tourists
-
సోలో ట్రిప్కే అతివల ఆసక్తి
సాక్షి, అమరావతి: పర్యాటకుల అభిరుచి కొత్త పుంతలు తొక్కుతోంది. వర్తమాన జీవితంలో సంతోషానికే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం మహిళల సోలో ప్రయాణాలకు కేరాఫ్గా మారనుంది. దీనికితోడు వెల్నెస్ రిట్రీట్లు, పాప్ సంస్కృతి ప్రేరేపిత టూర్లపై ఆసక్తి కనిపిస్తోంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ట్రెండ్లలో ‘సోలోగా మహిళా ప్రయాణం’ ఒకటిగా నిలుస్తోంది. 2024లో సోలో వీసాలకు దరఖాస్తు చేసిన మహిళలు 30 శాతం ఉంటే.. ఈ ఏడాది 37 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తోంది. సుమారు 25–40 ఏళ్ల మధ్య మహిళలు సోలో ట్రిప్లను ఉద్యమంగా చేపట్టబోతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. బాలి, థాయ్లాండ్, జపాన్ వంటి గమ్యస్థానాలలో సాహస యాత్రల ద్వారా తమ అన్వేషణను చేపట్టాలని భావిస్తున్నట్టు తేలింది.పర్యాటక శక్తి కేంద్రంగా ఆసియాప్రపంచ ప్రయాణ రంగంలో ఆసియా ఆధిపత్యం కొనసాగుతోంది. థాయ్లాండ్, జపాన్, వియత్నాంతో పాటు ఇండోనేషియా 2025లో అత్యంత పర్యాటక రద్దీని ఎదుర్కోనుంది. వీసా రహిత విధానాలు, వివిధ ఎక్స్పోలు లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించనుంది. సింగపూర్కు చెందిన డిస్నీ క్రూయిజ్కు 27 శాతానికిపైగా డిమాండ్ పెరగనుంది. నోరూరించ రుచుల కోసంప్రయాణ ప్రణాళికలో ఆహారం ప్రధాన భాగంగా మారుతోంది. 2025లో వంటకాల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటలీ ట్రఫుల్ ఫెస్టివల్, థాయ్లాండ్ సాంగ్క్రాన్ ఫుడ్ ఫెస్టివల్ వంటి ఐకానిక్ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో స్లోవేనియా, లావోస్, ఫారో దీవులు వంటి ఆఫ్బీట్ గమ్యస్థానాలు సాహస యాత్రల అనుభవాలను మహిళలు కోరుకుంటున్నారు.ఆరోగ్యకర ప్రయాణంప్రయాణికులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలి, తైవాన్ వంటి ప్రశాంతమైన గమ్యస్థానాలలో యోగా, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావడం కంటే ఒకే ప్రాంతంలో అనుభూతులను పూర్తిగా ఆస్వాదించేలా ‘స్లో ట్రావెలింగ్’ భావనను అలవర్చుకుంటున్నారు. మరోవైపు పాప్ సంస్కృతి ప్రయాణాన్ని ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇష్టపడుతున్నారు. అభిమానులు తమకు ఇష్టమైన సినిమాలు, ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాల నుంచి ప్రేరణ పొంది టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. -
‘ఇడ్లీ-సాంబారు, వడా పావ్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?’
పనాజి: గోవా బీచ్ కు విదేశీ పర్యాటకులు తగ్గి పోవడంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా బీచ్ లో ఇడ్లీ-సాంబార్, వడా పావ్ లు అమ్మడం వల్లే విదేశీ పర్యాటకులు రావడం లేదన్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ బీచ్ దుకాణాల్లో వడా పావ్ లు అమ్ముతున్నారు. కొంతమంది ఇడ్లీ సాంబార్ విక్రయాలు జరుపుతున్నారు. దాని వల్ల గత కొన్నేళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఈ కారణాలతో స్థానికుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. అయితే వాటి వల్ల విదేశీ పర్యాటకులు రావడం లేదని చెప్పారు కానీ, అవే ఎందుకు కారణమయ్యాయి అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. -
కిమ్ కీలక నిర్ణయం.. విదేశీ టూరిస్టులకు గుడ్న్యూస్
ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు ఇది శుభవార్తే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ పర్యాటకులకు ఆ దేశం తలుపులు తెరవబోతోంది. పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టిన కిమ్ ప్రభుత్వం తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైనట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.కొన్ని వారాల క్రితం విదేశీయులు ఉత్తర కొరియాలో పర్యటించారని.. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కిమ్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి విదేశీ మారక నిల్వలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.ఉత్తర కొరియా నిర్ణయంతో కెనడా, యూకే, న్యూజిలాండ్, చైనా వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఉత్తర కొరియా వచ్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి ఉత్తర కొరియా పర్యాటకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుకు మళ్లీ విదేశీయులను అనుమతిస్తోంది.ఇదీ చదవండి: USA: ఎలాన్ మస్క్కు బిగ్ షాక్.. -
గౌతముడు నడయాడిన నేల!
జూలపల్లి (పెద్దపల్లి): చుట్టూ పచ్చని పంట పొలాలు.. సమీ పంలోనే గలగల పారే హుస్సేన్మియా వాగు.. పక్కనే అతిప్రాచీన కోటలు.. మధ్య ఎత్త యిన కట్టడం.. అదే ధూళికట్టలో శాతవాహ నులు నిర్మించిన బౌద్ధ స్తూపం.. ఎంతో ఆక ర్షణీయంగా కనిపిస్తున్న కోటలు, బౌద్ధ స్తూపం అభివృద్ధికి నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తూ.. ఇక్కడ చారిత్రక ప్రాశస్త్యానికి మంత్రముగ్ధులవుతున్నా.. పాలకులకు పట్టడం లేదు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి – ఎలిగేడు మండలాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలనే డిమాండ్ పెరుగుతోంది.ధూళికోటే.. ధూళికట్ట..శాతవాహనులు దశాబ్దాల క్రితం ధూళికోట (ధూళికట్ట)ను రాజధానిగా చేసుకుని పాలించారన్నది చరిత్రకారుల కథనం. ఇక్కడే బౌద్ధ స్తూపం నిర్మించగా, గౌతమ బుద్ధుడు «ధ్యానం చేసినట్లు చెబుతున్నారు. 1972లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అతి ప్రాచీన గ్రామ ఆనవాళ్లు, ఆధారాలు లభించాయి. ధూళికట్ట శివారులోని కోట ప్రాంతంలో తవ్వకాలు చేప ట్టిన పురావస్తు శాఖ.. ఇక్కడ లభించిన వస్తు వులను హైదరాబాద్లోని మ్యూజియానికి తర లించి భద్రపరిచింది. వడ్కాపూర్ శివారులోని 741, 742 సర్వే నంబర్లలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా.. బౌద్ధ స్తూపం, బుద్ధుడు, నాగశేషు, కొన్ని విగ్రహాలు లభించాయి. వాటిని కూడా మ్యూజియంలో భద్రపరిచారు. బౌద్ధ స్తూపం 0.19 గుంటల విస్తీర్ణంలో ఉంది. పురావస్తు శాఖ తరపున అభివృద్ధి చేసేందుకు వడ్కాపూర్ రైతులను ఒప్పించి.. మరో ఎనిమిది ఎకరాలను కొనుగోలు చేశారు.అమలుకు నోచని హామీలు..బౌద్ధ స్తూపం, పరిసరాలను అభివృద్ధి చేస్తా మని అప్పటి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.50 లక్షలు కేటాయించారు. అధికారులు ప్రణాళికలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహించడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.ఏటా బుద్ధుని జయంతి..బౌద్ధ స్తూపం వద్ద 2003 నుంచి ఏటా గౌతమ బుద్ధుని జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దాతల సాయంతో బౌద్ధ దమ్మ ప్రచార పరిషత్ సభ్యులు ప్రత్యేక కార్యక్రమా లు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బౌద్ధ భిక్షువులతోపాటు పలు ప్రాంతాల నుంచి బౌద్ధులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.కనీస సౌకర్యాలు కరువు..ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్లు నెరవేరడం లేదు. ధూళికట్ట ఎల్లమ్మ ఆలయం నుంచి స్తూపం వరకు రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరైనా.. రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రోడ్డు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వసతి గదులు అందుబాటులోకి రాకుండా పోయాయి. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నల్ల మనోహర్రెడ్డి సొంత నిధులు వెచ్చించి ఈ ప్రాంతంలో ధ్యానముద్ర నిర్మించారు. అందులో గౌతమ బుద్ధుని పాల రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.పర్యాటకాభివృద్ధి చేయాలిఅతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఉన్న ధూళికట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. పర్యాటకానికి ఆటంకంగా ఉన్న వడ్కాపూర్ నుంచి బౌద్ధ స్తూపం, ధూళికట్ట రేణుకా ఎల్లమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మించాలి. ఏటా నిర్వహించే ఉత్సవాలు, ప్రార్థనలకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి.– మొగురం రమేశ్, మాజీ సర్పంచ్, వడ్కాపూర్ -
ఫ్యాషన్ స్ట్రీట్కు నయా లుక్
దాదర్: దక్షిణ ముంబైలోని ప్రముఖ ఫ్యాషన్ స్ట్రీట్కు కొత్త లుక్ ఇవ్వాలని బహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన నూతన ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉంచింది. సలహాదారుల కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం ఈ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దే పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని బీఎంసీ అదనపు కమిషనర్ (సిటీ) అశ్వినీ జోసీ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. నగరంలో ప్రధాన రైల్వే స్టేషన్లైన చర్చిగేట్–చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) మధ్య ఈ ఫ్యాషన్ స్ట్రీట్ ఉంది. దీనికి కూత వేటు దూరంలో ఆజాద్ మైదానం ఉంది. ఇక్కడ నేటి యువతను ఆకర్శించే అనేక కొత్త డిజైన్లతో కూడిన దుస్తులు, డ్రెస్ మెటీరియల్స్ లభిస్తాయి. దీంతో ఈ మార్కెట్ నగరంతోపాటు పశి్చమ, తూర్పు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో ఎంతో గుర్తింపు పొందింది. ఇక్కడ రకరకాల దుస్తులతోపాటు, చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగులు, లగేజీ బ్యాగులు, బెల్టులు, బూట్లు తదితర ఫ్యాషనబుల్ వస్తువులు చౌక ధరకే లభించడంతో నిత్యం వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. అంతేగాకుండా దేశ నలుమూలలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచి్చన పర్యాటకులు ఫ్యాషన్ స్ట్రీట్ను తప్పకుండా సందర్శిస్తారు. వివిధ పనుల నిమిత్తం ముంబైకి వచి్చన వారు కూడా ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన దుస్తులు, సామాగ్రి కొనుగోలు చేస్తారు. అన్ని రకాల, ఆధునిక ఫ్యాషన్ దుస్తులు లభించడంతో ఇక్కడికి పేదలతోపాటు, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరు. ముఖ్యంగా నేటి యువత ఆధునిక ఏసీ షాపింగ్ మాల్స్ల కంటే ఫుట్పాత్పై వెలసిన ఈ ఫ్యాషన్ స్ట్రీట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.లైసెన్సులు లేకుండానే వ్యాపారం..ప్రస్తుతం ఇక్కడ 6/8 లేదా 8/8 చదరపుటడుగులతో కూడిన చిన్న చిన్న టేలాలు, షాపులు ఇలా 250–300 వరకు ఉన్నాయి. ఇందులో లైసెన్స్గల షాపులు 112 ఉన్నాయి. మిగతా దుకాణాలన్నీ టెంపరరీ కావడంతో షట్టర్లు, డోర్లు, విద్యుత్ దీపాలు లేవు. చార్జింగ్ లైట్లతోనే వ్యాపారాలు కొనసాగిస్తారు. ఇక్కడ నిత్యం లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. రాత్రుల్లు దొంగల నుంచి తమ వస్తువులను కాపాడుకునేందుకు అందులో పనిచేసే వారు లేదా యజమానులు అక్కడే నిద్రపోతుంటారు. ఇలాంటి చరిత్రగల ఫ్యాషన్ స్ట్రీట్ త్వరలో సింగపూర్, యూరోప్ దేశాల తరహాలో కొత్త హంగులు, విద్యుత్ దీపాలతో దర్శనమివ్వనుంది. షాపింగ్లకు వచ్చే కస్టమర్లకు ఇక్కడ తాగునీరు, మరుగుడొడ్లు లేవు. దీంతో షాపింగ్కు వచి్చన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే ఆధునీకీకరించే ఈ ప్రాజెక్టులో కస్టమర్లకు అవసరమైన కనీస వసతులు, అల్పాహార స్టాళ్లు, సేదతీరేందుకు బెంచీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అధునిక సీసీ కెమెరాలతో భద్రతకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించే టూరిస్టులకు మున్నార్ అందాలను మరింత అందంగా చూపించాలనే ఉద్దేశంతో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) కొత్త బస్సు సర్వీసులను తీసుకొచ్చింది. హిల్ స్టేషన్లో డబుల్ డెక్కర్ బస్సులను లాంచ్ చేసింది. 'రాయల్ వ్యూ ప్రాజెక్ట్'లో భాగమైన ఈ బస్సులో పర్యాటకులు మున్నార్ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను గో కేరళ ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో పర్యాటక ప్రేమికులను బాగా ఆకట్టుకుంటోంది.ఇటీవల మున్నార్లో సందర్శన కోసం కొత్త డబుల్ డెక్కర్ బస్సును జెండా ఊపి రవాణా మంత్రి శ్రీ గణేష్ కుమార్ ప్రారంబించారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ పర్యాటకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందన్నారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీసు వల్ల ప్రస్తుతం ఉన్న పర్యాటక సంబంధిత సౌకర్యాలకు ఎలాంటి ముప్పు ఉండదని కూడా ఆయన హామీ ఇచ్చారు. దీని ప్రకారం, మున్నార్ రాయల్ వ్యూ డబుల్ డెక్కర్ బస్సు తేయాకు తోటలు ,ఎత్తైన ప్రాంతాలను 360 డిగ్రీల వీక్షణ అందించేలా రూపొందించారు. గాజు అద్దాలతో, వినసొంపైన సంగీతం పారదర్శకంగా బయటి దృశ్యాలను చక్కగా చూపిస్తుంది. బస్సు ఎగువ డెక్లో 38 మంది, దిగువ డెక్లో 12 మంది కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ బస్సు మున్నార్-దేవికులం మార్గంలో రోజువారీ నాలుగు సర్వీసులను నడుపుతుందని సమాచారం.కామెంట్లు చూస్తే గుండె గుభిల్లు అయితే ఈ వీడియో చాలామంది అనుమానాలు, భయాలు వ్యక్తం చేశారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులో నిస్సందేహంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. కానీ ఈ రోడ్డుపై నా అనుభవం చాలా తీవ్రంగా ఉంది అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.. KSRTC డ్రైవర్లు సరిగ్గా నావిగేట్ చేయకపోయినా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా... పెద్ద ముప్పు తప్పదు అని ఒకరు, మోషన్ సిక్నెస్ రావచ్చు, ముఖ్యంగా పొగమంచు ఉన్న రోజుల్లో ఇది చాలా ప్రమాద కరమైనది కావచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ పై చట్టపరమైన సవాళ్లు కొత్త బస్సు సర్వీస్ను పర్యాటకులు స్వాగతిస్తున్నప్పటికీ, ఇది చట్టపరమైన సమస్యలను రేకెత్తిస్తోంది. కేరళ హైకోర్టు ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని వాహనాలతో సహా అక్రమ వాహన మార్పులకు సంబంధించిన పిటిషన్లను సమీక్షిస్తోంది. ఎటువంటి మినహాయింపులు లేకుండా మోటారు వాహనాల చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని జస్టిస్ అనిల్ కె. నరేంద్రన్ , జస్టిస్ మురళీకృష్ణతో కూడిన డివిజన్ బెంచ్ నొక్కి చెప్పింది.మరోవైపు మున్నార్ టూరిస్ట్ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ కొత్త బస్సు సర్వీస్ వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వాదిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ సమస్య ప్రస్తుత పిటిషన్ పరిధిలోకి రాదని పేర్కొంటూ కోర్టు వారి దరఖాస్తును తోసిపుచ్చింది. తగిన మార్గాల ద్వారా చట్టపరమైన సహాయం తీసుకోవాలని పిటిషనర్లకు కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. KSRTC launches double-decker bus for tourists in Munnar 💚 pic.twitter.com/pJbn6mxik7— Go Kerala (@Gokerala_) February 11, 2025 -
దూకుడుతో శిశురక్షణ
కార్పస్ క్రిస్టీ కేథలిక్ పండుగగా చెప్పుకునే ‘బేబీ జంపింగ్ ఫెస్టివల్’ కొత్తగా వినేవారికి, చూసేవారికి వింతగా అనిపిస్తుంది. ఉత్తర స్పెయిన్ లోని కాంటాబ్రియన్ పర్వతాల దిగువన ఉన్న ‘కాస్ట్రిలో డి ముర్సియా’ అనే కుగ్రామంలో ఏటా ఈ పండుగను జరుపుకొంటారు. వేలాది మంది పర్యాటకులు ఈ వేడుకను చూడటానికి తరలి వస్తుంటారు. సుమారు రెండువందల సంవత్సరాలుగా తమకు ఈ ఆచారముందని అక్కడి వారు చెబుతారు. ‘ఎల్ కొలాచో’ (ది డెవిల్) అని పిలుచుకునే పసుపురంగు ముసుగులాంటి దుస్తులు ధరించిన కొందరు యువకులు, దయ్యాలను తలపిస్తూ ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తారు.పసుపు రంగు దుస్తులు వేసుకున్న ‘ఎల్ కొలాచో’లు స్థానికంగా ఈ వేడుకను చూడటానికి వచ్చిన వారిని కూడా హడలెత్తిస్తుంటారు. భయపెడుతూ, తరుముతూ పరుగులెత్తిస్తుంటారు. వారు తమ చేతిలో గంటలాంటి ఒక వస్తువుని పట్టుకుని, విచిత్రమైన శబ్దాలు చేసుకుంటూ, ఈ ఊరేగింపులో పాల్గొంటారు. పెద్ద పెద్ద డప్పులు, అరుపులు భయపెట్టేలా ఉంటాయి. నల్లటి కోట్లు, టోపీలు ధరించిన మరికొందరు వ్యక్తులు గంభీరంగా, ఈ ‘ఎల్ కొలాచో’లతో పాటు ఊరేగింపులో నడుస్తారు. ఈ వేడుకలో రోడ్డు పొడవునా పరుపులు, తలదిళ్లు పరిచి, వాటిపై ఏడాదిలోపు పసిపిల్లలను వరుసగా పడుకోబెడతారు. వారి మీద నుంచి ‘ఎల్ కొలాచో’ అనే యువకులను, పిల్లల పైనుంచి దూకిస్తారు. అలా దూకితే పిల్లలపై భూత ప్రేత పిశాచాల పీడ పడదని, దుష్టశక్తులు దరిచేరవని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అక్కడివారి నమ్మకం.అలా పిల్లల మీద నుంచి దూకిన తర్వాత మతపెద్దలు ప్రార్థనలు జరిపి, ఆ పసివాళ్లను ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల నుంచి, గులాబీ రేకులతో పిల్లలకు దీవెనలు అందుతాయి. ఇదంతా వేడుక రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపే ముగుస్తుంది. అయితే, ఈ వేడుకపై పలు విమర్శలున్నాయి. చాలామంది దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేస్తున్నా, కొందరు మాత్రం తమ పిల్లల క్షేమం కోసం ఈ వేడుకలో పాల్గొంటున్నారు. -
వైజాగ్కి వైన్ కోసం వస్తారు..
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు వైజాగ్కు వైన్ తాగడానికి రాకపోతే.. కాఫీ తాగడానికి వస్తారా అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వైజాగ్ బీచ్కు వచ్చేది టీ, కాఫీలు తాగడానికి కాదని, ఎంజాయ్ చెయ్యడానికని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. జర్మనీ తరహాలో బీచ్లో చిన్న హట్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్, బీరు, డ్రింక్ ఇచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకొస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని అన్నారు. గోవా, బెంగళూరుతో పోలిస్తే వైజాగ్ని ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోతున్నామో ఆలోచించాలన్నారు. టూరిస్ట్కి ఎంటర్టైన్మెంట్ కావాలని, ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇద్దరు కూర్చుంటే పోలీసులు కేసులు పెట్టేస్తారని అన్నారు. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారని చెప్పారు. రూల్స్ అవసరమే కానీ, వెసులుబాట్లు ఉండాలని, ముఖ్యంగా టూరిజానికి మినహాయింపులు ఇవ్వాలని అన్నారు. ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటకాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడంలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాటకులు వస్తున్నా కనీస వసతులు లేవని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలన్నారు. గిరిజనులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగలరా అని అన్నారు. ట్రైబల్ యాక్ట్లో మార్పులు చెయ్యాలని చెప్పారు. ఎవరైనా పెట్టుబడికి పర్మిషన్ కోసం వస్తే యస్ ఆర్ నో అని చెప్పడానికి అధికారులు 6 నెలలు, సంవత్సరం ఎందుకు తిప్పుతున్నారని ప్రశి్నంచారు. అనంతరం డిప్యూటీ సీఎం వివాదంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు అయ్యన్న స్పందిస్తూ.. ఒకరిని డిప్యూటీ సీఎంని చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరని ప్రశి్నంచారు. అది ప్రజలు నిర్ణయించాలని అన్నారు. -
ప్రపంచ పర్యాటకం కళకళ
2024 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా జనం పర్యాటనల్లో మునిగిపోయారని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్డబ్ల్యూటీఓ) ప్రకటించింది. గత ఏడాది ఏకంగా 140 కోట్ల మంది జనం పర్యటనల్లో బిజీగా మారారని యూఎన్డబ్ల్యూటీఓ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2019 డిసెంబర్లో మొదలైన కోవిడ్ సంక్షోభం దెబ్బకు కుదేలైన ప్రపంచ పర్యాటకం మళ్లీ నాలుగేళ్ల తర్వాత 99 శాతం పుంజుకోవడం విశేషం. 2014 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఏకంగా రూ.172 లక్షల కోట్లు ఖర్చుచేశారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక్కో పర్యాటకుడు గత ఏడాది మొత్తంలో పర్యాటకం కోసం దాదాపు రూ.86,000 ఖర్చుచేశాసినట్లు స్పష్టమైంది. ఎక్కువ ఎక్కడికి వెళ్లారు? గణాంకాల ప్రకారంచూస్తే అత్యధికంగా 74.7 కోట్ల మంది జనం యూరప్ దేశాల్లో పర్యటించారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి యుద్ధంలో మునిగిపోవడంతో పర్యాటకులు ఉక్రెయిన్, రష్యా వాటి సమీప దేశాల రీజియన్లో సందర్శనలపై ఆసక్తి కనబరచలేదు. దేశాలవారీగా చూస్తే ఫ్రాన్స్కు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఫ్రాన్స్ పర్యాటక బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది ఆ దేశానికి 10 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ఆ తర్వాత స్పెయిన్లో 9.8 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ‘‘అత్యధిక సందర్శకులతో ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. 2024 సమ్మర్ ఒలింపిక్స్, పారిస్లో ప్రఖ్యాత నోట్రే డేమ్ క్యాథడ్రల్ చర్చి పునఃప్రారంభం, రెండో ప్రపంచయుద్ధంలో నార్మాండీపై దాడుల ఘటనకు 80 ఏళ్లు పూర్తవడంతో జరిగిన కార్యక్రమాలను చూసేందుకు ఏడాది పొడవునా భారీగా జనం తరలివచ్చారు’’అని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 31.6 కోట్ల మంది పర్యటించారు. స్పెయిన్లో విభిన్న పరిస్థితి ‘‘మా ప్రాంతానికి రండిబాబు. పర్యటించి ఇక్కడి వ్యాపారాన్ని పెంచండి’’అనే రాష్ట్రాలు, దేశాలనే మనం చూశాం. అందుకు భిన్నంగా స్పెయిన్ వ్యవహరించినా మళ్లీ అదే దేశానికి జనం వరసకట్టడం గమనార్హం. సెవిల్లే సిటీలోని ప్లాజా డీ ఎస్పానా వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసి పోవడంతో అక్కడి స్థానిక యంత్రాంగం అక్కడ ఎవరు పర్యటించినా చార్జీలు వసూలుచేస్తామని హెచ్చరించింది. 1929 నిర్మించిన అక్కడి ప్రాంతంలో జనం, వ్యాపారాలు పెరిగిపోయి వీధివ్యాపారుల ఆక్రమణలు అధికమై, పాత కట్టడాలు దెబ్బతింటున్నాయని నగర మేయర్ జోస్ లూయిజ్ శాంజ్ చెప్పారు. ఇటలీలో వెనీస్, ఫ్లోరెన్స్ నగరాల్లో బృంద పర్యాటకాలపై నిషేధం, రాత్రిళ్లు బీచ్లలో ఈతకొట్టడంపై నిషేధాజ్ఞలున్నాసరే ఆ దేశంలో పర్యాటకం గతంతో పోలిస్తే 23 శాతం పెరిగింది.ఆశ్చర్యపరిచిన చిన్న దేశాలు భారత్తో పోలిస్తే అధిక మండే ఎండలుంటే ఖతార్లో అత్యధిక మంది సందర్శకులు వచ్చారు. అక్కడ గతంతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య 137 శాతం పెరగడం విశేషం. గత ఏడాది అత్యుత్తమ ఎయిర్లైన్స్గా ఖతార్ ఎయిర్లైన్స్ నిలిచింది. దోహాలోని హమాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ కిరీటాన్ని సాధించింది. ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లోని అత్యంత చిన్న దేశం ఆండోర్రాలోనూ పర్యాటకుల రద్దీ పెరిగింది. డొమెనికన్ రిపబ్లిక్, కువైట్, అల్బేనియా, ఎల్ సాల్వడార్ వంటి చిన్న దేశాలకూ పెద్ద సంఖ్యలో సందర్శకులు క్యూ కట్టడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు
బరేలీ: యూపీలోని బరేలీ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇద్దరు విదేశీయులకు గూగుల్ మ్యాప్ చుక్కలు చూపించింది. జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి, వారి విచారణను ఎదుర్కోవలసి వచ్చింది.వివరాల్లోకి వెళితే ఇద్దరు విదేశీ పర్యాటకులు గూగుల్ మ్యాప్ సాయంతో నేపాల్ వెళ్తుండగా దారి తప్పారు. ఢిల్లీ నుండి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళుతున్న ఈ ఫ్రెంచ్ పర్యాటకులు దారి తప్పి, యూపీలోని చురైలి ఆనకట్ట దగ్గరకు చేరుకున్నారు. కొందరు గ్రామస్తులు వీరిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిద్దరినీ చురైలి పోలీస్ స్టేషన్కు తరలించి, విచారించారు.ఈ ఘటన గురించి సర్కిల్ ఆఫీసర్ (సీఓ) బహేరి అరుణ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్రెంచ్ పౌరులు బ్రియాన్ జాక్వెస్ గిల్బర్ట్, సెబాస్టియన్ ఫ్రాంకోయిస్ గాబ్రియేల్ జనవరి 7న ఫ్రాన్స్ నుంచి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. వారు పిలిభిత్ నుండి తనక్పూర్ మీదుగా నేపాల్లోని ఖాట్మండు వెళ్ళవలసి ఉంది. అయితే గూగుల్ మ్యాప్ వారికి బరేలీలోని బహేరికి రూటును చూపించింది. దీంతో ఆ విదేశీయులు ఇద్దరూ దారితప్పి బరేలీలోని చురైలి ఆనకట్టకు చేరుకున్నారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు విదేశీయులు నిర్మానుష్య ప్రదేశంలో సైకిల్పై వెళ్లడాన్ని గమనించిన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తరువాత గ్రామస్తులు ఆ విదేశీయులను ఆపి, వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.అయితే వారు చెప్పేది గ్రామస్తులకు అర్థం కాలేదు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరు విదేశీయులను చురైలి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య సైతం ఆ ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులను విచారించి,వారిని నేపాల్కు సురక్షితంగా పంపించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్ షో -
రోడ్లపై మంచు గుట్టలు..చిక్కుకుపోయిన టూరిస్టులు
షిమ్లా:హిమాచల్ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. భారీ మంచు ప్రభావంతో రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై మంచు గుట్టలుగుట్టలుగా పేరుకుపోవడంతో రోహ్తక్, సోలాంగ్, అటల్ టన్నెల్ మార్గంలో వెయ్యి వరకు వాహనాలు సోమవారం రాత్రి కొన్ని గంటల పాటు చిక్కుకుపోయాయి.స్థానిక అధికారులు,పోలీసుల సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. మొత్తం 700 మంది టూరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్రిస్మస్, న్యూఇయర్ కావడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువవడం ఇదే సమయంలో మంచు భారీగా కురుస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పోలీసులు చెప్పారు. ఈ సీజన్లో ఇక్కడుండే మంచు పర్వతాలను చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుండడం గమనార్హం. #WATCH | Himachal Pradesh: Heavy snowfall causes a long traffic jam as nearly 1000 vehicles get stuck between Solang and Atal Tunnel, Rohtang. The police team is busy clearing the traffic jam amid snowfall. 700 tourists have been rescued safely. (23.12)Source: Himachal Pradesh… pic.twitter.com/wb9ZfKh6H6— ANI (@ANI) December 23, 2024 -
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది దుర్మరణం
రియో డిజనీరో: బ్రెజిల్లో క్రిస్మస్ వేళ విషాద ఘటన జరిగింది. ఓ వ్యాపారవేత్త తానే నడుపుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళుతున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ఉన్న 10 మంది మృతి చెందారు. విమానం పడిన చోట భవనాల్లో ఉన్న మరో పదిహేను మందికి గాయాలయ్యాయి. టూరిస్టు పట్టణం గ్రామడోలో ఈ ఘటన చోటు చేసుకుంది.బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానం తొలుత ఓ బిల్డింగ్ను ఢీకొట్టి తర్వాత అందులో కింది ఫ్లోర్లో ఉన్న మొబైల్ ఫోన్లు అమ్మే షాపులోకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్నవారంతా మృతిచెందారు. గ్రామడో పర్వత ప్రాంతంలోని పాపులర్ టూరిస్టు డెస్టినేషన్. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం.మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది. -
Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం 2024లో ఊపందుకుంది. గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాలను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. 2024లో గూగుల్లో కొన్ని పర్యాటక ప్రాంతాలు నిరంతరం ట్రెండింగ్లో నిలిచాయి. వీటిలో స్విట్జర్లాండ్, లండన్తో పాటు ఐదు దేశాల పేర్లు వినిపించాయి. ఇందులో భారత్కు కూడా స్థానం దక్కింది.అజర్బైజాన్2024లో భారత్కు చెందిన పర్యాటకలు అజర్బైజాన్కు సందర్శించేందుకు గూగుల్లో విస్తృతంగా సెర్చ్ చేశారు. దీనిని చూస్తుంటే అజర్బైజాన్ భారత పర్యాటకులకు ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్గా తెలుస్తోంది. భారతదేశం నుండి అజర్బైజాన్కు విమాన టిక్కెట్లు అందుబాటు ధరల్లో ఉంటాయి. అజర్బైజాన్ వెళ్లాలనుకునేవారు ఈ వీసాను మూడు రోజుల్లో సులభంగా పొందవచ్చు. అజర్బైజాన్లో చూడదగిన అద్భుతమైన ప్రదేశాలలో బాకు, అస్తారా, షెకి, క్యూబా, గోయ్గోల్ సరస్సు మొదలైనవి ఉన్నాయి.బాలిబాలి.. భారతీయులు అమితంగా ఇష్టపడే మరో పర్యాటక ప్రాంతం. బాలి ఇండోనేషియాలోని ఒక ప్రావిన్స్. ఇక్కడ కుటా బీచ్, లోవినా బీచ్లను సందర్శించవచ్చు. బాలి బర్డ్ పార్క్, బొటానికల్ గార్డెన్, మంకీ ఫారెస్ట్ ఇక్కడి ఆకర్షణ కేంద్రాలు. ప్రకృతి అందించిన సహజ సౌందర్యంతో పాటు, ట్రెక్కింగ్ తరహా సాహసాలను ఇష్టపడేవారికి బాలి పర్యాటక గమ్యస్థానంగా నిలిచింది.మనాలిహిమాచల్ ప్రదేశ్లోని మనాలి అందమైన హిల్ స్టేషన్గా పేరుగాంచింది. మనాలీలో పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఇక్కడి మంచు పర్వతాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పలు సాహస క్రీడలు అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన ఫోటోషూట్ చేసుకునేందుకు బాలి అనువైన ప్రాంతం. శీతాకాలంలో మనాలిని సందర్శిస్తే ఆ అనుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయి. 2024లో లెక్కలేనంతమంది పర్యాటకులు మనాలీని సందర్శించారు.కజకిస్తాన్కజకిస్తాన్ ఆసియాలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ఇక్కడ కరెన్సీ చాలా చౌకగా ఉంటుంది. భారత్ నుండి కజకిస్తాన్ చేరుకునేందుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఇది ప్రపంచంలో 9వ అతిపెద్ద దేశం. ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. లోయలు, పర్వతాలు, సరస్సులను అతి దగ్గరి నుంచి చూసే అవకాశం కలుగుతుంది.జైపూర్2024లో పర్యాటకులు గూగుల్లో అత్యధికంగా శోధించిన ప్రాంతాలలోభారత్లోని జైపూర్ కూడా ఉంంది. విదేశీ పర్యాటకులను జైపూర్ అమితంగా ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ను పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. అమెర్ ఫోర్ట్, హవా మహల్, నహర్ఘర్ కోట బిర్లా టెంపుల్తో సహా అనేక చారిత్రక ప్యాలెస్లు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు జైపూర్లో అనేకం ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో సంబ్రమాశ్చర్యాలు కలుగుతాయి. ఇది కూడా చదవండి: మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం -
మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం
జైపూర్: రాజస్థాన్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గడ్డకట్టేంత చలి ఉంటోంది. రాజధాని జైపూర్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల దిగువకు పడిపోయింది. ఇక్కడి హిల్ స్టేషన్ మౌంట్ అబూలో ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇంతటి చలిలోనూ మౌంట్ అబూను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ మౌంట్ అబూలో చూసేందుకు ఏమున్నాయి?రాజస్థాన్లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అక్కడి సంస్కృతి, ప్రజల జీవనశైలి, సంప్రదాయ వారసత్వం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని మౌంట్ అబూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది రాజస్థాన్లోని ఏకైక హిల్ స్టేషన్. నిత్యం ఇక్కడ పర్యాటకుల సందడి కనిపిస్తుంది. చరిత్రలోని వివరాల ప్రకారం సిరోహి మహారాజు ఒకప్పుడు మౌంట్ అబూను బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చాడు. దీంతో బ్రిటీషర్లు మౌంట్ అబూను తమ వేసవి విడిదిగా మార్చుకుని, అభివృద్ధి చేశారు. అచల్ఘర్ కోటమౌంట్ అబూలోని అచల్ఘర్ కోట ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. హిల్ స్టేషన్కు ఈ కోట అందాన్ని తీసుకువస్తుంది. ఈ కోటను మావద్ రాణా కుంభ్ నిర్మించాడు. ఈ కోట ఒక కొండపై ఉంది. ఇక్కడ నుండి కిందనున్న పట్టణాన్ని చూడవచ్చు. కోటలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఆలయంలో కొలువైన శివునికి ఇక్కడికి వచ్చే పర్యాటకులు పూజలు నిర్వహిస్తుంటారు.సన్సెట్ పాయింట్హిల్ స్టేషన్లలో సూర్యోదయం- సూర్యాస్తమయం పాయింట్లు ఎంతో ముచ్చటగొలుపుతాయి. ఇదేవిధంగా మౌంట్ అబూపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మధురానుభూతులను అందిస్తుంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.టోడ్ రాక్మౌంట్ అబూలో తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి టోడ్ రాక్. ఇదొక భారీ రాయి. ఈ రాయి ఆకారం కప్ప మాదిరిగా ఉంటుంది. ఈ రాతికప్ప నదిలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. టోడ్ రాక్ను చూసినవారు ఆశ్చర్యానికి గురవుతుంటారు. నక్కీ సరస్సుఈ సరస్సును దేవతలు స్వయంగా తవ్వారని చెబుతుంటారు. ఈ సరస్సులోని నీరు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. నీటిపై మంచు ఒక షీట్ మాదిరిగా విస్తరించివుంటుంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ సరస్సు ఇక్కడి ప్రకృతి అందాలకు పరాకాష్టగా నిలుస్తుంది. సాయంత్రం సమయాన ఈ సరస్సును చూడటం ప్రత్యేక అనుభూతని అందిస్తుంది.ఎలా వెళ్లాలి?మౌంట్ అబూకు పలు రవాణా మార్గాలలో చేరుకోవచ్చు. ఇక్కడికి 185 కి.మీ దూరంలో ఉదయపూర్ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీని పట్టుకుని మౌంట్ అబూను చేరుకోవచ్చు. అలాగే ఇక్కడికి సమీపంలో అబూ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఢిల్లీ నుంచి నేరుగా మౌంట్ అబూకు బస్సులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
విద్యార్థుల గుండెల్లో ట్రంప్ ‘బెల్స్’
సాక్షి, హైదరాబాద్: ‘అమెరికా ఫస్ట్’ అన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నినాదం మన విద్యార్థులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించి జనవరి 20న బాధ్యతలు స్వీకరించనుండటం ఒకవైపు మోదాన్ని, మరోవైపు ఖేదాన్ని కలిగిస్తోంది. ప్రతిభావంతులైన నిపుణులకు అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుందని చెబుతూనే... విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని, ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తామని ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రకటించారు.ఇది లక్షలాది మంది తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనితో అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న మన విద్యార్ధులు జనవరి 20వ తేదీలోగా అమెరికాకు చేరుకోవాలనే ఉద్దేశంతో పరుగులు పెడుతున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావొచ్చనే ఉద్దేశంతో ఆ దేశ విశ్వవిద్యాలయాలు కూడా విదేశాల్లోని తమ విద్యార్థులు త్వరగా క్యాంపస్కు చేరుకోవాలంటూ నోటీసులు ఇస్తున్నాయి. జూమ్ మీటింగ్లు, వెబ్నార్లు ఏర్పాటు చేస్తున్నాయి. దీనితో సెలవుల కోసం ఇళ్లకు వచ్చిన తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 1.5 లక్షల మందికిపైగా విద్యార్థులు తమ సెలవులు పూర్తికాకుండానే అమెరికాకు పయనం అవుతున్నారు. మరోవైపు ట్రంప్ రాక నేపథ్యంలో స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా తగ్గినట్టు తెలిసింది. గతేడాదితో పోల్చితే ఈసారి 40 శాతం వీసాలు తగ్గినట్లు కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకొనే విద్యార్ధులను ఇది నిరాశకు గురిచేస్తోందని పేర్కొంటున్నాయి.గత హయాంలోనే ట్రంప్ కొరడా..ట్రంప్ గతంలో తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన వెంటనే ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినం చేశారు. వెనిజులా, మెక్సికోతోపాటు తొమ్మిది అరబ్ దేశాల విద్యార్థులు, జనం రాకపోకలపై ఆంక్షలు విధించారు. రకరకాల విద్యాసంస్థల్లో చదువుకుంటున్నట్టు అడ్మిషన్లు తీసుకొని ఫుల్టైమ్ ఉద్యోగాలు చేసే విదేశీ విద్యార్థులపై తీవ్ర ఆంక్షలు విధించారు. అడ్డదారుల్లో హెచ్–1 వీసాలు పొంది ఉద్యోగులుగా చలామణీ అయ్యే వారిని గుర్తించి వీసాలు రద్దు చేసేం దుకు కూడా చర్యలు చేపట్టారు. అంతేకాదు.. అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న పొరపాటు ఉన్నా స్వదేశాలకు తిప్పి పంపారు కూడా. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశాలకు చెందినవారు ఎగరేసుకెళ్తున్నారన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్టు ట్రంప్ ప్రకటించడం గమనార్హం.ఇప్పుడు మరింత కఠినంగా ఆంక్షలు!ఇటీవలి ఎన్నికల్లోనూ ట్రంప్ ఇదే తరహాలో ప్రకటనలు చేశారు. విదేశాలకు చెందిన భార్యాభర్తలు అమెరికాలో ఉంటూ పిల్లలను కంటే వారికి అమెరికన్ పౌరసత్వం (బర్త్ రైట్స్) ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు చేసేవారి ఇమిగ్రేషన్ను రద్దు చేస్తామన్నారు. మరోవైపు అమెరికాలోని టాప్ విశ్వవిద్యాలయాల్లో చదువుకొనేవారు, క్యాంపస్ ఎంపికల్లోనే ఉద్యోగాలు పొందేవారికి నేరుగా గ్రీన్కార్డు ఇస్తామని కూడా ట్రంప్ ప్రకటించారు. దీనితో అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల్లో ఎలాంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ విద్యాసంస్థలు విదేశీ విద్యార్ధులను త్వరగా యూఎస్కు చేరుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. గత హయాంలోని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి జనవరి 20 తర్వాత వెళ్లేవారికి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యా సంస్థల ఎంపికే కీలకం..ట్రంప్ ఆంక్షలను కొట్టిపారేయడానికి వీల్లేదని, అలాగని అతిగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఎంపిక చేసుకొనే విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, చేరబోయే ఉద్యోగాలు ఏమిటన్నది కీలకమని సూచిస్తున్నారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా సరైన సర్టిఫికెట్లు ఇవ్వడం, డాక్యుమెంట్లు సమర్పించకపోవడం, నకిలీ విద్యాసంస్థల్లో చదవ డం వంటివి చేసేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కో వాల్సి ఉంటుంది’’ అని హైదరాబాద్లోని అమీర్పేట్కు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు.విద్యార్థులకు తోడు న్యూ ఇయర్ సందడితో..విద్యార్థులు అమెరికాకు క్యూ కట్టడంతోపాటు క్రిస్మస్ సెల వులు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో యూఎస్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీనితో విమాన టికెట్లకు డిమాండ్ మరింతగా పెరిగి.. చార్జీలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు అందుబాటులో ఉన్న రౌండప్ చార్జీలు ఇప్పుడు రూ.2 లక్షల వరకు చేరడం గమనార్హం.⇒ యూఎస్లో భారతీయ విద్యార్ధులు: 3.35 లక్షలు⇒ అందులో తెలుగు విద్యార్ధులు: సుమారు 56 శాతం⇒ వీరిలో తెలంగాణ నుంచి వెళ్లినవారు: 34 శాతం..⇒ ఏపీ నుంచి వెళ్లినవారు: 22 శాతం..హడావుడిగా పెళ్లిళ్లు..⇒ ఇమిగ్రేషన్ నిబంధనలు కఠిన తరం కావొచ్చనే వార్తల నేపథ్యంలో యూఎస్లో హెచ్–1బీ వీసాలపై ఉంటున్నవారు హడావుడిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. జనవరి 20 తర్వాత డిపెండెంట్ వీసాల్లో మార్పులు రావొచ్చని.. ఆలోగానే పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామితో కలిసి అమెరికా వెళ్లాలని భావిస్తున్నారు. ఇలాంటి వారు ఎంగేజ్మెంట్ అయినా కాకున్నా ముహూర్తాలు పెట్టేసుకుంటుండటం గమనార్హం.⇒ ఈ నెల 20వ తేదీన యూఎస్ విమానాల రౌండప్ చార్జీలు ఇవీ(రూ.ల్లో) (సుమారుగా)⇒ హైదరాబాద్ – డల్లాస్ 2,05,000⇒ బెంగళూర్ – షికాగో 2,15,000⇒ బెంగళూర్ – శాన్ఫ్రాన్సిస్కో 1,40,000⇒ చెన్నై– న్యూయార్క్ 1,32,000⇒ న్యూఢిల్లీ– వాషింగ్టన్ డీసీ 1,65,000ఇల్లీగల్ ఉద్యోగాల జోలికి వెళ్లొద్దు..ఓపీటీ (పార్ట్ టైమ్)కి మాత్రమే అర్హత కలిగిన వాళ్లు సీపీటీ (ఫుల్టైమ్) ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారు. సీనియర్ల మాటలు విని నష్టపోతున్నారు. అలాంటి తప్పుడు పద్ధతులు కష్టాలకు గురిచేస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారిలో కొందరు ఏదో ఒక విద్యాసంస్థలో చేరి.. నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఆన్లైన్ కోర్సుల్లో చేరి ఫుల్టైమ్ ఉద్యోగాలను ఆశిస్తు న్నారు. తాము చదివే విద్యాసంస్థలకు, పనిచేసే ప్రదేశాలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. అలాంటి వారికి సమస్య. స్టేటస్ ఉన్న నిజమైన విద్యార్ధులు సెలవులు ముగిసిన తర్వాత ఎప్పుడైనా అమెరికా వెళ్లవచ్చు– హిమబిందు, కాన్వోకేషన్స్స్క్వేర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ,అమీర్పేట్బాగా చదివేవాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయిమంచి విద్యాసంస్థల్లో చదివేవాళ్లు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ట్రంప్ కాలంలో కష్టాలు ఉంటాయనేది అపోహ మాత్రమే. బాగా చదివేవాళ్లకు అద్భుత అవకాశాలు ఉంటాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దొడ్డిదారుల్లో (షార్ట్కట్) ఉద్యోగాల్లో చేరవద్దు. వర్సిటీల్లో చేరిన తర్వాత పార్ట్టైమ్ ఉద్యోగాలకు ఇప్పటివరకు 3 ఏళ్లే చాన్స్ ఉంది. దీన్ని 6 ఏళ్లకు పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇది మనవాళ్లకు గొప్ప అవకాశం. కానీ పార్ట్టైమ్ అర్హత మాత్రమే ఉన్నవాళ్లు అత్యాశకు పోయి ఫుల్టైమ్ ఉద్యోగాల్లో చేరవద్దు – సూర్యగణేశ్ వాల్మీకి, (వాల్మీకి గ్రూప్) -
వనరుల బంగారం.. బయ్యారం
బయ్యారం ఊళ్లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తాయి. అయితే ఆ గుడులు ఇప్పుడు వాడుకలో లేవు.బయ్యారం.. ప్రకృతి వనరుల భాండాగారం..సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమాలకు ఆలవాలం! ఆ ఊరి గురించే ఈ కథనం.. తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లాలో.. మూడు వైపుల నీళ్లు, ఒకవైపు గుట్టలను హద్దులుగా చేసుకుని ఉంటుంది బయ్యారం. ఇక్కడి పెద్దచెరువు కట్టపై తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్న శిలాశాసనం కాకతీయుల వంశవృక్షాన్ని, వారి పాలనాదక్షతను తెలియజేస్తుంది. కాకతీయ వంశస్థురాలైన మైలమాంబ.. తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజల సంక్షేమార్థం ఈ చెరువును తవ్వించినట్లు ఈ శాసనం తెలుపుతోంది. సాగునీటి రంగంపై కాకతీయుల పరిజ్ఞానానికి నిదర్శనంగా బయ్యారం చెరువు నిలిచింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదటగా నీరు నిండి అలుగు పోసేదిగా బయ్యారం పెద్దచెరువు రికార్డులో ఉంది. ఇది 15,000 ఎకరాలకు సాగునీరును అందిస్తోంది. చెరువు మట్టి మహత్యంబయ్యారం చెరువు మట్టి మహిమ అంతా ఇంతా కాదు. గతంలో బెంగుళూరు పెంకులు, ఇప్పుడు అలంకరణ వస్తువులు, టైల్స్ తయారీకి ఈ మట్టే కీలకం. మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోని టైల్స్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే డెకరేటివ్ టైల్స్ మన దేశంలోనే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి దట్టమైన అడవులను దాటుకుంటూ వచ్చే వరద నీరు ఈ చెరువులో చేరుతుంది. నీటి ప్రవాహంతోపాటు వచ్చే ఒండ్రు మట్టి చెరువు అడుగుకు చేరి రేగడి మట్టిగా మారుతుంది. దీంతో తయారయ్యే పెంకులు, డెకరేటివ్ టైల్స్ నాణ్యతకు మరోపేరుగా నిలుస్తున్నాయి. అయితే ఆర్సీసీ కప్పుతో పోటీ పడలేక పెంకు ప్యాక్టరీలు మూత పడే దశకు చేరుకున్నాయి. వాటి స్థానంలో డెకరేటివ్ టైల్స్ తయారీ మొదలుపెట్టారు. ఇక్కడ తయారయ్యే జేడీ డచ్, హెచ్బీటీ, ఎస్సెమ్మార్, మోడర్న్ బ్రాండ్, ప్లోయింగ్ బిట్స్, సెంటర్ టైల్స్ ఇలా కస్టమర్లు ఏ విధమైన డిజై¯Œ కావాలన్నా ఇట్టే తయారుచేసి ఇస్తారు. బయ్యారం చెరువు మట్టితో తయారు చేసిన పెంకులు, టైల్స్, కటింగ్ డిజైన్లను బొగ్గు, ఊకతో కాలుస్తారు. అప్పుడు ఎర్రటి అందమైన వర్ణం వస్తుంది. వందలు, వేల ఏళ్లు గడచినా ఇది చెక్కు చెదరదు. వీటికి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు మలేషియా, జపాన్ వంటి దేశాల్లోనూ డిమాండ్ ఉంది.ఇనుపరాతి గుట్టతెలంగాణకే తల మానికంగా బయ్యారం ఇనుపరాతి గుట్ట ఉంది. దాదాపు 42వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ గుట్టలో దొరికే ఇనుపరాతి ముడిసరుకు నాణ్యమైనదిగా చెబుతున్నారు నిపుణులు. ఈ ముడిసరుకును గతంలో పాల్వంచ, విశాఖ ఉక్కు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఖనిజాలుబయ్యారం పరిసరాల్లోని నామాలపాడు, ఇతర ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా బైరటీస్, డోలమైట్, అభ్రకం, బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వానికి గతంలో నివేదిక కూడా పంపినట్లు సమాచారం. ఉద్యమాలకు నెలవునాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ పోరు దాకా.. సామాజిక స్పృహకు, ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు నెలవుగా ఉంది బయ్యారం. 1948లో నిజాం వ్యతిరేక పోరులో ఈ ప్రాంతానికి చెందిన 30 మంది పోరాట వీరులు నిజాం సైన్యం తూటాలకు అసువులు బాశారు. వారి స్మృత్యర్థం స్థూపం కూడా ఉందిక్కడ. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బయ్యారం ముందుంది. మలి దశ ఉద్యమంలోనూ చైతన్య శీలురు, కవులు, కళాకారులతో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ∙ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్బండారి వీరన్న, సాక్షి, బయ్యారంమురళీ మోహన్, ఫొటోగ్రాఫర్ -
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు
కైరో:ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదశాత్తు మునిగిపోయింది. ఈజిప్టు తీరానికి దగ్గరలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. మునిగిపోయినపుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా 13 మంది సిబ్బంది.ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రెడ్సీ గవర్నరేట్ వెల్లడించింది.వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది.సముద్రంలో బోటును ఒక్కసారిగా అల వచ్చి బలంగా ఢీకొట్టడంతో బోటు మునిగినపోయినట్లు అధికారులు వెల్లడించారు.అల బలంగా తాకినపుడు కొంత మంది ప్యాసింజర్లు వారి క్యాబిన్లలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారని తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు జరుగుతోందని చెప్పారు. -
ఇలా చేస్తే భారీగా విదేశీ పర్యాటకులు
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు, పర్యాటక రంగం వృద్ధికి వీలుగా బుకింగ్ డాట్ కామ్ కీలక సూచనలు చేసింది. అంతర్జాతీయంగా మరిన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ విమాన సరీ్వసులను అందుబాటులోకి తీసుకురావడం, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, భారత్లోని విభిన్న, విస్తృతమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని సూచించింది. వివిధ భాగస్వాముల నుంచి సమిష్టి చర్యలకు తోడు నిర్దేశిత పెట్టుబడులతో భారత పర్యాటకం కొత్త శిఖరాలకు వెళుతుందని పేర్కొంది. రానున్న ఏడాది, రెండేళ్లలో భారత్ను సందర్శించాలని అనుకుంటున్న వయోజనుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుని బుకింగ్ డాట్ కామ్ ఒక నివేదిక విడుదల చేసింది. 19 దేశాలకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. భారత్కు రావాలనుకుంటే, ఎదుర్కొనే సవాళ్లు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతలు ఏంటని ప్రశ్నించి, వారి అభిప్రాయాలు రాబట్టింది. విదేశీ పర్యాటకుల్లో సగం మంది కేవలం భారత్ను చూసి వెళ్లేందుకే వస్తున్నారు. మూడింట ఒక వంతు భారత్తోపాటు, ఆసియాలో ని మరికొన్ని దేశాలకూ వెళ్లేలా ట్రావెల్ ప్లాన్తో వస్తున్నారు. యూఎస్, యూకే, జర్మనీ, యూఏఈ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. సంప్రదాయంగా చైనా, కెనడా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు. భారత్కు వస్తున్న విదేశీ పర్యాటకులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఆ్రస్టేలియా, ఇటలీ, నెదర్లాండ్స్ తాజాగా చేరాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, జైపూర్ విదేశీ పర్యాటకులు సందర్శించే వాటిల్లో టాప్–5 ఎంపికలుగా ఉంటున్నాయి. హంపి, లేహ్కు ఆదరణ పెరుగుతోంది. పతి్నటాప్, పెహల్గామ్, మడికెరి, విజయవాడ, ఖజురహో ప్రాంతాలను సైతం సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. -
రండి.. తిని తరించండి
ప్రజల్లో విభిన్న ఆహారపు అలవాట్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ పర్యాటకం కొత్త రుచులను అన్వేషిస్తోంది. ఫలితంగా భారతదేశంలో పాకశాస్త్ర సంస్కృతిని ఆస్వాదించే పర్యాటకం (గ్యాస్ట్రోనమీ టూరిజం) ఊపందుకుంటోంది. విదేశీ పర్యాటకులు భారత పాకశాస్త్ర సంస్కృతి, కొత్త వంటకాల తయారీపై మక్కువతో మన దేశానికి క్యూ కడుతున్నారు. 2023లో విదేశీ పర్యాటకుల రాకపోకలు 15.6 శాతం పెరిగాయి. ఈ పర్యాటకులలో అత్యధికులు తమ ప్రయాణంలో భాగంగా పాకశాస్త్ర అనుభవాలను కోరుకుంటారు. దేశంలోని సుసంపన్నమైన అహారం, వంటల సంప్రదాయాలు, విభిన్న ప్రాంతీయ వంటకాలు, ప్రామాణికమైన ఆహార అనుభవాలపై విదేశీ పర్యాటకులు ఆసక్తి పెంచుకుంటున్నారు. – సాక్షి, అమరావతిపాకశాస్త్ర పర్యాటకంలో టర్కీదే అగ్రస్థానంప్రపంచవ్యాప్తంగా గ్యాస్ట్రోనమీ పర్యాటకులను ఆకట్టుకోవడం, సరికొత్త అనుభూతులను అందించడంలో టర్కీ ముందంజలో ఉంది. గతేడాది రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైన అక్కడి పాకశాస్త పర్యాటక మార్కెట్ నుంచి 2025 నాటికి రూ.2.10 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అక్కడి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ దేశవ్యాప్తంగా 2,200 కంటే ఎక్కువ స్థానిక ఆహార, పానీయాల వెరైటీలున్నాయి. ముఖ్యంగా గాజియాంటెప్, అదావా, హటే, ఇజ్మీర్ వంటి నగరాల్లో గ్యాస్ట్రోనమీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 41 రకాల విభిన్న ఆహార పదార్థాల తయారీ విధానంపై ప్రత్యేక కోర్సుల, శిక్షణను అందిస్తోంది. ఒక్క ఇస్తాంబుల్లోనే 16 శిక్షణ కేంద్రాలున్నాయి.స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించడానికి టర్కీ ఏకంగా 34 గ్యాస్ట్రోనమీ మ్యూజియాలను ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా 360 కంటే ఎక్కువ గ్యాస్ట్రోనమీ పండుగలను చేపడుతూ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే గాజియాంటెప్ను ‘సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’గా యునెస్కో గుర్తించింది. మసాలా వంటకాల నుంచి మొఘలాయ్ వరకు.. దక్షిణాదిలోని మసాలా కూరల నుంచి ఉత్తరాదిలోని మొఘలాయ్ వంటకాల వరకు భారతీయ హోటళ్లు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. దీనికితోడు వీధుల్లో అమ్మే ఆహారాలు (స్ట్రీట్ ఫుడ్) సైతం అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాలు గ్యాస్ట్రోనమీకి అడ్డాలుగా మారాయి. ఈశాన్య భారతదేశం అత్యంత స్థిరంగా అభివృద్ధి చెందుతున్న పాకశాస్త్ర గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. ఆ తర్వాత చెట్టినాడ్ విభిన్న ఆహార రుచులను అందిస్తోంది. ఇక గోవా కేవలం స్థానిక వంటకాలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వంటకాలను కూడా ప్రవేశపెడుతోంది. వీధి వంటకాల్లో లక్నోలో లభించే నెహారీ కుల్చా, షీర్మల్, మలై మఖాన్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమృత్సర్లో లభించే చోలే–కుల్చే, జిలేబీ, గులాబ్ జామూన్, పొడవాటి గ్లాసుల్లో ఇచ్చే లస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఆహారోత్సవాలతో ఆకర్షణవివిధ నగరాల్లో అనేక సంస్థల భాగస్వామ్యంతో ఆహారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో నార్త్–ఈస్ట్ స్లో ఫుడ్ అండ్ ఆగ్రో బయోడైవర్సిటీ సొసైటీ (నెస్పాస్) ఏటా నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మేఘాలయ రాష్ట్రంలోని మావ్లాంగ్లో నిర్వహించే ‘సేక్రేడ్ గ్రోవ్’ (మతపరమైన తోట చెట్ల పండుగ) ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈశాన్య భారతదేశంలోని స్థానికులు తయారుచేసి వడ్డించే వివిధ అటవీ, స్థానిక ఆహార వంటకాలను సంరక్షించేందుకు, ఆయా వంటకాలపై ప్రచారానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తున్నాయి. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తూ గ్యాస్ట్రోనమీ టూరిజానికి ఊతమిస్తున్నాయి. -
పోటెత్తిన కృష్ణమ్మ: సాగర్ డ్యామ్కు పర్యాటకుల క్యూ (ఫొటోలు)
-
సాగర్కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్కు పర్యాటకుల తాకిడి పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాదలు కిటకిటలాడాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో రోగి, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. మరోవైపు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యామ్ వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల సిఫార్సు ఉన్నవారిని మాత్రమే డ్యామ్ పైకి పంపుతున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. -
బ్యాంకాక్లో సంచలనం.. ఆరుగురు టూరిస్టుల మిస్టరీ డెత్
బ్యాంకాక్: టూరిస్టుల స్వర్గధామం థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఆరుగురు విదేశీయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరుగురు మంగళవారం(జులై 16) నగరంలోని ఓ హోటల్ గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. వీరంతా వియత్నాం దేశస్తులని సమాచారం.అయితే వీరిలో ఇద్దరికి అమెరికా పాస్పోర్టులుండటం గమనార్హం. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు. వీరు శని, ఆదివారాల్లో వేరువేరుగా బ్యాంకాక్లోని ఓ ప్రముఖ హోటల్కు వచ్చి రెండు గదులు తీసుకున్నారు. అనంతరం మంగళవారం వారంతా ఒకే గదిలో చనిపోయి ఉండటం మిస్టరీగా మారింది. విదేశీయులు అనుమానాస్పదంగా మృతి చెందిన హోటల్ను ప్రధాని స్రెత్తా తవిసిన్ పరిశీలించారు. పర్యాటక రంగంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకుగాను ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరపాలని ప్రధాని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురితో పాటు వేరే ఎవరైన వ్యక్తి వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఒడిశాలో బస్సు ప్రమాదం.. హైదరాబాద్ టూరిస్టులు మృతి
సాక్షి,హైదరాబాద్: తీర్థ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక నుంచి 23 మంది కలిసి ఒక ట్రావెల్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఒడిశాలోని బరంపురం సమీపంలో ప్రమాదానికి గురైంది. హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మృతులను ఉదయ్సింగ్,క్రాంతిభాయ్, ఉప్పలయ్యగా గుర్తించారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మొత్తం 20 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పర్యాటకులకు వింత ఉద్యోగాలు.. ఏంటో తెలుసా!?
