలకు పూర్తిగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలో బస చేసి అధికారులను అప్రమత్తం చేస్తూ, పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. వరద ఉధృతితో కల్యాణ కట్టలోకి చేరిన నీరు -
గోదావరికి పోటెత్తిన వరద
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వరద ఉధృతితో గురువారం రాత్రి 11 గంటలకు గోదావరి నీటిమట్టం 17.03 అడుగులు ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు 18.90 అడుగులకు చేరింది. అది పెరుగుతూ రాత్రి 11 గంటలకు 33.10 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా వరద నీరు ఉపనదుల ద్వారా గోదావరికి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది. అంతేకాకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని దిగువకు వదులుతుండటంతో శనివారం మధ్యాహ్నానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు, 1986లో వచ్చిన 75.6 అడుగుల నీటిమట్టంకన్నా పోలవరం బ్యాక్ వాటర్తో ఇప్పుడు భద్రాచలంలో గోదావరి ఒకట్రెండు అడుగులు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందన్న ప్రచారంతో ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
డెడ్ స్టోరేజీ చేరువలో ఎస్సారెస్పీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 1050.30 అడుగుల (6.37 టీఎంసీ) కు పడిపోయింది. ఎండల తీవ్రతకు ప్రతిరోజూ రెండు వందలకు పైగా క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భారీగా పూడిక నిండిపోవడంతో ఐదు టీఎంసీల మట్టానికి తగ్గితే బురద నీరు మారే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఒకటిన్నర టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. ఐదు జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టే ఆధారం. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఈ గ్రిడ్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల తాగునీటి కోసం ప్రతిరోజు 54 క్యూసెక్కులు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి కోసం 29 క్యూసెక్కులు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోసం మరో 54 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తున్నారు. ఆవిరి నష్టాలతో కలిపి మొత్తం ప్రతిరోజు 394 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఏటా ఈ ప్రాజెక్టుకు ఆగస్టులో ఇన్ఫ్లో ఉంటుంది. అప్పటి వరకు తాగునీటి అవసరాలకు ఈ నీటినే వినియోగించాల్సి ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం- 6.37టీఎంసీలు ప్రతిరోజూ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీరు- 394క్యూసెక్కులు.. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీటి మట్టం- 5టీఎంసీలు ఆగస్టులో భారీగా ఇన్ఫ్లో.. మహారాష్ట్రతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండ లేదు. ఈసారి 2018 ఆగస్టులో వచ్చిన వరద కొంత మేరకు ఊరటనిచ్చింది. ఒక్కోరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కొన్నిరోజులు లక్ష క్యూసెక్కుల చొప్పున వరద జలాలు వచ్చి చేరాయి. ఏడాది మొత్తానికి 77.92 టీఎంసీలు వచ్చాయి. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టంగా 83 టీఎంసీలకు చేరింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నీటిని వదిలారు. ఎగువ ఎల్ఎండీ వరకు ఆయకట్టుకు సుమారు 20 టీఎంసీలు సాగునీరు సరఫరా చేశారు. తాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది లేదు.. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రాజెక్టు 6.37 టీఎంసీల నీరుంది. దీంతో ఆగస్టు మాసాంతం వరకు తాగునీటిని సరఫరా చేయవచ్చు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్లో ప్రాజెక్టు ఇన్ఫ్లో ఉంటుంది. -శ్రీనివాస్రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ -
కొల్లేరు సరస్సులో తగ్గిపోయిన నీరు
-
బోర్డు ఆదేశాలు బేఖాతరు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాల దిగువన నీటిని తోడటం మొదలైంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, తమ అనుమతి లేకుండా కనీస నీటి మట్టాల దిగువన నీటిని తీసుకోరాదన్న కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి వినియోగం మొదలు పెట్టాయి. 2,124 క్యూసెక్కుల మేర నీటిని ఇరు రాష్ట్రాలు తమతమ అవసరాల నిమిత్తం శ్రీశైలం నుంచి వాడుకున్నాయి. గతేడాదితో పోలిస్తే శ్రీశైలంలో ఈ ఏడాది నీటి వినియోగం గణనీయంగా పెరగడంతో ముందుగానే ప్రాజెక్టులో నీటి మట్టాలు తగ్గాయి. గతేడాది 885 అడుగుల నీటి మట్టానికి గాను 856 అడుగులమట్టంలో నీరుం డగా, ఈ ఏడాది అది 833.80 అడుగుల మట్టానికి పడిపోయింది. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 834 అడుగులే. నీటి మట్టం తగ్గతున్న నేపథ్యం లో రెండ్రోజుల కిందటే ఎట్టి పరిస్థితుల్లోనూ కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లరాదని కృష్ణా బోర్డు తెలుగు రాష్ట్రాలను హెచ్చరించింది. త్రిసభ్య భేటీ వరకు వద్దన్నా.. : కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరిగే వరకు కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లే అంశంపై ఎలాంటి నిర్ణయాలు చేయరాదని ఇదివరకే సూచించింది. అయినప్పటికీ ఇరు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని మొదలుపెట్టాయి. గురువారం ఏపీ శ్రీశైలం నుంచి హంద్రీనీవా కాల్వలకు 860 క్యూసెక్కులు, తెలంగాణ కల్వకుర్తి అవసరాలకు 1,264 క్యూసెక్కుల నీటిని తరలించాయి. దీంతో జలాలు కనీస నీటి మట్టానికి దిగువకు పడిపోయాయి. అయితే ఇరు రాష్ట్రాలు ఎంతకాలం, ఏ మేర నీటిని తరలించుకుంటాయన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో బోర్డు ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే. గతంలో కనీస నీటి మట్టాల దిగువన నీటిని తోడినప్పుడు పూర్తి స్థాయి బోర్డు సమావేశాల్లోనే వీటిపై ఏ నిర్ణయం అనేది తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చే వారం బోర్డు సమావేశం జరుగుతుండొచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఒక్క నెలలోనే 185 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను ఆగస్టు నెల పూర్తిగా ఆదుకుంది. ఈ నెలలో వచ్చి న ప్రవాహాలతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా, నాగార్జునసాగర్ దాదాపు నిండింది. ఈ నెలలో సాగర్లోకి 185 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. మరో 8 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకోనుంది. ఎగువ శ్రీశైలం నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగు తుండటంతో సాగర్కు గురువారం సాయంత్రం 73వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులకు గానూ 582 అడుగులకు చేరింది. నీటినిల్వ 312 టీఎంసీలకు గానూ 288 టీఎంసీలను దాటింది. మరో 24 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుకుండను తలపిం చనుంది. రెండు రోజులతో పోలిస్తే శ్రీశైలం నుంచి ప్రవాహాలు తగ్గినా, అవి మళ్లీ క్రమంగా పుంజు కునే అవకాశం కనిపిస్తోంది. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్లకు నీటి ప్రవాహాలు క్రమంగా పెరిగాయి. గురువారం ఆల్మట్టిలోకి లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక నారాయణపూర్ నుంచి 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ జూరాలకు విడుదల చేశారు. దీంతో ఉదయం జూరాలకు 80 వేల క్యూసెక్కుల వరద కొనసాగగా, అది సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. దీంతో దిగువ శ్రీశైలానికి జూరాల నుంచి 1.31 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువా రం ఉదయం శ్రీశైలానికి కేవలం 29 వేల క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 1.02 లక్షల క్యూసెక్కులకు చేరింది. సాగర్కు 73,344 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా, శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉంది. సాగర్ నుంచి ఏపీ, తెలంగాణ అవసరాలకు 28,744 క్యూసెక్కు ల నీటిని సాగు, తాగుకు విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలంలో పెరిగిన నీటి మట్టం
సాక్షి, హైదరాబాద్: ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో శ్రీశైలంలో నీటి నిల్వలు పెరిగాయి. బుధవారం నాటికి శ్రీశైలం నీటి మట్టం 50 టీఎంసీలు దాటింది. జూరాల నుంచి 37 వేల క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుత మట్టం 51.23 టీఎంసీలకు చేరింది. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు హైదరాబాద్ తాగునీటికి శ్రీశైలం నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆల్మట్టిలోకి 12 వేల క్యూసెక్కుల మేర వరద వస్తుండగా, వచ్చిన నీటిని దిగువ నారాయణపూర్కు విడుదల చేశారు. నారాయణపూర్లోకి 11,350 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో కొనసాగుతుండటం వల్ల ప్రాజెక్ట్ పూర్తిగా నిండటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. నారాయణపూర్ నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు ప్రాజెక్టు పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో జూరాలకు 37,073 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం జూరాలలో 9.11 టీఎంసీల నిల్వలు ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. -
నిలకడగా వరద ఉధృతి
సముద్రంలోకి 3,52,472 క్యూసెక్కుల నీరు విడుదల కొవ్వూరు: గోదావరిలో వరద ఉధృతి నిలకడగా ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నాలుగు ఆర్మ్లు వద్ద ఉన్న 175 గేట్లును ఎత్తి 3,52,472 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆనకట్ట వద్ద నీటి మట్టం 8.90 అడుగులుగా నమోదైంది. ఉభయగోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 13 వేల క్యూసెక్కుల నీరు సాగు అవసరాలకు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పుడెల్టాకు 4,500, సెంట్రల్ డెల్టాకు 2,000, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తున్నారు. తగ్గుతున్న నీటి మట్టం కాలేశ్వరంలో 5.11 మీటర్లు, పేరూరులో 7.0, దుమ్ముగూడెంలో 7.57, కునవరంలో 9.06, కుంటలో 4.97, కొయిదాలో 12.0, పోలవరంలో 8.58, రోడ్డు కం రైలు వంతెన వద్ద 14.02 మీటర్లు చొప్పున, భద్రచలంలో 24.30 అడుగుల నీటిమట్ట నమోదైంది. ఎగువన నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. -
టీబీ డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం
బొమ్మనహాళ్ : టీబీ డ్యాంలో నీటిమట్టం పెరిగినట్లు జలాశయం సిబ్బంది గురువారం తెలిపారు. జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిమట్టం ఆశాజనకంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిసే ఇన్ప్లో 15వేలు దాటిందని.. ఇదేవిధంగా మరో 20 రోజులు నీరు వచ్చి చేరితే ఆయకట్టుకు ఊపిరి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పొంగుతోంది.. పాతాళగంగ!
- రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం (సగటు) 11.27మీటర్లు - గతేడాది కంటే ఎత్తుకు పెరిగిన నీటి మట్టం 3.76మీటర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం గతేడాదితో పోల్చితే కాస్త మెరుగుపడింది. 2016లో ఇదే సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పాతాళగంగ మరింత కిందికి వెళ్లిపోయింది. తర్వాత ఆగస్టు నుంచి వర్షాలు ఆశాజనకంగా కురిసినా భూగర్భ జల మట్టాల్లో మార్పులు పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 584 మండలాల్లోని పరిస్థితిపై భూగర్భ జల శాఖ నివేదిక విడుదల చేసింది. ఇందులో 266 మండలాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలున్నాయి. 175 మండలాల్లో పదిహేను మీటర్ల లోతులో నీటిమట్టాలుండగా.. 83 మండలాల్లో ఇరవై మీటర్ల లోతులో ఉన్నాయి. 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటి మట్టాలున్న మండలాలు 60 ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది జూన్లో రాష్ట్రంలో సగటున 15.03 మీటర్ల లోతులో నీరు లభ్యమవగా... ప్రస్తుతం 11.27 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. అతి తక్కువ లోతులో జగిత్యాల జిల్లా (7.33 మీటర్లు), ఎక్కువ లోతులో సంగారెడ్డి (17.03 మీటర్లు) జిల్లాలో నీటి లభ్యత ఉంది. ప్రస్తుతం నాగర్కర్నూల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సగటు కంటే ఎక్కువ లోతులో నీరున్నట్లు అధికారులు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ ఆర్బన్, ఖమ్మం జిల్లాల్లో సగటున 8 మీటర్ల కంటే తక్కువ లోతులో భూగర్భ జలం లభ్యమవుతోంది. -
పెరుగుతున్న శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల జలాశయ సెల్ఫ్ క్యాచ్ మెంట్ ఏరియాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా డ్యామ్ నీటి మట్టం ప్రతి రోజు రెండు పాయింట్ల చొప్పున పెరుగుతోంది. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 8.00 మి.మీ వర్షపాతం నమోదైంది. నీటి మట్టం మంగళవారం సాయంత్రానికి 779.60 అడుగులకు చేరుకుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు నమోదు అవుతుండటంతో జలాశయంలో 36 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 20.2814 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
రిజర్వాయర్లలో పడిపోతున్న నీటిమట్టం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో 19 శాతానికే పరిమితమైనట్లు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్, ఇందిరా సాగర్, భాక్రానంగల్ తదితర రిజర్వాయర్లలో ఈ వారాంతంలో 29.665 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గతేడాది కంటే నీటి నిల్వలు తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. పంజాబ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, త్రిపుర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో గత ఏడాది కంటే నీటి నిల్వలు పెరిగినట్లు జలవనరుల శాఖ పేర్కొంది. -
రేపు బాబ్లీ గేట్లు ఎత్తివేత
సాక్షి, కరీంనగర్/బాల్కొండ: మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం ఎత్తనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ నీటి మట్టం 90 టీఎంసీల నుంచి 9.22 టీఎంసీలకు, ఎల్ఎండీలో 24 టీఎంసీల నుంచి 7.04 టీఎంసీలకు తగ్గింది. ఇదే సమయంలో గతం లో వెలువడిన సుప్రీంకోర్డు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనుండటంతో ‘మహా’వరదపై ఆశలు పెరుగుతు న్నాయి. అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉండటం వల్ల ఈ నాలుగు మాసాలు మహారాష్ట్రలో కురిసే భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి నదీ ప్రవాహం ద్వారా భారీగా నీరు చేరే అవకాశం ఉంది. అయితే.. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్, విష్ణుపురి, గైక్వాడ్ తదితర 11 ప్రాజెక్టులు నిండిన తరువాతనే ఎస్సారెస్పీలోకి వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఏడాదిలో నాలుగు నెలలు (వర్షాకాలం) ఎత్తాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఏటా జూన్ 30న అర్ధరాత్రి తర్వాత గేట్లు ఎత్తుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో మహారాష్ట్ర ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు డెడ్స్టోరేజీకి చేరాయి. గతేడాది కురిసిన వర్షాలకు అక్కడ, ఇక్కడ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ఎస్సారెస్పీకి పెద్ద మొత్తంలో మహారాష్ట్రకు వరద నీరు చేరగా, సుమారు 102 టీఎంసీలు గోదావరిలోకే వదిలేసి 90 టీఎంసీలు నిల్వ చేశారు. ఈసారి కూడా బాబ్లీ గేట్లు తెరుస్తున్నందున మహారాష్ట్ర వరద నీరుపైనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. -
పుష్కరకాలంలో ఏనాడు లేదు
నాగార్జునసాగర్: గత పుష్కరకాలంలో ఏనాడు లేనంతగా సాగర్ జలాశయ నీటి మట్టం కనిష్టస్థాయికి చేరింది. హైదరాబాద్తో పాటు ప్లోరిన్ పీడిత ప్రాంతాలకు త్రాగు నీరిందించేందుకు శ్రీశైలం జలాశయం నుండి నీటిని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్ననాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 502.20 అడుగులుండగా 118.806 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం నీటిమట్టం 775.90 అడుగులుండగా కేవలం 18.8677 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 2005 నుండి ఈ ఏడాది వరకు ఇంత తక్కువ నీటిమట్టం ఏనాడూ నమోదు కాలేదు. ఆంధ్ర-తెలంగాణ నాయకులు, అధికారులు జలాశయాలు ఖాళీ అయ్యేలా పోటీపడి నీటిని విడుదల చేయించారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా నీటి నిల్వ 312.0450 టీఎంసీలు ఉంది. సాగర్లో పూడిక చేరకముందు 408.24 టీఎంసీల నీటి నిల్వలు ఉండేవి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. నీటి నిల్వ 215.8 టీఎంసీలు. పూడిక నిండకముందు 308టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 2001 నుండి 2005 వరకు అయిదేళ్లలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు జలాశయాల నీటిమట్టాలు, సాగునీరు, రైతుల గురించి పట్టించుకోకపోగా వ్యవసాయం దండగ అంటూ కాలం గడిపారు. దీనికి తోడు సకాలంలో వర్షాలు కురవక వరదలు రాక జలాశయాలన్నీ అడుగంటిపోయాయి. కరవు కరాళ నృత్యం చేసింది. సాగర్ జలాశయం కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా వరుసగా 2003, 2004 లలో 500 అడుగులకంటే దిగువకు వెళ్లింది. అనంతరం రాజశేఖర్రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుకుని క్రస్ట్ గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలయ్యింది. పదేళ్లు కరవు ఛాయలు కనపడలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం ఇదేనెలలో సాగర్ జలాశయం నీటిమట్టం 517.90 అడుగులున్నది. 2015 లో 514.10 ఉండగా 2016 లో 506.20 అడుగులకు కనీస నీటిమట్టం కన్నా దిగువకు తగ్గింది. వరదలు వచ్చినప్పటికీ నాగార్జునసాగర్ జలాశయం వరకు నీటి రాక ప్రారంభం కాగానే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తర్వాత వర్షాలు ముఖం చాటుచేశాయి. అయినప్పటికీ సాగునీటి శాఖ అధికారులు నీటిìని వృధా చేయకుండా ప్రతి నీటిబొట్టుకు లెక్కలు గట్టి కాల్వల్లో నీటిని పారించి అత్యధికంగా పంటలు పండేందుకు కృషిచేసినట్లు ఆయకట్టు ప్రాంత రెతులు తెలిపారు. ఈ ఏడాది రైతులకు తిరిగి చంద్రబాబుకాలం నాటి పరిస్థితులు జ్ఞప్తికి వస్తున్నాయి. శ్రీశైలం నుండి నీరు వస్తేనే.. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయంలోకి నీరు విడుదలైతేనే తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు సరఫరా కానుంది. ఇప్పటికే కష్ణా నది యాజమాన్యం బోర్డుకు నీటి విడుదల కోసం లేఖ రాసినట్లు సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునిల్ తెలిపారు. త్వరలో శ్రీశైలం నుండి నీటిని విడుదల చేయాలని నల్లగొండ ప్రజలతో పాటు హైద్రాబాద్ ప్రజలు కోరుతున్నారు. -
కృష్ణా కష్టమే.. గోదావరే గతి!