పర్యాటకులు ఎక్కడకు వెళ్లినా ఖర్చుపెట్టడమే తప్ప సంపాదించుకునే అవకాశం ఉండదు. ఆస్ట్రేలియాలోని టాస్మానియా దీవి మాత్రం పర్యాటకులకు తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే, ఈ అవకాశం ఆస్ట్రేలియన్లకు మాత్రమే పరిమితం. ‘టూరిజం టాస్మానియా’ పర్యాటకులకు వింత వింత ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తోంది.‘కోవిడ్’ తర్వాత టాస్మానియాకు పర్యాటకుల రాక గణనీయంగా తగ్గిపోవడంతో స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ‘టూరిజం టాస్మానియా’ సీఈవో వెనీసా పింటో తెలిపారు. రొటీన్ ఉద్యోగాలతో విసిగిపోయిన వారికి ఈ ఉద్యోగాలు కొంత ఆటవిడుపుగా ఉంటాయని చెప్పారు. ‘టూరిజం టాస్మానియా’ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ప్రకటించిన ఉద్యోగాలు ఇవీ..పారానార్మల్ ఇన్వేస్టిగేటర్– అతీంద్రియశక్తులను అన్వేషించే పని, వైన్ విస్పరర్– వైన్యార్డుల్లో తిరుగుతూ రకరకాల వైన్లను రుచిచూసి, వాటి నాణ్యతను నిగ్గు తేల్చడం. ఓయ్స్టర్ ఆర్గనైజర్– సముద్రంలో పట్టిన ఆల్చిప్పలను ఒక క్రమపద్ధతిలో వేరు చేయడం, కేవ్కండక్టర్– పురాతన గుహలను సందర్శించే వారికి వినోదం కల్పించేందుకు సంగీత కచేరీలు నిర్వహించడం, సోనా స్టోకర్– కట్టెల మంటపై వేడిచేసిన నీళ్లతో స్నానాలు చేసే వారికోసం తగిన ఉష్ణోగ్రతలో నీళ్లు వేడిచేయడం, సోక్స్మిత్– స్నానానికి ఉపయోగించే బాత్సాల్ట్స్ తయారు చేయడం, స్టార్ సీకర్– రాత్రంతా టెలిస్కోప్తో నక్షత్రాలు చూస్తూ గడపడం, ట్రఫల్ స్నఫర్– ట్రఫల్ అనేది ఒకరకం పుట్టగొడుగు.మిగిలిన పుట్టగొడుగుల నుంచి ఈ రకం పుట్టగొడుగులను వాసన చూసి వేరు చేయడం, వోంబాట్ వాకర్– వోంబాట్ ఆస్ట్రేలియాలో కనిపించే జంతువు. కుక్కలను వాకింగ్కు తీసుకెళ్లినట్లే వోంబాట్ను వ్యాహ్యాళికి తీసుకెళ్లడం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చలికాలం. ఆస్ట్రేలియాలో ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉండే చలికాలంలో ఎక్కువమంది పర్యటనలకు వెళుతుంటారు. ‘టూరిజం టాస్మానియా’ ప్రకటన చూశాక చాలామంది టాస్మానియాకు వెళ్లడానికి పెట్టాబేడా సర్దుకుంటున్నారు. టాస్మానియాకు వెళితే, ఖర్చులు పోను ఎంతో కొంత మిగలేసుకు రావచ్చనేదే వారి ఆశ.ఇవి చదవండి: కాలానికి కళ్లెం! -
సౌదీ అతిధి గృహాల అందాలకు...పర్యాటకుల ఫిదా
పర్యాటకుల స్వర్గధామంగా వర్ధిల్లుతున్న సౌదీలో పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా అద్భుతమైన హోటల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక ప్రైవేట్ ద్వీపంలో ప్రశాంతంగా నివసించాలనుకున్నా, మారుమూల ఎడారిలో విడిది కోరుకున్నా, సందడికి కేంద్రమైన చోట విలాసవంతమైన బస కోరుకున్నా...పర్యాటకుల కోసం వైవిధ్యభరిత నివాస సౌకర్యాలను అందిస్తోంది. సౌదీపై పర్యాటకుల ఆసక్తిని రెట్టింపు చేసే వాటిలో అతిధి గృహాలు కూడా ఉన్నాయి. కొన్ని అనూహ్యమైన అద్భుతమైన నేపథ్యాలతో సెట్ చేయబడిన అతిధి గృహాలు.. అటు ప్రకృతి సౌందర్యాన్ని ఇటు సంప్రదాయం ఆధునికతను మిళితం చేస్తూ హోటల్ అనే పదానికి కొత్త నిర్వచనాలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి విశేషాలు...సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ఎడారి మైదానాలు హిజాజ్ పర్వతాలు వంటి మంత్రముగ్దులను చేసే నేపధ్యంతో ఉంటుంది సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ ఇది ఒక ది రెడ్ సీ రిసార్ట్, ఇది నబాటేయన్ నిర్మాణ వారసత్వం తో ఎడారి పరిసరాలకు వన్నె తెస్తుంది. ఎడారి పువ్వుతో ప్రేరణ పొందిన ఈ హోటల్ బసను, ఫంక్షన్లను ఒకే కప్పు క్రింద నిర్వహిస్తుంది. అతిథులు చుట్టుపక్కల ఉన్న కొండ దిబ్బల వీక్షణలను ఆస్వాదించడానికి అనుకూలంగా విల్లాలు నిర్మించారు. ఈ ప్రదేశంలో అతిథులు ఆనందించడానికి రెండు సిగ్నేచర్ రెస్టారెంట్లు, అవుట్డోర్ పూల్, ఫిట్నెస్ సెంటర్, ప్రపంచ స్థాయి సిక్స్ సెన్సెస్ స్పా ఉన్నాయి. కాండే నాస్ట్ ట్రావెలర్ ప్రచురించిన ప్రపంచంలోని ఉత్తమ హోటల్ల జాబితాలో ’2024 హాట్ లిస్ట్’లో ఇదీ ఒకటి.డెసర్ట్ రాక్ రిసార్ట్అచ్చంగా లోయలూ పర్వతాల మధ్య ఉన్న డెసర్ట్ రాక్ రిసార్ట్ హోటల్ ఒక నిర్మాణ కళాఖండం దాని అద్భుతమైన సహజ ప్రకృతిని సంరక్షిస్తూ పర్వతప్రాంతంలో పూర్తిగా కలగలిసి సిపోయింది. అతిథులు రాతితో చెక్కిన గదులలో సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు. నుజుమా, ఎ రిట్జ్ కార్ల్టన్ రిజర్వ్ ది రెడ్ సీఅద్భుతమైన సహజ సౌందర్యం స్వదేశీ డిజైన్తో సహజమైన హోటల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు రిట్జ్–కార్ల్టన్ రిజర్వ్ల ప్రత్యేక శ్రేణిలో ఇది కూడా ఒకటి. చేరింది. ఈ హోటల్ రెడ్ సీ బ్లూ హోల్ ద్వీపాల సమూహంలో భాగమైన ప్రైవేట్ ద్వీపాల సహజమైన సెట్లో నెలకొల్పారు. పూర్తిగా ప్రకృతి సౌందర్యంతో మమేకమై పర్యావరణ హితంగా రూపొందించిన ఈ రిసార్ట్లో వన్ టూ ఫోర్ బెడ్ రూమ్ పడక గదులు 63 తో పాటు బీచ్ విల్లాలు ఉంటాయి. విలాసవంతమైన స్పా, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్ల శ్రేణి...మరెన్నో ఉంటాయి.బాబ్ సంహాన్, దిరియాఈ ఏడాదే ప్రారంభమైన బాబ్ సంహాన్...యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా నిలిచిన దిరియాలో ప్రారంభించిన మొట్టమొదటి హోటల్గా ఘనత దక్కించుకుంది. సిగ్నేచర్ నజ్దీ నిర్మాణ శైలితో సమకాలీన లగ్జరీని మిళితం చేసిన ఈ హోటల్ 106 గదుల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తుంది, అతిథులను ప్రాంతపు సంస్కృతి చరిత్రలో మమేకం చేస్తుంది. నార్త్ దిరియాలోని సుందరమైన వాడి హనీఫా,అట్–తురైఫ్ రెండింటికి దగ్గరగా ఉన్నందున, అతిథులు హోటల్ సౌకర్యాలతో పాటు సమీపంలోని ఆకర్షణలను ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు.దార్ తంతోరా, అల్ ఉలాదార్ తంతోరా అనేది ది హౌస్ హోటల్ నుంచి ఒక ఉన్నత స్థాయి పర్యావరణ వసతి గృహం, ఇది కూడా ఇటీవలే ప్రారంభించారు. చారిత్రాత్మక అల్ ఉలా ఓల్డ్ టౌన్లో ఉన్న ఈ హోటల్... వారసత్వపు వైభవం, సమకాలీన డిజైన్స్ ల మేలు కలయిక, ఇది అతిథులను 12వ శతాబ్దానికి తిరిగి తీసుకువెళ్లడానికి వినూత్నంగా రూపుదిద్దారు, అదే సమయంలో వారికి ఆధునిక ఆతిథ్యం కూడా అందిస్తుంది. హోటల్లో 30 అతిథి గదులు చారిత్రాత్మక మట్టి–ఇటుక భవనాల తరహాలో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతలతో కొలువుదీరాయి. -
మనాలీ కిటకిట.. మూడు రోజుల్లో 50 వేల మంది పర్యాటకులు
వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు చల్లని ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఈ కోవలో హిమాచల్ ప్రదేశ్లోని పర్యాటక నగరం మనాలి పర్యాటకులతో సందడిగా మారింది.మనాలీలో వారాంతాల్లో పర్యాటకుల సంఖ్య రెండింతలు పెరిగింది. గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారాంతంలో అధికంగా పర్యాటకులు మనాలికి తరలివచ్చారు. మూడు రోజుల్లో 50,000 మందికి పైగా పర్యాటకులు మనాలికి వచ్చారు. పర్యాటకులతో కూడిన 7,500 వాహనాలు మనాలికి చేరుకున్నాయి.మనాలిలోని హిడింబ దేవాలయం ఆదివారం పర్యాటకులతో నిండిపోయింది. అమ్మవారి దర్శనం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రద్దీ కారణంగా కొందరు పర్యాటకులు బయటి నుండే అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు. రోహ్తంగ్, లాహౌల్ వ్యాలీతో పాటు, మనాలిలోని మాల్ రోడ్లో ప్రభుత్వం పర్యాటక ప్రదర్శన నిర్వహించింది. గ్రీన్ ట్యాక్స్ బారియర్ వద్ద బయట రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటక వాహనాల సంఖ్య 2,500 దాటింది.మనాలిలో హోటల్ గదులు 70 నుండి 90 శాతం వరకు బుక్ అయ్యాయి. పర్యాటకులు ఇక్కడి నుంచి సోలంగ్నాల, సిస్సు, కోక్సర్, రోహ్తంగ్, హిడింబ ఆలయం, వశిష్ఠలను చూసేందుకు వెళుతున్నారు. సాయంత్రం కాగానే మనాలిలోని మాల్ రోడ్డు పర్యాటకులతో నిండిపోతోంది.హోటళ్లన్నీ పర్యాటకులతో నిండిపోయాయని హోటళ్ల సంఘం అధ్యక్షుడు ముఖేష్ ఠాకూర్ తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. హిమాచల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బీఎస్ ఓక్తా మాట్లాడుతూ వారాంతపు రోజుల్లో మనాలీకి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నదని, కార్పొరేషన్లోని హోటళ్లు దాదాపుగా నిండిపోయాయని పేర్కొన్నారు. -
పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
సాక్షి, అమరావతి: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. వేసవి విడిదికి అనుకూలమైన దేశంలోని 50 ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించింది. ఇన్ క్రెడిబుల్ ఇండియాలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ‘కూల్ సమ్మర్స్ ఆఫ్ ఇండియా’ అంటూ విస్తృత ప్రచారం చేపట్టింది. మండు వేసవిలో శీతల భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6న దుబాయ్లో అరేబియన్ ట్రావెల్ మార్ట్లో కూడా ప్రచార చిత్రాన్ని ప్రదర్శించనుంది. చల్లని వాతావరణం ఉండే ప్రాంతాలు.. కేంద్ర పర్యాటక శాఖ 50కిపైగా వేసవి విడిది ప్రదేశాలతో జాబితాను రూపొందించింది. ఇందులో జమ్మూ, కశ్మీర్లోని గుల్మార్గ్, పట్నిటాప్, గ్రెజ్–మనస్బాల్, పితోర్ఘర్, ఔలి–చోప్తా, కిన్నౌర్, తీర్థన్, కేరళలోని వాయనాడ్–వాగమోన్, మిజోరంలోని ఐజ్వాల్, థెన్జాల్, సిక్కింలో లాచుంగ్–యుమ్తాంగ్, అస్సాంలోని హఫ్లాంగ్, పశ్చిమ బెంగాల్లోని కుర్సియోంగ్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు వేసవి అనుకూల గమ్యస్థానాలుగా ఉంటాయని ఆ శాఖ అభిప్రాయం. -
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
భువనేశ్వర్: ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాజకీయ పర్యాటకులు తమ రాష్ట్రానికి తరలివస్తున్నారని, తమపై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తమ ప్రజలపై ఈ రాజకీయ పర్యాటకుల ప్రభావం ఏమాత్రం ఉండదని తేలి్చచెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పొలిటికల్ టూరిస్టులుగా మారిపోయారని, కేవలం ఎన్నికల సమయంలోనే వారు ఒడిశాలో కనిపిస్తారని, ఆ తర్వాత మటుమాయం అవుతారని ఎద్దేవా చేశారు. నవీన్ పటా్నయక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పర్యాటకులు అనుచితమైన భాష ఉపయోగిస్తున్నారని, అది తమ రాష్ట్ర ప్రజలు సహించబోరని హెచ్చరించారు. -
పర్యాటకం కళకళ
సాక్షి అమరావతి : అందమైన తీర ప్రాంతం.. అపార పర్యాటక వనరులు.. తూర్పు కనుమల్లోని వైవిధ్యం.. విదేశాలను తలపించే హిల్ స్టేషన్లు.. కృష్ణా, గోదావరి అందాలు.. రాష్ట్ర పర్యాటకానికి మణిహారంగా నిలుస్తున్నాయి. దేశంలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ప్రధానంగా విశాఖలో బీచ్లకు, అరకు వ్యాలీకి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.గతేడాది విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పర్యాటక రంగంలో 117 ఒప్పందాల ద్వారా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు రూ.3049.90 కోట్ల సివిల్ వర్క్స్ ప్రారంభం అయ్యాయి. ఇవి పూర్తయితే 9,022 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.600 కోట్లతో 7 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందాలు పూర్తయ్యాయి. మరో రూ.3,757 కోట్లతో 2,750 మందికి ఉపాధి కలి్పంచేలా 15 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద (ఓఅండ్ఎం) 87 ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. రాష్ట్ర పర్యాటక సిగలో ఎన్నెన్నో.. ⇒ రూ.544 కోట్లతో రాజమహేంద్రవరంలోని గోదావరిపై ఉన్న పురాతన హేవ్లాక్ (రైల్వే) బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం. తునికి సమీపంలోని చిన్న శంకర్లపూడిలో 18 గోల్ఫ్ కోర్సులు, టూరిజం కాంప్లెక్సులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, వెల్నెస్ సెంటర్, బయోడైవర్సిటీ థీమ్ ప్రాజెక్టు. ⇒ విశాఖపటా్నన్ని టూరిజం డెస్టినీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భోగాపురంలో రూ.750 కోట్లతో 300 ఎకరాల్లో రేసింగ్ ట్రాక్, గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో రూ.243 కోట్లతో 10 ఎకరాల్లో ఐ ఆఫ్ వైజాగ్ (మెగా వీల్), రూ.100 కోట్లతో 5 ఎకరాల్లో స్కై టవర్, రూ.25 కోట్లతో స్నో వరల్డ్కు డీపీఆర్ సిద్ధమైంది. కోస్టల్ జోన్ టూరిజంలో భాగంగా 288 బీచ్లను గుర్తించి అత్యాధునిక వసతులు కలి్పస్తున్నారు. ⇒ ఆంధ్రా ఊటీగా పేరొందినæ అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా రూ.150 కోట్లతో తీర్చిదిద్దనున్నారు. ⇒ రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచి్చంది. ⇒పెనుకొండలో ఇస్కాన్ చారిటీస్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో స్పిరుచ్యువల్ కేంద్రం, అరకు, పేరూరు, కాకినాడలో 5 స్టార్ హోటల్, కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి.. పలు ప్రాంతాల్లో శిల్పారామాలు, విశాఖ లో టన్నెల్ ఆక్వేరియం హోటల్, పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్లు ఏర్పాటు కానున్నాయి. అన్న వరం ప్రాంతంలో మేఫెయిర్ సంస్థ (భువనేశ్వర్) లగ్జరీ రిసార్ట్ను అభివృద్ధి చేయనుంది. -
జపాన్కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డ్!
తూర్పు ఆసియాలోని జపాన్కు విదేశీ పర్యాటకులు పోటెత్తారు. గత మార్చి నెలలో 30 లక్షల మందికిపైగా విదేశీయులు జపాన్ను సందర్శించారు. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని ఆ దేశ ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది. జపాన్ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్ పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. -
ఆ చిల్లర విలువ ఎంత అంటే?
ప్రతి ఏటా లక్షలాదిమంది పర్యాటకులు ఇటలీ రాజధాని రోమ్ను సందర్శిస్తుంటారు. రోమ్ అందాలను చూసినవారు మళ్లీ ఇక్కడికి రావాలని అనుకుంటారు. రోమ్ని సందర్శించే పర్యాటకులు ట్రెవీ ఫౌంటెన్లో ఒక నాణెం లేదా రెండు నాణేలు విసురుతుంటారు. ఈ విధంగా ప్రతి ఏటా సుమారు ఒక మిలియన్ యూరోలు (రూ.9 కోట్లు) ఈ ఫౌంటెన్లో జమ అవుతున్నాయట. ఒక అంచనా ప్రకారం పర్యాటకులు ప్రతిరోజూ సుమారు 3000 యూరో నాణేలను ఈ ఫౌంటెన్లోకి విసిరివేస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ. 2,50,000 అంటే సంవత్సరానికి రూ.9 కోట్లు ఈ ఫౌంటెన్లోకి విసురుతున్నారన్న మాట. ట్రెవీ ఫౌంటెన్లోకి విసిరిన నాణేలను బయటకు తీసి, స్థానిక పేదలు, నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు. ట్రెవీ ఫౌంటెన్ రోమ్లోని ట్రెవీ నగరంలో ఉంది. ఈ ఫౌంటెన్ 85 అడుగుల ఎత్తు, 161 అడుగుల వెడల్పు కలిగివుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ఫౌంటెన్లలో ఒకటి. దీనికి ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వి రూపమిచ్చారు. పియట్రో బ్రాచి దీనిని నిర్మించారు. దీని నిర్మాణ పనులు 1732లో ప్రారంభమై 1762లో పూర్తయ్యాయి. రోమ్కు వచ్చే దాదాపు ప్రతి పర్యాటకుడు ట్రెవీ ఫౌంటెన్లో నాణెం విసురుతాడు. రోమ్ను మరోమారు సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ ఫౌంటెన్లో నాణేలు విసురుతారట. Tourists throw over €1 million into Italy's Trevi Fountain each year. pic.twitter.com/GVAIfciJSg — Historic Vids (@historyinmemes) March 24, 2024 కాగా ఈ పౌంటెన్లో నాణేలు విసిరేందుకు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఫౌంటెన్ దగ్గర సినిమా షూటింగ్లు, ఫ్యాషన్ షోలు తరచూ నిర్వహిస్తుంటారు. 1954లో విడుదలైన ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ ఫౌంటెన్ ఇతివృత్తం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ఫౌంటెన్ మరింత ఫేమస్గా మారింది. . -
ఇక్కడి బీచ్ల్లో రంగురాళ్లు ఏరితే, భారీ జరిమానా!
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు సముద్ర తీరానికి, బీచ్లకు,అందమైన ద్వీపాలకు వెళతాం. బీచ్లకు వెళ్లామంటే గవ్వలు, రంగు రంగుల గులకరాళ్లు ఏరుకోవడం ఒక సరాదా. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఇదొక అలవాటు మారిపోయింది. కానీ ఈ అలవాటు ప్రకృతిని, పర్యావరణా సమతుల్యతను దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ఈ నేపథ్యంలోనే కెనరీ ఐలాండ్స్ కఠిన చర్యలకు దిగింది. పర్యావరణ పరిరక్షణకోసం స్పెయిన్కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లాంజరోటే, ఫుయెర్తెవెంట్యురా ద్వీపాల్లోని సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరడాన్ని నిషేధించింది. రాళ్లను సేకరించే టూరిస్టులకు రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బీచ్లు క్షీణించకుండా పర్యాటకులకు అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. మాస్ టూరిజం కారణంగా కానరీ ద్వీపాలు దెబ్బతింటున్నాయంటున్నారు అధికారులు. కానరీ దీవుల్లోని దీవులకు వచ్చే పర్యాటకులు తమతో పాటు రంగురాళ్లు, ఇసుకను తీసుకువెళతారట. పర్యాటకుల రాళ్లను తీసుకెళ్లే అలవాటుతో అక్కడి సహజ సమతుల్యత దెబ్బతింటోందని ఆ దేశం భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ఈ రాళ్లు,మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా అక్కడి అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు ఏటా తీరంవెంబడి భారీ స్థాయిలో ఇసుక, మట్టి కోల్పోతోందని వెల్లడించారు. కానరీ దీవులు ఏడు ప్రధాన ద్వీపాల సమూహం. ఇందులో టెనెరిఫే, గ్రాన్ కానరియా, లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా, లా పాల్మా, లా గోమెరా , ఎల్ హిరో. ఈ ద్వీపాలలో టెనెరిప్ ద్వీపం కానరీ దీవులలో అతిపెద్ద ద్వీపం. స్పెయిన్లోని అతిపెద్ద పర్వతం మౌంట్ టీడే ఇక్కడే ఉంది. -
తెరుచుకోనున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
జమ్మూకశ్మీర్లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ మాట్లాడుతూ మార్చి 23న ఈ గార్డెన్ను ప్రారంభించనున్నారని, ఇక్కడి పూలు అందరినీ తప్పక ఆకట్టుకుంటాయని అన్నారు. తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు. -
మంచులో చిక్కుకున్న పర్యాటకులను కాపాడిన ఆర్మీ సిబ్బంది
తూర్పు సిక్కింలోని గ్యాంగ్టక్లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అకస్మాత్తుగా భారీ హిమపాతం కురియడంతో తూర్పు సిక్కింలోని నటులాలో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వారిని ఆర్మీ బృందం కాపాడింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది. దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲 Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ — Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024 -
ఆతిథ్య రంగం జోరు..
ముంబై: ఆతిథ్య రంగం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–13 శాతం మేర వృద్ధి చెందనుంది. దేశీయంగా పర్యాటకానికి డిమాండ్ స్థిరంగా కొనసాగనుండటంతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరగనుండటం ఇందుకు తోడ్పడనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 15–17 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది. డిమాండ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా హోటల్స్ లభ్యత ఒక మోస్తరుగానే పెరుగుతుండటంతో సమీపకాలంలో పరిశ్రమ లాభదాయకత ప్రస్తుత, వచ్చే ఆరి్థక సంవత్సరాల్లో మెరుగ్గా ఉండనుందని నివేదిక వివరించింది. గదుల అద్దె రేట్లు (ఏఆర్ఆర్) సగటున ఈ ఆరి్థక సంవత్సరం 10–12 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరం 5–7 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఆక్యుపెన్సీ ఆరోగ్యకరంగా 73–74 శాతం స్థాయిలో కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ టూరిస్టుల రాక ఈ ఆరి్థక సంవత్సరమూ పెరగనున్నప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 10 శాతం తక్కువగానే నమోదు కావచ్చని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది ఇది పుంజుకోగలదన్నారు. ఆచితూచి పెట్టుబడులు.. డిమాండ్ పుంజుకోవడం పరిశ్రమ సెంటిమెంటు మెరుగుపడేందుకు ఊతమిస్తున్నప్పటికీ కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశ్రమ ఆచితూచి వ్యవహరిస్తోందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలిపారు. ‘స్థల సేకరణ వ్యయాలు అధికంగా ఉండటం, నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, పరిశ్రమ సైక్లికల్ స్వభావం కారణంగా లాభాలకు మళ్లాలంటే సుదీర్ఘ సమయం పట్టనుండటం వంటి అంశాల వల్ల కొత్తగా పెట్టుబడి వ్యయాలు చేయాలంటే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కాబట్టి బ్రాండ్లు తమ ముందస్తు పెట్టుబడి వ్యయాలను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా గదులను పెంచుకోవడాన్ని కొనసాగించే అవకాశం ఉంది‘ అని కన్సల్ పేర్కొన్నారు. ఏఆర్ఆర్పరమైన ఆదాయ వృద్ధితో సమానంగా నిర్వహణ వ్యయాలు పెరగకపోవడం వల్ల లాభదాయకత మెరుగుపడగలదని ఆయన చెప్పారు. హోటళ్లు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గత రెండేళ్లుగా సిబ్బందిని, ఫుడ్.. బెవరేజ్ల వ్యయాలను క్రమబదీ్ధకరించుకుంటూ పలు చర్యలు తీసుకోవడం కూడా పరిశ్రమకు సానుకూలాంశమని కన్సల్ వివరించారు. -
అటల్ టన్నెల్లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్!
హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్తంగ్లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హిమాచల్తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు. రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు..
అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయోధ్యలో పెరుగుతున్న రద్దీ చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని.. పర్యాటక రంగంలో ఉత్తరప్రదేశ్ అగ్రగామి అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం అంచనా వేసింది. ఈ ఏడాది అయోధ్యను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరగడంతో ఉత్తరప్రదేశ్లో దేశీయ, విదేశీ పర్యాటకుల మొత్తం ఖర్చు ఈ ఏడాది చివరి నాటికి 4 లక్షల కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మునుపటి కంటే కూడా రూ. 20000 నుంచి రూ. 25000 కోట్లు ఎక్కువని అంచనా..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలోని ఆధ్యాత్మిక పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఆధ్యాత్మిక టూరిజంలో ఉత్తరప్రదేశ్ గణనీయ వృద్ధి సాధించనుంది. గంగా నది, వారణాసి, తాజ్ మహల్ వంటి పర్యాటక ప్రదేశాల జాబితాలో అయోధ్య రామాలయం కూడా చేరిపోయింది. 2022లో మాత్రమే 32 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ సందర్శించారు. ఇందులో కేవలం అయోధ్యను మాత్రమే సందర్శించిన వారు 2.21 కోట్లు. ఇది 2021తో పోలిస్తే ఏకంగా 200 శాతం ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 'కాంతి ఘోష్' ప్రకారం, ఉత్తరప్రదేశ్లో దేశీయ పర్యాటకులు దాదాపు రూ. 2.2 లక్షల కోట్లు, విదేశీ పర్యాటకులు రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే యూపీలో పర్యాటకుల ఖర్చు మొత్తం రూ.2.3 లక్షల కోట్లని తెలుస్తోంది. 2019లో అంతర్జాతీయ పర్యాటక వసూళ్లలో భారతదేశం వాటా 14వ ర్యాంక్తో 2.06 శాతం తక్కువగా ఉండేది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కూడా, ఇది ఆరవ ర్యాంక్తో కేవలం 7 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. ఇది రాబోయే రోజుల్లో తప్పకుండా వృద్ధి చెందుతుందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అవగతమవుతోంది. జీడీపీలో ఉత్తరప్రదేశ్ వాటా.. 2028 ఆర్ధిక సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఏకంగా 500 బిలియన్ డాలర్లగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ వృద్ధి భారతదేశ జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు 2027 - 2028లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అప్పటికి ఆర్ధిక వృద్ధిలో 500 బిలియన్ డాలర్ల మార్కుని అధిగమించే రెండు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటిగా ఉండనుంది. ఇది నార్వే, హంగేరీ మొదలైన యూరోపియన్ దేశాల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
పదండి.. డైనోసార్లను వేటాడుదాం!
ఒకప్పుడు అడవుల్లో వేట కామన్. నాడు రాజులు సరదాకి చేస్తే.. ఆదివాసీలు ఇప్పటికీ ఆహారం కోసం వేటాడుతుంటారు. ఏ జింకలో, అడవి పందులో అయితే సరే. మరీ పులిని వేటాడాలంటే కష్టం. అది నిషేధం కూడా. మరి ఏకంగా డైనోసార్నే వేటాడాలనుకుంటే.. అందుకు అఫీషియల్గా లైసెన్స్ కూడా ఇస్తే.. ఆశ్చర్యంగా అనిపిస్తోందా.. ఆ సంగతులేమిటో తెలుసుకుందామా.. అది డైనోసార్ ల్యాండ్.. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల డైనోసార్ల అవశేషాలు బయటపడినా.. అమెరికా మాత్రం స్పెషల్. ఒకప్పుడు భారీ సంఖ్యలో డైనోసార్లు తిరుగాడిన నేల అది. అందులోనూ ఉటా రాష్ట్రంలోని వెర్నల్ ప్రాంతంలో వేలకొద్దీ డైనోసార్ల శిలాజాలను గుర్తించారు. మనం డైనోసార్లను వేటాడటానికి అధికారికంగా లైసెన్సులు ఇచ్చేది కూడా ఇక్కడే. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పర్యాటకులు అక్కడికి వెళ్లినప్పుడు దరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ ఇచ్చేస్తారు. కానీ వేటాడటానికి డైనోసార్లు దొరుకుతాయా అని మాత్రం అడగొద్దు సుమా. పర్యాటకం కోసం.. శిలాజాల గుర్తింపు కోసం.. ఉటా ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచేందుకు, డైనోసార్ల శిలాజాల వెలికితీతకు ఊపునిచ్చేందుకు 1951లో ‘డైనోసార్ హంటింగ్ లైసెన్స్’లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతానికి ‘డైనోసార్ కంట్రోల్ ఏరియా ఆఫ్ యూంటా కౌంటీ’ అని పేరు పెట్టారు. ఈ వినూత్న ఆలోచనతో పర్యాటకులు కూడా పెరిగారు. ఏటా 60 వేల మందికే లైసెన్స్లు ఇస్తారు. అంతేకాదు చాలా రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. ►లైసెన్స్ పొందినవారు టీ–రెక్స్ డైనోసార్లలో కేవలం ఒక పెద్ద మగదానిని మాత్రమే వేటాడాలి. ►ఒక డిప్లోడాకస్ గిగాంటికస్ (అతిభారీ శాఖాహార డైనోసార్)ను వేటాడొచ్చు. అయితే దాని బరువు 5 వేల పౌండ్లు (2,268 కేజీలు)కన్నా ఎక్కువగా ఉండాలి ►ఏవైనా రెండు మగ స్టెగోసార్ (వీపుపై ముళ్లలా ఉండేవి) డైనోసార్లను వేటాడొచ్చు. ►టెరోడాక్టిల్ (పక్షుల్లా ఎగిరేవి) డైనోసార్లను అయితే నాలుగింటిని వేటాడొచ్చు. అయితే ఇందులో పిల్ల డైనోసార్లు ఉండొద్దు. కుప్పలు కుప్పలుగా డైనోసార్ల ఎముకలు ఉటా స్టేట్లోని వెర్నల్ ప్రాంతంలో సుమారు రెండు లక్షల ఎకరాల ప్రాంతంలో ‘డైనోసార్ నేషనల్ మాన్యుమెంట్’ ఉంది. దీన్నే డైనోసార్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతమంతా సుమారు 15 కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల శిలాజాలు ఉన్నాయి. కొన్నిచోట్ల పదుల కొద్దీ డైనోసార్ల శిలాజాలు కుప్పల్లా ఉండటంతో.. ‘డైనోసార్ ఎముకల క్వారీ’లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. పర్యాటకులు ఈ ప్రాంతంలో కలియదిరగవచ్చు. కొన్ని డైనోసార్లను ముట్టుకోవచ్చు కూడా. ..మరి పదండి.. డైనోసార్లను వేటాడుదాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
చార్మినార్లో కనీస సౌకర్యాలు కరువు
హైదరాబాద్: చార్మినార్ చూసేందుకు వచ్చన సందర్శకులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో పర్యాటకులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి తాగునీటితో పాటు బ్యాగులు ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు క్లాక్రూంలు అందుబాటులో లేవు. భద్రతాచర్యల దృష్ట్యా చార్మినార్కట్టడంలోని బ్యాగ్లతో పాటు ఇతర వస్తువులను అనుమతించరు. దీంతో తమ వెంట తెచ్చుకున్న బ్యాగులు, ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ► రోజూ సందర్శకుల ద్వారా వస్తున్న ఆదాయం రోజురోజుకు పెరుగుతున్నా.. సందర్శకులకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లభించడం లేదనే విమర్శలున్నాయి. ► వీకెండ్లలో పర్యాటకుల సంఖ్య రోజుకు 5 వేల నుంచి 6 వేలకు పైగా ఉంటుండటంతో వారి ద్వారా ఏఎస్ఐకు దాదాపు రెండు లక్షల వరకు ఆదాయం ఉంటుందని అంచనా. రోజుకు లక్షల్లో ఆదాయం వస్తున్నా.. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని ప్రశ్నిస్తున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ... దేశ విదేశాల నుంచి చార్మినార్ కట్టడాన్ని సందర్శించే పర్యాటకుల సౌకర్యార్థం అవసరమైన చర్యలు చేపట్టడానికి పురాతత్వశాఖ (ఏఎస్ఐ– ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు ఆసక్తి చూపడం లేదని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయంపై చూపిస్తున్న శ్రద్ధ సౌకర్యాల ఏర్పాటులో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినార్ల కెమికల్ ట్రీట్మెంట్ పనులు.. మినార్లకు కేవలం కెమికల్ ట్రీట్మెంట్ పనులు మాత్రమే చేపడుతున్నారని సందర్శకులకు అవసరమైన సౌకర్యాల పట్ల ఏమాత్రం దృష్టి సారించడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారి్మనార్ కట్టడంలో సందర్శకులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. కట్టడంలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయడం లేదని పలువురు వాపోతున్నారు. రిమోట్ ప్రెసెంస్ కియోస్కీని ఏర్పాటు చేయాలి.. చారి్మనార్ కట్టడంలో గతంలో ఏర్పాటు చేసిన రిమోట్ ప్రెసెంస్ కియోస్కీ ప్రస్తుతం కనుమరుగైంది. మక్కా మసీదు, ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు, యునాని, ఫలక్నుమా ప్యాలెస్, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్ తదితర పురాత న కట్టడాలను దగ్గరగా కనులారా తిలకించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2002 జూన్ 8న చార్మినార్ కట్టడంలోని ఒక చోట చార్మినార్ రిమోట్ ప్రెసెంస్ క్రియోస్కిని ఏర్పాటు చేశారు. రూ.28 లక్షల వ్యయంతో.. దాదాపు రూ. 28 లక్షల రూపాయల వ్యయంతో పురాతన కట్టడాలను దూరంగా ఉన్నవాటిని దగ్గరగా చూసేందుకు చార్మినార్ కట్టడంలో రిమోట్ ప్రెసెంస్ క్రియోస్కిని ఏర్పాటు చేశారు. దీనికోసం చారి్మనార్ పైభాగంలో నాలుగు కెమెరాలను అమర్చారు. కొన్నేళ్ల పాటు రెండు కెమెరాలు పనిచేయకుండా పోయాయి. మిగిలిన రెండు కెమెరాల ద్వారా సందర్శకులు చార్మినార్, మక్కామసీద్, ఫలక్నుమా ఫ్యాలెస్లను తిలకిస్తున్నారు. ప్రస్తుతం అవి కూడా పనిచేయడం లేదని సమాచారం. టచ్ స్క్రీన్ ఆనవాళ్లు కూడా చారి్మనార్ కట్టడంలో కనిపించకుండా పోయాయి. పనిచేయని రిమోట్ ప్రెసెంస్ కియోస్కీ టచ్ర్స్కీన్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. -
2023లో ‘ఉదయ్పూర్’ ఎందుకు మారుమోగింది?
2023కు జ్ఞాపకాలతో వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. నూతన సంవత్సరానికి ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు మనమంతా సిద్ధం కావాల్సిన తరుణం వచ్చేసింది. అయితే 2023 రాజస్థాన్లోని ఉదయపూర్కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దీనికితోడు 2023లో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా కూడా పేరు తెచ్చుకుంది. ఉదయ్పూర్ జీ-20ని స్వాగతించింది. రెండు భారీ డెస్టినేషన్ వెడ్డింగ్లు కూడా ఉదయపూర్లో జరిగాయి. ట్రావెల్ అండ్ లీజర్ 2023లో విడుదల చేసిన జాబితాలో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా పేరు తెచ్చుకుంది. పర్యాటకుల అభిరుచి, స్థానిక సంస్కృతి, ఆహారం, షాపింగ్, వివిధ పర్యాటక ప్రదేశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో ఉదయపూర్ నగరానికి 93.33 రీడర్ స్కోర్ లభించింది. ప్రపంచంలోని నలుమూలలకు చెందిన పర్యాటకులు ఉదయ్పూర్ను ఎంతగానో ఇష్టపడుతుంటారు. భారత్ అధ్యక్షతన తొలి జీ-20 సమావేశం ఉదయపూర్లో జరిగింది. రెండవ జీ-20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ (ఎస్ఎఫ్డబ్ల్యుజీ) సమావేశం కూడా ఇక్కడే జరిగింది. దీనిలో 90 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్లకు ప్రసిద్ధి చెందింది. 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఇక్కడే వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్లో జరిగిన వీరి వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన తారలే కాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ప్రేమికుల రోజున ఉదయపూర్లో నటాషాను వివాహం చేసుకున్నారు. స్టార్ హోటల్ రాఫాల్లో క్రైస్తవ ఆచారాల ప్రకారం జరిగిన ఈ వివాహానికి హార్దిక్ కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
అమెరికా టూరిస్టులపై చైనా కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా నుంచి వచ్చే పర్యాటకుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది తొలి రోజు నుంచి చైనాకు వచ్చే అమెరికా పర్యాటకులకు నిబంధనల్లో భారీ సడలింపులు ఇచ్చింది. రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్లు, హోటల్ రిజర్వేషన్ ప్రూఫులు, చైనా నుంచి అందిన ఇన్విటేషన్లు తీసుకురావాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్లోని చైనా ఎంబసీ ఒక ప్రకటన చేసింది. చైనా, అమెరికా ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపర్చేందుకే ఈ నిబంధనల సడలింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో చైనా ఎంబసీ తెలిపింది. అయితే కొవిడ్తో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, మలేషియా దేశాల పౌరులకు 15 రోజుల పాటు దేశంలో పర్యటించేందుకుగాను వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత నెలలో చైనా ప్రకటించడం గమనార్హం. కొవిడ్కు ముందు ఏడాది 2019లో చైనాలో విదేశీ టూరిస్టుల ఎంట్రీ ఎగ్జిట్లు 977 మిలియన్లు నమోదవగా ఈ ఏడాది అవి 8.4 మిలియన్లకు పడిపోయాయి. చైనా పర్యాటక రంగం ఎంత దారుణంగా దెబ్బతిన్నదో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఇదీచదవండి.. ట్రంప్ పోరాటం వాటితోనే.. 15 నుంచి ఎన్నికల రేసు స్టార్ట్ -
వైష్ణోదేవి సమక్షంలో నూతన సంవత్సరం సందడి
నూతన సంవత్సరం సందర్భంగా జమ్ముకశ్మీర్లోని వైష్ణో దేవి క్షేత్రంతో సహా హిమాచల్లోని పలు శక్తిపీఠాలను నందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. వైష్ణోదేవి ఆలయానికి ఇప్పటికే 50 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా. నూతన సంవత్సరం సందర్భంగా హిమాచల్లోని అన్ని శక్తిపీఠాలను పూలతో అందంగా అలంకరించారు. జ్వాలాజీ, బజరేశ్వరి, చాముండ, నయన దేవి, చింతపూర్ణి క్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నయన దేవి క్షేత్రంలో నూతన సంవత్సర మేళా ప్రారంభమైంది. ఆలయ తలుపులు 22 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. కాంగ్రాలోని చాముండ దేవాలయం తలుపులు తెల్లవారుజామున 4:00 గంటలకే తెరిచారు. హిమాచల్లోని పలు హోటళ్లు ఇప్పటికే భక్తులతో నిండిపోయాయి. అదే సమయంలో మనాలికి 60 నుంచి 70 వేల మంది పర్యాటకులు తరలివచ్చారు. డిసెంబర్ 31 (ఈరోజు) సాయంత్రం నాటికి ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా. మరోవైపు సిమ్లా ఇప్పటికే టూరిస్టులతో నిండిపోయింది. రోహ్తంగ్ పరిధిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలో ఆకాశం మేఘావృతమైంది. కాగా జమ్మూ కాశ్మీర్లోని పట్నిటాప్, నత్తతోప్, పహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్ తదితర పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హిమాచల్ సిద్ధమైంది. కసౌలి, చైల్, డల్హౌలీలు పర్యాటకులతో నిండిపోయాయి. ఖజ్జియార్లోని హోటళ్లలో 85 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. శనివారం సాయంత్రం నాటికే వందలాది మంది పర్యాటకులు డల్హౌసీ, ఖజ్జియార్కు చేరుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది పర్యాటకులు హిమాచల్ చేరుకున్నారు. సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్, మనాలి మాల్ రోడ్లలో నూతన సంవత్సరానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, హోటళ్లను 24 గంటలూ తెరిచే ఉంచనున్నారు. ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇది కూడా చదవండి: అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? -
హిమాచల్కు టూరిస్టుల తాకిడి!
హిమాచల్ ప్రదేశ్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది. సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం పలు హోటళ్ల యజమానులకు సూచించింది. ఇది కూడా చదవండి: బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
2023లో కశ్మీర్ను ఎంతమంది సందర్శించారు?
కశ్మీర్ అనే పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన ప్రదేశం కదలాడుతుంటుంది. అయితే ఇంతలోనే అక్కడ ఉగ్రవాదం నీడలు ఉన్నాయన్న వాస్తవం కూడా కళ్లముందుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది చేపడుతున్న చర్యలు తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెలకొన్న శాంతియుత పరిస్థితుల్లో కశ్మీర్కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది(2023) దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది లోయలో మెరుగైన భద్రతా పరిస్థితికి తార్కాణంగా నిలిచిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అనడం సరైనదికాదన్నారు. ఇదిలా ఉండగా గురువారం పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీని గురించి విలేకరులు.. జితేంద్ర సింగ్ను అడిగినప్పుడు అలాంటి సంఘటనలను మరువలేమని, సంబంధిత ఏజెన్సీలు వాటిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాగా పర్యాటకులు తమకు కశ్మీర్లో తగిన భద్రత ఉందని భావించినందునే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారని జితేంద్ర సింగ్ తెలియజేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
వీసా లేకుండానే వియత్నాంకి: టూరిస్టులకు బంపర్ ఆఫర్
థాయ్లాండ్, శ్రీలంక తరువాత వియత్నాం కూడా త్వరలోనే భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పనేంది. వీసా లేకుండా ఆ దేశంలో పర్యటించేందుకు భారతీయులకు అవకాశం కలగనుంది. టూరిస్టులను ఆకర్షించే పథకంలో భాగంగా ఈ యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే శ్రీలంక, థాయ్లాండ్ తర్వాత భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్న మూడో దేశంగా వియత్నాం అవతరించనుంది. వియత్నాం సంస్కృతి, క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి న్గుయిన్ వాన్ జంగ్, చైనా, భారత్ వంటి ప్రధాన మార్కెట్లకు స్వల్పకాలిక వీసా మినహాయింపులపై కీలక సూచన చేశారు. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చిన ఆయన కొంతకాలం పాటు ఈ మినహాయింపు నిచ్చేందుకు యోచిస్తోందని వియత్నాం వార్తా సంస్థ VnExpress నివేదించింది. 2023 ఏడాదిలో తొలి పది నెలల్లో, వియత్నాంను సందర్శించిన అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య దాదాపు 10 మిలియన్ల దాటింది. 2022 నుండి 4.6 రెట్లు పెరిగింది.కోవిడ్కు ముందు, వియత్నాంను సందర్శించిన ఇండియా టూరిస్టలు సుమారు 1,70,000 మంది . ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్ , ఫిన్లాండ్ జాతీయులు ప్రస్తుతం వీసా లేకుండా వియత్నాంలో ప్రయాణించవచ్చు. కాగా అక్టోబర్లో, థాయ్లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 10 నుండి మే 10, 2024 వరకు ఆరు నెలల పాటు భారతదేశం, తైవాన్ నుండి పర్యాటకులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
అహ్మదాబాద్లో పర్యాటకుల రద్దీ
ప్రపంచ కప్- 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు (నవంబర్ 19, ఆదివారం) గుజరాత్లోని అహ్మదాబాద్లోగల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం దేశ, విదేశాల నుంచి క్రికెట్ ప్రేమికులు అహ్మదాబాద్కు తరలివచ్చారు. వీరంతా అహ్మదాబాద్లోని పలు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. దీంతో ఇక్కడి సబర్మతి ఆశ్రమం, భద్ర కోట, అక్షరధామ్ ఆలయం, గుజరాత్ సైన్స్ సిటీ, నైట్ మార్కెట్ ఆఫ్ లా గార్డెన్, కైట్ మ్యూజియం, అదాలజ్ స్టెప్వెల్ మొదలైనవన్నీ పర్యాటకులతో రద్దీగా మారాయి. ఈ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్లో పేరుగాంచిన ప్రముఖ ప్రదేశాలలో సబర్మతి ఆశ్రమం ఒకటి. సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీకి చెందిన, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అనేక స్ఫూర్తిదాయక, ప్రేరణాత్మక వస్తువులను చూడవచ్చు. కంకారియా సరస్సు అహ్మదాబాద్లో కంకారియా సరస్సు అందమైన పర్యావరణానికి ప్రతీకగా నిలిచింది. కంకారియాలో అరుదైన జంతువుల అభయారణ్యం ఉంది. ఇది పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కిడ్స్ సిటీలో థియేటర్, హిస్టారికల్ సెంటర్, రీసెర్చ్ లాబొరేటరీ, ఐస్ క్రీం ఫ్యాక్టరీ మొదలైనవి ఉన్నాయి. భద్ర కోట అహ్మదాబాద్లోని జామా మసీదు సమీపంలో భద్ర కోట ఉంది. దీనిని 1411లో నిర్మించారు. కోట నుండి అహ్మదాబాద్ నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళ ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. లా గార్డెన్ నైట్ మార్కెట్ లా గార్డెన్కు చెందిన నైట్ మార్కెట్ను సందర్శించకపోతే అహ్మదాబాద్ పర్యటన అసంపూర్ణం అవుతుందని అంటారు. ఈ మార్కెట్లో చేతితో తయారు చేసిన గుజరాతీ దుస్తులు, వివిధ వస్తువులు లభ్యమవుతాయి. ఇది కూడా చదవండి: భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు -
కొల్లేరులో వి‘హంగామా’
శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. ఇక్కడే పుట్టి.. బతుకు పయనంలో వేల కిలోమీటర్ల మేర వలస పోయిన అతిథి పక్షులు గమనం తప్పకుండా ఏటా మాదిరిగానే విడిది కోసం కొల్లేరు అభయారణ్యానికి వస్తున్నాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుని.. పిల్లలతో కలిసి విదేశాలకు వలస పోయేంతవరకు ఇక్కడే గూళ్లు కట్టుకుని సందడి చేస్తుంటాయి. నిండా పక్షులతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతం ఈ ఏడాదీ పర్యాటకులకు ఆహ్వా నం పలుకుతోంది. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ దృష్ట్యా ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాల వద్ద పర్యాటకుల కోసం అటవీ శాఖ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అంచనా వేస్తోంది. - కైకలూరు 105 రకాల పక్షులున్నాయ్ కొల్లేరు అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులు ఉన్నట్టు ఏషియన్ వాటర్ బర్ట్స్ సెన్సస్–2023 నివేదిక వెల్లడించింది. ఇక్కడ మొత్తం 81,495 పక్షులు ఉన్నట్టు నిర్థారించారు. వీటిలో అత్యధికంగా 7,875 కోయిలలు ఉండగా.. రెండో స్థానంలో 6,869 పెలికాన్లు (గూడబాతులు) ఉన్నట్టు తేల్చింది. వీటితోపాటు ఎర్రకాళ్ల కొంగ (పెయిండెడ్ స్టార్క్), కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), నల్లరెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్) వంటి అనేక పక్షి జాతులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఇవికాకుండా కొల్లేరు అభయారణ్యానికి ఏటా 3 లక్షల నుంచి 4 లక్షల పక్షులు విహారానికి వస్తున్నాయి. వీటిలో సుమారు 1.20 లక్షల పక్షలు విదేశాల నుంచి విడిది కోసం వచ్చే పక్షులు ఉంటున్నాయి. కొల్లేరు ప్రాంతాన్ని పక్షులు సంచరించే ప్రయాణంలో ‘సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే’ అంటారు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం కావడంతో వలస పక్షుల ఇక్కడ విడిది చేసేందుకు ఇష్టపడతాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర 30 దేశాల నుంచి వివిధ వలస జాతుల పక్షులు విచ్చేస్తాయి. అక్టోబర్ నుంచి వీటి రాక మొదలవుతుంది. మార్చి నాటికి సంతానోత్పత్తి చేసుకుని ఇవి తిరిగి తిరిగి వెళ్లడం అనవాయితీగా వస్తోంది. ఎకో టూరిజానికి ప్రతిపాదనలు జిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్ల ఖర్చు కాగల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 10 ప్రదేశాలను పర్యాటక శాఖ గుర్తించింది. రానున్న రోజుల్లో కొల్లేరు ఎకో టూరిజం పర్యాటక శాఖకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుంది. ప్రధానంగా పర్యాటకులు విచ్చేసే పక్షుల విహార కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రండి రండి.. ఇలా చేరుకోండి విజయవాడ.. ఏలూరు.. భీమవరం ప్రాంతాల నుంచి కైకలూరు–భీమవరం జాతీయ రహదారి మీదుగా ఆటపాక చేరుకోవచ్చు. ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. బస్సు దిగిన తరువాత పక్షుల కేంద్రానికి నడక మార్గంలో చేరుకోవచ్చు. విజయవాడ–విశాఖపట్నం రైలు మార్గంలో కైకలూరు రైల్వే స్టేషన్లో దిగి ఆటోలపై మూడు కిలోమీటర్ల దూరంలో పక్షుల కేంద్రానికి చేరవచ్చు. పక్షుల కేంద్రం, మ్యూజియం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెరిచి ఉంటాయి. రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు ఆటపాక పక్షుల కేంద్రం వద్ద రూ.30 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పక్షుల నివాసాలకు కృత్రిమ ఇనుప స్టాండ్లు, పక్షుల విహార చెరువు గట్లు పటిష్టపర్చడం, గోడలకు పక్షుల చిత్రాలు, పర్యాటకులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులు చేయనున్నాం. పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధికి అటవీ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తోంది. – జె.శ్రీనివాస్, అటవీశాఖ రేంజర్, కైకలూరు -
టూరిస్టులకు థాయ్లాండ్ బంపర్ ఆఫర్
పర్యాటకులకు థాయ్లాండ్ (Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని నిర్ణయించింది. సీజన్ సమీపిస్తున్నందున ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు థాయ్ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు. తాజా నిర్ణయంతో భారత్ తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్లాండ్లో పర్యటించవచ్చని అధికార ప్రతినిధి చై వచరోంకే తెలిపారు. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సీజన్లో 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ప్రయాణ రంగం ద్వారా వచ్చే ఆదాయంతో ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారిన బలహీన ఎగుమతులను లోటును భర్తీ చేయాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. కాగా థాయ్లాండ్కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్నుంచే ఎక్కువ పర్యాటకుల తాకిడి ఉంటుంది. జనవరి -అక్టోబర్ 29 మధ్య, థాయ్లాండ్కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు. తద్వారా దేశానికి భారీ ఆదాయమే సమకూరింది. 2019లో రికార్డు స్థాయిలో వచ్చిన 39 మిలియన్ల టూరిస్టుల్లో 11 మిలియన్లతో టాప్లోని లిచింది చైనా.ఈ నేపథ్యంలోనే అయిన కోవిడ్ తరువాత టూరిజం మార్కెట్కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన చైనీస్ టూరిస్టుల కోసం సెప్టెంబరులో వీసా అవసరం లేకుండానే పరిమిత కాల పర్యటనకు అవకాశం కల్పించింది. -
ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య శనివారం ఉదయం నుండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన దాడిలో మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు -
ఫ్రెండ్ కారులో వీకెండ్ ట్రిప్కు చెక్కేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
వీకెండ్లోనో, లేదా అత్యవసరం అనుకున్నపుడో ఫ్రెండ్కారును తీసుకొని వెళ్లడం చాలామందికి అలవాటు. అలాగే అద్దె కారులో అయినా సరే హిల్ స్టేషన్లకు చెక్కేస్తారు చాలామంది. అయితే అలాంటి వారి గుండ గుభిల్లు మనే వార్త ఇది. స్రేహితుడి కారులో రోడ్ ట్రిప్కు వెళ్లిన ఒక ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరలవుతోంది. ఫ్రెండ్ కారు తీసుకొని హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన టూరిస్ట్లకు భారీ పెనాల్టి విధించారు అక్కడి పోలీసు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను సీతారామ్ 12456 తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. దీని ప్రకారం అక్కడి ట్రాఫిక్ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఆపారు. చిన్న వీడియోలో కుటుంబం ప్రయాణిస్తున్న కారు కనిపించలేదు. కానీ వీడియోలోని వ్యక్తి తన స్నేహితుడి కారులో ప్రయాణిస్తున్నాడని చెప్పాడు. అతను చూపించిన పత్రాలను చూసిన పోలీసులు మరొకరి కారును ఉపయోగించడనాఇకి అనుమతిలేదని చలాన్ జారీ చేస్తామని డ్రైవర్కు చెప్పడం, దీంతో ఇరువురూ కాసేపు వాదించు కోవడం చూడొచ్చు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్న పోలీసులు అసలు కారు ఓనరుకు ఫోన్ చేసి మరీ నిర్ధారించుకున్నారు. చివరికి చలానా విధించారు. (ట్రంప్ టవర్స్లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్వుతారు) అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటంటే స్నేహితుడు లేదా బంధువు కారును వారి సమ్మతితో తీసుకు వెళ్లడం, నడపడం నిజానికి చట్టవిరుద్ధం కాదు. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న చాలామంది టూర్ ఆపరేటర్లు కమర్షియల్ వెహికల్ ట్యాక్స్ ఆదా చేసేందుకు పర్యాటకులకు ప్రైవేట్ రిజిస్టర్డ్ కార్లను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలా వ్యవహరించారా అనేది తేలాల్సి ఉంది. అసలు యజమాని నుండి సమ్మతితో కారును తీసుకున్నట్లయితే, అది చట్టవిరుద్ధం కాదు. ఒకవేళ పోలీసులు తప్పుగా చలాన్ జారీ చేస్తే, ఈ విషయాన్ని క్లియర్ చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే చెన్నైలో యజమానికి తెలియకుండా స్నేహితుడి లేదా బంధువుల వాహనం నడుపుతూ పట్టుబడితే, చెన్నై పోలీసులు మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా విధిస్తారు. సాధారణ తనిఖీల సమయంలో కారు లేదా బైక్ తమ స్నేహితుడిదేనని చాలా మంది పేర్కొంటున్నందున, నగరంలో వాహనాల దొంగతనాల సంఖ్యను తగ్గించేలా ఇలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే హైదరాబాద్లో ఇలాంటి నిబంధన ఉన్నట్టుగా అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) -
జనం.. గగనయానం!
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఏపీలోని విశాఖపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. రైలులో వెళ్లి రావాలంటే.. మూడు, నాలుగు రోజులు సెలవు పెట్టాలి. పైగా సుదీర్ఘ ప్రయాణంతో ఇబ్బంది. దీంతో విమానంలో వెళ్లాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్కు వచ్చేసి యథావిధిగా ఆఫీసుకు వెళ్లాడు. కీసర ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నాలుగు రోజుల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారు. విమాన టికెట్లు అందుబాటులో ఉండటంతో బుక్ చేసుకుని సింగపూర్ చుట్టి వచ్చేశారు. ఇదీ ప్రయాణికుల రద్దీ 2022 ఏప్రిల్నుంచి జూలై వరకు ప్రయాణికుల సంఖ్య: 26,73,979 పెరిగిన ప్రయాణికుల శాతం:28.2% ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు సంఖ్య: 34,29,083 ..రాష్ట్రంలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారనేందుకు ఈ రెండు చిన్న ఉదాహరణలే. దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం పట్టడం, ప్రయాణ బడలిక, ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది విమాన ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండటం, విదేశాలకు వెళ్లేందుకు వీసాలు కూడా సులువుగా లభిస్తుండటంతో విదేశాలకు వెళ్లేవారూ పెరుగుతున్నారు. మరోవైపు చదువుల కోసం విదేశాలకు వెళ్లివచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. దీనితోనూ విమానాలకు డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు, ఆహా్వనం పలికేందుకు వస్తున్న బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు ఎయిర్పోర్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి రావడం గమనార్హం. ఒక్క జూలై నెలలోనే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. 25శాతం పెరిగిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపి రోజూ సుమారు 400 వరకు విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. సగటున రోజూ 65వేల మందికిపైగా వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ సంఖ్య 70వేలకుపైగా ఉంటోందని, విదేశాలకు వెళ్లే విద్యార్ధులే రోజూ సుమారు 5 వేల మంది వరకు ఉంటున్నారని ఎయిర్పోర్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాకు వెళ్లే విద్యార్ధులతోపాటు పర్యాటకులు, బంధువుల వద్దకు వెళ్లేవారు కూడా పెరిగారని అంటున్నారు. ఇక దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు,వ్యాపారం,ఇతర పనులపై రాకపోకలు సాగించేవారు ఎక్కువయ్యారని చెప్తున్నారు. గత ఏడాది జూలైలో 16,01,281 మంది విమాన ప్రయాణం చేయగా.. ఈసారి ఆ సంఖ్య 25శాతం పెరిగి 20 లక్షలకుపైగా నమోదైంది. అవసరం ఏదైనా విమానం ఎక్కాల్సిందే.. దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలు, ఇతర ముఖ్యమైన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన కనెక్టివిటీ పెరిగింది. యూరప్తోపాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, మాల్దీవులు, ఢాకా వంటి దేశాలు, అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు కోవిడ్ తర్వాత చాలా మంది విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్నట్టు ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక రంగ సంస్థలు చెప్తున్నాయి. ఒకప్పుడు తప్పనిసరి అయితే తప్ప విమాన ప్రయాణం జోలికి వెళ్లనివారు కూడా.. ఏమాత్రం అవకాశం ఉన్నా విమానంలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నాయి. కొంత ఖర్చయినా ఫర్వాలేదు, విమానంలో వెళ్లాలనే కోరికతో సాధారణ, మధ్య తరగతి వర్గాలవారు కూడా విమానం ఎక్కేస్తున్నారని పేర్కొంటున్నాయి. -
పర్యాటకుల రెస్టారెంట్ బిల్లు కట్టిన ఇటలీ ప్రభుత్వం
రోమ్: ఇటలీకి చెందిన ముగ్గురు పర్యాటకులు పొరుగుదేశం ఆల్బేనియాకు వెళ్లారు. అక్కడ రెస్టారెంట్లో తిని బిల్లు కట్టకుండా చెక్కేశారు. ఇటలీ ప్రధాని మెలోనీ ఇటీవల కుటుంబంతో కలిసి ఆల్బేనియాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్బేనియా ప్రధాని ఈడి రమా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని మెలోనీ తీవ్ర అవమానంగా భావించారు. దేశం పరువు తీశారంటూ తమ దేశస్తులపై మండిపడ్డారు. ‘వెళ్లి ఆ నలుగురు ఇడియట్స్ బిల్లు కట్టండి’అంటూ అక్కడి తమ దౌత్యాధికారులను ఆదేశించారు. వారు వెళ్లి రూ.7,245 బిల్లును సదరు రెస్టారెంట్ నిర్వాహకులకు చెల్లించి వచ్చారు. నిబంధనలు, సంప్రదాయాలను పాటించాలని, ఇటువంటివి మరోసారి జరక్కుండా జాగ్రత్తపడాలని తమ దేశస్తులకు ఇటలీ ఎంబసీ సూచించింది. కొందరు వ్యక్తులు బిల్లు చెల్లించకుండానే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోతున్నట్లుగా సదరు రెస్టారెంట్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఫుడ్ ఐటమ్స్ ఎంతో బాగున్నాయంటూ సదరు నలుగురు ఇటాలియన్లు తమను మెచ్చుకున్నారని కూడా తెలపడం విశేషం. -
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న యాత్రికులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొడియాల వద్ద 1500 వాహనాలు నిలిచిపోగా సుమారు 20 వేల మంది రోడ్ల మీద చిక్కుకుపోయారు. సుమారు 40 కి.మీ మేర యాత్రికులు, స్థానికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు దారిపొడవునా ఆవస్థలు పడుతున్నారు. కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ మరలలేక అక్కడే నిలిచిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వీరిలో ఏపీ, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమ్మల్ని ఎలాగైనా బయట పడేయమని విపత్తులో చిక్కుకున్న యాత్రికులంతా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని అభ్యర్థిస్తున్నారు. ఇది కూడా చదవండి: చెన్నైలో నిత్య పెళ్లికొడుకు కల్యాణసుందరం అరెస్ట్ -
తాజ్మహల్ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ధారావి(ముంబై). దీనిని సుందరంగా మార్చే బాధ్యతను ఆదానీ గ్రూప్ తన చేతుల్లోకి తీసుకుంది. అయితే మహారాష్ట్రలోని రాజకీయ ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు నుంచి అదాని గ్రూపును తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ భారీ స్లమ్ ఏరియాకు పర్యాటకులు తాకిడి మరింతగా పెరిగింది. ప్రతీయేటా వేలాదిమంది విదేశీయులు ఈ స్లమ్ ఏరియాను సందర్శించేందుకు వస్తున్నారు. ఇక్కడి పేదల దుర్భర పరిస్థితులను అసక్తిగా గమనిస్తున్నారు. దేశంలోని తాజ్మహల్ను చూసేందుకు వచ్చేవారికన్నా ఈ స్లమ్ ఏరియాకే అధికంగా పర్యాటకులు వస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. 18వ శతాబ్ధంలో కొందరు మత్స్యకారులు తమ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. కూలీనాలీ చేసుకుంటూ ఇక్కడే ఉంటూ వచ్చారు. తరువాతి కాలంలో వివిధ వృత్తుల వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 20 వ శతాబ్ధం నాటికి ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్కూళ్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆసుపత్రులు.. ఇలా అన్ని సౌకర్యాలు ఈ ప్రాంతంలో సమకూరాయి. ప్రస్తుతం ఇది ఆసియాలో అతి పెద్ద మురికివాడగా పేరొందింది. సుమారు 550 ఎకరాల్లో విస్తరించిన ధారావి.. లెక్కకుమించిన గుడిసెలు కలిగిన బస్తీలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడి ఒక్కో గుడిసెలోనూ 10 మందికిపైగా వ్యక్తులు ఉంటున్నారు. దీనిని పరిశీలించి చూస్తే ఇక్కడి జనాభా ఎంత అధికమో తెలుస్తుంది. ధారావి మురికివాడలో 10 లక్షలకుపైగా జనాభా ఉండవచ్చని అంచనా. ఇక్కడికి వచ్చే టూరిస్టులు గంటల తరబడి ఇక్కడే ఉంటూ, ఇక్కడి పరిస్థితులను గమనిస్తుంటారు. పేదలు ఎలా జీవిస్తుంటారు? వారి దినచర్య ఎలా ఉంటుందనేది వీరు గమనిస్తారు. ఈ నేపధ్యంలో పలు అంశాలకు సంబంధిచిన వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా ఇటువంటి మురికి వాడలు మనదేశంలోనే కాకుండా ఆఫ్రికాదేశాలైన యుగాండా, కెన్యా, కేప్టౌన్లలోనూ కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: నది దగ్గర తన పనిలో మునిగిన పాల వ్యాపారి.. కలెక్టర్ ఫొటోతో గుట్టు రట్టు -
ఆతిథ్యానికి అందలం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రం.. పర్యాటక రంగం అభివృద్ధిలోనూ వేగంగా ముందుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికతో రాష్ట్రంలో పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. లగ్జరీ విల్లాలు, 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటుతో పర్యాటకులను ఆకర్షించడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. సులభతర వాణిజ్యంలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తోంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇందులో విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు), గండికోటలో నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే పిచ్చుకలంక, హార్సిలీహిల్స్లో కూడా ఒబెరాయ్ నిర్మాణాలకు ఒప్పందాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఒక్క ఒబెరాయ్ సంస్థల ద్వారానే సుమారు 10,900 మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. తాజాగా విశాఖలో మేఫెయిర్, తిరుపతిలో ఎంఆర్కేఆర్ (హయత్) సంస్థల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపింది. వీటికి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ వెంటనే స్థలాలను సైతం కేటాయించింది. తిరుపతిలో 5 స్టార్ హోటల్ ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఏటా 30 నుంచి 40 మిలియన్ల యాత్రికులు వస్తుంటారు. దీనికి తోడు చెన్నై – తిరుపతి – నెల్లూరు పారిశ్రామిక హబ్ కూడా ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో తిరుపతిలోని పేరూరులో 5 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ ( హయత్ గ్రూప్) ముందుకొచ్చింది. రూ.218 కోట్ల పెట్టుబడితో 1550 మందికిపైగా ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించింది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.230.08 కోట్ల ఆదాయం లభించనుంది. ఇందులో సుమారు 144 గదులు (స్టాండర్డ్, సుపీరియర్, డీలక్స్, సూట్స్), అత్యాధునిక రెస్టారెంట్, కాన్ఫరెన్స్, బ్యాంకెట్ హాల్, వివాహాలు, ఎగ్జిబిషన్లకు ప్రత్యేక వేదిక, హెల్త్ హబ్ ఇతర ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. విశాఖలో రూ.525 కోట్లతో విల్లాల సముదాయం విశాఖపట్నానికి సమీపంలోని అన్నవరం వద్ద మేఫెయిర్ సంస్థ (భువనేశ్వర్) అత్యాధునిక లగ్జరీ రిసార్ట్ను అభివృద్ధి చేయనుంది. సుమారు 40 ఎకరాల్లో రూ.525 కోట్లతో 250 రిసార్టులను నిర్మిస్తుంది. దీని ద్వారా 1,750 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.852.40 కోట్లు ఆదాయం లభిస్తుంది. ఇందులో భారీ కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్, మినీ గోల్ఫ్ కోర్సు, 4,500 మంది కూర్చునేలా బ్యాంకెట్ హాల్, మరో 10 చిన్న బ్యాంకెట్ హాళ్లు, ఓపెన్ స్కై బ్యాంకెట్ హాల్, షాపింగ్ మాల్స్ ఉంటాయి. రూ.69.37 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తొలి దశలో భాగంగా విశాఖపట్నంలోని అన్నవరం, పేరూరు, గండికోట గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. సుమారు రూ.69.37 కోట్లతో గ్రామాల్లో పెద్ద రహదారులను కలుపుతూ రోడ్ల నిర్మాణం, నీటి సౌకర్యం మెరుగుదల, ప్రత్యేక విద్యుత్ లైన్లు, అత్యాధునిక మురుగు పారుదల వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. వీటికి త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనుంది. సీఎం జగన్ బ్రాండింగ్తోనే పెట్టుబడులు సీఎం జగన్ బ్రాండింగ్తో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి హోటల్ రంగ సంస్థలు వస్తున్నాయి. ఒబెరాయ్తో పాటు మేఫెయిర్, హయత్ గ్రూప్ల హోటళ్లు, లగ్జరీ విల్లాల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇచ్చాం. పర్యాటకంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పనే ఈ ప్రాజెక్టుల లక్ష్యం. జీఐఎస్లో కుదిరిన ప్రతి ఒప్పందాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకొస్తాం. తిరుపతి, విశాఖ, గండికోటను ప్రపంచ పటంలో మరింత ఉన్నతంగా నిలబెడతాం. పర్యాటకానికి అవకాశాలుండే ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. తద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షిస్తాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు
పనాజీ: కర్ణాటక గోవా సరిహద్దులో పర్యాటక ప్రాంతమైన దూధ్ సాగర్ జలపాతాలను దగ్గరగా చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న పర్యాటకులను రైల్వే పోలీసులు అడ్డుకుని వారితో గుంజీలు తీయించారు. రైలులో గోవా వెళ్తుండగా మార్గమధ్యలో కిటికీల్లోంచి కనిపించే అందమైన పర్యటక దృశ్యం దూద్ సాగర్ జలపాతాలు. దూరం నుంచి చూస్తేనే అంత ఆహ్లాదంగా ఉండే ఈ జలపాతాలను దగ్గరగా చూడాలని కొందరు ఔత్సాహికులైన పర్యాటకులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. గతంలో అడవి గుండా జలపాతాలను చేరేందుకు మార్గం ఉండేది. కానీ ఇటీవల ఇక్కడికి సమీపంలోని మైనాపీ జలపాతాల వద్ద ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ దోవను మూసివేశారు. దీంతో పర్యాటకులు దూధ్ సాగర్ చేరుకోవడానికి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. అది ఇంకా ప్రమాదమని రైల్వే పోలీసులు అనేకమార్లు పర్యాటకులను హెచ్చరిస్తున్నా వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం అయితే వందల కొద్దీ పర్యాటకులు ఈ మార్గం గుండా వెళ్తూ రైల్వే పోలీసుల కంటపడ్డారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన రైల్వే పోలీసులు నిబంధనలను అతిక్రమించిన వందల టూరిస్టులతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. A huge crowd who set out to watch Dudhsagar Waterfalls in Goa were seen on the railway tracks after authorities denied them entry As per social media accounts, some of them were also asked to perform squats by Railway Police personnel as punishment#Dudhsagarwaterfall pic.twitter.com/jh7uzHcJiR — ET NOW (@ETNOWlive) July 16, 2023 దక్షిణ పశ్చిమ రైల్వే వారు ట్విట్టర్ వేదికగా దయచేసి దూధ్ సాగర్ జలపాతాలను రైలులో నుండే చూసి ఆస్వాదించండి. రైలు పట్టాలెక్కి కాదు. అలా చేస్తే ఇకపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. We urge you to savour the beauty of Dudhsagar Falls from WITHIN your coach. Walking on/along tracks not only endangers your own safety but is also an offence under Section 147, 159 of Railway Act. It can also endanger safety of trains. (1/2) pic.twitter.com/Puj7hKh5JF — South Western Railway (@SWRRLY) July 16, 2023 ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
నా అడ్డాలోకి వస్తే ఇలానే ఉంటుంది.. బీకేర్ ఫుల్!
పులిని కాస్త దూరంలో చూసినా పైప్రాణాలు పైకే పోతాయేమో అన్నట్లే భయపడతాం. అదే పులి ఒక్క ఉదుటన దూకి వస్తే ఇంకెలా ఉంటుంది.. ఇక ఆ పరిస్థితి వర్ణణాతీతమే. ఈ తరహా ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో చూస్తే మాత్రం పులి భయపెట్టిన తీరు అలా సరదాగా రైడ్కు వెళ్లిన వారి వెన్నులో వణుకు పుట్టించిదనే చెప్పాలి కొంతమంది కలిసి టాప్ లెస్ జీప్లో ‘విహార యాత్ర’ కు బయల్దేరారు. వారు అలా స్లోగా వెహికల్లో వెళుతుండగా, పులి ఉన్నపళంగా దూకుతూ వారిపైకి రాబోయింది. వారు గట్టిగా కేకలు వేస్తూ వెహికల్ను ముందుకు కదిలించే క్రమంలో కూడా పులి మరొక్కసారి బయపెట్టింది. ‘ నా అడ్డాలోకి వస్తే ఇలానే ఉంటుంది’ అనేంతగా జర్క్లు ఇచ్చింది. అంతే వారు అక్కడ ఉండటం మంచిది కాదని విషయం అర్ధమై మెల్లగా జారుకున్నారు. పులి కూడా వారు వెళ్లిపోవడం చూసి ఇక దాడి చేయడానికి వెనుకాడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని బట్టి ఏమి అర్ధమవుతుందంటే వన్య ప్రాణాల జోలికి వెళితే ఏమైనా జరగొచ్చనే విషయం అవగతమవుతోంది. ఏదో సరదాగా కోసం ముచ్చటపడితే మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. Bhaiya, chalo chalo...ho gaya!!!🤣 pic.twitter.com/E3oPegDwaF— Dr. Ajayita (@DoctorAjayita) July 15, 2023 -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్పూర్ వస్తుంటారు. -
లఢక్ పర్యటకుని నిర్లక్ష్యం.. సోయగాల ఒడిలో కమ్ముకున్న దుమ్ము మేఘాలు..
లఢక్: భూతల స్వర్గం కశ్మీర్.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్ను పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్సర్ సైట్లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రామ్సైట్ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది. Shared by a fellow birder from #Ladakh... this stupidity is getting out of hand. This seemingly "barren" landscape is teeming with #life- and the short summer is when that life is at its peak. That too at a Ramsar Site! These idiots need to be named, shamed and booked!… pic.twitter.com/wRpYkkYf6p — Mofussil_Medic (@Daak_Saab) July 9, 2023 ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్లో పర్యటకులకు భారీ ట్యాక్స్లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్లో రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్లాలా దర్శనభాగ్యం! -
సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్గా షార్క్ దూసుకురావడంతో..
అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీరంలో ఆ క్షణంలో భయానక వాతావరణం ఏర్పడింది. సముద్రంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా స్నానం చేస్తున్న వారి మధ్యలోకి ఉన్నట్టుండి ఒక భారీ షార్క్ ప్రత్యక్షమయ్యింది. దీంతో వారంతా నీటిలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ భారీ షార్క్ నీటి మీద తేలియాడుతూ సముద్రంలో సేద తీరుతున్నవారి దిశగా దూసుకువచ్చింది. ఈ షార్క్ను బీచ్లో నుంచి చూసినవారు సముద్రంలో సయ్యాటలాడుతున్న వారిని హెచ్చరిస్తూ బయటకు వచ్చేయండంటూ గట్టిగా కేకలు పెట్టారు. గతంలో న్యూయార్క్లోని ఫైర్ ఐలాండ్ను 15 ఏళ్ల కుర్రాడిని షార్క్ చంపేసినప్పటి నుంచి జనాలకు షార్క్లంటే విపరీతమైన భయం పట్టుకుంది. తాజాగా ఫ్లోరిడా బీచ్లో కనిపించిన షార్క్ భారీ ఆకారంతో ఉండటంతో అక్కడున్న వారంతా భయపడిపోయారు. ఆ క్షణంలో అక్కడ ఆందోళనకర వాతావారణం ఏర్పడింది. గతంలో షార్క్ దాడిలో బాలుడు మృతి చెందడం, దీనికి ముందు షార్క్ దాడిలో కొందరు గాయపడటాన్ని స్థానికులు మరోమారు గుర్తుచేసుకున్నారు. ‘అది ఆకలితో ఉన్నట్టుంది’ ఫ్లోరిడాలో ఆ సమయంలో సముద్రతీరంలో సేదతీరిన క్రిస్టీ కాక్స్ మాట్లాడుతూ తాను ఆ షార్క్ను చూసినప్పుడు అది ఆహరపు వేటలో ఉన్నట్లు అనిపించిదన్నారు. అందుకే అది వేగంగా కదులుతూ మనుషులవైపు వచ్చిందన్నారు. దానిని చూడగానే అక్కడున్న వారంతా నిశ్చేష్టులైపోయారన్నారు. ఎలాగోలా అందరూ దారి బారి నుంచి తప్పించుకున్నారన్నారు. కాగా గతంలో పలువురిపై షార్క్ దాడులు జరగగా, వారిలో కొందరు వికలాంగులుగా మారిపోయారు. ఇది కూడా చదవండి: ‘ఇదేం పువ్వు రా బాబూ.. ముక్కు పేలిపోతోంది’ -
15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. ప్రయాణికుల నరకం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురిసిన వర్షాలతో నదుల్లో వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. అటు భారీగా కురిసిన వర్షాలతో కొండ చరియలు రహదారులపై విరిగిపడ్డాయి. దీంతో మండి, కులును కలిపే జాతీయ రహదారిని బ్లాక్ చేశారు పోలీసులు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా మండీలోని చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నత్తనడకన కదులుతున్న వాహనాలతో పర్యటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 200 మంది పర్యటకులు రాత్రంతా రోడ్లపైనే ఉండిపోయారు. ముందుకు వెళ్లలేక వెనకకు మళ్లలేక పిల్లలతో సహా కుటుంబాలతో కలిసి రోడ్లపైనే ఉన్నామని చెప్పారు. ఇదో పీడకలలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఎడతెరిపి లేని వర్షంతో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు జాతీయ రహదారులతోసహా 124 రోడ్లు దెబ్బతిన్నాయని సీనియర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి ఒకరు తెలిపారు. భారీ వర్షాల కారణంగా దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. వరదలతో వివిధ జిల్లాల్లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. #WATCH | Heavy rainfall in Himachal Pradesh's Mandi district leads to landslide on Chandigarh-Manali highway near 7 Mile; causes heavy traffic jam (Drone Visuals from Mandi) pic.twitter.com/tmpPZ8aUbM — ANI (@ANI) June 26, 2023 ఇదీ చదవండి: కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..? కొండ చరియలు విరిగిపడగా.. ఆదివారం సాయంత్రం 5 గంటలకే రహదారిని మూసివేశారని పర్యటకులు తెలిపారు. రాత్రంతా రోడ్డుపైనే ఉన్నట్లు చెప్పారు. బస చేయడానికి హోటల్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. దాదాపు 200 వందల కార్లపైనే వరుసగా ఉండిపోయాయని చెప్పారు. కొందరు బస్సుల్లో విహారయాత్రకు వచ్చి రాత్రంతా అందులోనే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విరిగిపడిన కొండ చరియలను రోడ్డుపై నుంచి ఎప్పుడు తొలగిస్తారో.. ఇంకా ఎంత సమయం వేచి ఉండాలో కూడా అధికారులు తెలపట్లేదని చెప్పారు. "The administration has said that there is a landslide ahead. I don't have much info, we have been here since 5 am," says a tourist from Scotland, who has been stranded in a traffic jam following a landslide on Chandigarh-Manali highway near 7 Mile pic.twitter.com/sWKeJpe5zq — ANI (@ANI) June 26, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
ఈ యాప్ మహిళల కోసమే.. వాళ్లే ఆపరేటర్లు, గైడ్లు కూడా!
ఇంతవరకు ఎన్నో యాప్లు చూశాం. కానీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఉండే యాప్లు గురించి వినలేదు కదా. మహిళలు మాత్రమే ధైర్యంగా తమకి నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేలా భద్రతతో కూడిన యాప్లు ఇంతవరకు రాలేదు. టూరీజంలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారు తమ స్నేహితులతో పూర్తి భద్రతతో వెళ్లేలా సరికొత్త యాప్ని రంగంలోకి తీసుకువచ్చింది ఓ రాష్ట్రం. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో వారికి టూరిస్టు గైడ్గా మహిళలే ఉంటారు. ఇదంతా ఎక్కడ? ఆ యాప్ ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే.. వివరాల్లోకెళ్తే..ఒంటరిగా ఉండే మహిళలు లేదా కేవలం మహిళలు తమ స్నేహితులతో టూర్కి వెళ్లాలనుకున్నా.. ఏ మాత్రం భయపడకుండా భద్రంగా వెళ్లేందుకు ఓ సరికొత్త యాప్ని తీసుకొచ్చింది కేరళ రాష్ట్రం. ఈ మేరకు కేరళ రాష్ట్రం సందర్శన కోసం మహిళా స్నేహపూర్వక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వారికి టూరిస్ట్ ఆపరేటర్లు, గైడ్లుగా మహిళలే ఉండేలా తగిన సౌకర్యాలతో కూడిన మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించాలని నిర్ణయించింది కేరళ. అందులో భాగంగానే ఫ్రెండ్లీ టూరిజం విమెన్ ప్రాజెక్టును నోడల్ ఏజెన్సీ అయిన స్టేట్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ చేపట్టి.. అందుకోసం ఓ యాప్ను కూడా సిద్దం చేయమని కోరింది . ఈ యాప్లో సామాజిక సాంస్కతిక అంశాలతో సహా అన్ని స్థాన నిర్ధిష్ట సమాచారం, చిత్రాలు ఉంటాయి. అలాగే కేరళలోని వివిధ ప్రాంతాల విశేషాల గురించి ఆ యాప్లోనే ఉంటుంది. రాష్ట్రంలో మహిళా పర్యాటకులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వ విధాన ప్రాధాన్యత అని పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు సొంతంగా లేదా వ్యక్తిగతంగా గుంపులుగా దూర ప్రాంతాలకు వెళ్లడం ఓ ట్రెండ్గా మారిన ప్రంపంచంలో మనం జీవిస్తున్నాం అన్నారు. ఈ యాప్ సాయంతో మహిళలు హ్యాపీగా పర్యటించిలే గాకుండా వారికెలాంటి ఇబ్బంది తలెత్తదని మంత్రి రియాస్ ధీమగా చెప్పారు. సుమారు 1.5 లక్షల మంది మహిళలు.. ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి మహిళల జెండర్ ఇన్క్లూజివ్ టూరిజం కాన్సెప్ట్కు అనుగుణంగా గతేడాది అక్టోబర్లో రియాస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చొరవ తోపాటు పర్యాటక శాఖ అనేక రకాల మహిళా స్నేహపూర్వక పర్యాటక ఉత్పత్తులు, ప్యాకేజీలను విడుదల చేస్తోంది. సుమారు 1.5 లక్షల మంది మహిళలు పాల్గొనే లక్ష్యంతో యూఎన్ మహిళలతో సహా వివిధ సంస్థల మద్దతుతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యాటక రంగంలో సుమారు 10 వేల మంది మహిళా వెంచర్ల తోసహా దాదాపు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. యాప్లో ఉన్న సౌలభ్యం.. ఈ యాప్లో మహిళలకు అనుకూలమైన పర్యాటక ఉత్పత్తులు, ప్యాకేజీలు, రిసార్ట్లు, హోటళ్లు, మహిళా సంస్థలు, గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్లు, మహిళా టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు హోమ్ స్టేలు, మహిళా టూర్ గైడ్ల తదితర అన్ని వివరాలు ఉంటాయి. అంతేగాదు ఈ యాప్లో మహిళల నేతృత్వంలోని హస్తకళలు, సావనీర్ ఉత్పత్తి, విక్రయ యూనిట్లు, విశ్రాంతి గదులు, క్యాంపింగ్ సైట్లు, లైసెన్స్ హౌస్బోట్లు, కారవాన్ పార్కులు, వివిధ ప్రదేశాలలో జాతి వంటకాల యూనిట్లు, పండుగలు, అనుభవపూర్వక సాహస ప్యాకేజీలు వంటి సౌకర్యాలు ఉంటాయి. యాప్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేలా ఈ ఆర్టీ మిషన్ భారీగా కసరత్తు ప్రారంభించింది. ఆర్టీ మిషన్ చేపట్టిన ఫ్రెండ్లీ విమెన్ టూరిజం ప్రాజెక్టు కింద సుమారు 1800 మంది మహిళలు వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన మహిళలకి జూలై నుంచి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఉంటుంది. (చదవండి: అటు అండమాన్.. ఇటు దుబాయ్... ఎక్కడికి వెళ్లడం సులభం? ఎంత ఖర్చవుతుందంటే..) -
కొండచరియల బీభత్సం చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు..!
-
కేరళలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 22 మంది మృతి
తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో విషాద ఘటన జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తానూర్లోని పర్యాటక ప్రాంతం తూర్వాల్ తీరమ్ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది బోటులో ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఆరుగురిని కాపాడామని యంత్రాంగం తెలిపింది. రూ.2లక్షల పరిహారం.. ఈ విషాధ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రూ.2లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi — PMO India (@PMOIndia) May 7, 2023 సీఎం విచారం.. ఈ బోటు ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్పై జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు సంతాపం తెలిపారు. Deeply saddened by the tragic loss of lives in the Tanur boat accident in Malappuram. Have directed the District administration to effectively coordinate rescue operations, which are being overseen by Cabinet Ministers. Heartfelt condolences to the grieving families & friends. — Pinarayi Vijayan (@pinarayivijayan) May 7, 2023 చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత -
పర్యాటక ద్వీపం.. హోప్ఐలాండ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మనకు అండమాన్ నికోబార్, లక్షదీవుల గురించి తెలుసు. అక్కడ విహరించాలనుకునేవారూ ఎక్కువే. అయితే దూరాభారం, అధిక వ్యయం వల్ల వెనుకడుగు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో మనకు సమీపంలోనే బంగాళాఖాతంలోనే ఉన్న హోప్ ఐలాండ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాకినాడ సముద్ర తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం దాదాపు 150 ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడింది. ఈ కాలంలో వచ్చిన ఎన్నో తుపాన్ల నుంచి పెట్టని కోటగా నిలిచి కాకినాడ నగరాన్ని, నౌకాశ్రయాన్ని హోప్ ఐలాండ్ రక్షించింది. 1996లో నవంబర్ 6న తుపాను విజృంభణతో తీరమంతా చిగురుటాకులా వణికిపోయి వందలాది మంది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. అంతటి విలయంలో సైతం హోప్ ఐలాండ్ను విడిచి ఒక్క కుటుంబం కూడా బయటకు రాకపోవడం విశేషం. వృద్ధ గౌతమి, తుల్యభాగ నదీ పాయలతో.. మన రాష్ట్రంలోని సముద్ర జలాల్లో ఉన్న ఏకైక ద్వీపం.. హోప్ ఐలాండ్. ధవళేశ్వరం ఆనకట్ట దిగువన వృద్ధ గౌతమి నదీ పాయ యానాం సమీపంలో సముద్రంలో కలుస్తోంది. అలాగే కోరింగ మడ అడవుల సమీపంలో తుల్యభాగ పాయ సముద్రంలో అంతర్భాగమవుతోంది. ఈ రెండు పాయల నుంచి వచ్చిన ఇసుక కారణంగానే హోప్ ఐలాండ్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోదావరి బంగాళాఖాతంలో కలిసే ప్రాంతానికి 50 కిలోమీటర్ల ఎగువన 1850లో కాటన్ ఆనకట్ట నిర్మాణం జరిగింది. ఈ బ్యారేజ్ నిర్మాణం తర్వాత ఈ హోప్ ఐలాండ్ వేగంగా విస్తరించిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. బ్యారేజ్తో గోదావరి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డాక నదీ ప్రవాహంలో వచ్చిన మార్పులతో ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఈ మేటలతోనే ద్వీపం ఏర్పడిందని చెబుతున్నారు. 18 కిలోమీటర్లు పొడవు, 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ద్వీపం కాకినాడ నగరానికి, పోర్టుకు ఆయువుపట్టుగా నిలుస్తోంది. వందేళ్ల క్రితమే జనసంచారం.. ఈ ద్వీపంలో జనసంచారం వందేళ్ల క్రితమే మొదలైంది. ఇప్పుడు అక్కడున్నది రెండో తరం. హోప్ ఐలాండ్లో నివసిస్తున్న వారి పూర్వీకులంతా సముద్రతీరంలోని వివిధ గ్రామాల నుంచి వలస వచ్చి స్థిరపడ్డవారే. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఈ ద్వీపాన్ని గుర్తించి వేటకు అనుకూలమని అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐలాండ్లో తొలి నివాసం ఏర్పాటు చేసుకున్న పుత్రయ్య పేరుతో దాన్ని పుత్రయ్యపాకలుగా పిలుస్తున్నారు. మొదట్లో సీజన్ సమయంలో ఈ ఐలాండ్కి వచ్చి, చేపల వేట పూర్తి అయ్యాక తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోయే వారు. కాలక్రమంలో అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సోలార్ విద్యుత్ సదుపాయం ఉంది. చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ ఎక్కడ బోరు వేసినా మంచినీరే లభిస్తుండటం విశేషం. సముద్రం నడిబొడ్డున ఉన్న ఆ పల్లెలో 118 కుటుంబాలు నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మక్కువతో అక్కడే నివాసం.. హోప్ ఐలాండ్లో నివసించేవారు ఏ చిన్న సరకులు కావాల్సినా పడవపైన సముద్రం దాటి కాకినాడ రావాల్సిందే. ఐలాండ్లో ఉంటున్న పలువురికి కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయినా వారంతా అక్కడి వాతావరణంపై మక్కువతో తిరిగి ద్వీపానికి వెళ్లిపోయారు. వీరి ఓట్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగిలో ఉన్నాయి. హోప్ ఐలాండ్కు ఇలా చేరుకోవాలి.. హోప్ ఐలాండ్ పర్యాటకులు ఆస్వాదించేందుకు ఎంతో అనువైన ప్రాంతం. ఇక్కడకు వెళ్లడానికి కాకినాడ నుంచి సూర్యోదయానికి ముందు బయలుదేరితే సముద్ర అలల ఉధృతి తక్కువగా ఉండి ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాకినాడ నుంచి హోప్ ఐలాండ్ చేరుకోవాలంటే సాధారణ ఇంజిన్ బోటులో గంట ప్రయాణం. కాకినాడ హార్బర్ నుంచి లేదా నగరంలోని జగన్నాథపురం నుంచి బోటులో హోప్ ఐలాండ్కు చేరుకోవచ్చు. అయితే పర్యాటకులు ముందుగా హార్బర్లో అటవీ అధికారుల అనుమతులు తీసుకోవాలి. గతంలో ఏపీ టూరిజం అధికారులు ద్వీపానికి వెళ్లే పర్యాటకుల కోసం కాకినాడ జగన్నాథపురం బకింగ్హామ్ కెనాల్ నుంచి బోట్లు కూడా నడిపారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సముద్ర ప్రయాణం, హోప్ఐలాండ్ తీరం ఆస్వాదించేందుకు పర్యాటకులు వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు జరిగాయి. పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు హోప్ ఐలాండ్కు పర్యాటకులు రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తాం. అక్కడున్న కుటుంబాలకు సదుపాయాలు మెరుగుపరుస్తాం. –కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఉంటాం ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఉంటాం. మా పూర్వీకులు కూడా ఇక్కడే గంగమ్మతల్లి ఒడిలో జీవించారు. మాకు సముద్రమంటే భయం లేదు. తుపానులతో కూడా మాకేమీ కాదు. హోప్ ఐలాండ్లో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నాం. ఇలా చేస్తే పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది.– మచ్చా బాగయ్య, స్థానికుడు, హోప్ ఐలాండ్ -
బాబోయ్.. టూరిస్ట్లపై పులి ఎటాక్! వీడియో వైరల్
-
పర్యాటకులను ఆకర్షిస్తున్న లంబసింగి రిసార్ట్స్
-
శిల్పారామాలు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శిల్పారామాలు పర్యాటకులతో నిత్యం కళకళలాడుతున్నాయి. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే 125 శాతం మేర సందర్శకుల తాకిడి పెరిగింది. కోవిడ్ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న శిల్పారామం సొసైటీ ఏడాది కాలంలోనే అనూహ్యంగా వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా మెరుగైన రాబడి లభించింది. గతంలో ఎప్పుడూ నష్టాల్లోనే నడిచిన శిల్పారామాలు 2022–23లో ఏకంగా రూ.2 కోట్ల వరకు లాభం గడించడం రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది శిల్పారామాలు ఉండగా సగటున ప్రతినెల 1.25 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి గ్రామీణ వాతావరణానికి ప్రతీకలుగా నిలిచే శిల్పారామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తిరుపతి, కడప శిల్పారామాల్లో మల్టీపర్పస్ హాల్, డైనింగ్ హాల్, టాయిలెట్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా శిల్పారామాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా బోటింగ్ (జలవిహారం) కార్యకలాపాల పనులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్–జిమ్, సందర్శకులను ఆకట్టుకునేలా పెయింటింగ్ డిస్ప్లేలను ఏర్పాటు చేసింది. మిగిలిన శిల్పారామాల్లోను ఈ తరహా వినోదాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గుంటూరు శిల్పారామం పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పులివెందుల శిల్పారామంలో పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కొత్త శిల్పారామాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, రాయచోటిల్లో అర్బన్ హట్స్ (శిల్పారామాల) నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లతో కర్నూలులో, రూ.9.20 కోట్లతో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బండపల్లిలో శిల్పారామాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీ, భూ సేకరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు విశాఖ, కాకినాడ, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరుల్లో ఒక్కోచోట రూ.1.50 కోట్లతో హస్తకళల మ్యూజియాల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. జిల్లాకో శిల్పారామం ప్రతి జిల్లాలో శిల్పారామం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన వాటా స్కీమ్లను సది్వనియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శిల్పారామాల్లో పచ్చదనాన్ని కాపాడుతూనే ఆధునికీకరణ చేపడుతున్నాం. అందుకే రాష్ట్ర విభజన తర్వాత గణనీయమైన వృద్ధిని సాధించాయి. నెలకు 1.25 లక్షల మంది సందర్శకులు రావడం ఇందుకు నిదర్శనం. – ఆర్.కె.రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి చక్కని ఆటవిడుపు కేంద్రాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా శిల్పారామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాం. చక్కని ఆటవిడుపు కేంద్రాలుగా పిల్లలు, పెద్దలు కూడా సంతోషంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ముఖ్యంగా బోటింగ్ కార్యకలాపాలపై దృష్టిసారించాం. హస్తకళలు, కళాకారుల కోసం శిల్పారామాల్లో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్, స్టేజ్లను అందిస్తున్నాం. – శ్యామ్ప్రసాద్రెడ్డి, సీఈవో, శిల్పారామం సొసైటీ -
సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురు పర్యాటకులు సజీవ సమాధి..
గ్యాంగ్టాక్: మంచుసోయగాలు, ప్రకృతి రమణీయతను చూసేందుకు వచ్చిన పర్యాటకులను ప్రకృతి హిమపాతం రూపంలో కబళించింది. సిక్కింలోని హిమాలయ పర్వతసానువుల్లోని లోయ మార్గం నాథూలా ప్రాంతంలో మంగళవారం సంభవించిన భారీ హిమపాతం ధాటికి ఏడుగురు పర్యాటకులు మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. 11 మంది గాయపడ్డారు. ఐదారు వాహనాలతోసహా దాదాపు 30 మంది మంచు దిబ్బల కింద చిక్కుకున్నారన్న అనుమానాలతో అక్కడ అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాంగ్టాక్, నాథూ లాను కలిపే జవహర్లాల్ నెహ్రూ మార్గంలోని 14వ నంబర్ మైలురాయి వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వద్దన్నా వినకుండా.. ప్రమాదం విషయం తెలియగానే సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానికులు అక్కడికి చేరుకుని 23 మందిని కాపాడారు. నెహ్రూ మార్గ్లో ఆగిపోయిన 80 వాహనాల్లోని 350 మందికిపైగా పర్యాటకులను సురక్షితంగా వెనక్కి పంపించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా 13వ నంబర్ మైలురాయి దాటాక సాధారణంగా పర్యాటకులకు అనుమతి ఉండదు. కానీ, పర్యాటకులు ఘటనాస్థలి దాకా తీసుకెళ్లాలని టూర్ ఆపరేటర్లు, డ్రైవర్లను బలవంతపెట్టారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. చైనా సరిహద్దు సమీపంలో నాథూ లా మార్గముంది. వాణిజ్య సంబంధ రాకపోకలకు భారత్, చైనాలు వినియోగిస్తున్న మూడు సరిహద్దు పోస్ట్లలో నాథూ లా ఒకటి. సముద్రమట్టానికి 14,450 అడుగుల ఎత్తులోని మంచుమయమైన ఈ ప్రాంతాలను చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావడం తెల్సిందే. గ్యాంగ్టాక్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతముంది. ప్రమాదం జరిగాక క్షతగాత్రులను గ్యాంగ్టాక్కు పంపించి చికిత్సనందిస్తున్నారు. చదవండి: విషాదం.. సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరిచిన పారిశుద్ధ్య కార్మికులు.. కాసేపటికే.. -
సిక్కింలో మంచులో చిక్కిన 900 మంది యాత్రికులు
గ్యాంగ్టాక్: సిక్కింలో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, టోంగో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్టాక్ వైపు శనివారం సాయంత్రం బయలుదేరిన 89 వాహనాలు దట్టమైన మంచులో చిక్కినట్టు అధికారులు చెప్పారు. వీటిలో సుమారు 900 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారన్నారు. ఆర్మీ సాయంతో వీరిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. అడ్డంకులను తొలగిస్తుండటంతో ఇప్పటికే 15 వాహనాలు గ్యాంగ్టాక్ వైపు బయలుదేరాయని చెప్పారు. కొందరు ప్రయాణికులను దగ్గరల్లోని క్యాంపులకు తీసుకెళ్తామని వెల్లడించారు. -
తెలంగాణకు అతిథులు వస్తున్నారు.. కరోనా తర్వాత పెరిగిన సంఖ్య!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారికి కుదేలైన తెలంగాణ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. స్వదేశీ, విదేశీ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. కరోనా కంటే ముందున్న స్థాయిలో కాకున్నా చాలావరకు మెరుగుపడింది. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2023 ప్రకారం ఈ ఏడాది (2022–23)లో 68 వేల మందికిపైగా విదేశీ పర్యాటకులు, 6 కోట్ల మందికిపైగా స్వదేశీయులు (వివిధ రాష్ట్రాలకు చెందినవారు) తెలంగాణ ఆధ్యాతి్మక, పర్యాటక సొబగులను ఆస్వాదించేందుకు వచ్చారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సహా కొలనుపాక, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి, భద్రాద్రికి సందర్శకులు పోటెత్తుతున్నారు. కేవలం తీర్థయాత్రలేగాకుండా నాగార్జునసాగర్లోని బుద్ధవనం,చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలతోపాటు గతేడాది అట్టహాసంగా ప్రారంభమైన ముచ్చింతల్లోని శ్రీరామనగరానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విదేశీ టూరిస్టుల్లో మాత్రం అగ్రభాగం వైద్యసేవలు పొందేందుకే వస్తున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది ఆఫిక్రా దేశాల నుంచి వస్తుండగా యూరప్, అమెరికా తదితర దేశాల నుంచి సందర్శకులు, ఐటీ నిపుణులు భాగ్యనగరానికి అత్యధికంగా వచ్చిన వారిలో ఉన్నారు. మహమ్మారి వ్యాప్తికి ముందు 9 కోట్లకు పైనే 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలైంది. లాక్డౌన్లు, కరోనా ఆంక్షల కారణంగా జనజీవనం దాదాపుగా స్తంభించింది. ఆ తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరగడం, టీకాలు అందుబాటులోకి రావడం, ఆంక్షలను సడలించడంతో క్రమంగా పర్యాటకం ఊపందుకుంటోంది. కరోనా వ్యాప్తికి ముందు 2016–17లో అత్యధికంగా 9.5 కోట్ల మందికిపైగా స్వదేశీ, 1.6 లక్షల మందికిపైగా విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారు. కరోనా తాకిడి తర్వాత అత్యల్పంగా 2021–22లో 3.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులు, 5,917 మంది అంతర్జాతీయ పర్యాటకులు వచి్చనట్లు గణాంకాలు చెబుతున్నా యి. ఇక ఆ మరుసటి ఏడాదిలోనే ఈ సంఖ్యలో 89.84% (స్వదేశీ పర్యాటకులు), 1,056.01% (విదేశీ పర్యాటకులు) వృద్ధి నమోదు కావడం విశేషం. చదవండి వెల్డన్ పీటీఓ.. పాత వస్తువులతో కొత్త ఫర్నీచర్ -
రాష్ట్ర వ్యాప్తంగా 20 పీఎస్లను ఏర్పాటు చేశాం: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
-
బోటు నిండుగా ఆదాయం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకం పరవళ్లు తొక్కుతోంది. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు చెందిన 12 బోటింగ్ యూనిట్లలో వివిధ రకాలైన 41 బోట్లు నిత్యం సేవలందిస్తున్నాయి. పాపికొండలు, విజయవాడ, శ్రీశైలం బోటింగ్ పాయింట్లకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రికార్డు స్థాయిలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏపీటీడీసీ బోటింగ్ విభాగం ద్వారా రూ.6.25 కోట్లు ఆదాయం రాగా, మార్చి చివరి నాటికి రూ.8.32కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా బోట్ల కొనుగోలు రూ.2కోట్ల వ్యయంతో కొత్త బోట్ల కొనుగోలుకు ఏపీటీడీసీ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అధికారులు టెండర్లు పిలవనున్నారు. 50సీటింగ్ సామర్థ్యం కలిగిన మూడు బోట్లను కొనుగోలు చేసి పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న విజయవాడ, శ్రీశైలం యూనిట్లకు కేటాయించనున్నారు. ఔట్ బోర్డ్ బోట్లు, స్పీడ్, డీలక్స్, పెడల్ బోట్లను సైతం కొనుగోలు చేయనున్నారు. మరోవైపు నాగార్జున సాగర్లోని స్టీల్ జెట్టీకి కూడా మరమ్మతులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురానున్నారు. కొత్త బోటింగ్ యూనిట్లపై దృష్టి ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రస్తుత బోటింగ్ యూనిట్లలో సేవలను మెరుగుపరచడంతోపాటు కొత్త యూనిట్లను నెలకొల్పడంపై దృష్టి సారిస్తోంది. ఇటీవల పోచవరం(పాపికొండలు), వైఎస్సార్ జిల్లాలోని పర్నపల్లిలో జల పర్యాటకాన్ని అందుబాటులోకి తెచి్చంది. రాష్ట్రంలోనే తొలిసారిగా పర్నపల్లిలో అమెరికన్ పాంటూన్ బోట్లను ప్రవేశపెట్టింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ కస్టమైజ్డ్ బోట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడ గత నెలలో ఏకంగా రూ.8లక్షల వరకు ఆదాయం వచి్చంది. త్వరలో బ్రహ్మంసాగర్, దేవునికడపతోపాటు రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కూడా బోట్లు నడిపేందుకు ఏపీటీడీసీ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. జల పర్యాటకానికి ఆదరణ పెరుగుతోంది. పర్యాటకులకు మెరుగైన సేవలందించేందుకు కొత్త బోట్లను సైతం కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఇంత ఆదాయం ఎప్పుడూ రాలేదు. కొత్త బోటింగ్ పాయింట్లపైనా దృష్టి సారించాం. కరోనా తర్వాత ఇంత వేగంగా పుంజుకోవడం శుభపరిణామం. – కె.కన్నబాబు, ఎండీ, ఏపీటీడీసీ -
భారతీయ పర్యాటకులు: ఈసారి 6 లక్షలు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దాదాపు 5–6 లక్షల మంది భారతీయ పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించవచ్చని మలేషియా అంచనా వేస్తోంది. గత ఏడాది ఈ సంఖ్య సుమారు 3 లక్షలుగా నమోదైంది. శుక్రవారమిక్కడ నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్న సందర్భంగా టూరిజం మలేషియా సీనియర్ డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ (ఆసియా, ఆఫ్రికా) మొహమ్మద్ అమీరుల్ రిజాల్ అబ్దుల్ రహీం ఈ విషయాలు తెలిపారు. కరోనాకు పూర్వం 2019లో భారత్ నుంచి 7.35 లక్షల పైచిలుకు టూరిస్టులు వచ్చారని, పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఏడాది తిరిగి ఆ స్థాయికి ఇది చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి వచ్చే టూరిస్టుల్లో అత్యధిక శాతం మంది దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది 70 లక్షల మంది పైగా విదేశీ టూరిస్టులు మలేషియాను సందర్శించగా ఈ ఏడాది ఇది 1.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి 30న ప్రారంభమైన టూరిజం మలేషియా రోడ్షోలు వివిధ నగరాల్లో ఫిబ్రవరి 7 వరకు కొనసాగనున్నాయి. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
విశాఖ బీచ్లో విషాదాలు ఉండవిక.. రాకాసి అలలపై నజర్!