అడుగంటిన కృష్ణా జలాలు సింగూరు, గోదావరి జలాలపైనే భారమంతా... సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు కనిష్టానికి పడిపోవడంతో హైదరాబాద్ జంట నగరాలకు వచ్చే రెండు, మూడు నెలలు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతోంది. రెండు ప్రాజెక్టుల్లో కలిపి మరో 3.8 టీఎంసీల నీటి లభ్యతే ఉండటం, దానినే ఇరు రాష్ట్రాలూ పంచుకోవాల్సి రావడం పాలనా యంత్రాంగాన్ని కలవరానికి గురిచేస్తుంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇక గోదావరి జలాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలింది మూడే... హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 360 ఎంజీడీల మేర నీటి అవసరాలు ఉండగా ప్రస్తుతం కృష్ణా జలాల నుంచే 270 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో సాగర్ జలాలే ఎక్కువగా జంట నగరాల తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ప్రస్తుతం సాగర్లో నీటి మట్టాలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయాయి. ఎగువన ఉన్న శ్రీశైలంలో సైతం అదే పరిస్థితి నెలకొంది. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులకుగానూ ప్రస్తుతం 504.4 అడుగులకు చేరగా నీటి నిల్వ 122.36 టీఎంసీలకు చేరింది. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టానికిగానూ 785.2 అడుగుల్లో 22.38 టీఎంసీల నీటి లభ్యత ఉంది. సాగర్లో 502 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల్లో వినియోగార్హమైన నీటి లభ్యత 8 టీఎంసీలు ఉండగా దాన్ని ఇటీవలే బోర్డు ఇరు రాష్ట్రాలకూ పంచింది. తెలంగాణకు 1.5 టీఎంసీలు, ఏపీకి 6.5 టీఎంసీలు దక్కాయి. సాగర్లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల వరకు నీటిని తీసుకునే అవకాశం ఉంది. ఆ స్థాయి మట్టాల్లో లభ్యతగా ఉన్నది కేవలం 3.8 టీఎంసీలే. ఇందులో ఆవిరి, సరఫరా నష్టాలు 0.8 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసినా గరిష్టంగా లభ్యమయ్యేవి 3 టీఎంసీలే. ఆ నీటినే ఇరు రాష్ట్రాలు జూన్, జూలై, ఆగస్టు వరకు వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే కృష్ణా జలాల్లో 8 టీఎంసీల మేర తెలంగాణ ఎక్కువగా వాడిందని ఏపీ అంటుండగా బోర్డు దానికి వత్తాసు పలుకుతోంది. దీన్నే బోర్డు పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు చుక్క నీరు దక్కదు. జంట నగరాలకు జూన్, జూలైలలో నీటి అవసరాలు కనిష్టంగా 4 టీఎంసీల వరకు ఉంటాయి. లభ్యతగా ఉండే 3 టీఎంసీల్లో బోర్డు కనికరించి రెండు రాష్ట్రాలకు చెరిసగం నీటిని పంచినా రాష్ట్రానికి తాగునీటి కటకట తప్పదు. అదే జరిగితే రాష్ట్రం పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది. గోదావరిపైనే ఆశలన్నీ.. హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణా జలాలు అందించడం క్లిష్టమైతే రాష్ట్రం ఇక గోదావరి ప్రాజెక్టులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎల్లంపల్లిలో ఆశించిన స్థాయిలో నీరుండటం కొంత ఊరటనిస్తోంది. ఎల్లంపల్లి సామర్ధ్యం 20.17 టీఎంసీలుకాగా ప్రస్తుతం 10.64 టీఎంసీల నిల్వలున్నాయి. దీంతోపాటే సింగూరులో మరో 18.24 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ నీటితో జంట నగరాల ప్రజల దాహార్తి తీర్చే అవకాశముందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. -
శ్రీశైలంలో 26 టీఎంసీల నీటి నిల్వలు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయంలో శనివారం సాయంతానికి 26.2222 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. దిగువ నాగార్జునసాగర్కు రోజుకు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తుండడంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 794.10 అడుగులుగా నమోదైంది. తెరచి ఉంచిన రెండు రివర్ స్లూయిస్గేట్లలో ఒక్క గేటు ఎత్తును 8 అడుగులకు కుదించి రెండు గేట్ల ద్వారా 14,503 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 320 క్యూసెక్కులను వినియోగించుకుని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో స్వల్పంగా 0.135 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. -
కనీస నీటి మట్టానికి చట్టబద్ధత కల్పించాలి
కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చట్ట బద్ధత కల్పించాలని రాయ సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. శ్రీశైలంలో 874 అడుగుల నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకున్న ఘనత టీడీపీదేనని ప్రకటించడం దారుణమన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 875 అడుగలకుపైన ఉన్న సమయంలో మాత్రమే దిగువన ఉన్న సాగర్కు నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని పేర్కొన్నారు. -
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 880.60 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 880.60 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వస్తున్న 8వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నుంచి 32,041 వేల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు విడుదలవుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో నాలుగు జనరేటర్లతో ఉత్పత్తి చేస్తూ 23,341 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 6వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,700 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 191.2118 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
జలకళతో ఉట్టిపడుతోన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
-
పోతిరెడ్డిపాడు వద్ద 880.80 అడుగుల నీటిమట్టం
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద మంగళవారం సాయంత్రం 7గంటల సమయంలో 880.80 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు. శ్రీశైలం జలాశయంలోకి 1,20,300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 881.80అడుగుల నీటిమట్టం వద్ద 197.20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గేజింగ్ అధికారులు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 1500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ వద్ద ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ ఎస్కేప్ కాల్వకు 500 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. హంద్రీనీవాసుజలస్రవంతి కాల్వకు 2,025 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం 73,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. -
శ్రీశైలానికి పెరిగిన వరద
· మరో మూడు రోజుల్లో డ్యాం నిండే అవకాశం · ఎగువ ప్రాంతాల నుంచి 17 టీఎంసీల నీరు విడుదల శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 1,95,568 క్యూసెక్కుల నీరు విడుదలైంది. సోమవారం సాయంత్రానికి 17 టీఎంసీల నీరు శ్రీశైలాన్ని చేరుకోనుంది. ఇప్పటికే డ్యాం నీటిమట్టం 879.50 అడుగులకు చేరుకుంది. సోమవారానికి డ్యాంలో గరిష్టస్థాయి నీటినిల్వలు 200 టీఎంసీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం జలాశయంలో 215.65 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. మరో 30 టీఎంసీలు వచ్చి చేరితే పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. వస్తున్న ఇన్ఫ్లోను దృష్టిలో ఉంచుకుని మరో మూడు రోజుల్లో డ్యాం గేట్లను తెరచి దిగువ నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ ఇంజనీర్లు సన్నద్ధమవుతున్నారు. శ్రీశైలానికి ఇన్ఫ్లో పెరుగుతుండడంతో రెండు పవర్హౌస్లో విద్యుత్ ఉత్పాదనను పూర్తిస్థాయిలో చేపడుతున్నారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఏడు జనరేటర్లు, భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఐదు జనరేటర్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,541 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 500 క్యూసెక్కులు, హంద్రీనివా సుజల స్రవంతికి 1680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 10.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పూర్తిగా నిండిన హుస్సేన్సాగర్ జలాశయం
హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి జలాశయం నీటి మట్టం 513.88 అడుగులకు చేరుకుంది. కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు.. దీంతో అధికారులు 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది. -
'లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
హైదరాబాద్: నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆయన నగరవాసులకు సూచించారు. నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షంతో హుస్సేన్సాగర్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. సాగర్లో ఇన్ఫ్లో 5 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2500 క్యూసెక్కులు నీరు ఉంది. -
శ్రీశైలం జలాశయంలోకి 1.5 టీఎంసీల నీరు చేరిక
-
శ్రీశైలం జలాశయంలోకి 1.5 టీఎంసీల నీరు చేరిక
శ్రీశైలం ప్రాజెక్టు: కష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం సాయంత్రం వరకు జలాశయంలోకి 1.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 159.0010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రోజా నుంచి వచ్చే వరద జలాలు నిలిచిపోగా, జూరాల నుంచి 16వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదలవుతుంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 874 అడుగులకు చేరుకుంది. -
శ్రీశైలం డ్యామ్కు వరద నీరు
873. 70 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం శ్రీశైలం ప్రాజెక్టు: ఇటీవల కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం సమయానికి ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల, రోజాల నుంచి 29,437 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనివ్వా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ పరిసర ప్రాంతాలలో 9.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రానికి డ్యామ్లో నీటి మట్టం 873.70 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 157.5068 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