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో కవ్వించే అలలతో పోటీ పడుతూ.. సరదాల్లో మునిగి తేలే పర్యాటకుల్ని అమాంతం పొట్టన పెట్టుకుంటున్నాయి రాకాసి అలలు. రిప్ కరెంట్గా పిలిచే ఇలాంటి రాకాసి అలలు కడలి మాటున దాగి ఉంటూ వేటు వేస్తుంటాయి. చీలిక ప్రవాహాలుగా పేర్కొనే వీటినుంచి సందర్శకుల్ని రక్షించేందుకు విశాఖ పోలీసులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. రిప్ కరెంట్పై ముందస్తు సమాచారం అందించే వెబ్సైట్ ద్వారా ఆయా బీచ్లలో హెచ్చరికలు జారీ చేసి, సందర్శకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రిప్ కరెంట్ అంటే.. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిషిని ఒక్కసారిగా లోతైన ప్రవాహంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలోని సుదూర ప్రాంతంలో గాలి ద్వారా ఏర్పడిన అలలు.. నీటి అడుగున బలమైన ప్రవాహంగా తీరం వైపు దూసుకొస్తాయి. తీరానికి వచ్చేసరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్కసారిగా తీరాన్ని తాకినప్పుడు సముద్రం అడుగున అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఈ కెరటాలు తిరిగి వెళ్లేటప్పుడు తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడుతుంటాయి. రిప్ కరెంట్ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకూ ఉంటుంది. ఇలాంటి అల చీలికతో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 290 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఈ ప్రవాహంలో ఎవరు ఉన్నా.. రెప్పపాటులో సముద్రంలోపలికి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో గజ ఈతగాళ్లు కూడా దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. విశాఖ తీరంలో ఎన్నో విషాదాలు విశాఖ సాగర తీరంలో 2018లో 55 మంది, 2019లో 51 మంది, 2020లో 64 మంది, 2021లో 63 మంది మృత్యువాత పడగా.. గతేడాది 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, సాగర నగర్, రుషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో వాటిపై నిలబడి సాగర అందాలను వీక్షిస్తుంటారు. కొంతమంది అక్కడే సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు. విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండటంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్నవారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడటం అసాధ్యం. సందర్శకుల భద్రతకు పెద్దపీట ఎంవోఎస్డీఏసీ డాట్ జీవోవీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో రిప్ కరెంట్ సమాచారం ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలతో లభిస్తుంది. ఇలా వచ్చే ముందస్తు సమాచారం ద్వారా రిప్ కరెంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ రిప్ కరెంట్ ప్రభావం లేనిపక్షంలో సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతిస్తాం. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. – సీహెచ్ శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
రివర్ క్రూయిజ్ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లగ్జరీ రివర్ క్రూయిజ్ ఒకచోట చిక్కుకుపోయిందంటూ వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి ఎంతమాత్రం వాస్తవం కావని క్రూయిజ్ని నిర్వహస్తున్న ఎక్సోటివ్ హెరిటేజ్ గ్రూప్ చైర్మన్ రాజ్సింగ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఓడ పాట్నా చేరుకుంది. ఓడ నదిలో లంగరు వేయగా..పర్యాటకులు సందర్శన కోసం పడవలు తీసుకుని బయలుదేరారని తెలిపారు. "ఓడ ఎల్లప్పుడూ ప్రధానంగా లోతైన ప్రదేశంలోనే ఉంటుంది. పెద్ద ఓడలు ఎప్పుడూ ఒడ్డుకు వెళ్లలేవు. ఈ ఓడను చూడటానికి వేలాదిమంది తరలి వచ్చారు. ఓడ గోప్యత, ప్రయాణికుల భద్రత తదితర కారణాల రీత్యా తాము పాట్నాకి తీసుకువచ్చామని, జెట్టీకి తీసుకురాలేకపోయామని చెప్పారు". అలాగే పర్యాటకులు అక్కడ చిరాంద్ అనే పర్యాట ప్రదేశాన్ని చూడటానికి పడవలను తీసుకుని వెళ్లారని, మళ్లీ సురక్షితంగా తిరిగి వచ్చేశారని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్లు, బీహార్లోని పాట్నా, జార్ఖండ్లోని షాహిగంజ్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్లోని ఢాకా వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రాంతాలను ఈ క్రూయిజ్ కవర్ చేస్తుంది. శాకాహార భారతీయ వంటకాలు, ఆల్కహాల్ లేని పానీయాలు, స్పా, కాల్లోనే అందుబాటులో ఉండే వైద్యులు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ రివర్ క్రూయిజ్కి రోజుకు సుమరు రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు వరుకు ఖర్చు అవుతుంది. మొత్తం 51 రోజుల ప్రయాణానికి ప్రతి ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
Andhra Pradesh: ఇక టూరిస్ట్ పోలీసింగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ వెళ్లే పర్యాటకులను ‘హాయ్ వెల్కం టు వైజాగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ’.. ‘ఇన్ వైజాగ్ యూ కెన్ సీ ఆర్కే బీచ్, రుషికొండ, భీమిలి, కైలాసగిరి, సింహాచలం టెంపుల్. ఇఫ్ యూ హేవ్ ఎనీ ప్రాబ్లమ్. ప్లీజ్ కాంటాక్ట్ అజ్’ అంటూ ప్రేమగా పలకరించేందుకు ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసులు అందుబాటులోకి రానున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సమస్త సమాచారాన్ని అందిచడంతో పాటు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా టూరిస్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మొదటగా విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ కియోస్క్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పర్యాటక ప్రదేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఉమ్మడి విశాఖలో చూడదగిన పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని బ్రోచర్ల రూపంలో అందుబాటులో ఉంచనున్నారు. పర్యాటకులు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా.. ఎవరైనా తప్పిపోయినా వీరికి ఫిర్యాదు చేస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. పర్యాటకుల నుంచి ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే కూడా వీరికి సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ప్రయాణం సాఫీగా సాగేలా చూడటంతోపాటు మరోసారి వచ్చే విధంగా ఆకర్షించేందుకు టూరిస్ట్ పోలీసింగ్ తోడ్పడుతుందనేది ప్రభుత్వ వర్గాల భావన. జీ–20 సమావేశాల నేపథ్యంలో.. విశాఖలో వరుసగా వివిధ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 28, 29 తేదీల్లో జీ–20 దేశాల సమావేశాలకు కూడా విశాఖ వేదిక కాబోతోంది. దీనికి విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం ప్రతినిధులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసింగ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 55 ప్రాంతాల్లో 200 వరకూ జీ–20 గ్రూప్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. 2016 నుంచీ చేయాలనుకున్నా.. వాస్తవానికి దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసింగ్ అభివృద్ధి చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఇందుకు అనుగుణంగా 2016లోనే ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఈ విధానం అమలుకు నోచుకోలేదు. 2019లో 25 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కోవిడ్ నేపథ్యంలో అమలుకు నోచుకోలేదు. తాజాగా జీ–20 సమావేశాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ విశాఖలో ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కియోస్క్ ఏర్పాటు చేస్తున్నాం విశాఖ నగరంలో టూరిస్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఆర్కే బీచ్ ప్రాంతంలో మొదటగా ఒక కియోస్క్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా పర్యాటకులకు సేవలందించేందుకు పోలీసులు అందుబాటులో ఉంటారు. తర్వాత మిగిలిన పర్యాటక ప్రదేశాలైన భీమిలి, రుషికొండ, తెన్నేటి పార్కు, కైలాసగిరి, యారాడ వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. – శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
విహార యాత్ర అంటే ఆ దేశానికి వెళ్లాలంటున్న భారతీయలు!
కోవిడ్ తర్వాత సింగపూర్ తన పూర్వ వైభవాన్ని పొందింది. 2019 నుంచి కరోనాతో టూరిజం పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సందర్శకుల తాకిడి పెరగడంతో 2022లో తిరిగి పుంజుకుంది. దీంతో నవంబర్ వరకు 5.37 మిలియన్లు టూరిస్టులు సింగపూర్ను సందర్శించారు. నవంబర్ వరకు సింగపూర్ టూరిజం బోర్డు (STB) నుంచి వచ్చిన డేటా ఆధారంగా.. 48 శాతం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, భారత్ నుంచే ఉన్నారు. డిసెంబర్ సాంప్రదాయకంగా సింగపూర్ సందర్శకులకు రద్దీగా ఉండే ప్రయాణ కాలం కావడంతో, ఈ సంఖ్యను కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో ఇండోనేషియా నుంచి 9.86 లక్షలు ఉండగా, భారత్ నుంచి 6.12 లక్షల మంది ఉన్నారు. సింగపూర్ టూరిజం అభివృద్ధిలో ఇండియా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మలేషియా 495,470తో మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (476,480), ఫిలిప్పీన్స్ (325,480) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చివరగా 2019 ప్రీ-కోవిడ్ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా 19.1 మిలియన్ల మంది టూరిస్టులు సందర్శించారు. ఆ సంవత్సరంలో, సింగపూర్కు చైనా నుంచి 3.6 మిలియన్లకు పైగా సందర్శకులు వచ్చారు. చివరకు తమ పౌరులను మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని చైనా గత వారం ప్రకటించడంతో, 2023లో సింగపూర్ టూరిజం మహమ్మారి అనంతరం పున్వరైభవానికి చేరుకునే అవకాశం కల్పిస్తోంది. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
వియత్నాంలోని కాన్థో నగరంలో ఇటీవల వెలిసిన బంగారు భవనం అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. కాన్థో నగరానికి చెందిన ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే ఆసామి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించాడు. కొత్తతరహాలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాడు. ఇళ్ల నమూనాలు చూడటానికి దేశదేశాల్లో సంచరించాడు. ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డెకరేటర్లతో చర్చోప చర్చలు జరిపాక, ఇదివరకు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో బంగారు తాపడంతో ఇల్లు నిర్మించాలని నిశ్చయించుకుని, తన నివాసంగా బంగారు భవనాన్ని నిర్మించాడు. ఇంటి వెలుపల గోడలను, పైకప్పును పూర్తిగా బంగారు రేకులతో తాపడం చేయించాడు. ఇంటి బయటే కాదు, లోపల కూడా అడుగడుగునా కళ్లుచెదిరేలా బంగారు వస్తువులతో నింపేశాడు. ఇంట్లోని చాలా వస్తువులు పూర్తి బంగారంతో తయారు చేయించనవి అయితే, కొన్ని భారీ విగ్రహాల వంటివి మాత్రం బంగారు తాపడం చేయించనవి. ఆరేళ్ల కిందటే బంగారు భవనాన్ని నిర్మించాలని అనుకున్నానని, దీని నిర్మాణం పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టిందని ట్రుంగ్ మీడియాకు వెల్లడించాడు. ఇప్పుడు ఈ భవంతి వియత్నాం దేశానికే ప్రత్యేక ఆకర్షణగా మారింది. వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులు పనికట్టుకుని మరీ కాన్థో నగరానికి వచ్చి, ఈ ఇంటిని కళ్లారా చూసి వెళుతున్నారు. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
‘పాపికొండల’ ప్రత్యేక ప్యాకేజీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఆ ప్యాకేజీ వివరాలను ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 98486 29341, 98488 83091 నంబర్లలో, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 63037 69675 నంబర్లో సంప్రదించాలని కోరారు. రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి ఒక రోజు పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి 2 రోజుల పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి రెండు నాన్వెజ్ కూరలతో భోజనం. 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. -
టెంట్లతోనే రిసార్ట్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు తక్కువ ఖర్చుతో విలాసవంతమైన అనుభూతి అందించేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చర్యలు చేపట్టింది. బీచ్లు, కొండ ప్రాంతాల్లో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఎకో టెంట్ రిసార్టులను ఏర్పాటు చేయబోతోంది. తొలి దశలో భాగంగా ఐదు ప్రాంతాలను ప్రతిపాదించింది. ఇందులో బాపట్ల జిల్లాలోని పెదగంజాం–నిజాంపట్నం బీచ్ కారిడార్, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం, అనకాపల్లి జిల్లాలోని ముత్యాలంపాలెం, అందలాపల్లె బీచ్లతో పాటు అన్నమయ్య జిల్లాలోని మల్లయ్యకొండపై టెంట్ రిసార్టులను అందుబాటులోకి తేనుంది. ఒక్కో రిసార్ట్లో 20 టెంట్లు.. ప్రతి ఎకో రిసార్టులో 20 టెంట్ గదులతో పాటు అనుబంధంగా రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టెంట్ గదిలో బెడ్రూమ్కు అనుబంధంగా బాత్రూమ్, వరండా నిర్మిస్తారు. టెంట్లో ఒక కుటుంబం (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు) విడిది చేసేలా తీర్చిదిద్దనున్నారు. ఏపీటీడీసీ వీటిని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) కింద నిర్వహించనుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. భూమిని లీజు ప్రాతిపదికన అద్దెకిచ్చి.. అందులో ప్రైవేటు వ్యక్తులు స్వయంగా టెంట్ రిసార్టులు ఏర్పాటు చేసి, నిర్వహించేలా ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది. -
పర్యాటక ఏపీ.. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో ర్యాంకు
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం సాధించింది. గత ఏడాది (2021) 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడును సందర్శించినట్లు ఆ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకులో ఉండగా, కర్ణాటక నాలుగో ర్యాంకు, మహారాష్ట్ర ఐదో ర్యాంకులో ఉన్నాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశీయ పర్యాటకుల్లో తమిళనాడును 17.02 శాతం, ఉత్తరప్రదేశ్ను 16.19 శాతం, ఆంధ్రప్రదేశ్ను 13.77 శాతం, కర్ణాటకను 12 శాతం, మహారాష్ట్రను 6.43 శాతం మంది సందర్శించినట్లు తెలిపాయి. 2021లో దేశీయ పర్యాటకుల వృద్ధి ఆంధ్రప్రదేశ్లో 31.69 శాతంగా గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల వృద్ధి 11.05 శాతమే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన వారి సంఖ్య క్షీణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో 2021లో దేశీయ పర్యాటకుల్లో వృద్ధి –19.99 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2019లో కూడా మూడో ర్యాంకులో ఉంది. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగో ర్యాంకు పొందింది. 2021లో మళ్లీ పుంజుకొని మూడో ర్యాంకులోకి వచ్చింది. 2019 నుంచి 2021 వరకు టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. 2019లో ఆంధ్రప్రదేశ్ను 23.70 కోట్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా 2020లో 7.08 కోట్ల మందే వచ్చారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021లో గణనీయంగా తగ్గిపోయినట్లు పర్యాటక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 7.17 మిలియన్లు ఉండగా 2021లో 1.05 మిలియన్లకు తగ్గిపోయింది. 2020తో పోల్చి చూస్తే 2021లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29 శాతం క్షీణించింది. 2019లో ఏపీలో విదేశీ పర్యాటకుల సంఖ్య 0.89 శాతం వృద్ధి ఉండగా కోవిడ్ కారణంగా 2020లో ఏపీలో 70.12 శాతం మేర, 2021లో 59.24 శాతం మేర క్షీణించింది. -
వామ్మో దెయ్యాల ఊళ్లు.. ఆ ఇళ్లలో ప్రేతాత్మలు ఉన్నాయా?.. అక్కడికి వెళ్లాలంటే?
ఆ ఊళ్లో ఎటుచూసినా చెదురు మదురుగా విసిరేసినట్లుండే భూత్ బంగ్లాలే కనిపిస్తాయి. వీధుల్లో తిరుగుతుంటే, అక్కడక్కడా పాడుబడిన వాహనాలు కనిపిస్తాయి. ప్రపంచంలో అక్కడక్కడా అరుదుగా కనిపించే దెయ్యాల ఊళ్లుగా పేరుమోసిన ఊళ్లలో ఆ ఊరొకటి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటారా? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఊరి పేరు బోడీ. ఇదొక చిన్న పట్టణం. రెండువందలకు పైగా ఇళ్లు, చర్చిలు, పాడుబడిన సెలూన్లు, జూదశాలలు, వినోదకేంద్రాలు, హోటళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే, ఈ ఊళ్లో మనుషులెవరూ ఉండరు. అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చిపోతుంటారు. పర్యాటకులు బస చేయడానికి ఇక్కడా ఎలాంటి వసతులూ ఉండవు. బాగున్న రోజుల్లో ఈ ఊరి జనాభా పదివేలకు పైగానే ఉండేది. ఊరికి దగ్గరగానే బంగారు గని ఉండేది. గనిలో పనిచేసేవాళ్లంతా ఈ ఊళ్లో ఉండేవాళ్లు. ఊరే కాదు, ఊరవతల ఉండే బంగారు గని కూడా ఇప్పుడు ఖాళీగా మిగిలింది. దెయ్యాల భయంతోనే జనాభా అంతా ఈ ఊరిని విడిచిపెట్టి తలోదిక్కూ వెళ్లిపోయారు. డెబ్బయ్యేళ్ల కిందట ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇంకెవ్వరూ ఇక్కడకు వచ్చి స్థిరపడే ప్రయత్నం చేయకపోవడంతో 1962లో కాలిఫోర్నియా ప్రభుత్వం దీనిని ‘బోడీ స్టేట్ హిస్టారిక్ పార్క్’గా మార్చింది. గుండెధైర్యం ఉన్న పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వస్తుంటారు. వారిలోనూ కొందరు ఇక్కడ కొన్ని పాడుబడిన ఇళ్లలో ప్రేతాత్మలు చూశామని, కొన్ని ఇళ్ల నుంచి పిల్లలు ఆడుకుంటున్న చప్పుళ్లు విన్నామని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. పాడుబడిన ఇళ్లలో అప్పటి జనాలు వాడుకున్న ఫర్నిచర్, ఇతర వస్తువులు దుమ్ముపట్టి ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ ఊరిని సందర్శించడానికి పగటి వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. రుతువును బట్టి సందర్శకులను అనుమతించే వేళల్లో మార్పులు ఉంటాయి. -
పాపికొండలు పోదాం పద!
గోదారమ్మ పరవళ్లు..ప్రకృతి అందాలు..ఎత్తయిన కొండలు..పున్నమి వెన్నెల్లో ఇసుక తిన్నెలు..నైట్ హాల్ట్లు.. ఇలా పాపికొండలు విహారయాత్ర ఇచ్చే మజాయే వేరంటారు పర్యాటకులు. అలాంటి మధురానుభూతి జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకుంటారు సందర్శకులు. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ విహార యాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో ఆదివారం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పాపికొండలు విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, బోట్ల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయి. గోదావరికి వరదలు రావడంతో గత నాలుగు నెలలుగా పాపికొండలు పర్యాటకం నిలిచిపోయింది. ఈనేపథ్యంలో నీటిమట్టం అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం పాపికొండలు విహారయాత్ర బోట్లకు శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో పర్యాటకశాఖ అధికారులు పాపికొండలు విహార యాత్రకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలి రోజు ఒక్క బోటు మాత్రమే.. పాపికొండల విహారయాత్రకు తొలి రోజు ఆదివారం ఒక్క బోటుమాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి ఏపీ టూరిజం, ప్రైవేట్ టూరిజం శనివారం నుంచి టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. విహారయాత్రకు బోట్లు బయలుదేరేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా పోశమ్మగండి వద్ద బోట్ పాయింట్, కంట్రోల్ రూమ్లో రెవెన్యూ, పోలీసు, పర్యాటక, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. బోట్ పాయింట్ వద్ద ఉన్న అన్ని బోట్లలో భద్రతా చర్యలను వారు పరిశీలించారు. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుమతులు మంజూరు చేసింది. పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి పర్యాటకులతో టూరిజం బోటు బయలుదేరడానికి ముందే పైలెట్ బోట్ వెళ్తుంది. ఇందులో శాటిలైట్ ఫోన్తోపాటు పర్యాటక సిబ్బంది ఒకరు, గజ ఈతగాడు ఉంటారు. వీరి వద్ద కూడా వాకీ టాకీ ఉంటుంది. పైలెట్ బోటు.. టూరిజం బోటు కంటే ముందుగా వెళ్తూ గోదావరిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్తోపాటు వెనుక వస్తున్న బోటుకు వాకీ టాకీలో సమాచారం అందిస్తారు. ఇలా చేరుకోవాలి: ముందుగా ఏపీ పర్యాటక శాఖ వెబ్సైట్.. https:// tourism.ap.gov.in/లో పాపికొండలు విహారయాత్రకు టికెట్లు బుక్ చేసుకోవాలి. రూ.1,250 టికెట్ బుక్ చేసుకున్నవారు నేరుగా రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ గోదావరి గట్టున ఉన్న పర్యాటక శాఖ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ నుంచి బస్సులో పోశమ్మ గండి బోట్ పాయింట్ వరకు పర్యాటక శాఖ సిబ్బంది తీసుకొస్తారు. యాత్ర ముగిశాక మళ్లీ రాజమండ్రికి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇక రూ.1000 టికెట్ తీసుకున్నవారు నేరుగా బోట్లు బయలుదేరే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండికి చేరుకోవాల్సి ఉంటుంది. రెండు బోట్ పాయింట్ల వద్ద ఏర్పాట్లు పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద మొత్తం 15 బోట్లు ఉండగా, వీటిలో ఎనిమిది బోట్లకు అనుమతి మంజూరు చేశారు. మరో ఏడు బోట్లకు ఫిట్నెస్ పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వీఆర్ పురం మండలం పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లు ఉండగా వీటిలో 13 బోట్లకు ఫిట్నెస్ అనుమతి ఇచ్చారు. మరో నాలుగు బోట్లకు అనుమతి రావాల్సి ఉంది. -
అడవి పిలుస్తోంది!
సాక్షి,అమరావతి: ప్రకృతి ఒడిలో సేద తీరాలని.. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొద్ది రోజులపాటు దూరంగా, ప్రశాంతంగా గడపాలనుకునేవారికి అడవి ఆహ్వానం పలుకుతోంది. ఇందుకోసం అటవీ ప్రేమికులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు అటవీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. తూర్పు కనుమల్లో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పాపికొండలు ఇలా పలు అడవులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ అడవుల్లోని కొత్త ప్రదేశాలు, కొండలు, లోయల సందర్శనలు, ట్రెక్కింగ్ పట్ల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. విభిన్న వృక్ష, జంతుజాలానికి ఆలవాలం.. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం.. 1.64 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో 36,914 చదరపు కిలోమీటర్లలో (22.46 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో 8,139 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రిజర్వు అటవీ ప్రాంతం. శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు, రాయల్ ఎలిఫెంట్ రిజర్వు, శేషాచలం బయోస్పియర్.. ఇవి కాకుండా 3 జాతీయ పార్కులు, 13 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. ఇవన్నీ విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు, గొప్ప జీవవైవిధ్యం, ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలంతో విలసిల్లుతున్నాయి. 30కి పైగా ప్రదేశాలు.. తలకోన, ఉబ్బలమడుగు, నేలపట్టు, పులికాట్, పెంచలకోన, బైర్లూటి, పెచ్చర్ల, మారేడుమిల్లి, కంబాలకొండ, తెలినీలాపురం, చొల్లంగి, వంటి 30కిపైగా పర్యావరణ పర్యాటక ప్రదేశాలను ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఈ సంవత్సరం తలకోన ప్రాంతాన్ని 2 లక్షల మంది సందర్శించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉబ్బలమడుగు, మారేడుమిల్లి, చొల్లంగి ప్రాంతాలకూ లక్షల మంది వస్తున్నారు. వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేసేందుకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది. థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు.. ప్రతి జిల్లాలో కొత్తగా నగర వనాలు, వనమిత్ర, జూపార్కులకు అనువైన ప్రదేశాలను అధికారులు గుర్తించనున్నారు. అలాగే ఉన్నవాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్కడకు వచ్చిన పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, అవుట్డోర్ జిమ్ వంటివి నెలకొల్పనున్నారు. తద్వారా అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అటవీ, స్థానిక గిరిజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అక్కడ విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాశి వనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వంటి థీమ్ పార్కులు సృష్టించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కడపలో ఉన్న నగర వనం మోడల్లో అన్ని నగర వనాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించే యత్నాలు ఊపందుకుంటున్నాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్, ఇతర అడవుల సందర్శనకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నారు. కర్ణాటక తరహాలో జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో పర్యాటక అద్భుతాలు అటవీ సందర్శనలు, ప్రకృతి పర్యటనలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే తలకోన, బైర్లూటి వంటి ఎన్నో అందమైన పర్యావరణ పర్యాటక ప్రాంతాలున్నాయి. శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాలున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడపొచ్చు. ఇలాంటి పర్యటనల ద్వారా ప్రజలు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగించకుండా, వన్యప్రాణులు, మొక్కలకు నష్టం కలిగించకుండా పర్యాటకులు నడుచుకోవాలి. రాష్ట్రంలో కొత్త తరహా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఇందులో భాగమవ్వాలి. – మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
నయగరా జలపాతం కింద 100ల ఏళ్ల నాటి సొరంగం
ఇంతవరకు చాలామంది పర్యాటకులు నయాగరా జలపాతం అందాలను వీక్షించారు. ఆ దృశ్యాలను ఇంతవరకు పర్యాటకులు దూరం నుంచే వీక్షించారు. ఇక నుంచి చాలా దగ్గర నుంచే కళ్లను కట్టిపడేసే ఆ నయాగరా అందాలను వీక్షించొచ్చు అంటున్నారు అధికారులు. ఈ నయాగరా జలపాతం పర్యాటక కేంద్రంగా చాలా ప్రసిద్ధిగాంచింది. ఐతే జలపాతం కింద ఉన్న 100 ఏళ్ల నాటి సొరంగం పర్యాటక ఔత్సాహికుల కోసం తెరిచారు. దీంతో ఈ సొరంగం గుండా ఉన్న పవర్స్టేషన్ కూడా చూడవచ్చు. కెనడియన్ వైపు శతాబ్దం క్రితం నిర్మించిన 670 మీటర్ల సొరంగం నాటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని బహిర్గతం చేస్తోంది. ఇప్పుడు ఈ పవర్ స్టేషన్ని కూడా నయగరా పర్యటనలో భాగంగా అందరూ వీక్షించే సువర్ణావకాశం కల్పించారు. 1905 నుంచి 2006 వరకు పనిచేసిన ఈ పవర్స్టేషన్ శక్తివంతమైన జెయింట్ జనరేటర్తో నయగరా నది నీటిని మళ్లించి ప్రాంతీయ పరిశ్రమను విద్యుద్దీకరించేవారు. ఈ ప్రాంతం ఒకప్పుడు జలవిద్యుత్ను వినియోగించుకోవాలనుకునే వ్యాపారవేత్తల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఒక గాజుతో కప్పబడిన ఎలివేటర్ సదర్శకులను సొరంగంలోకి తీసుకువెళ్తుంది. అక్కడ పర్యాటకులు నయగరా జలపాతం అందమైన దృశ్యాల తోపాటు దిగువన ఉన్న పవర్ స్టేషన్ని కూడా చూడవచ్చు. (చదవండి: చిన్నారిని వీపుకి తగిలించుకున్న బాలుడెవరో తెలుసా!) -
ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్ హోం’ అక్కడే పదేళ్లు పండగ!
న్యూఢిల్లీ: ఇండోనేషియా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు కొత్త వీసాను తీసుకొచ్చింది. ఇందుకోసం ‘సెకండ్ హెమ్ వీసా’ ప్రోగ్రామ్ను తీసు కొచ్చింది. ఈ వీసా ద్వారా పర్యాటకులు బాలిలో గరిష్టంగా 10 సంవత్సరాలు నివసించవచ్చు. అంతేకాదు ఈ వీసాతో, విదేశీయులు ఐదు లేదా పదేళ్ల పాటు పెట్టుబడి, ఇతర కార్యకలాపాలు వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న వర్గాలు ఈ వీసా ద్వారా దీర్ఘకాలికంగా ఇక్కడ బస చేవయచ్చని ఇండోనేషియా తాజాగా ప్రకటించింది. బాలి సహా అనేక ఇతర పాపులర్ టూరిస్ట్ ప్రదేశాలకు వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే దీని లక్ష్యం అని ఇమ్మిగ్రేషన్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ విడోడో ఏకత్జాజానా మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. ఈ విధానం క్రిస్మస్ రోజున లేదా కొత్త నిబంధన జారీ చేసిన 60 రోజుల తర్వాత అమలులోకి వస్తుందని తెలిపారు. ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కొంతమంది విదేశీయులకు ఇది ఆర్థికేతర ప్రోత్సాహకమని విడోడో ఎకత్జాజానా వ్యాఖ్యానించారు. తాజా ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతాల్లో కనీసం 130,000 డాలర్లు (కోటి 60 లక్షల రూపాయలకు పైనే) ఉన్నవారు కొత్త “సెకండ్ హోమ్ వీసా” పొందడానికి అర్హులు. ఆ దేశ అధికారిక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నిబంధనలకు ప్రకారం ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు విమానయాన సంస్థ ఇండోనేషియా గరుడ అంతర్జాతీయ విమానాలను పునః ప్రారంభించడంతో ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పుంజు కోనుందని భావిస్తున్నారు. దీనికి తోడు బాలిలో నవంబర్లో జరిగే G-20 సమ్మిట్కు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు తరలి రానున్నారు. దీంతో భారీ ఆదాయాన్ని ఇండోనేషియా ఆశిస్తోంది. -
12 ఏళ్లకు ఓసారి మాత్రమే వికసించే పువ్వులు.. ఎక్కడో తెలుసా?
బనశంకరి(కర్ణాటక): 12 ఏళ్లకు ఒకసారి వికసించే నీల కురింజి పూల సోయగాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో చిక్కమగళూరులో పర్యాటకుల సందడి నెలకొంది. గత నెలారంభంలో నీల కురింజి మొక్కలు పుష్పించడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. పొరుగునున్న కేరళలోని మున్నార్ తో పాటు చిక్కమగళూరులోని పలు చోట్ల అడవులు, లోయల్లో నీల కురింజి అందాలు అలరిస్తున్నాయి. దీపావళి సెలువులు రావడంతో చంద్రదోణి అడవుల్లో నీల కురింజి వనాలు సందడిగా మారాయి. చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం -
కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఐదుగురు యాత్రికులతో గుప్తకాశీలోని ఫటా హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ వెళ్లేందుకు బయలుదేరిన హెలికాప్టర్ కొద్దిసేపటికే కుప్పకూలింది. వెంటనే మంటలు అంటుకోవటంతో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కేదార్నాథ్కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని గరుడ ఛట్టీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సిందియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని, పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఆర్యాన్ విమానయాన సంస్థ బెల్ 407 హెలికాప్టర్ వీటీ-ఆర్పీఎన్ ప్రమాదానికి గురైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ఇదీ చదవండి: కశ్మీర్లో మళ్లీ పౌరులపై దాడులు.. నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య -
Araku Valley: అరకు పర్యాటకుల కోసం ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవుల నేపథ్యంలో అరకు పర్యాటకుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం–అరకు మధ్య అక్టోబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఈ స్పెషల్ రైలు (08509) ప్రతీ రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయల్దేరి మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ రైలు(08510) అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు 5–స్లీపర్క్లాస్, 7–సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్లతో నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతాయి. వంజంగి హిల్స్కు పర్యాటకుల తాకిడి సాక్షి, పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మేఘాల కొండ వంజంగి హిల్స్కు మంగళవారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దసరా సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు, విద్యార్థులు వంజంగి హిల్స్ ప్రాంతానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు, మేఘాలను చూసి పరవశించారు. ఉదయం 10గంటల వరకు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంది. -
చందమామే దిగి వచ్చిందా!
దుబాయ్: డబ్బుంటే ఆ అంతరిక్షాన్నే ఎంచక్కా కిందకి దింపేసుకోవచ్చేమో కదా! లగ్జరీ లైఫ్కు పెట్టింది పేరైన దుబాయ్లో పర్యాటకుల్ని ఆకర్షించడానికి చంద్రుడి ఆకృతిలో రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఇది రెండేళ్లలో పూర్తవుతుందట. అచ్చు చంద్రుడి ఉపరితలం మాదిరిగా డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. 735 అడుగుల ఎత్తైన ఈ మూన్ రిసార్ట్ దుబాయ్కి మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇందులో స్పా, వెల్నెస్ సెక్షన్, నైట్క్లబ్, ఈవెంట్ సెంటర్ ఉంటాయి. వ్యోమగాములకు, అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే సాధారణ పర్యాటకులకి శిక్షణ కూడా ఇస్తారట. దీనికి నిర్మాణానికి 500 కోట్ల డాలర్లు అవుతుందట. దీనిపై ఏటా 180 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని నిర్మాణ కంపెనీ అంచనా. ఈ రిసార్ట్స్లో ఏడాదికి కోటి మంది పర్యాటకులు ఎంజాయ్ చేసే వీలుంటుంది. (క్లిక్ చేయండి: సీఎన్జీ వినియోగదారులకు చేదు వార్త) -
కన్నా.. వద్దు రా.. వాళ్లసలే మనుషులు!
వైరల్: నేటి పరిస్థితుల్లో.. సమాజంలో మనిషికి మనిషే శత్రువు. ఇంకా చెప్పాలంటే నోరు లేని జీవులే ఈ విషయంలో ఎంతో నయం. కనీసం అవి గుంపుగా బతుకుతున్నాయ్ అన్నాడు ఓ రచయిత. అయితే తన స్వార్థం కోసం మూగజీవాలను బలి తీసుకుంటున్న పరిస్థితుల్లో.. మనుషుల పట్ల అవి అప్రమత్తంగా ఉండడంలో ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. జనావాసాల్లోకి వచ్చే మూగజీవుల పట్ల మనుషులు వ్యవహరించే తీరే అందుకు నిదర్శనం కూడా. ఒక్కోసారి వాటి మానానా అవి వెళ్తున్నా కూడా వెంటపడి మరీ వేధించడం, హింసించడం, విషాదకరమైన ఘటనలూ చూస్తున్నాం. అయితే.. ఏనుగులంటే సాధారణంగా.. కాస్త బుద్ధిజీవులు. ఒక్కోసారి వాటి తెలివి తేటలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆకలి తీర్చుకునే విషయంలోనే కాదు.. మిగతా విషయాల్లోనూ గజరాజుల బుర్రే బుర్ర. గుంపులుగా జీవిస్తూ.. ఒక్కోసారి ప్రమాదాలను ముందుగా పసిగడుతుంటాయి. అందుకేనేమో.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓ జాతీయ ఉద్యానవనంలో.. ఏ తల్లి ఏనుగు.. గున్న ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో అక్కడే ఆగి ఉన్న టూరిస్టుల వాహనం వైపు గున్నేగును అడుగులు వేసింది. అది చూసి.. ఆ తల్లి ఏనుగు ఎక్కడికి వెళ్తావ్ అన్నట్లుగా వెనక్కి లాగేసుకుంది. పాతదా? కొత్తదా? ఎక్కడ జరిగింది అనే క్లారిటీ లేదు.. కానీ, మిలియన్నర వ్యూస్తో ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్ ద్వారా వైరల్ అవుతోంది. Mother elephant stops its child from approaching the tourists.. pic.twitter.com/ASruHsJKnn — Buitengebieden (@buitengebieden) September 3, 2022 ఇదీ చదవండి: తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ, ఆ తర్వాత ఏమైందంటే.. -
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
Araku Valley: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే. గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది. గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్) అక్కడే పెళ్లి చేసుకోవచ్చు గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఈ కాన్సెప్ట్ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు. ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
నలుగురికి కోవిడ్ పాజిటివ్.. భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం
కఠ్మాండూ: భారత్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో పొరుగుదేశం నేపాల్ అప్రమత్తమైంది భారత్ నుంచి వచ్చే పర్యాటకులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నేపాల్ నిషేధం విధించింది. ఇటీవల ఝులాఘాట్ సరిహద్దు ప్రాంతం మీదుగా భారత్ నుంచి బైతడి జిల్లాకు వచ్చిన నలుగురు భారతీయ పర్యాటకులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణయిందని అధికారులు తెలిపారు. వారిని వెంటనే తిరిగి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించామన్నారు. భారత్ నుంచి తిరిగి వచ్చే నేపాలీయుల కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నందున పర్యాటకులపై నిషేధం విధించామన్నారు. మంగళవారం ఒక్కరోజే నేపాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు టిబెట్లో కేసులు పెరుగుతుండడంతో బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటాలా సౌధాన్ని మంగళవారం నుంచి మూసివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కాగా చైనాలో నిన్న 828 కొత్త కేసులు బయటపడగా అందులో టిబెట్లో 22 నమోదయ్యాయి. చదవండి: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. వెస్ట్బ్యాంక్లో ముగ్గురు మృతి -
పర్యాటకుల ‘రివెంజ్ టూరిజం’
సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో కొత్త ప్రయాణ ఒరవడులు కనిపిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో విధించిన నిబంధనలు, పరిమితుల సడలింపులతో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మంది విదేశీ టూర్ల వైపు చూస్తుంటే..వీలుపడని వారు దేశీయ పర్యటనలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రావెల్ పరిశ్రమలో సుదీర్ఘ విరామం తర్వాత ఇంతటి స్థాయిలో ప్రయాణాల పెరుగుదలను మార్కెట్ నిపుణులు ‘రివెంజ్ ట్రావెల్’గా అభివర్ణిస్తున్నారు. పక్కా గైడెన్స్తో.. కోవిడ్ వల్ల ఎదురైన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి సరైన గైడెన్స్లోనే తమ ప్రయాణాలు కొనసాగించాలని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రావెల్ ఏజెంట్ల సాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తుండటం ట్రావెల్ కంపెనీలకు ఊతం ఇస్తోంది. ఈ క్రమంలోనే 80 శాతం మంది టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ద్వారా ఆర్గనైజ్డ్ ట్రిప్లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినియోగదారుల మద్దతు సమకూర్చుకునేందుకు అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రేటు ఎంతైనా పర్వాలేదు ప్రముఖ ట్రావెల్ సర్వే ప్రకారం భారత్లో 86 శాతం మంది కరోనాకు మందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేసైనా తాము కోల్పోయిన ప్రయాణ అనుభూతిని తిరిగి పొందాలనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తున్న మెజార్టీ ఎయిర్లైన్స్, ట్రావెల్ ఏజెంట్లు భవిష్యత్తులో తమ పరిశ్రమ భారీ వృద్ధిని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విహారం కోసం.. పర్యావరణ అనుకూల పర్యటనల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. 87 శాతం మంది తాము ప్రశాంత వాతావరణంలో గడపాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ ప్రయాణికులు సైతం సహోద్యోగులతో మళ్లీ కలిసి ప్రయాణాల్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. ఏమిటీ రివెంజ్ ట్రావెల్ నిబంధనల నుంచి ఉపశమనం కోసం ప్రజలు జాగ్రత్తలు విస్మరించి కరోనాను మళ్లీ విజృంభించేలా చేసే ప్రక్రియను రివెంజ్ ట్రావెల్ లేదా రివెంజ్ టూరిజం అంటారు. లాక్డౌన్లు, వర్క్ఫ్రమ్ హోమ్ల కారణంగా ఇంట్లోనే ఉండి విసిగిపోయిన ప్రజలు సాధారణంగా సాగుతున్న జీవితంలో మార్పు కోరుకొని బయటికి వస్తున్నారు. కరోనా భయం కూడా వారిని ఆపలేకపోతోంది. అందుకే వారు టూర్లకు వెళుతున్నారు. ఇదే రివెంజ్ ట్రావెల్ పూర్తి కాన్సెప్ట్. పర్యాటకులు నిబంధనలను విస్మరించడాన్ని చూసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘‘రివెంజ్ ట్రావెల్’’అన్న పదాన్ని ఇటీవల వాడింది. ఇది చాలా ప్రమాదకరమని ప్రజలను హెచ్చరించింది. -
అమర్నాథ్ యాత్ర: కాపాడాలని రాయగడ యువకుల వీడియో సందేశం
కొరాపుట్(భువనేశ్వర్): పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఒడిశా వాసులు అనుకోని ఆపదలో చిక్కుకున్నారు. ఇందులో నవరంగ్పూర్ వాసులు క్షేమంగా భయటపడగా, రాయగడకు చెందిన యువకులు మాత్రం ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం అందించారు. నవరంగపూర్జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన పశుమర్తి నగేష్, శాంతి, వినయ్, వాసు, చిన్ను, సోహిణీ, హరి, బొద్దుపు సునీత యాత్రకు భయలుదేరి వెళ్లారు. వీరితో పాటు జయపురానికి చెందిన కోట కామేశ్వరరావు, చంద్ర దంపతులు, సాలూరులో పలివెల శ్రీను, జ్యోతి, పార్వతీపురానికి చెందిన నాగుల రేష్మ దంపతులు తోడయ్యారు. అంతా శుక్రవారం అమర్నాథ్లో విపత్తు జరిగే సమయానికి కొన్ని గంటల ముందు స్వామివారి దర్శనం చేసుకొని, తిరిగి శ్రీనగర్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీరు అమర్నాథ్ గుహ వద్దనే ఉన్నారు. సాయంత్రం ఈ ఘటన జరిగింది. శ్రీనగర్ చేరే సమయంలో విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి టీవీల్లో దుర్ఘటన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు ఆందోళనకు గురయ్యారు. జమ్మూ–కశ్మీర్లో బీఎస్ఎన్ఎల్ పోస్ట్పెయిడ్ ఫోన్లు మాత్రమే పని చేస్తాయి. కేవలం స్థానికులకు మాత్రమే ప్రీ పెయిడ్ ఫోన్లు పనిచేస్తాయి. వెళ్లిన వారందరివీ ప్రీపెయిడ్ ఫోన్లు కావడంతో వీరి క్షేమ సమాచారం ఆలస్యమైంది. శ్రీనగర్లో ప్రతి హోటల్లో వైఫై సదుపాయం ఉంటుంది. దీంతో వీరందరి ఫొటోలు వాట్సాప్లో పంపిచడంతో అంతా క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే గండం నుంచి భయట పడ్డామని యాత్రికులు తమ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. చిక్కుకున్న రాయగడ వాసులు.. రాయగడ: ‘అమర్నాథ్ యాత్రకు వెళ్లాం. అనుకోని విధంగా అంతా ప్రమాదంలో చిక్కుకున్నాం. మమ్మల్ని కాపాడండి’ అని రాయగడకు చెందిన యువకులు వీడియో సందేశం ద్వారా ప్రాథేయపడ్డారు. పట్టణంలోని కాళీపూజ జంక్షన్కు చెందిన బసంతకుమార్ సేనాపతి, సౌమ్యరంజన్ పాత్రొ, కొనతాం రవికుమార్, టుకున ప్రధాన్, నిహార్రంజన్ పాత్రొ 10రోజుల క్రితం అమర్నాథ్ యాత్రకు వెళ్లాం. వీరంతా తమకు సంబంధించిన సామగ్రిని జమ్మూలో విడిచి, అమర్నాథ్కు పయనమయ్యారు. యాత్రలో భాగంగా మంచులింగాన్ని శుక్రవారం ఉదయం దర్శించుకుని, తిరిగి వస్తున్న సమయంలో వంశతరణి నదీ వర్షబీభత్సానికి వారు నివసించేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లు కొట్టుకుపోయాయి. దీంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బాతల్ నుంచి నడక ప్రయాణం కొనసాగించామని వీడియో ద్వారా రాయగడలో ఉన్న తమ మిత్రులకు తెలియజేశారు. ప్రస్తుతం తాము ఐదుగురం మంచుకొండలపై ప్రయాణం చేస్తున్నామని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంతో ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. జమ్మూ వరకు తమను చేర్చేవిధంగా సహకరించాలని వారంతా ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం స్పందించి తమ వారిని కాపాడాలని బాధితుల కుటుంబీకులు కోరుతున్నారు. చదవండి: కాంగ్రెస్కు మరో సీనియర్ నేత గుడ్బై! బీజేపీ గూటికి కుల్దీప్ బిష్ణోయ్! -
అమర్నాథ్లో కన్నడిగులు క్షేమం: సీఎం
శివాజీనగర: జమ్ముకశ్మీర్లోని అమర్నాథ్ గుహ వద్ద ఆకస్మిక వరదలు సంభవించి పలువురు మరణించడం తెలిసిందే. దీంతో యాత్రను రద్దు చేశారు. అమర్నాథ్ పర్యటనలో వంద మందికి పైగా కన్నడిగులు ఉన్నారు. వారి రక్షణకు చర్యలు తీసుకున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై, రెవెన్యూ మంత్రి అశోక్ తెలిపారు. శనివారం సీఎం మాట్లాడుతూ కన్నడిగులు అందరూ క్షేమమని, ఎలాంటి అవాంఛనీయాలు జరిగినట్లు సమాచారం రాలేదన్నారు. 15–20 మంది ఫోన్ చేసి తాము ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పగా, అక్కడి అధికారులతో మాట్లాడి సాయం చేయాలని కోరామన్నారు. సహాయం అవసరమైతే సహాయవాణికి కాల్ చేయాలన్నారు. మైసూరు లాయర్లు సురక్షితం మైసూరు: అమర్నాథ్ వరద విపత్తు నుంచి మైసూరు నగరానికి చెందిన న్యాయవాదుల బృందం కొంచెంలో తప్పించుకుంది. వరదలో చిక్కుకున్న తమను సైనికులు కాపాడినట్లు తెలిపారు. మైసూరు తాలూకాలో మరటి క్యాతనహళ్లికి చెందిన ఎ.జె.సుధీర్, గుంగ్రాల్ శివరామ్, ఎస్.రఘు, మైసూరువాసి జి.కే.జోషి, హెబ్బాలవాసి కే.టి.విష్ణు. లోకేష్, తిలక్, ప్రదీప్కుమార్ తదితరులు జూలై నెల 4 వ తేదీన అమర్నాథ్లో పరమశివుని గుహ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఎగువన హిమాలయాల్లో ప్రచండమైన వరదలు రావడంతో గుహ వద్ద పెద్ద ప్రవాహం దూసుకొచ్చింది. కొండ చరియలు కూడాకొట్టుకొచ్చాయని తెలిపారు. ఇంతలో సైనికులు తమను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారని ఫోన్లో తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్: 011–23438252, 011–23438253 కాశ్మీర్ హెల్ప్ లైన్: 0914–2496240 దేవాలయ పాలక మండలి సహాయవాణి:01914–2313149 కర్ణాటక కేంద్రం: 080–1070, 22340676 -
Hyderabad: చారిత్రక భాగ్యనగరికి విదేశీ పర్యాటక కళ
సాక్షి, హైదరాబాద్: ‘అతిథి దేవోభవ’ అంటూ భాగ్యనగరం పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. గోల్కొండ కోట, చార్మినార్ వంటి శతాబ్దాల నాటి చారిత్రక కట్టడాలు యథావిధిగా విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వివిధ దేశాల నుంచి ప్రతిరోజు 5000 మంది, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 10 వేల మందికి పైగా పర్యాటకులు హైదరాబాద్ను సందర్శిస్తారు. వీరిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య సాధారణ రోజుల్లో 3000 వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 7500 వరకు ఉంటుంది. మరో 2000 నుంచి 2500 మంది విదేశీ పర్యాటకులు నగరంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. కోవిడ్ కారణంగా ఈ రాకపోకల్లో స్తబ్దత నెలకొంది. కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడంతో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి మొదలైంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, పర్యాటకులు నగరాన్ని సందర్శిస్తున్నారు. అలాగే విదేశీ రాకపోకలు కూడా పెరిగాయి. యూరోప్ దేశాల నుంచి నగరానికి ఎక్కువ మంది వస్తున్నట్లు జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్ ఆంక్షలను తొలగించినప్పటికీ చాలా మంది వేచి చూసే ధోరణి వల్ల ప్రయాణం వాయిదా వేసుకున్నారని, రెండు నెలలుగా రాకపోకలు తిరిగి ఊపందుకున్నాయని పేర్కొన్నారు. ఇది ‘రివెంజ్ టూరిజం’... ఏడాదికోసారి ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి సేదతీరడం సాధారణమైన అంశం. అలాగే పర్యాటక ప్రియులు సైతం దేశవిదేశాలను సందర్శించి తమ అభిరుచిని చాటుకుంటారు. కానీ కోవిడ్ కారణంగా ఈ పర్యటనలు నిలిచిపోవడంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆంక్షలు తొలగడంతో గట్టు తెగిన ప్రవాహంలా జనం రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా అనూహ్యంగా పెరిగిన పర్యాటకుల తాకిడిని ట్రావెల్స్ సంస్థలు ‘రివెంజ్ టూరిజం’గా అభివర్ణిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలోనే భారతదేశ సందర్శన కోసం తరలి వస్తున్నారు. ఢిల్లీ, ఆగ్రా వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించిన వాళ్లు దక్షిణాదిలో హైదరాబాద్ను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, తదితర ప్రాంతాలతో పాటు రామప్ప ఆలయాన్ని సైతం ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీ.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. కోవిడ్కు ముందు ఉన్న డిమాండ్తో పోల్చుకుంటే గత మే నెలలో 93 శాతం మంది జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 86 శాతం వరకు ఉండడం గనార్హం. జూన్ 10వ తేదీన ఒక్క రోజే 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కోవిడ్ తరువాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే విమానాల సంఖ్య పెరగడంతో అందుకనుగుణంగా ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. మే నెలలో 15 లక్షలకు పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 2.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు బయలుదేరారు. నగరం నుంచి ఇప్పుడు లండన్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, దుబాయ్, ఖతార్, షార్జా, దోహా, కువైట్లకు సర్వీసులు నడుస్తున్నాయి. హాంకాంగ్ మినహా, అంతకుముందున్న అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇప్పుడు విమాన సర్వీసులు ఉన్నాయి.కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకూ విమాన సర్వీసులను జోడించారు. (క్లిక్: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..) -
తారల తళుక్కులను చూసేద్దాం!
సాక్షి, అమరావతి: కాంతి కాలుష్యానికి (లైట్ల వెలుతురు పెద్దగా లేని ప్రాంతం) దూరంగా చీకటి ఆకాశంలో టెలీస్కోప్ల సాయంతో నక్షత్రాలను వీక్షించడమే ఆస్ట్రో పర్యాటకం. ఇది ఎత్తైన కొండలు, దట్టమైన కోనలు, హిమ పర్వతాల ప్రాంతాల్లో సాంకేతికతతో కూడిన ఎకో టూరిజంగా ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇందులో పర్యాటకులు స్పష్టమైన రాత్రి ఆకాశాన్ని అన్వేషిస్తూ (నైట్ స్కై టూరిజం) గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఖగోళ వస్తువులు, ఉల్కాపాతాలను వీక్షించవచ్చు. ఆస్ట్రో–ఫొటోగ్రఫీ నేర్చుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు సైతం ఆకాశంపై పరిశోధనలకు రాత్రి శిఖరాగ్ర ప్రదేశాల్లోనే ఎంచుకొంటారు. ఉపాధి వనరుగా.. ఆస్ట్రో టూరిజం స్థానిక వర్గాలకు బలమైన ఆర్థిక, సామాజిక ఉపాధి వనరుగా మారుతోంది. లద్ధాఖ్లో స్థానిక మహిళలకు ఆస్ట్రో టూరిజంలో టెలిస్కోప్ల వినియోగంలో శిక్షణ పొంది నక్షత్రాలు, నక్షత్ర రాశులను గుర్తించడంలో పర్యాటకులకు గైడులుగా వ్యవహరిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆస్ట్రో–స్టే పేరిట స్థానిక గృహాల్లోనే పర్యాటకులకు బస కల్పించి ఉపాధి పొందుతున్నారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్ల్లో ఖగోళ పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టుల కోసం గుడిసెలు ఏర్పాటు చేస్తూ.. భోజనాలు అందిస్తూ..సంగీత కచేరీలతో అలరిస్తూ సంపాదిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని బెనిటల్ ఆస్ట్రో గ్రామంగా మారింది. ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘ఆస్ట్రో విలేజ్ పార్టీలు’ పెడుతున్నారు. దేశంలో ఇలా.. దేశంలో తొలి సారిగా రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 33 జిల్లాల్లో ఆస్ట్రో టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి జిల్లాలో టెలిస్కోప్లు ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీలోని బికనీర్ హౌస్లో కూడా ఆస్ట్రో టూరిజం కోసం కేంద్రాన్ని నిర్వహిస్తోంది. రాజధాని జైపూర్లోనే 4 నక్షత్ర వీక్షణ కేంద్రాలను పెట్టింది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పుదుచ్చేరి, కర్ణాటకలోని విరాజ్పేట, మడికేరి, గోవా, కేరళలోని మున్నార్లో ఆస్ట్రో ఫోటోగ్రఫీ సెషన్లు, ప్లానెటరీ పెరేడ్, ‘మెస్సియర్ మారథాన్’ పేరుతో చీకటి ఆకాశాన్ని వీక్షించేందుకు మొబైల్ అబ్జర్వేటరీలు నడుస్తున్నాయి. తమిళనాడులో తక్కువ జనసాంద్రత కలిగిన ఏలగిరి కొండలు, ఊటీకి ఖగోళ పర్యాటకం పెరుగుతోంది. లద్ధాఖ్కు ప్రత్యేక గుర్తింపు! ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో లద్ధాఖ్లోని హన్లే గ్రామం ఒకటి. ఈ ప్రాంతాన్నే ఇటీవల మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్గా ప్రకటించారు. ఇది శీతల ఎడారి ప్రాంతం కావడంతో ఏడాది పొడవునా పొడి వాతావరణంతో ఆకాశంలో పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే పరిశోధనల కోసం రాత్రిపూట ఆకాశాన్ని కాంతి కాలుష్య కారకాల నుంచి పరిరక్షించే దిశగా ప్రత్యేక బృందం కృషి చేస్తోంది. -
ఆహ్లాదం మాటున సుడి‘గండాలు’
మారేడుమిల్లి: దట్టమైన అడవులు....చుట్టూ ఎత్తైన కొండలు...పాతాళానికి జారిపోయేలా లోయలు, గలగలపాతే సెలయేళ్లు, పక్షుల కిలకిలారావాలు, వంపుసొంపుల రహదారులు, ఆహ్లాదం కలిగించే చల్లని వాతావారణం, మనస్సును మైమరిపించే ప్రకృతి రమణీయతకు నిలయం మారేడుమిల్లి మండలం. సుముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తున ఉండే ప్రాంతంలో వాలి సుగ్రీవ్ వాలమూలికల ప్రదేశం, జలతరంగిణి, అమృతధార జలపాతాలు, జంగిల్స్టార్, మన్యం యూ పాయింట్, వనవిహరి వంటి పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో పాములేరు గ్రామం ఒక్కటి. ఈ గ్రామం పక్కనుంచి సుందరంగా ప్రవహించే కొండవాగు పర్యాటకులను ఎంతగానో అకర్షిసుంది. అయితే ఈ వాగు చాలా ప్రమాదకరమైంది. ఇందులో స్నానాలకు దిగినవారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. కొండల మధ్య సుంచి ఒంపుసొంపులుగా ప్రవహించే ఈ వాగు పైకి ఎంతో సుందరంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. నీటి లోపల పెద్దపెద్ద సుడిగుండాలు, ముసళ్లు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే చాలా మంది పర్యాటకులు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. తరుచూ ప్రమాదాలు పాములేరు వాగులో తరుచూ ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామానికి చెందిన కాళిదాస్ సందీప్, దాన ఆరుణ్కుమార్ అనే ఇద్దరు యువకులు వాగులోకి దిగి మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకినాడ జిల్లా సర్పవరానికి చెందిన బొక్కా మనోజ్, వాసు అనే ఇద్దరు యువకులు వాగులో మునిగి చనిపోయారు. గత ఏడాది రాజమహేంద్రవరానికి చెందిన బీటెక్ విద్యార్థులు నలుగురు, రంగపేటకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. అంతకు ముందు ఏడాది తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతై మృతి చెందారు. ఇలా గత పదేళ్లలో వందలాది మంది వాగులో మృత్యువాత పడ్డారు. ఫలితమివ్వని హెచ్చరిక బోర్డులు పాములేరు వాగులో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అటవీశాఖ అధికారులు వాగులోకి దిగడాన్ని నిషేధించారు. వాగు వద్ద చుట్టూ గతంలో కంచెలు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాటిని పర్యాటకులు పట్టించుకోవడం లేదు. వాగులోకి దిగే సమయంలో స్థానిక గిరిజనులు హెచ్చరిస్తున్నా పర్యాటకులు లెక్క చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముందు, ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకోవాలని స్ధానిక గిరిజనులు, పర్యాటకులు కోరుతున్నారు. (చదవండి: విశాఖలో అంతర్జాతీయ యానిమేషన్ చిత్ర నిర్మాణం) -
ఒంపు సొంపుల ఏరులో.. మడ అడవుల మధ్యలో
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతి సిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ..వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ..చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలు పోతున్నట్లు వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలా హిరిలో.. అంటూ సాగే పడవ ప్రయాణం.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్లు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు ఆస్వాదించాలంటే నాగాయలంక మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే! నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద నుంచి సముద్ర ప్రాంతం వరకూ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డుపొన్న వంటి రకాల మొక్కలున్నాయి. వీటిలో మడ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నీటిలో వేర్లు, మొదళ్ళు కనబడుతూ పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. మడ అడవుల నడుమ, నదీపాయలు, సింకుల్లో ప్రయాణిస్తూ సాగే ప్రయాణం సుందర్బన్ అడవుల అందాలను తలపిస్తుంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా సహజ సిద్ధ ప్రకృతి సోయగాలకు నెలవు ఈ తీర ప్రాంతం. ప్రత్యేకమైన ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఈ మడ అడవుల అందాలను తిలకించాలంటే నాగాయలంక, గుల్లలమోద, ఎదురుమొండి, సంగమేశ్వరం నుంచి ప్రత్యేక పడవల్లో వెళ్ళాల్సి ఉంటుంది.. రవాణా సదుపాయం కల్పిస్తే మరింతగా టూరిజం అభివృద్ధి ప్రస్తుతం ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసుకుని టూరిస్టులు ఈ లైట్హౌస్ సందర్శిస్తున్నారు. ఈ ప్రయాణం రిస్కుతో కూడుకోవడం, ఖర్చులు ఎక్కువ అవడం వల్ల లైట్హౌస్ని సందర్శించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది ఈ ప్రాంతాన్ని సందర్శించలేక పోతున్నారు. దీనికితోడు లైట్హౌస్ ప్రాంతంలో ఏమీ దొరక్క పోవడం పర్యాటకులకు నిరాశే మిగులుతుంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకశాఖ ప్రత్యేక లాంచీలు, బోట్లను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. లైట్హౌస్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా లైట్హౌస్ ఓ వైపు పచ్చని మడ అడవులు, మరో వైపు కృష్ణా నది, ఇంకోవైపు బంగాళాఖాతం మధ్య ఉండే మడ అడవుల నడుమ ఉండే గుల్లలమోద లైట్హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగాయలంక నుంచి 25 కి.మీ దూరంలో లైట్ హౌస్ ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ లైట్హౌస్ని 1972లో ఆధునీకరించారు. దీని ఎత్తు 135 అడుగులు. 9 అంతస్తులు కలిగి ఉంది. 1977 ఉప్పెనకు ఈ లైట్హౌస్ 5వ అంతస్తు వరకూ వరద నీరు వచ్చినట్లు రికార్డులో నమోదైంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా పచ్చని మడ అడవులు, నదీపాయల నడుమ ఉండటం ఈ లైట్హౌస్ ప్రత్యేకత. (క్లిక్: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) -
పర్యాటకులకు శుభవార్త.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పర్యాటకులు, తీర్థయాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ–అరకు–విశాఖ (రైల్ కం రోడ్ ) ఈ టూర్ ప్రతిరోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్లో అరకు వ్యాలీ (ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, ధింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరి అదేరోజు రాత్రి విశాఖపట్నానికి చేరుస్తారు. తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) ఈ టూర్ ప్రతిశుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్ప్రెస్లో తిరుపతి తీసుకువెళ్లి, మళ్లీ అదే రైలులో విశాఖ తీసుకొస్తారు. సదరన్ డివైన్ టెంపుల్ టూర్ (ఫ్లైట్ ప్యాకేజీ) ఈ టూర్ ఆగష్టు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొత్తం 5రాత్రులు, 6పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో దక్షిణాదిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, త్రివేండ్రం వంటి దర్శనీయ స్థలాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో గానీ, 0891–2500695, 8287932318 నంబర్లలో గానీ సంప్రదించాలని చంద్రమోహన్ సూచించారు. -
జలవిహార్ లో పర్యాటకుల సందడి
-
డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్
రాకాసి అలలు.. ఎన్నో కుటుంబాల్లో మరణ శాసనం రాసి సముద్రమంత దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఆరాటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకునేలోపు పర్యాటకుల జీవితాల్లో తీరం విషాదాన్ని నింపుతున్నాయి. గజ ఈతగాళ్లు ఉన్నా.. మునిగిపోతున్నవారిని చేరేలోపే మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ చెప్పేందుకు విశాఖ వాసులు సరికొత్త డ్రోన్ను ఆవిష్కరించారు. సైఫ్సీస్ పేరుతో రూపొందించిన ఈ పరికరం మృత్యు అలలను ఎదిరించి మునిగిపోతున్న వారి ప్రాణాలు కాపాడగలదు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ను పర్యాటక శాఖ నిర్వహించింది. సాక్షి, విశాఖపట్నం: సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఎవరికైనా ఈత కొట్టాలనిపిస్తుంటుంది. కానీ రాకాసి అలలు మింగేస్తాయని భయం అందరిలోనూ ఆందోళన రేకెత్తించినా.. అక్కడి పరిస్థితులు వాటిని లెక్కచెయ్యనీయవు. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పుష్కర కాలంలో సుమారు 600 మంది అలలకు బలయ్యారు. ఇందులో 60 శాతం మంది 15 నుంచి 30 ఏళ్లలోపువారే ఉండటం బాధాకరమైన విషయం. నగర పరిధిలోని అన్ని బీచ్పాయింట్లలో ఉండే లైఫ్గార్డులు సముద్రంలో మునిగిపోతున్న చాలా మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే అలల ఉధృతికి లోపలకు కొట్టుకుపోతున్న వారి వద్దకు లైఫ్గార్డులు వెళ్లేలోపే కొందరు మృత్యువాతపడుతున్నారు. ఇటువంటి వారిని కాపాడేందుకు విశాఖకు చెందిన ఓ బృందం సైఫ్సీస్ పేరుతో డ్రోన్ను తయారు చేసింది. దగ్గరలోనే లోతు.. వదులుగా ఇసుక మిగిలిన సముద్ర తీరాలతో పోలిస్తే విశాఖ తీరం రూపురేఖలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మచిలీపట్నం దగ్గర సముద్రంలో చాలా దూరం వెళ్తే గానీ లోతుండదు. గోవా దగ్గర సముద్రంలో దాదాపు కిలోమీటర్ దూరం వరకూ నడిచి వెళ్లొచ్చు. కానీ విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద పది మీటర్ల ముందుకెళ్తే చాలు లోతు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఆర్కే బీచ్కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో ఈ లోతు మరింతగా పెరుగుతూ వస్తోంది. ఆర్కే బీచ్తో పాటు భీమిలి, రుషికొండ, తొట్లకొండ, సాగర్నగర్ దగ్గర లోతుతో పాటు ఇసుక ఎక్కువ వదులుగా ఉంటుంది. కెరటం వచ్చి వెనక్కు వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. దీన్ని అంచనా వెయ్యలేక పోవడంతో కాళ్లు పట్టుకోల్పోయి లోతులోకి జారిపోయి గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సముద్రంలో ప్రమాదాల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఈ సైఫ్సీస్ డ్రోన్లు ఉపయోగపడతాయి. సైఫ్ సీస్.. ఇలా రక్షిస్తుంది.. సాధారణంగా లైఫ్గార్డ్ సెకనుకు మీటరు నుంచి మీటరున్నర దూరం ఈదుతూ వెళ్లగలరు. 30 మీటర్ల దూరంలో పర్యాటకుడు మునిగిపోతుంటే.. అక్కడికి చేరుకోవడానికి కనీసం 25 సెకన్ల సమయం లైఫ్గార్డుకు పడుతుంది. కానీ.. గజఈతగాడి కంటే ఐదు రెట్లు వేగంగా ఈ మానవ రహిత డ్రోన్లు దూసుకెళ్తుంది. 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకన్ల వ్యవధిలోనే చేరుకొని బాధితుడిని రక్షించగలదు. అంటే లైఫ్గార్డు కంటే 7 రెట్లు వేగంగా స్పందిస్తుంది. లైఫ్గార్డు ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే రక్షించగలరు. కానీ.. సైఫ్సీస్ 200 కిలోల బరువు వరకూ ఎంత మంది ఉంటే అందర్ని ఒడ్డుకు తీసుకురాగలదు. గంటకు 15 కిలో మీటర్ల వేగంతో అలలను చీల్చుకుంటూ ముందుకు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. పూర్తిగా రిమోట్ ద్వారా ఒడ్డున నిలబడే ఆపరేట్ చేస్తూ.. మునిగిపోతున్న వారి వద్దకు ఈ డ్రోన్లను క్షణాల్లో పంపించవచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల వరకూ దీన్ని పంపించవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీలు 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంట పాటు పనిచేస్తాయి. స్టాండ్ బై మోడ్ 5 నుంచి 6 గంటల వరకూ ఉంటుంది. 22 కేజీల బరువుండే ఈ డ్రోన్ను పట్టుకుంటే మళ్లీ జారిపోకుండా గ్రిప్ ఉంటుంది. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.6 లక్షల వరకూ ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరం వరకూ దీనిని కంట్రోల్డ్గా ఆపరేట్ చెయ్యవచ్చు. భారత ప్రభుత్వ ప్రశంసలు విశాఖ బృందం చేసిన ఈ సైఫ్సీస్ డ్రోన్కు అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్పోలో సైఫ్సీస్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ దీని పనితీరుని తెలుసుకొని బృంద సభ్యులను అభినందించారు. ఇప్పటికే హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పర్యాటక అవసరాల కోసం వీటిని కొనుగోలు చేసుకున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ.. కొద్ది నెలల క్రితం సైఫ్సీస్ డ్రోన్ ట్రయల్ రన్ను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రోత్సహిస్తే.. ప్రాణాలు కాపాడతాం.. మూడేళ్ల పాటు శ్రమించి సైఫ్సీస్ డ్రోన్ని ఇండియన్ నేవీ స్పెసిఫికేషన్స్తో తయారు చేశాం. సైఫ్సీస్ని డీఆర్డీవో–ఎన్ఎస్టీఎల్ అప్రూవ్ డిజైన్తో రూపుదిద్దుకుంది. లైఫ్గార్డుల కంటే వేగంగా చేరుకోవడం వల్ల సముద్రంలో మునిగిపోతున్న వారిని కాపాడగలం. 100 శాతం ఆటోమేటిక్గా రోబోటిక్ ప్రోబ్స్తో దీన్ని తయారు చేశాం. పలు రాష్ట్రాల్లో చాలా మంది ప్రాణాలను కాపాడుతోంది. ఏపీలో ప్రోత్సహిస్తే వైజాగ్ బీచ్లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలమన్న విశ్వాసం మాకు ఉంది. – అలీఅస్గర్ కలకత్తావాలా, సైఫ్సీస్ కో–ఫౌండర్ (చదవండి: సీపోర్టు టు ఎయిర్పోర్టు 'సువిశాల రహదారి') -
తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వేసవి సీజన్లో పర్యాటకులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్( ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–అరకు–విశాఖపట్నం (రైల్ కం రోడ్ ప్యాకేజీ): ఈ టూర్ ప్రతీ రోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్లో అరకు వ్యాలీ(ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, థింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరుతారు. అక్కడ నుంచి అన్ని ప్రాంతాలను చూపించి తిరిగి అరకు నుంచి రోడ్ మార్గం ద్వారా అదేరోజు రాత్రి విశాఖపట్నం చేరుస్తారు. ఈ టూర్ ప్యాకేజీ చార్జీలు విశాఖ నుంచి అరకు వరకు విస్టాడోమ్ కోచ్లో వెళ్లాలనుకుంటే పెద్దలకు రూ.3,060, పిల్లలకు రూ.2670, స్లీపర్ క్లాస్ కోచ్ అయితే పెద్దలకు రూ.2,385, పిల్లలకు రూ.2,015, సెకండ్ సిటింగ్ పెద్దలకు రూ.2,185, పిల్లలకు రూ.1,815(ఈ చార్జీలు సైట్సీయింగ్, రానుపోను ప్రయాణఖర్చులు, అల్పాహారం, మ«ధ్యాహ్నం భోజనం, సాయంత్రం హై టీ, బోర్రా ప్రవేశచార్జీలు, అన్ని పన్నులు కలుపుకుని) తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) ఈ టూర్ ప్రతీ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. థర్డ్ ఏసీ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.17,860, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 11,720, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.10,495, స్లీపర్ క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.15,765, డబుల్ ఆక్యుపెన్సీ రూ.9,625, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.9,400.. వసతి, రవాణా, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం చార్జీలు, కాణిపాకం, తిరుచానూర్ టికెట్ చార్జీలు, టోల్ గేట్స్, పార్కింగ్, జీఎస్టీ వంటి అన్ని చార్జీలతో కలిపి ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఒకటో నెంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 0891–2500695, 8287932318 నెంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. (చదవండి: మంత్రులు, ఎమ్మెల్యేలే టార్గెట్) -
అండమాన్కు చలో చలో