871.4 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 871.4 అడుగులుగా నమోదైంది. జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో లేదు. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 13,588 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. తెలంగాణా ప్రాంతంలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్కు 7,063 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనివాసుజల స్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 4,500 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 147.6340 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. -
పీఏబీఆర్ కు జలసిరి
– జీడిపల్లి రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కులు – హెచ్చెల్సీ నుంచి 450 క్యూసెక్కెల నీరు డ్యాంకు సరఫరా కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటి మట్టం పెరుగుతోంది. డ్యాంలోకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు సుమారు 1000 క్యూసెక్కులకు పైగానే నీరు సరఫరా అవుతోంది. అలాగే తుంగభ్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా రోజుకు సుమారు 450 క్యూసెక్కుల వరకు సరఫరా అవుతోంది. ఆదివారం డ్యాంలో 2.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. ఏపీ జెన్కో జల విద్యుత్ తయారికి రోజుకు సుమారు 800 క్యూసెక్కుల వరకు నీటిని డ్యాం నుంచి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి అనంతం ఆ నీరు మిడ్పెన్నార్డ్యాంలోకి వదలడం జరుగుతుందని డీఈ పేర్కొన్నారు. -
స్వల్పంగా పెరిగిన శ్రీశైలం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. శుక్రవారం 872.40 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 872.60 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం నుంచి జూరాల నుంచి శ్రీశైలానికి విడుదలయ్యే నీరు నిలిచిపోయింది. రెండు జలవిద్యుత్ కేంద్రాలలో ఎటువంటి ఉత్పాదన జరగలేదు. జలాశయంలోని బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 4,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 152.8314 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. -
640 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్ నీటిమట్టం 640 అడుగులకు చేరుకుంది. నాలుగు రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో ప్రారంభమైంది. దీంతో ప్రాజెక్ట్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్ట్లో గరిష్ట నీటి మట్టం 645 అడుగులు ఉండగా శనివారం సాయంత్రానికి 640 అడుగులకు చేరుకుంది. ఎగువన కురుస్తన్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో తగ్గిపోయంది. ఎగువ నుంచి కేవలం 1,400 క్యూసెక్ల వరద నీరు రిజర్వాయర్లో చేరుతుందని ప్రాజెక్టు ఇంజినీర్ ఎన్.రమేష్ తెలిపారు. రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు. -
గుంతలు.. గతుకులే
సాక్షి, హైదరాబాద్: నీటమునిగిన బస్తీలు.. బురదమయంగా కాలనీలు.. గతుకులు పడి రాళ్లు తేలిన రహదారులు.. దెబ్బతిన్న మ్యాన్హోళ్లు.. బుధవారం నాటి కుంభవృష్టి నుంచి నగరం ఇంకా తేరుకోలేదని చెప్పడానికి సాక్ష్యాలివన్నీ. గురువారం సైతం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో బుధవారం నాటి పరిస్థితే కనిపించింది. దీంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, మ్యాన్హోళ్లు దెబ్బతిన్నాయి. బీటీ రహదారులు బాగా దెబ్బతినగా.. ఇటీవలే వేసిన తారు రోడ్లు సైతం వర్షం దెబ్బకు నామరూపాలు లేకుండాపోయాయి. అసలే అధ్వానంగా ఉన్న రహదారులు కాస్తా.. వర్షానికి దారుణంగా దెబ్బతినడంతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. నగరంలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల నష్టం దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇళ్లలోకి నీరుచేరి బియ్యం, ఆహార పదార్థాలు తడిసిపోయి పనికిరాకుండా పోయాయి. కొన్ని ఇళ్లల్లో ఇప్పటికీ నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరం.. * మూసీ పరీవాహక ప్రాంతంలోని సంజయ్నగర్లో ఆరు ఇళ్లు నేలమట్టం కావడంతో అందరూ రోడ్డునపడ్డారు. * నల్లకుంట సత్యానగర్ బస్తీలో ఇళ్లలోకి నీరుచేరి నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. రెండు రోజులుగా తాగు నీరందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. * లోతట్టు ప్రాంతమైన బతుకమ్మ కుంట, గోల్నాక, ప్రేమనగర్తో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల దుకాణాల్లోకి నీరు చేరింది. * కంటోన్మెంట్ ఐదో వార్డు ఏఓసీ గేటు మహేంద్రహిల్స్ చెక్ పోస్టు సమీపంలోని ప్రధాన రోడ్డు, జూబ్లీ బస్టాండ్ సమీపంలో రోడ్డు కోతకు గురైంది. పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. * బండ్లగూడ ప్రధాన రహదారిపై నిర్మాణంలో ని కల్వర్ట్ వద్ద వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. పల్లె చెరువు నుంచి వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే దీనికి కారణం. వరద తాకిడికి రోడ్డు గోతులమయమైంది. * కేపీహెచ్బీ కాలనీలోని రోడ్లు గుంతలమయమయ్యాయి. మోకాలు లోతు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. * గండిపేట కట్ట రెండు రోజులుగా చీకట్లో మగ్గుతోంది. దానిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ బుధవారం వర్షానికి కాలిపోవటంతో చెరువు కట్ట, లేక్ పోలీస్స్టేషన్ అంధకారంలో మునిగాయి. తగ్గని హుస్సేన్ సాగర్ ఉధృతి హుస్సేన్సాగర్లో నీటిమట్టం తగ్గకపోవడంతో తూము ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతూనే ఉన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. గురువారం 513.42 మీటర్ల మేర నీరు ఉంది. దీంతో 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ లేక్స్ డివిజన్ ఎస్ఈ శేఖర్రెడ్డి తెలిపారు. -
పెరుగుతున్న పాలేరు నీటిమట్టం
జిల్లాలో 32 వేల ఎకరాలకే సాగునీటి అవకాశం కూసుమంచి: సాగర్ నుంచి మెుదటి జోన్కు నీటిని విడుదల చేయగా ఆ నీరు పాలేరు రిజర్వాయర్కు చేరుతుండటంతో రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆదివారానికి నీటి మట్టం 10 అడుగులకు చేరింది. రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. రోజుకు రెండు క్యూసెక్కుల నీరు చొప్పున పది రోజుల పాటు సాగర్ నీరు రిజర్వాయర్కు చేరుతుంది. మెుత్తం జిల్లాలో 32 వేల ఎకరాలకే సాగర్ నీరు పంటలకు అందే అవకాశం ఉంది. కాగా కూసుమంచి మండలంలోని భగవత్వీడు, నాయకన్గూడెం, ఈశ్వరమాధారం, రాజుపేట పంచాయతీల్లో మేజర్లు, మైనర్ల ద్వారా సుమారు 12 వేల ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందనుంది. అలాగే పాలేరు చిన్న కాలువ కూడా మెుదటి జోన్లోకే వస్తుండటంతో ఈ కాలువ పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన 20 వేల ఎకరాలకు కూడా త్వరలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే పాలేరు అవుట్ఫాల్ నుంచి రెండో జోన్ మెుదలవుతున్నందున ఈ జోన్కు సాగు నీటిని విడుదల చేయాలంటే సాగర్ నిండాల్సిందేనని అధికారులు చెపుతున్నారు. పాలేరు నీరు తాగునీటికే.... పాలేరును పూర్థి స్థాయిలో నింపే క్రమంలోనే రెండో జోన్ ఆయకట్టు పరిధిలో తాగునీటì ని విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఖమ్మం నగరానికి నీటిని విడుదల చేస్తారు. రెండో జోన్కు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్న క్రమంలో సాగుకు ఆ నీటిని వినియోగించకుండా తగు చర్యలను ఎన్నెస్పీ అధికారులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
శ్రీశైలం డ్యాం నీటి మట్టం 872.40 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం నీటిమట్టం సోమవారం సాయంత్రం సమయానికి 872.40 అడుగులకు చేరుకుంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో పెరిగింది. శ్రీశైలానికి 16వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 26,406 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 19,881 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 4,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 151.8195 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 873.20 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం నీటిమట్టం రోజు రోజుకు తగ్గుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాల్సి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వచ్చే ఇన్ఫ్లో కూడా తగ్గడంతో డ్యాంలో నీటినిల్వ తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 157.5068 టీఎంసీల నీరు నిల్వఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 16వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్కు 25,537 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 14,200 క్యూసెక్కులు హంద్రీనీవా సుజల స్రవంతికి 2,025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటిమట్టం 873.20 అడుగులకు చేరుకుంది. -
మేల్కోకపోతే ముప్పే
→ సీబీఆర్లో డెడ్స్టోరేజీకి పడిపోయిన నీటిమట్టం → మూడు మున్సిపాలిటీలు.. వేలాది గ్రామాలకు తాగునీటి కష్టాలు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్)... ధర్మవరం, కదిరి, పులివెందుల మున్సిపాలిటీలతోపాటు సత్యసాయివాటర్ సప్లైపాజెక్ట్, వైఎస్సార్ కడప జిల్లాలోని యురేనియం ప్రాజెక్ట్కు నీరందించే ప్రధాన రిజర్వాయర్. కానీ ఈ రిజర్వాయర్లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతూ డెడ్స్టోరేజీకి చేరుతోంది. ఇదిలాగే కొనసాగితే మూడు మున్సిపాలిటీలు..వేలాది గ్రామాల వారు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. «ధర్మవరం/ తాడిమర్రి : ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి మండల సరిహద్దు, వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లి సమీపంలో చిత్రావతి నదిపై 1993లో సీబీఆర్ను నిర్మించారు. ఇటు అనంతపురం, అటు వైఎస్సార్ జిల్లాలకు తాగునీరు, సాగునీరు సౌకర్యాల కోసం 10 టీఎంసీల సామర్థ్యంతో ఈ డ్యాంను నిర్మించారు. అయితే పనులు నాసిరకంగా ఉండడంతో క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనులను నిలుపుదల చేశారు. 1999లో అప్పటి వరకు చేసిన పనులను తొలగించి తిరిగి మొదటి నుంచీ పనులను చేయడానికి రూ. 93.87 కోట్లు వ్యయాన్ని విడుదల చేశారు. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే అదనంగా రూ.50 కోట్లు విడుదల చేయించి 2006లో నిర్మాణం పూర్తి చేయించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం గొడ్డుమర్రి సమీపంలో 6 టీఎంసీల లక్ష్యంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అక్కడ నుంచి యల్లనూరు మండలం, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, పులివెందుల, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లోని 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఆర్లో ఆర్డబ్ల్యూఎస్, శానిటేషన్ శాఖలు సంయుక్తంగా పులివెందుల, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలతో పాటు ఆ నియోజకవర్గాల్లోని గ్రామాలకు తాగునీటిని సరఫరా కోసం పంపు హౌస్లను ఏర్పాటు చేశారు. వాటితోపాటు వైఎస్సార్ జిల్లా తుమ్మల దగ్గర ఏర్పాటు చేసిన యురేనియం ఫ్యాక్టరీకి నీటిని అందించడానికి మరో పంపును ఏర్పాటు చేశారు. వర్షాలు లేక.. సీబీఆర్లోకి నీరు చేరక : కొంతకాలంగా వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో సీబీఆర్లోకి నీరు చేరకపోవడంతో ఉన్న నీరు అడుగంటిపోతోంది. నెల రోజుల క్రితం 284.81 మీటర్ల మేర 0.87 టీఎంసీలు ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 284.31 మీటర్లమేర 0.711 టీఎంసీలకు పడిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. ఫలితంగా సాగు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రంగుమారిన నీరు: ఇప్పటికే ధర్మవరం మున్సిపాలిటీలో మూడు రోజులకోసారి వదిలే తాగునీరు ఐదు రోజులకోసారి వదులుతున్నారు. పంప్హౌస్ల చుట్టూ చేరిన పూడికను జేసీబీలతో తొలగించి..నీటిని మోటార్ల వద్దకు పంపుతున్నారు. దీంతో నీరంతా రంగుమారి సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ అధికారులు పట్టణ ప్రజలకు మొదటి హెచ్చరికను చేరవేశారు. పాలకులు అధికారులు పట్టించుకుని చిత్రావతిలోకి నీరు వదలకపోతే లక్షలాది మంది ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోవాల్సి వస్తుంది. టీబీ డ్యామ్ నుంచి 5 టీఎంసీలు ఇవ్వాలి తుంగభద్ర ట్రిబ్యునల్ ప్రకారం టీబీ డ్యామ్లో 100 టీఎంసీలు ఉంటే 5 టీఎంసీలు విడుదల చేయాలి. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సక్రమంగా కురవక ఏటికేడు డ్యామ్లోకి నీరు చేరడం తగ్గుతోంది. దీంతో మనవాటా 2 టీఎంసీలకు కుదించారు. రెండేళ్లుగా కేవలం 1.5 టీఎంసీ నీరు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈఏడాది 3 టీఎంసీలను విడుదల చేయిస్తామని వైఎస్సార్ కడప జిల్లా ప్రజా ప్రతినిధులు అంటున్నారు. అలా జరిగితే తాగునీటికి ఇబ్బందులు ఉండక పోవచ్చు. – జయకుమార్, డీఈ సీబీఆర్, పార్నపల్లి -
స్వల్పంగా పెరిగిన శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం స్వల్పంగా పెరిగింది. సోమవారం సాయంత్రం సమయానికి 874.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 875.10 అడుగులకు చేరుకుంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 24వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 29,696 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన చేస్తూ 15,571 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 12,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 163.9724 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
కృష్ణమ్మ తుళ్లింత
మొగల్రాజపురం: ఎగువన పులిచింతల, నాగార్జునసాగర్ ల నుంచి నీటి రాక పెరగడంతో కృష్ణానది నిండుగా కళకళలాడుతోంది. ఎప్పుడెప్పుడు గేట్లు ఎత్తేస్తారా.. ఎంత త్వరగా పరుగులు తీద్దామా అన్నట్లుగా కృష్ణమ్మ బ్యారేజీ నుంచి తుళ్లిపడుతోంది. ప్రకాశం బ్యారేజ్ గేట్ల నుంచి నీరు ఎగసిపడుతూ అక్కడ ఉన్న టబ్లు (తొట్లు) నిండి అప్రాన్ వైపునకు పరవళ్ళు తొక్కాయి. అప్రాన్ మొత్తం నీటితో నిండింది. అప్రాన్పై ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్పోస్ట్లోకి కూడా నీరు రావడంతో నీటిలో ఉండే∙సిబ్బంది విధులు నిర్వహించారు. అప్రాన్పై ఏర్పాటు చేసిన అమరావతి ఫుడ్కోర్డు కుర్చీలు, సామాగ్రి నీటి తాకిడికి చెల్లాచెదురు అయ్యాయి. -
పెరుగుతున్న కృష్ణా జలాలు
సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం వద్ద కృష్ణా జలాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద జలాలు భారీగా వస్తున్నాయి. దీంతో సంగమేశ్వరం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. శనివారం వీఐపీలకు కేటాయించిన శిబిరం వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. అధికారులు హుటాహుటిన ఈ శిబిరాన్ని తొలగించారు. భక్తుల అటువైపు వెళ్లకుండా బ్యారికేట్లు ఏర్పాటు చేశారు. -
శ్రీశైలానికి భారీగా వరదనీరు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయానికి వస్తున్న ఇన్ఫ్లో రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం సమయానికి ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 1,79,482 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి విడుదలైంది. బుధవారం నాటికి డ్యాం నీటిమట్టం మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జలాశయంలో 117.4872 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 863.60 అడుగులకు చేరుకుంది. జలాశయం నుంచి కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం 12,944 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 4,250 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
సెంచరీ కొట్టిన శ్రీశైలం
కర్నూలు(సిటీ): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయమైన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 106 టీఎంసీలకు చేరుకుంది. గత నాలుగేళ్లతో పోలిస్తే ఆగస్టు మొదటి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. గత ఏడాది కృష్ణా, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువకపోవడంతో నదులు జల కళ తప్పాయి. ఫలితంగా శ్రీశైలం జలాశయంలో 82.19 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఈ ఏడాది కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వరం పరీవాహక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి.. నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండటంతో అక్కడి నుంచి వస్తున్న భారీ వరదతో సోమవారం తెల్లవారుజాము సమయానికి శ్రీశైలం డ్యాం నీటి మట్టం 106 టీఎంసీలకు చేరుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు: భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి 2,28,189 క్యూసెక్కుల వర దనీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 93.8 టీఎంసీల నీరు నిల్వగా ఉండగా, డ్యాం నీటిమట్టం 855.70 అడుగులకు చేరుకుంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి ఆదివారం 1,47,366 క్యూసెక్కుల వరదనీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 1,045 క్యూసెక్కులు, హంద్రీ నీవ్వా సుజల స్రవంతికి 1,014 క్యూసెక్కుల నీటిని రాయలసీమప్రాంత వాసుల అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. డిమాండ్ను అనుసరించి కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. సాయంత్రం 6గంటల సమయానికి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్తో ఉత్పత్తి చేస్తూ 6,357 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. -
నిర్మాణాలు సరే.. నీరొచ్చేనా?
ఘాట్లు ఉన్నా.. నీరు లేదాయె – కుడి కాలువకు నీటి విడుదల సరే, డెల్టాకు ఎప్పుడు? – చర్యలు తీసుకోకపోతే అవస్థలే.. అమరావతి (మాచర్ల ): పుష్కరాలను పురస్కరించుకుని పుష్కర ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో మంచినీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేశారు. పుష్కర ఘాట్ల నిర్మాణం జరుగుతున్న డెల్టా ప్రాంతంలో మాత్రం నీటి విడుదలకు సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఆదేశాల జారీ చేయలేదు. దీంతో పుష్కర ఘాట్లకు నీటì æవిడుదల ఎప్పుడని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. విజయపురి సౌత్లోని కృష్ణా పరీవాహక డెల్టా ప్రాంతం నుంచి అమరావతి, విజయవాడ వరకూ పలు పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నారు. కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేస్తారనే అంచనాలతోనే వీటి నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వంతో అధికారుల చర్చలు మరో 8 రోజుల్లో పుష్కరాలు ప్రారంభమయ్యే సమయంలో నీరు విడుదల చేయకపోవడం, డెల్టా ప్రాంతంలోని అన్ని పుష్కర ఘాట్లకు కృష్ణా పరీవాహక ప్రాంతంలో రెండు వైపులా నీరు అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణాడెల్టాకు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయకపోతే పుష్కర ఘాట్లకు సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెండు రోజులుగా అధికారులతో చర్చలు జరుపుతోంది. శ్రీశైలం రిజర్వాయర్కు నీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా డెల్టాకు సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు. అంతా అనుమానమే.. డెల్టా ద్వారా నీరు విడుదల చేయించేందుకు కృష్ణాబోర్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పుష్కరాలకు నీరు విడుదల చేయడం అనివార్యమని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 10వ తేదీలోపు సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదలచేసి పుష్కరఘాట్ల వద్ద నీరు నిల్వ ఉండేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పుష్కరాలలోపు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని పుష్కర ఘాట్లకు నీటిని విడుదల చేస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే. -
త్వరలో మిషన్ కాకతీయ ఫలాలు
బాల్కొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు త్వరలోనే రైతులకు అందుతాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యసాగర్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించారు. అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం నీటి మట్టం, ప్రాజెక్ట్ ఆయకట్టు వివరాలను తెలుసుకున్నారు. రెండేళ్లపాటు సరైన వర్షాలు కురియకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీయడం వల్ల వాటి నీటినిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందాలని ఆకాంక్షించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను ప్రజలు కాపాడుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ నాయకుడు చింత వెంకటేశ్వర్లు ఉన్నారు. -
ఖుషీఖుషీగా
మండలంలోని పాకాలలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాకాల సరస్సు నీటిమట్టం 19.6 ఫీట్లకు చేరుకుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చి పాకాల అందాలను వీక్షించారు. నర్సంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఖానాపురం ఎస్సై దుడ్డెల గురుస్వామి కుటుంబ సమేతంగా సరస్సును సందర్శించారు. అనంతరం కాసేపు బోటింగ్ షికారుచేసి ఆనందంగా గడిపారు. – ఖానాపురం -
29 అడుగులు దాటిన లక్నవరం నీటిమట్టం
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు నీటిమట్టం 29 అడుగులు దాటింది. ఆదివారం మధ్యాహ్నం సరస్సులో 29 అడుగుల 3 అంగుళాల నీరుంది. ఈ మేరకు సరస్సు ప్రధాన కాల్వల్లోని నర్సింహుల, రంగాపురం కాల్వల కోసం నీటిని సద్దిమడుగులోకి వదిలారు. తర్వాత అక్కడి నుంచి కాల్వలకు నీటిని వదిలారు. ఇదిలా ఉండగా, సరస్సు తూముల వద్ద 24 అడుగుల ఎత్తులో రాళ్ల మధ్య నుంచి నీరు ఎక్కువగా లీకవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నీటిని విడుదల చేయాల్సిన సమయంలో కూడా నీటిపారుదల శాఖ అధికారులు రాకుండా స్థానిక గ్యాంగ్మెన్లతోనే పనులు చేయించడం గమనార్హం. పదివేల ఎకరాలకు సాగునీరందిస్తూ, పర్యాటక ప్రాంతంగా ప్రభు త్వానికి ఆదాయం సమకూరుస్తున్న సరస్సుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. -
పెరిగిన గోదారి నీటి మట్టం
-
భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మంగళవారం సాయంత్రం నీటిమట్టం 52.4 అడుగులకు చేరిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి నీటి మట్టం తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. -
పెరుగుతూ.. తగ్గుతూ
♦ భద్రాచలంలో 52 అడుగుల వద్ద నిలకడగా నీటిమట్టం ♦ వరద నీటితో గ్రామాలకు నిలిచిన రాకపోకలు ♦ అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ♦ విలీన మండలాలకు బస్సులు నిలిపివేత ♦ వరదపై అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల సాక్షి ప్రతినిధి, ఖమ్మం/భద్రాచలం : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు పోటెత్తుతుండటంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా వరద ప్రవాహం ఇదే రీతిన ఉండగా.. భద్రాచలం వద్ద మంగళవారం 52.4 అడుగుల నీటిమట్టం నమోదైంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవాహం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరదల వల్ల గోదావరి పరీవాహక మండలాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలపై.. కల్యాణ కట్టకు ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుండటంతో పుష్కరాల సమయంలో చేపట్టిన తాత్కాలిక షెడ్లు, విద్యుత్ స్తంభాలు నీటమునిగాయి. వరద ఉధృతి తగ్గకపోవటంతో పరీవాహక మండలాల్లోని పలుచోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిల్వ ఉంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కరకట్ట స్లూయిస్ల లీకేజీల వల్ల వరద నీరు భద్రాచలంలోకి వస్తుండటంతో అశోక్నగర్ కొత్తకాలనీ వరదలో చిక్కుకుంది. ఇక్కడున్న ఇరవై ఇళ్ల వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. రాకపోకలకు ఇబ్బందులు గోదావరి వరద ప్రభావం భద్రాచలం, పాల్వంచ డివిజన్లోని తొమ్మిది మండలాలపై చూపుతోంది. భద్రాచలం నుంచి ఇరువైపులా ఉన్న రహదారులపై వరద నీరు చేరుతోంది. వాజేడు మండలంలోని వాజేడు-గుమ్మడిదొడ్డి రహదారి ఇంకా వరద నీటిలోనే ఉంది. దీంతో ఇక్కడికొచ్చే ప్రజానీకం జగన్నాధపురం మీదుగా ఆరు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. చెరుకూరు, కృష్ణాపురం, కడేకల్, పూసూరు, దూలాపురం వద్ద గోదావరి నీరు రోడ్లపైకి ఎక్కింది. వెంకటాపురం మండలంలోని ఎధిర, బోదాపురం, కుక్కెతొర్రె వద్ద రోడ్లపైకి వచ్చిన వరద నీరు రెండు రోజులుగా అలాగే ఉండటంతో అత్యవసర పనుల నిమిత్తం ప్రజలు అదే నీటిలో ప్ర యాణం సాగిస్తున్నారు. దుమ్ముగూడెం బ్రాంచ్ ఆనకట్ట వద్ద వరద నీరు పొంగి పొర్లుతోంది. పర్ణశాలలో సీతవాగు రెండో రోజు నీటిలో మునిగి ఉంది. దుకాణాలు కూడా నీట మునగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సున్నంబట్టి, ప్రగళ్లపల్లి గ్రామా ల మధ్య వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు కాశీనగరం మీదుగా మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిలో దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, రేగుబల్లి, నడికుడి రోడ్లపై గోదావరి వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పర్ణశాలకు వెళ్లే మార్గంలోనూ నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పర్ణశాల దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇక్కడి వరద పరిస్థితిని చూసి వెనుదిరుగుతున్నారు. విలీన మండలాలకు బస్సులు బంద్ వరదలతో ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భద్రాచలం డిపో నుంచి ఏపీలో విలీనమైన మండలాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు. భద్రాచలం నుంచి కూనవరం రహదారిలో రాయన్పేట, నెల్లిపాక, గౌరీదేవిపేట, మురుమూరు, పోలిపాకల వద్ద ఆర్అండ్బీ రహదారిపై మూడు అడుగులకు పైగా వరద నీరు చేరటంతో ఎటువంటి వాహనాలు తిరగలేదు. విలీన మండలాలైన కూనవరం, వీఆర్పురం మండలాలకు వెళ్లే వారు ఎటపాక, లక్ష్మీపురం, ఏడుగురాళ్లపల్లి మీదుగా కూటూరు నుంచి ఆయా మండలాలకు చేరుకున్నారు. భద్రాచలం నుంచి వెంకటాపురం రూట్లో 13 సర్వీసులు, విలీన మండలాలకు వెళ్లే 4 సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. దీంతో భద్రాచలం డిపోకు రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్లు డీఎం నర్సింహ తెలిపారు. మంత్రి తుమ్మల పర్యటన గోదావరికి వరద పెరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం భద్రాచలంలో పర్యటించారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. కరకట్ట స్లూయిస్లను పరిశీలించి.. వరద పరిస్థితిపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. రెండు రోజులుగా వరద ఒకే రీతిన ఉన్నందున పరీవాహక మండలాల ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతుకు సూచించారు. -
రైతుల ముఖాల్లో ఆనందం నింపిన గోదారి
-
ఉగ్ర గోదారి...!
♦ 50 అడుగుల వద్ద నిలకడగా నీటిమట్టం ♦ పరీవాహక మండలాల్లో హైఅలర్ట్ ♦ పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ ♦ కరకట్ట స్లూరుుస్లలోకి వరద నీరు ఒక్కసారిగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ఆదివారం రాత్రి 7గంటలకు 23.3 అడుగులు నమోదు కాగా సోమవారం ఉదయం ఐదు గంటలకే 42 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి 51 అడుగులకు చేరింది. ఆపై గోదారమ్మ శాంతించింది. దీంతో 50 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే గోదావరికి వరద ప్రవాహం పోటెత్తటంతో పరీవాహక ప్రాంత మండలాల ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీరంతా నదిలోకి చేరుతుండటంతో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 5 గంటలకు 51 అడుగుల నీటిమట్టం నమోదైంది. 6 గంటల నుంచి 50 అడుగులతో నిలకడగా ప్రవహిస్తోంది. 48 అడుగుల తర్వాత అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులకు చేరువలో ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి 7 గంటలకు 23.3 అడుగులున్న నీటిమట్టం ఆ తరువాత గంటగంటకూ పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలోనే గోదావరి వరద పోటెత్తడంతో పరీవాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. వాగుల ఎగపోటుతో పొలాల్లోకి నీరు చేరింది. ముంచెత్తిన వరద.. భద్రాచలం డివిజన్లోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలతో పాటు పాల్వంచ డివిజన్లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో వేలాది ఎకరాలు నీటమునిగాయి. పత్తి విత్తనాలు కుళ్లిపోయే అవకాశం ఉంది. జామాయిల్ తోటలు జలమయం అయ్యాయి. భద్రాచలం నుంచి వాజేడు వరకు పలు రహదారులపైకి వరద నీరు చేరటంతో రాకపోకలు స్తంభించాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని సీతమ్మ నారచీరలు, సీతవాగు పోటెత్తడంతో రామాయణ సుందర దృశ్యాలు, దుకాణాలు కూడా జలమయమయ్యాయి. పర్ణశాల వెళ్లే రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలు స్తంభించి భక్తులు వెనుదిరిగి వెళ్లారు. స్తంభాలు నీటమునగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దిగువన ఉన్న శబరి నదికి వరదలేకపోవడం, ఈ ప్రాంతంలో వర్షాలు లేకపోవడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. రాకపోకలు బంద్ గోదావరి ప్రవాహంతో వాగులు ఎగపోటేస్తున్నాయి. పలుచోట్ల రహదారులపైకి నీరు చేరింది. వెంకటాపురం మండలంలోని బోదాపురం వాగు, పాలెం గ్రామ సమీపంలోని కుక్కెతొర్రె వాగులకు వద్ద గోదావరి వరదనీరు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలం వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య సుమారు కిలోమీటర్ మేర రహదారి ముంపునకు గురైంది. వాజేడు- ఎడ్జర్లపల్లి మధ్య ఉన్న బ్రిడ్జి నీట మునిగింది. వాజేడు- గుమ్మడిదొడ్డి మధ్య విద్యుత్ స్తంభాలు నీటమునిగాయి. చర్ల మండలం గుండుపేట, సున్నంబట్టి, బైరాగులపాడు మధ్య రాకపోకలు స్తంభించాయి. నీటమునిగిన స్నానఘట్టాలు భద్రాచలం వద్ద స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. కల్యాణ కట్టకు ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గోదావరి పుష్కరాల సమయంలో నిర్మించిన షెడ్లు నీట మునిగాయి. స్నానఘట్టాల రేవులో వేసిన విద్యుత్ స్తంభాలు కూడా మునగడంతో సరఫరా నిలిపివేశారు. స్నానఘట్టాలకు సమీపంలో వరద నీటిమట్టాన్ని తెలిపే సూచికలు సైతం నీట మునిగాయి. 48 అడుగుల వరకు మాత్రమే సూచికలు కనిపిస్తుండగా, ఆ తరువాత గోదావరి ఎంత పెరుగుతుందనేది చూసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. సూచికల ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే గోదావరి వరద ఎంత ఉందనేది ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని స్థానికులంటున్నారు. స్లూయిస్ల లీకేజీతో కొత్తకాలనీ ఇక్కట్లు కరకట్ట స్లూయిస్ల ద్వారా గోదావరిలో నుంచి వరద నీరు లీకవ్వటంతో భద్రాచలం కొత్తకాలనీలోని ఇళ్లను వరద చుట్టుముట్టింది. కొత్తకాలనీలోని 20 ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడ ఉన్న వారిని సమీపంలోని పాఠశాల భవనంలోకి తరలించి, పునరావాసాన్ని ఏర్పాటు చేశారు. స్నానఘట్టాల వద్ద ఉన్న స్లూయిస్ల మోటార్లను అమర్చి నీటిని గోదావరిలోకి పంపుతున్నారు. ఐటీడీఏ పీఓ రాజీవ్గాంధీ హన్మంతు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు మండలాల అధికారులతో సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
పోటెత్తిన గోదావరి
-
జలగండం!
♦ మెరుగుపడని భూగర్భజలాలు ♦ వర్షాకాలంలోనూ 1.02 మీటర్లు పతనం ♦ సగటున 16.72 మీటర్ల లోతులో జలాలు ♦ గతనెలలో సాధారణ వర్షపాతం నమోదు ♦ అయినా జిల్లాలో పెరగని నీటిమట్టాలు భూగర్భజలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తీవ్ర వర్షాభావం కారణంగా జలసిరి పూర్తిగా పాతాళంలోకి జారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు సైతం భూగర్భజల మట్టాలు మెరుగుపడలేదని గణాంకాలు చెబుతున్నాయి. వానాకాలంలో కురుస్తున్న వర్షాలు భూగర్భజలాలను సమతుల్యం చేస్తాయని భావించినప్పటికీ.. తాజాగా భూగర్భ జలవనరుల శాఖ వెల్లడించిన గణాంకాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో కంటే ప్రస్తుత నీటిమట్టాలు మరింత పతనం కావడం కలవరపరుస్తోంది. ఏకంగా 1.02 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పతనమై సగటు 16.72 మీటర్లలోతుకు పడిపోయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత సీజన్లో కురిసిన అడపాదడపా వర్షాలు భూగర్భ జలాల పెరుగుదలపై ప్రభావం చూపలేదు. గతనెలలో 10.39 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా.. ఏకంగా 13.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 3.3 సెంటీమీటర్ల వర్షం ఎక్కువగా కురిసింది. అయినా భూగర్భజలాలు మరింత పడిపోయాయి. జూన్ నెలలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువ వర్షాలు కురిశాయి. తూర్పు, ఉత్తర ప్రాంతంలో చిన్నపాటి వానలు కురవగా.. తాండూరు, వికారాబాద్, పరిగి డివిజన్లలోని కొన్ని మండలాల్లో కుండపోత వానలు పడ్డాయి. అయితే ఒక్కసారిగా కురిసిన వానలతో వరదలు పెరిగి చెరువులు, కుంటలు జలాలతో కళకళలాడుతున్నాయి. అయితే భూమిలోకి ఇంకిన నీటి శాతం పెద్దగా లేకపోవ డంతో భూగర్భజల మట్టాలు పైకిరాలేదు. మరోవైపు భూగర్భనీటి వినియోగం తగ్గకపోవడంతో అవి మరింత పతనమై 16.72 మీటర్ల లోతుకు చేరాయి. 30 మీటర్ల లోతులో.. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. జిల్లాలో నీటిప్రాజెక్టులు లేనందున వర్షాధార పంటలను నమ్ముకుని రైతులు సాగుపనులు చేస్తున్నాయి. అయితే జిల్లా అంతటా వర్షాలు లేకపోవడం రైతులను ఆందోళన కలిగించే విషయమే. పశ్చిమ ప్రాంతంలో గతనెలలో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూగర్భజలాలు మాత్రం మెరుగుపడలేదు. పరిగి, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, గండేడ్ మండలాల్లో 30 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ నీటిమట్టాలు నమోదైనట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా దోమ, వికారాబాద్, మర్పల్లి, పెద్దేముల్, యాచారం, మేడ్చల్, మహేశ్వరం, హయత్నగర్ మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భజలాలున్నాయి. మిగతా గ్రామీణ మండలాల్లో జిల్లా సగటు కంటే ఎక్కువలోతులోనే నీటిమట్టాలు నమోదు కావడం ఆందోళనకరం. -
బాబ్లీ తెరిచినా ఒరిగేది లేదు!
♦ బోసిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ♦ 18 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం ♦ 4.5 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం ♦ నేడు మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తివేత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) నీరు లేక వెల వెల బోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ‘శ్రీరామా కరుణించ వేమిరా’.. అంటూ వేడుకుంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి జూన్ మాసం దాటినా ఇప్పటి వరకు భారీ వరద నీరు వచ్చి చేరలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్లో నీరు లేక పోవడంతో ఆయకట్టు ప్రశ్నాకర్థంగా మారింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) అయితే ప్రస్తుత నీటి మట్టం 1046.60( 4.5 టీఎంసీలు) అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీకి దిగువ భాగాన ప్రాజెక్ట్ నీరు ఉంది. ప్రాజెక్ట్లోకి భారీ వరద నీరు వచ్చి చేరితే ఖరీఫ్ ఆశాజనకంగా ఉంటుందని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా గత రెండు సంవత్సరాలుగా ఎస్సారెస్పీలోకి వరదలు రాక ఏడాదంతా నీరు లేక బోసి పోయింది. జూన్ మాసం దాటినా ఇంత వరకు చుక్క వరద నీరు వచ్చి చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఇదే క్రమంలో శుక్రవారం ఉదయం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు తెరనుండగా.. దాంతోనూ ప్రయోజనం కనిపించడం లేదు. మహారాష్ట్ర నుంచే ప్రధాన వరదలు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ప్రధాన వరద నీరు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచే వచ్చి చేరుతుంది. కాని ప్రస్తుత సంవత్సరం ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్, విష్ణుపురి , గైక్వాడ్ ప్రాజెక్ట్లు డెడ్ స్టోరేజీలోనే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్లు నిండిన తరువాతనే ఎస్సారెస్పీలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కాని ఆ ప్రాజెక్ట్లే నీరు లేక వెలవెల బోతున్నాయి. అధిక వరద నీరు వచ్చి చేరే గోదావరి ప్రాంతం నీరు లేక బోసి పోతోంది. ఇంకా ప్రాజెక్ట్ ఎలా నిండుతుందని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగన మహా సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు సుప్రీం తీర్పు ప్రకారం జూలై 1న గేట్లు ఎత్తినా ఎస్సారెస్పీకి పెద్దగా వరద నీరు వచ్చి చేరే అవకాశం లేదు. బాబ్లీ ప్రాజెక్ట్ కూడ నీరు లేక వెల వెల బోతోంది. బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 2.4 టీఎంసీలు కాగా ప్రాజెక్ట్లో కేవలం 0.006 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్ట్లో ఉంది. మళ్లీ బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అక్టోబర్ 28న మూసి వేస్తారు. బాబ్లీ గేట్లు ఎత్తినా ఎస్సారెస్పీకి ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు అధికారులు. డెడ్స్టోరేజీకి దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.... ఎస్సారెస్పీ నీటి మట్టం డెడ్స్టోరేజీకి దిగువన ఉంది. 1987 తరువాత ప్రస్తుత సంవత్సరమే ఇంత కనీష్ట స్థాయికి ప్రాజెక్ట్ నీటి మట్టం పడిపోయిందని అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్ట్ డెడ్స్టోరేజీ 5 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో నిల్వ ఉంది 4.5 టీఎంసీల నీరు మాత్రమే! ప్రాజెక్ట్లోకి వరదలు వచ్చి చేరక పోతే సాగు నీరు అవసరాలు తీర్చడం దేవుడెరుగు.. కనీసం తాగు నీటి అవసరాలు కూడ తీరే పరిస్థితి కనిపించడం లేదు. మహారాష్ట్రలో నేడే బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తి వేత.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన ప్రాజెక్ట్కు 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను శుక్రవారం ఉదయం ఎత్తనున్నట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ సత్యనారియణ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ గేట్లను ఎత్తాలి. అక్టోబర్ 28న మూసి వేయాలి. దాంట్లో భాగంగానే బాబ్లీ గే ట్లను ఎత్తుతారు. గేట్ల ఎత్తివేత త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. తెలంగాణ తరుపున ప్రాజెక్ట్ ఎస్ఈ సత్యనారాయణ, మహారాష్ట్ర తరుపున నాందెడ్ ఈఈ లవరాలే, సీడ బ్ల్యూసీ తరుపున ఈఈ శ్రీనివాస్ పాల్గొంటున్నారన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం 2.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్లో 0.006 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తినా గోదావరి ప్రవహించే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీపై ఆధారపడిన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
పొంగుతున్న వాగులు, గ్రామాలకు స్తంభించిన రాకపోకలు నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 4 రోజు లుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులకు జలకళ వచ్చింది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా జోరువాన కురిసింది. జిల్లాలో పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు మూడు గేట్లు తెరిచి.. ప్రాజెక్టు నుంచి 21,550 క్యూసెక్కుల వ రద నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఇదే మండలంలోని పెదవాగు, గుబ్బలమంగమ్మ వాగు ఉధృతికి ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. ముల్కలపల్లి మం డలం పాములేరువాగు, సాటివాగు ఉధృతం గా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసానిలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 398 అడుగులకు ప్రాజెక్టు నీటిమట్టం చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 16.8 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇల్లెందు నుంచి గుండాల మధ్య వాగు వంతెన డైవర్షన్ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం, మణుగూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. ఓపెన్ కాస్ట్ల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి వర్షాలు సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంగళవారం సింగరేణి వ్యాప్తంగా ఓపెన్కాస్టుగనుల్లో 1,55,808 టన్నులకు.. 1,10,375 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఇక భూగర్భ గనుల్లో సైతం 43,615 టన్నులకు.. 27,310 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. బుధవారం కూడా భారీ వర్షం కురవడంతో మరో లక్ష టన్నులకుపైగా బొగ్గుఉత్పత్తికి అం తరాయం కలిగింది. వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. మేడారంలోని జంపన్నవాగు ఎగువ ప్రాంతాల్లో రెండు బ్రిడ్జిలకు ఆనుకుని వరదనీరు పరవళ్లు తొక్కింది. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. సింగరేణి సంస్థ మేడిపెల్లి ఓసీపీలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మహదేవపూర్ మండలంలోని పెద్దంపేట వాగులో ప్రవాహం పెరగడంతో వాగు అవతలివైపు ఉన్న గ్రామాలకు రవాణా స్తంభించింది. వర్షాలకు గోడ కూలి ఒకరు మృతి నల్లగొండ జిల్లాలో బుధవారం రోజంతా ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, వీధులు జలమయమయ్యూరుు. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నారుు. మూసీ నుంచి కాల్వల ద్వారా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షానికి గోడకూలి శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన పల్స పార్వతమ్మ(65) మృతిచెందింది. మూడు రోజులపాటు భారీ వర్షాలు ఖమ్మం జిల్లా ములకలపల్లిలో 16 సెం.మీ. వర్షపాతం సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు కొనసాగిన అల్పపీడనం బలహీనపడింది. ప్రస్తుతం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిషా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి గురువారం అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రభావంతో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, శుక్ర , శనివారాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు ఖమ్మం జిల్లా ములకలపల్లిలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బూర్గుంపాడులో 13, భద్రాచలంలో 11, పాల్వంచలో 10, కొత్తగూడెంలో 8, మణుగూరు, సిర్పూరుల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పినపాక, అశ్వాపురం, అశ్వారావుపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. బోథ్, కోయిదా, ఏటూరునాగారం, వెంకటాపురం, సత్తుపల్లి, ఆదిలాబాద్, జూలూరుపాడుల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్లో ఎడతెరిపి లేని వాన: హైదరాబాద్లో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగర రహదారులు జలమయమై పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం, సాయంత్రం రాకపోకలు నెమ్మదిగా సాగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 8.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. -
సోమశిలలో 24.488 టీఎంసీలు
సోమశిల : సోమశిల జలాశయంలో శనివారం నాటికి 24.488 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయంలో 89.904 మీటర్లు, 294.96 అడుగుల నీటి మట్టం ఉంది. సగటున 104 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథావుతోంది. కండలేరులో 26.398 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 26.398 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. లోలెవల్ స్లూయీస్కు 7 క్యూసెక్కులు, సాయిగంగ ద్వారా తిరుపతికి 50 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
పదేళ్ల కనిష్ట స్థాయికి నీటి నిల్వలు
న్యూఢిల్లీ: దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలలో నీటి నిల్వలు 22 శాతం మేరకు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఇదేసమయానికి 34 బిలియన్ క్యూబిక్ మీటర్లు ( బీఎంసీ) గా ఉన్న నీటి నిల్వలు ప్రస్తుతం 157 బీసీఎమ్ లుగా ఉన్నాయని, ప్రస్తుతం పదేళ్ల కనిష్ట స్థాయికి నీటి నిల్వల సామర్థం పడిపోయిందని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వల సామర్థ్యం బాగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్, త్రిపురలలో నీటి నిల్వలు కాస్త మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు సమానంగా నిల్వలున్నాయి. -
పాతాళగంగ
అడుగంటుతున్న భూగర్భ జలాలు పది మీటర్ల లోతుకు పడిపోయిన నీటిమట్టం 33 మండలాల్లో కరువు ఛాయలు గతేడాది కంటే ఎక్కువ లోతులో నీరు వేసవిలో తాగునీటికి తిప్పలే... హన్మకొండ : జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికే జిల్లా లో 33 మండలాల్లో ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. వేసవి ప్రారంభంలోనే నీటి కటకట తప్పేలా లేదు. అధికార యంత్రాం గం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే ఈ వేసవిలో జిల్లా వాసులకు తాగునీటి గండం తప్పేలా లేదు. ఈ ఏడాది జిల్లాలో సగటు వర్షపాతం 33 శాతం తక్కువగా నమోదైంది. వరుసగా రెండేళ్లు ఇదే పరిస్థితి నెలకొనడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వ తగ్గిపోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో బోరుబావులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా భూగర్భ జలవనరులు తగ్గుముఖం పట్టాయి. కరువు ప్రాంతం, అటవీప్రాంతం అనే తేడా లేకుండా జిల్లా అంతటా అడుగంటారుు. జిల్లాలో కరువు ప్రాంతంగా పేర్కొనే జనగామ సబ్ డివిజన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 33 మండలాల్లో నీటి కటకట.. భూగర్భ జలవనరుల శాఖ లెక్కల ప్రకారం భూ ఉపరితలం నుంచి ఎనిమిది మీటర్ల లోతుకు నీటిమట్టాలు పడిపోతే కరువు ఛాయలు అలుముకున్నట్లు పరిగణిస్తారు. జిల్లాలో 50 మండలాలు ఉండగా వీటిలో ఎనిమిది మీటర్లలోపు లోపు నీటిమట్టం ఉన్న మండలాలు 17 ఉన్నాయి. మిగిలిన 33 మండలాల్లో నీటిమట్టం ఎనిమిది అడుగుల కంటే కిందికే చేరుకుంది. భూగర్భ జలవనరుల విభాగం నివేదిక 2016 ఫిబ్రవరి ప్రకారం జిల్లా సగటు భూగర్భనీటి మట్టం 11.35 మీటర్లకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి జిల్లా సగటు భూగర్భ నీటిమట్టం 11.10 మీటర్లుగా నమోదైంది. అంటే గతేడాది కంటే ఎక్కువ లోతుకు నీటిమట్టాలు పడిపోయాయి. జనగామలో 17.81 మీటర్లకు.. జనగామ సబ్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం భూగర్భ నీటిమట్టం 17.81 మీటర్లకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి ఇక్కడ నీటిమట్టం 14.65 మీటర్లుగా నమోదైంది. డివిజన్లోని రఘునాథపల్లి మండలంలో భూగర్భ జలాలు 42.87 మీటర్ల లోతులోకి వెళ్లారుు. గతేడాది ఇదే సమయానికి ఈ మండలంలో 30.54 మీటర్ల లోతులో ఉండేవి. జిల్లాలోనే అత్యంత దారుణ పరిస్థితి నెలకొన్న ఈ మండలంలో భూగర్భ నీటిమట్టాలు పెంచేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. నర్సంపేట, మహబూబాబాద్లో మెరుగు.. నర్సంపేట, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలో గతేడాదితో పోల్చితే నీటి మట్టాలు పెరిగాయి. అంతేకాదు.. ఈ నీటి మట్టాలు జిల్లా సగటు కంటే పై స్థా యిలో ఉండటం ఇక్కడి ప్రజలకు ఊరట కలిగిస్తోంది. నర్సంపేటలో గతేడాది 7.34 మీటర్ల లోతులో నీరుండగా, ఈసారి ఒక మీటరు పైకి వచ్చి 6.26 మీటర్ల లోతులో అందుబాటులో ఉన్నారుు. మహబూబాబాద్ డివిజన్లో గతేడాది 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 6.77 మీటర్ల లోతులోనే నీరు లభిస్తోంది. జిల్లాలో అత్యంత ఎక్కువగా సంగెంలో 3.56, ఖానాపూర్ మండలంలో 3.68 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ములుగు రెవెన్యూ డివిజన్లో సైతం నీటిమట్టం పడిపోవడం ఈ ఏడాది కరువు పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ డివిజన్లో సగటున 12 అడుగుల లోతుకి నీటిమట్టం చేరుకుంది. తాగునీటి కోసం రాస్తారోకో నర్సంపేట : తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మండలంలోని ఇటుకాలపల్లి పంచాయుతీ పరిధిలోని ఆకులతండాలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. వుల్లంపల్లి-నర్సంపేట ప్రధాన రహదారిపై పలువురు మహిళలు, తండావాసులు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్య సవ్ముయ్యు మాట్లాడుతూ.. ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండావాసులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ముల్లైపెరియార్ 152 అడుగులు
సాక్షి, చెన్నై : కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యాంపై సర్వ హక్కుల్ని తమిళనాడు కల్గి ఉన్న విష యం తెలిసిందే. ఈ హక్కుల్ని కాలరాయడం లక్ష్యంగా కేరళ తరచూ ఏదో ఒక కుట్ర చేస్తూ వస్తున్నది. ఈ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం వాస్తవానికి 152 అడుగులు. 36 ఏళ్ల క్రితం ఈ డ్యాం నీటి మట్టం 142 అడుగులకు తదుపరి, కేరళ కుట్ర పుణ్యమా నీటి మట్టం 136 అడుగులకు తగ్గింది. ఏళ్ల తరబడి రాష్ట్రంలో ని పాలకులు నీటి మట్టం పెంపు లక్ష్యం గా న్యాయ స్థానంలో పోరాడుతూనే వ చ్చారు. ఎట్టకేలకు 2014లో సుప్రీం కో ర్టు తమిళనాడుకు అనుకూలంగా తీర్పు ను వెలువరించింది. ఆ డ్యాం నీటి మ ట్టం 142 అడుగులకు పెంచుకునేందుకు ఆదేశాలు ఇచ్చింది. అందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనూ కేరళ కుట్రలకు హద్దే లేదు. 152 అడుగులు : సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో, కేరళ కుట్రల్ని భగ్నం చేస్తూ నెలల తరబడి ఈ డ్యాం నీటి మట్టం పెంపు ప్రక్రియ సాగుతూ వచ్చింది. ఎట్టకేలకు 2014 నవంబర్ 14న డ్యాం నీటి మట్టం 142 అడుగులకు చేరడంతో ఆ డ్యాం నీటి ఆధారిత అన్నదాతల్లో ఆనందం తాండవం చేసింది. తమిళుల కల సాకారం కావడంతో, ఎక్కడ 152 అడుగులకు నీటి మట్టం పెంచాలన్న డిమాండ్ తెర మీదకు తెస్తారోనన్న బెంగతో మళ్లీ కుట్రల బాటలో కేరళ ప్రభుత్వం పయనించింది. అదే సమయంలో నీటి మట్టం 152 అడుగులకు చేరాల్సిందేనని ఆ డ్యాం నీటి ఆధారిత తేని, శివగంగై, రామనాథపురం, విరుదునగర్, మదురై జిల్లాల్లోని అన్నదాతలు నినాదాన్ని అందుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయింది. డ్యాం నీటి మట్టం పూర్తి స్థాయిలోకి చేర్చే దిశగా 152 అడుగుల నినాదంతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సైతం తీసుకొచ్చారు. అలాగే, కోర్టు ద్వారా ఓ వైపు నీటి మట్టం పెంపు ప్రయత్నాలు చేపడుతూనే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఇందుకు కేంద్ర నీటి పారుదల శాఖ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆ మేరకు కేంద్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కూడిన ఐదుగురి బృందం మంగళవారం ముల్లై పెరియార్ డ్యాం పరిసరాల్లో పరిశీలన చేపట్టింది. ప్రధాన డ్యాం గేట్లను, బేబి డ్యాం, ప్రధాన డ్యాంలోకి నీళ్లు వచ్చే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ప్రధానంగా డ్యాం సామర్థ్యం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఈ బృందం కేంద్ర నీటి పారుదల శాఖ కు నివేదికను సమర్పించనుంది. తదుపరి చర్యల మేరకు నీటి మట్టం పెంపునకు కసరత్తులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా, నీటి మట్టం పెంపు లక్ష్యంగా వచ్చిన ప్రతిపాదనలో భాగంగా తమ పరిశీలన సాగిందని, ఇది తొలి విడత పర్యటన అని, మరో మారు ఇక్కడ పరిశీలనకు అవకాశాలు ఉన్నట్టు ఆ బృందం వర్గాలు పేర్కొన్నాయి.