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి పోర్టు బ్లెయిర్కు తొలినాళ్లలో మూడు నెలలకోసారి పాసింజర్ షిప్ నడిచేది. క్రమంగా డిమాండ్ పెరగడంతో నెలకోసారి పరుగులు తీసింది. విశాఖ పోర్టు నుంచి ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రయాణికులు, ముఖ్యంగా వలసదారులు ఈ నౌక ద్వారానే అండమాన్ చేరుకునేవారు. ఫుల్ డిమాండ్తో నడుస్తున్న తరుణంలో కరోనా వ్యాప్తి చెందడం... లాక్డౌన్ కారణంగా.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండేళ్ల పాటు రాకపోకలను నిలిపివేసింది. తాజాగా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఫుల్ స్వింగ్లో షిప్ ప్రయాణం మొదలుపెట్టింది. శనివారం సాయంత్రం బయలుదేరి.. 450 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం పోర్టుబ్లెయిర్లో పాసింజర్ కార్గో షిప్ క్యాంప్బెల్ బే బయలుదేరింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే 95 శాతం మంది ఇందులో ఉండటం విశేషం. అండమాన్ నికోబార్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారంతా.. వేసవి సెలవుల కోసం తమ స్వస్థలాలకు బయలుదేరినట్లు షిప్ ఏజెంట్స్ చెబుతున్నారు. మూడు రోజుల ప్రయాణం తర్వాత విశాఖపట్నం పోర్టుకు ఈ నెల 3వ తేదీ ఉదయం చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ట్రాఫిక్ మేనేజర్ రత్నకుమార్ పూర్తి చేశారు. 5న ఫుల్ప్యాక్తో ప్రయాణం విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కూడా ఖరారైంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం క్యాంప్బెల్ బే షిప్ విశాఖ నుంచి బయలుదేరనుంది. 8వ తేదీ ఉదయానికి క్యాంప్బెల్ బే.. తిరిగి పోర్టు బ్లెయిర్కు చేరుకోనుంది. సుదీర్ఘ విరామం తర్వాత నడుస్తుండటంతో టికెట్స్ హాట్ కేక్స్లా అమ్ముడు పోయాయి. మొత్తం 500 మంది సామర్థ్యం ఉండగా బుకింగ్స్ ప్రారంభించిన రెండ్రోజుల్లోనే మొత్తం టికెట్స్ విక్రయించేశారు. అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను అనుసరించి క్యాంప్బెల్షిప్ని నడుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏవీ భానోజీరావు, గరుడ పట్టాభి రామయ్య అండ్ కో ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్ నేపథ్యంలో మరో షిప్ రెడీ..! క్యాంప్బెల్ బే ప్యాసింజర్ కార్గో షిప్ తొలి ప్రయాణంలోనే 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఇంకా కావాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుండటంతో మరో షిప్ని కూడా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్కు ఎంవీ స్వరాజ్ద్వీప్ నౌక రాకపోకలు సాగించేది. తర్వాత ఎంవీ హర్షవర్థన్ నడిపారు. రెండేళ్ల క్రితం ఇది మరమ్మతులకు గురికావడంతో డాక్యార్డులో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇది దాదాపు పూర్తయిందనీ.. త్వరలోనే ఎంవీ హర్షవర్ధన్ షిప్ని విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్కు రాకపోకలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణం చాలా చౌక అండమాన్కు చాలా తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రయాణికులను రెండు రకాలుగా విభజించారు. అండమాన్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయాణికుడిని ఐలాండర్ అనీ.. పర్యాటకుల్ని నాన్ ఐలాండర్గా షిప్ టికెట్స్ విక్రయంలో విభజిస్తారు. ఐలాండర్కు జనరల్ టికెట్ కేవలం రూ.1250 మాత్రమే కాగా.. పర్యాటకుడికి జనరల్ టికెట్ రూ.3,375 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి అండమాన్కు విమానంలో వెళ్లాలంటే రూ.10 వేల వరకూ ఖర్చవుతుంది. ఎంత లగేజ్ తీసుకెళ్లినా.. ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయడం లేదు. మొత్తం నాలుగు విభాగాలుగా టికెట్స్ విక్రయాలు జరుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. మంచి ప్రారంభం దక్కింది కోవిడ్ తర్వాత అండమాన్కు పాసింజర్ షిప్ ప్రయాణం మొదలు కావడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరిగానే ప్రారంభం నుంచే ప్రయాణికులు ఆసక్తి చూపించడం శుభపరిణామం. ఈ నెల 3న వస్తున్న షిప్కు బెర్తు, ఇతర సౌకర్యాలు పోర్టు పరంగా పూర్తి చేశాం. ప్రతి ప్రయాణికుడు కనీసం 10–15 పెద్ద సైజు బ్యాగ్లు, లగేజీతో ప్రయాణిస్తుంటారు. ఇందుకనుగుణంగా పోర్టులోకి ఆర్టీసీ బస్సులను కూడా ఆ సమయంలో అనుమతిస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, విశాఖ పోర్టు చైర్మన్ (చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!) -
అలా.. జల విహారం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా జల విహారానికి (బోటింగ్) ఆదరణ పెరుగుతోంది. పర్యాటక శాఖతో పాటు ప్రైవేటు బోట్లు టూరిస్టులతో నిత్యం కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఏటా ఆదాయం రెట్టింపు అవుతుండడంతో పాటు ఒక్క బోటింగ్ నుంచే కార్పొరేషన్కు ఎక్కువ రాబడి వస్తుండడం విశేషం. ఈ క్రమంలో పర్యాటక శాఖ కొత్త బోట్ల కొనుగోలుకు కసరత్తు చేస్తోంది. తొలిదశలో భాగంగా విజయవాడ (భవానీ ద్వీపం), నాగార్జున సాగర్, విశాఖ ఫిషింగ్ హార్బర్లో అత్యాధునిక సౌకర్యాలతో 40 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్లను అందుబాటులోకి తేనుంది. వీటి కోసం సుమారు రూ.7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తర్వాతి దశలో రాజమండ్రి, శ్రీశైలంలోనూ కొత్తవి తీసుకురానున్నారు. గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం.. రాష్ట్రంలో ప్రస్తుతం 45 పర్యాటక శాఖ బోట్లు ఉండగా వాటిలో 40 బోట్లు నిత్యం నడుస్తున్నాయి. మరో 72 ప్రైవేటు బోట్లు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి. గతంలో కరోనా కారణంగా ఎక్కడికక్కడ బోటింగ్ నిలిచిపోవడంతో ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. అయితే ప్రస్తుతం వస్తున్న రాబడి కరోనా ముందు నాటి సాధారణ పరిస్థితులను తలపిస్తుండటం విశేషం. కరోనా మొదటి వేవ్లో సుదీర్ఘ విరామం తర్వాత బోటింగ్ ప్రారంభమవగా సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 (17వ తేదీ) వరకు రూ.2.79 కోట్ల ఆదాయం వచ్చింది. సెకండ్ వేవ్ విరామం అనంతరం సెప్టెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 (17వ తేదీ) వరకు రూ.4.72 కోట్ల రాబడి నమోదైంది. ఇటువంటి తరుణంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటకశాఖ చర్యలు చేపడుతోంది. బోటింగ్కు ప్రాధాన్యం పెరుగుతోంది! పర్యాటకులు జల విహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బోటింగ్ ద్వారా రాబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. డిమాండ్, అవసరాన్ని బట్టి కొత్త ప్రదేశాల్లోనూ బోటింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం. – ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
రావోయి విహారి.. బోటింగ్కు సిద్ధమోయి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బోధిసిరి బోటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరమ్మతుల పేరుతో మూడేళ్లపాటు పర్యాటకులకు దూరంగా ఉన్న ఈ డబుల్ డెక్కర్ క్రూయిజ్ వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. రూ.23 లక్షలతో మరమ్మతులు చేసిన బోధిసిరి ఇటీవల బెరంపార్క్లో బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకుంది. ప్రస్తుతం దానికి సర్వహంగులు ఏర్పాటు చేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు ఇప్పుడిప్పుడే దర్శనీయ స్థలాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో బోధిసిరి బోటు నదీ విహారానికి సిద్ధమవడంపై హర్షం వ్యక్తమవుతోంది. బోధిసిరి బోటు వినియోగంలోకి వస్తే కృష్ణానదిలో విహరించేందుకు ఉత్సాహపడే పర్యాటకులకు ఆహ్లాదం కలిగించడమేగాక ఏపీటీడీసీకి మంచి ఆదాయం సమకూరుతుంది. పోర్ట్ అధికారుల నిబంధనల మేరకు రూపుదిద్దిన బోధిసిరి బోటుకు పోర్ట్, ఇరిగేషన్ శాఖల అనుమతులు కూడా సులువుగానే లభించాయి. బోటులో నైట్ పార్టీ.. రెండు దశాబ్దాలుగా పర్యాటకులకు సేవలందిస్తున్న బోధిసిరి బోటు 120 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంది. గరిష్టంగా 200 మంది వరకు ఇందులో ప్రయాణం చేయవచ్చు. ఈ బోటును ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కూడా అద్దెకు ఇస్తారు. ఈ భారీ బోటు పైభాగంలో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి చిన్నచిన్న వేడుకలు నిర్వహించుకోవచ్చు. దీనిమీద చిన్నపాటి వేదిక కూడా ఉంది. బోటు నదిలో విహరిస్తుండగా పార్టీలు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బోటులో ఏర్పాటు చేసుకునే విద్యుత్ లైట్లతో అహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకొంటే ఆ మజానే వేరని అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇటువంటి ఫంక్షన్లతోపాటు అసోసియేషన్లు, మార్కెటింగ్ సంస్థలు వంటివాటి సమావేశాలకు కూడా అనువుగా ఉంటుంది. ఫంక్షన్కు లేదా సమావేశానికి వచ్చే అతిథులు భోజనాలు చేసేందుకు కింద ఏసీ సౌకర్యంతో సీటింగ్, టేబుల్స్తో పెద్ద హాల్ ఉంది. పైన ఆటపాటలతో కనువిందు చేస్తే కింద హాల్లో రుచికరమైన వంటకాలతో విందు భోజనం సిద్ధంగా ఉంటుంది. బోధిసిరి బోటులో నదిలో విహరించేందుకు గతంలో రెండు గంటలకు రూ.10 వేలు వసూలు చేసింది ఏపీటీడీసీ. కార్తికమాసం, పండుగలు, వారాంతపు సెలవుదినాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బోధిసిరి బోటును వినియోగిస్తుంటారు. వారంలో బోటు విహారం బోధిసిరి బోటుకు సంబంధించిన పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు, స్టిక్కరింగ్, ప్లంబింగ్ పనులు మూడు, నాలుగు రోజుల్లో పూర్తవుతాయి. ఇప్పటికే బోటు ట్రయల్ రన్ పూర్తయింది. బోటుకు సంబంధించిన అనుమతులు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బోటు షికారు వారం రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కృష్ణానదిలో బోధిసిరి కనువిందు చేయనుంది. – సీహెచ్.శ్రీనివాసరావు, డివిజనల్ మేనేజరు, ఏపీటీడీసీ -
మదిని దోచే .. మన్యం సొగసు
మనసుదోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే గోదావరి సోయగాలు.. ఎటు చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరు గాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నదీ తీరంలో దృశ్యాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసిన తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. – రంపచోడవరం మరుపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్పై ప్రయాణం చేసి పాపికొండలు చేరుకుంటారు. పాపికొండలు మధ్య బోట్లో పర్యాటకుల ప్రయాణం ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి ప్రకృతి గుడి.. సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తయిన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని క్యాంపెన్ టెంటుల్లో బస చేస్తారు. ఎత్తయిన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మారేడుమిల్లి చింతూరు ఘాట్రోడ్ గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాదిగా తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటకశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజమ్ ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. -
పర్యాటక ప్యాకేజీలతో ఆదాయం పరుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటిస్తున్న ప్యాకేజీల కారణంగా ఆ శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.24.05 కోట్లు ఆర్జించింది. ఇందులో తిరుపతి ప్యాకేజీల నుంచే అత్యధికంగా రూ.18 కోట్లు రావడం విశేషం. ఒక్క డిసెంబర్లోనే రూ.4 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ లోకల్టూర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. మరోవైపు కార్తీకమాసంలో శైవక్షేత్రాలు, శక్తిపీఠాల ప్యాకేజీలు కొంతమేరకు ఆదాయవృద్ధికి దోహదపడ్డాయి. ప్రస్తుతం పర్యాటక శాఖ 35 టూర్ ప్యాకేజీలను నడుపుతూ.. 30 సొంత బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబయి వంటి మెట్రో నగరాల నుంచి తిరుపతికి విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటకు బెంగళూరు, హైదరాబాద్ నుంచి పర్యాటకుల రాకను ప్రోత్సహిస్తున్నారు. కోవిడ్ ప్రారంభమైన తర్వాత పడిపోయిన పర్యాటకశాఖ ఆదాయం ప్యాకేజీలతో తిరిగి పుంజుకుంటుంది. తిరుపతికి ఇలా.. రవాణాతో పాటు వసతి, స్వామివారి దర్శనం కల్పిస్తుండడంతో తిరుపతి టూర్ ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం కర్నూలు, ఒంగోలు, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి తిరుపతికి పర్యాటక శాఖ బస్సులు నడుపుతోంది. మరోవైపు చెన్నై–వళ్లూరు–తిరుపతి, తిరుపతి–శ్రీశైలం, తిరుపతి–కాణిపాకం–స్వర్ణ దేవాలయం, అరుణాచలం తదితర లోకల్ ప్యాకేజీలను అందిస్తోంది. లోకల్ టూరిజం.. స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విశాఖపట్నం–లంబసింగి, విశాఖపట్నం–అరసవిల్లి దేవాలయం, రాజమండ్రి–మారేడుమిల్లి, కర్నూలు–శ్రీకాకుళం–నంద్యాల, శ్రీకాకుళంలో అరసవిల్లి–శ్రీకూర్మం–శాలిహుండం–కళింగపట్నంకు ఒక్కరోజులో చుట్టివచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే సర్క్యూట్ టూరిజంలో భాగంగా కొత్తగా అనంతపురం–కదిరి–వేమనగారి జన్మస్థలం ప్రాంతం–గండి ఆంజనేయస్వామి దేవాలయం, గండికోట, బెలూం గుహలు, తాడిపత్రి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో కలిపి రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్యాకేజీల ద్వారా పర్యాటక శాఖ సిబ్బంది జీతాలు, రవాణా ఖర్చులు అన్నీ పోనూ నికరంగా సుమారు రూ.6 కోట్లకు పైగా ఆదాయం లభించింది. పర్యాటకానికి కొత్త ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యూట్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా హైదరాబాద్, ముంబయి నుంచి విమాన ప్యాకేజీని ప్రవేశపెట్టాం. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఏపీ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి సొంత బస్సుల్లో సురక్షితంగా.. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పర్యాటక ప్యాకేజీలను నడుపుతున్నాం. కోవిడ్ కారణంగా రెండేళ్లలో ఎన్నడూ లేనంత వృద్ధి కేవలం ఆరు నెలల్లో సాధించాం. సొంత బస్సుల్లో సురక్షితంగా పర్యాటకులను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో ఎక్కువ ఆదరణ లభిస్తోంది. – ఎస్. సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ -
అటపాకలో విహంగ సోయగం
కైకలూరు: అరకేజీ బరువున్న చేపను అమాంతంగా మింగేసే పక్షిని మీరెప్పుడైనా చూశారా? వివిధ రంగుల కలబోత పక్షి ఉన్నట్లు మీకు తెలుసా.. చేపలను చిన్న చిన్న ముక్కలు చేసి పిల్లల నోటిలో పెట్టి మాతృత్వ ఆనందాన్ని పొందే అతిథి గురించి విన్నారా.. సహజత్వం ఉట్టిపడే పక్షుల బొమ్మలు, ముట్టుకుంటే మధురంగా వినిపించే ధ్వనులు ఇలా ఒకటేంటి అటపాక పక్షుల కేంద్రంలో.. ప్రతి దృశ్యాన్ని కనులారా చూసి ఆస్వాదించాల్సిందే. పెలికాన్ ప్యారడైజ్.. రాష్ట్రంలో పెలికాన్ ప్యారడైజ్గా పేరుపొందిన అటపాక పక్షుల విహార కేంద్రానికి శీతాకాలపు వలస విదేశీ పక్షుల రాక ఊపందుకుంది. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ప్రకృతి తన సహజసిద్ధ వాతావరణాన్ని సంతరించుకోవడంతో.. 188 రకాల విదేశీ అతిథి పక్షులకు ఆవాసంగా మారి ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మైళ్ల దూరాన్ని ఛేదించి పక్షులు కొల్లేరుకు చేరుకుంటున్నాయి. ఇకపోతే.. అటపాక పక్షుల కేం ద్రం వద్దకు వచ్చిన పర్యాటకుల పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఊయల వం టివి రారమ్మని పిలుస్తుంటాయి. మ్యూజియంలో ఏర్పాటు చేసిన పక్షుల నమూనా బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి. కొల్లేరులో బోటుపై వెళుతూ పక్షులను దగ్గర నుంచి చూడడం జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టంగా నిలిచిపోతుంది. ఆలనా..పాలనా అటవీశాఖదే.. అటపాక పక్షుల కేంద్ర నిర్వహణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ పక్షుల విహారానికి అనువుగా 280 ఎకరాల చెరువు ఉంది. అందులో 162 స్టాండ్లు ఉన్నాయి. వీటిపై పెలికాన్, పెయింటెడ్ స్టా్కక్, వైట్ ఐబీస్, కార్బొనెంట్ పక్షులు కొలువుదీరాయి. ఇప్పటికే పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి చేశాయి. పక్షుల పిల్లల వయసు నెల రోజులు దాటింది. వాటి కేరింతలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బోటు షికారుకు రెండు బోట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు. -
వలస విహంగాల సందడి
సూళ్లూరుపేట: విదేశీ వలస విహంగాల సందడితో.. ప్రకృతి అందాలకు హరివిల్లుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు మరింత శోభను సంతరించుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతానికి విచ్చేసే విదేశీ వలస పక్షులు నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట తదితర ప్రాంతాల్లోని చెట్లపై గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళుతుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి దాకా ఈ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నేలపట్టును బ్రీడింగ్ సెంటర్గా, పులికాట్ సరస్సును ఫీడింగ్ సెంటర్గా ఉపయోగించుకుని వెళుతుంటాయి. సంతానోత్పత్తి నేలపట్టులో, ఆహారం కోసం పులికాట్ సరస్సులో ఉంటూ.. పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీహరికోట–సూళ్లూరుపేట రోడ్డుకు పక్కన వలస విహంగాలు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఈ సారి సరస్సులో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో వేల సంఖ్యలో ఫ్లెమింగోలు, ఫెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, ఇతర కొంగజాతులు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి. -
విదేశాల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్!
సాక్షి,బరంపురం: చిలికా సరస్సుకు ప్రతీ ఏడాది మాదిరిగానే విదేశీ పక్షులు వచ్చి చేరుతున్నాయి.తమ జాతి పక్షులతో జతకట్టేందుకు చిలికా దీవుల్లో విడిదిని ఏర్పరచుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా చలి ఎక్కువై లక్షలాది విదేశీ విహంగాలు చిలికా సరస్సుకు చేరుతున్నాయి. విదేశీ పక్షులు వేటగాళ్ల బారిన పడకుండా చిలికా వన్యప్రాణి అభివృధ్ధి సంస్థ అధికారులు గట్టి నిఘాను ఏర్పాటుచేశారు. ( చదవండి: మత్తు చల్లుతున్నారు.. అందుకే చూశారా? ) మూడు వారాలుగా సుమారు 8.94 లక్షల విదేశీ పక్షులు సరస్సుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంతానానికి శ్రీకారం రకరకాల విదేశీ పక్షులు చిలికా సరస్సు మధ్యన ఉన్న బరుకుల్, నల్లబాల, కాళీజై, సత్తపరా, బ్రేక్పాస్టు, శరణ్, చోడైహోగా, మంగళాజోడి, పరికుద్ దీవులకు లక్షల సంఖ్యలో చేరుకొని విడిదిని ఏర్పర్చుకున్నాయి. ప్రకృతిలో వచ్చే మార్పును మనుషులతో పాటు పక్షులు కూడా తెలుసుకుంటాయనడానికి.. చలికాలంలో చిలికా సరస్సుకి లక్షలాది పక్షులు రావడమే నిదర్శనం. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ గూడు కట్టుకొని తమ జాతి పక్షులతో జతకలిసి సంతాన అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాయి. చదవండి: లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు.. -
మంచి సౌకర్యాలతో మెరుగైన ఆదాయం
సాక్షి, అమరావతి: భద్రాచలం నుంచి పాపికొండలకు వచ్చే పర్యాటకులకు వీలుగా పోచవరంలో ఈ నెల 14 నుంచి బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. పర్యాటకులకు రాత్రి బస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 20వ తేదీలోగా పోలవరం నుంచి పాపికొండలకు కొత్త బోటింగ్ పాయింట్ను ప్రారంభించాలని, వారంలోగా నాగార్జునసాగర్లో బోట్ సర్వీసు నడపాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే హరిత రెస్టారెంట్ల్ల ఆదాయం మెరుగుపడుతోందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 69.57 కోట్లు వచ్చిందని తెలిపారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పర్యాటకానికి మంచి సీజన్ అని, రెస్టారెంట్లలో పూర్తిస్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ, నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఆక్యుపెన్సీని పెంచాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో రూ.4.50 కోట్లతో రోప్ వే, బొర్రా గుహల్లో రూ. 2.70 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, మారేడుమిల్లిలో రూ.1.15 కోట్లతో కాటేజీలు, అడ్వంచర్ స్పోర్ట్స్ పనులు వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. లంబసింగికి వచ్చే పర్యాటకుల కోసం తాత్కాలికంగా చేపట్టిన రెస్టారెంట్, టాయిలెట్స్ పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు. పాండ్రంగిలో అల్లూరి మ్యూజియం, కృష్ణ్ణదేవిపేటలో ఆయన సమాధి అభివృద్ధి పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు, ఉత్తమ క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తయిందని, ఈ నెల 11, 12 తేదీల్లో విజయనగరంలో కొనసాగుతుందన్నారు. మార్చిలో రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహించి సీఎం చేతులమీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. -
తోటి వారితో తంటా.. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా కేసులు
కరోనా తొలినాళ్ల తరహాలో ఇప్పుడు ‘ఒమిక్రాన్’ పరేషాన్ చేస్తోంది. ఈ వేరియంట్ వ్యాపించిన దేశాల నుంచి ప్రయాణికులు వస్తుం డటం, వారిలో కొందరికి పాజిటివ్గా తేలుతుండటం, ఇదే సమయంలో రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. విదేశాల నుంచి వచ్చిన కోవిడ్ బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినా.. ‘ఒమిక్రాన్’ ఉన్నదీ లేనిదీ తేలడానికి నాలుగైదు రోజులు పట్టనుండటం ఉత్కంఠ రేపుతోంది. సాక్షి, హైదరాబాద్: విమానాశ్రయాల్లో కట్టుదిట్టంగా స్క్రీనింగ్ చేపట్టిన ఈనెల ఒకటో తేదీ నుంచి శుక్రవారం వరకు.. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 909 మంది రాగా 13 మందికి పాజిటివ్గా తేలింది. ఇందులో ఒక్క శుక్రవారం రోజునే 219 మంది ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న యూకే, యూరప్, సింగపూర్ దేశాల నుంచి వచ్చారు. వీరిలో 9 మందికి కరోనా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన అందరినీ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారి నమూనా లను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. ఫలితాలు రావడానికి 4,5 రోజులు పట్టనుంది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారంతా తప్పనిసరిగా హోంఐసోలేషన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. వచ్చేప్పుడు నెగిటివ్.. ఇక్కడ పాజిటివ్! ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విమానాశ్రయాలను కట్టుదిట్టం చేసింది. హైరిస్క్ దేశాల నుంచి వస్తున్న అందరికీ, ఇతర దేశాల నుంచి వస్తున్నవారిలో కొందరికి ర్యాండమ్గా టెస్టులు చేస్తున్నారు. వాస్తవానికి ఏ దేశం నుంచి ఇక్కడికి రావాలన్నా.. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లాలన్నీ.. ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్ ఉండాలి. హైరిస్క్ దేశాల నుంచి వస్తున్నవారు కూడా తమవెంట నెగిటివ్ రిపోర్టు తెస్తున్నారు. అంటే వారికి కరోనా ఉండకూడదు. కానీ ఇక్కడ వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే.. 13 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. ఇంత జరుగుతున్నా టీకాలపై నిర్లక్ష్యమే! ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించినా, దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా.. టీకాలు వేసుకునే విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని వైద్యశాఖ సిబ్బంది అంటున్నారు. రాష్ట్రంలో 90శాతం వరకు మొదటి డోసు వేసుకున్నా.. రెండో డోసు 48 శాతమే అయింది. రెండో డోస్ వేసుకోకుండా పెండింగ్లో ఉన్నవారు 24.80 లక్షల మందికిపైగా ఉన్నారు. ఇందులో చాలా మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లూ ఉండటం ఆందోళనకరంగా మారింది. కుమురంభీం జిల్లాలో కేవలం 16 శాతమే రెండో డోస్ తీసుకున్నారు. వికారాబాద్, గద్వాలల్లో 19 శాతం, నారాయణపేటలో 21 శాతం, ఆదిలాబాద్ 23 శాతం, వనపర్తి 26 శాతం, నాగర్ కర్నూల్ 27 శాతం, మహబూబ్నగర్ జిల్లాలో 29 శాతమే రెండో డోసు తీసుకున్నారు. రెండో డోస్ అధికంగా హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 73 శాతం మేర పూర్తయింది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన జిల్లాలపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. శాఖ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం పలు జిల్లాల్లో పర్యటించి పరిశీలించింది. కిందిస్థాయి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చింది. వ్యాక్సినేషన్కు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని.. ఈ నెలాఖరు నాటికి 100% రెండు డోసుల టీకా పూర్తి చేయాలన్నారు. ఇక దేశీయ ప్రయాణాలకూ ఆంక్షలు! ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించాయి. ఇక దేశీయ ప్రయాణాలకూ ఆంక్షలు మొదలుకానున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు ముంబై వచ్చే విమాన ప్రయాణికులు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని, లేదా ప్రయాణానికి 48 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ప్రయాణికులకు ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. యూకే నుంచి వచ్చి.. క్వారంటైన్ తప్పించుకోబోయి యూకే నుంచి వచ్చిన ఓ 36 ఏళ్ల మహిళకు ఎయిర్పోర్ట్ సిబ్బంది కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అధికారులు క్వారంటైన్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆమె వారి కళ్లుగప్పి బయటికి వెళ్లిపోయింది. చింతల్ ప్రాంతంలోని రిడ్జ్ టవర్స్కు చేరుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే దీనిపై జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఆమె పాస్పోర్ట్లోని చిరునామాను అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. సదరు మహిళను ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. స్థానిక సీఐ బాలరాజు సదరు మహిళకు నచ్చజెప్పి వైద్యాధికారుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఆమెకు లక్షణాలు పెద్దగా లేవని, ఆమె తల్లిదండ్రులను హోంఐసోలేషన్లో ఉంచామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో మళ్లీ వార్డులు సిద్ధం విదేశాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ పాజిటివ్ వస్తుండటం, రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. టిమ్స్తోపాటు గాంధీ కోవిడ్ కేంద్రాల్లో ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రత్యేక కోవిడ్ వార్డులను, ఐసీయూలు, ప్రత్యేక పడకలను సిద్ధం చేస్తోంది. ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు, వెంటిలేటర్లు వంటివి ఎలా ఉన్నాయన్న దానిపై దృష్టిపెట్టింది. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఉంటే మరమ్మతులు చేయించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించింది. రోగులకు వెంటిలేటర్ల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని సూచించింది. ఇక కోవిడ్ నిర్ధారణ కోసం ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని నిర్ణయించింది. ఫారిన్ జర్నీ పరేషాన్ విదేశాల నుంచి వచ్చినవారిలో కరోనా పాజిటివ్ వచ్చినవారిని టిమ్స్కు తరలిస్తున్న వైద్యారోగ్య శాఖ.. మిగతా వారందరినీ హోం ఐసోలేషన్లో ఉండాలని స్పష్టంగా ఆదేశించింది. గంటల కొద్దీ సాగే విమాన ప్రయాణంలో పాజిటివ్ వచ్చినవారితో కలిసి మిగతా వందలాది మంది ప్రయాణిస్తున్నారు. అందులోనే భోజనం, టిఫిన్ చేస్తారు. బాత్రూమ్లు వినియోగిస్తారు. మాస్కులను కట్టుదిట్టం చేసినా.. పలుమార్లు వాటిని తీయాల్సి ఉంటుంది. పాజిటివ్ వారిలో ఎవరికైనా ఒమిక్రాన్ ఉండి ఉంటే.. మిగతా ప్రయాణికులకూ సోకినట్టేనన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్లో ఉండేవారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని.. ఎనిమిది రోజుల తర్వాత మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలని, ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రులకు తరలించాలని వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే హోం ఐసోలేషన్లో ఉండాల్సిన విదేశీ ప్రయాణికుల్లో చాలామంది తమకేమీ లేదన్న భావనతో బయట తిరుగుతున్నారన్న ఆరోపణలున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వందల మందిని పర్యవేక్షించడం అధికారులకు సవాల్గా మారింది. -
వెళితే మడమ తిప్పలేం
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతిసిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ.. సాగరుడితో జతకట్టేందుకు వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ.. చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలుపోతున్నట్టు వినసొంపైన పక్షుల కిలాకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలాహిరిలో అంటూ కడలి తీరానికి సాగే పడవ ప్రయాణం.. సముద్ర జలాల మధ్యలో చూసితీరాల్సిన అందాల దీవి.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్టు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు స్వాదించాలంటే నిజాంపట్నం మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.. మరి ఓసారి చూసొద్దాం రండి.. రేపల్లె: తీరప్రాంతాన్ని విపత్తుల సమయంలో అమ్మలా కాపాడే మడ అడవులు ప్రకృతి రమణీయతతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. కార్తీక మాసాన యాత్రికులను రారమ్మంటూ పిలుస్తున్నాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని గుంటూరు–కృష్ణా జిల్లాల తీరప్రాంతంలో పదివేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ మడ అడవులు గుంటూరు జిల్లా పరిధిలోని రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో సుమారు 4వేల హెక్టార్లలో దట్టంగా అలుముకున్నాయి. ఆహ్లాదం.. పడవ ప్రయాణం నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పాతూరు గ్రామ సమీపంలో పాతూరు డ్రెయిన్ ఉంటుంది. ఇది ఐదు కిలోమీటర్ల మేర మలుపులు తిరుగుతూ ప్రయాణించి సముద్రంలో కలుస్తోంది. ఈ డ్రెయిన్ ఇరువైపులా దట్టంగా విస్తరించిన మడ అడవులు విశేష ఆకర్షణగా నిలుస్తాయి. ఈ డ్రెయిన్లో పడవ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. సాగర తీరానికి ఈ మార్గంతో పాటు నక్షత్రనగర్ నుంచి బీఎం డ్రెయిన్ మీదుగా మరో మార్గమూ ఉంది. అయితే ఆ మార్గం మడ అడవులు తక్కువగా ఉంటాయి. సముద్ర తీరానికి వెళ్లేందుకు పాతూరు లేదా నక్షత్రనగర్లో మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. బోటు మొత్తం బుక్ చేసుకుంటే సుమారు రూ.7వేలు తీసుకుంటారు. కార్తీక ‘ద్వీపం’ మడ అడవుల మధ్య ఆహ్లాదకర ప్రయాణం అనంతరం సముద్ర తీరానికి కొంచెం దూరంలో సహజసిద్ధంగా ఏర్పడిన అందాల ద్వీపం ఉంటుంది. ఇది ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. అక్కడకు వెళ్లాలంటే సముద్రంలో కొంత దూరం పడవలో ప్రయాణించాలి. ఈ ఐలాండ్ సాగర స్నానాలకు అనువుగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఆటపాటలతో ఉల్లాసంగా గడపొచ్చు. సముద్ర తీరం వంపులో ఉండటంతో ఐలాండ్తోపాటు, దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని పరిశావారిపాలెం గ్రామంలోని సముద్రంలో ఎడమ వైపు సూర్యోదయం, కుడి వైపు సూర్యాస్తమయం కనిపిస్తాయి. కన్యాకుమారి తరహాలో సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను తిలకించే అవకాశం ఇక్కడ ఉండడం విశేషం. ఐలాండ్లో వసతుల లేమి బోట్లు అంబాటులో లేకపోవడం వల్ల ఐలాండ్కు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంటుంది. సరైన వసతులు లేకపోవడం కూడా యాత్రికులు రాకపోవడానికి మరో కారణం. గతంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా మడ అడవుల నడుమ ప్రయాణించి ఐలాండ్లో పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. ఐలాండ్ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు కల్పించి అందుబాటులో బోట్లు ఉంచితే ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంది. ఫలితంగా తీరప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. , -
ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!
Thailand Monkey Festival: : కొన్ని దేశాల్లో చాలా వింతైన పండుగలు జరుగుతుంటాయి. పైగా ఆ పండుగలను భారీ ఖర్చుతో అంగరంగ వైభవోపేతంగా జరుపుతారు. చూడటానికి కాస్త విడ్డూరంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. అచ్చం అలాంటి పండుగే ఒకటి థాయ్లాండ్ దేశంలో అట్టహాసంగా జరుగుతోంది. (చదవండి: ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!) అసలు విషయంలోకెళ్లితే.. థాయ్లాండ్లోని ప్రజలు కోతుల పండుగను అత్యంత అట్టహాసంగానూ, ఆహ్లాదభరితంగానూ నిర్వహిస్తారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత సెంట్రల్ థాయ్లాండ్లోని లోప్బురి పట్టణంలో ఈ పండుగ తిరిగి ప్రారంభమైంది. అంతేకాదు ఈపండుగలో వేలాది కోతులు రెండు టన్నుల అరటిపండ్లు, పైనాపిల్ పళ్లను తింటూ, గెంతుతూ అక్కడ ఉన్న పళ్ల కుప్ప పైకి ఎక్కి కూర్చుంటూ ఆనందంగా ఆరగిస్తాయి. అంతేకాదు ఈ పండుగకు సుమారు రూ 3 వేల డాలర్లు అంటే (దాదాపు రూ. 2లక్షలు) వరకు ఖర్చు పెట్టి మరి ఆకోతులకు ఘనంగా విందు నిర్వహిస్తారు. అయితే ఈ పండుగను ఎందుకు చేస్తారంటే పర్యాటక దేశం అయిన థాయ్లాండ్ని ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడంలో తమ వంతుగా సహకరిస్తున్న స్థానిక కోతులకు ధన్యావాదాలు చెప్పే నిమిత్తం ఈ పండుగను నిర్వహిస్తారు. ఇది థాయ్లాండ్ వార్షిక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పండుగను "మంకీ ప్రావిన్స్" అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది పండుగ థీమ్ ఏంటంటే వీల్ చైర్ కోతులు. ఈ థీమ్ ముఖ్యోద్దేశం ఏంటంటే థాయ్లాండ్లోని యోంగ్యుత్ పేద ప్రజలకు సుమారు వంద వీల్ చైర్లను విరాళంగా ఇవ్వడం. అంతేకాదు నవంబర్లో వ్యాక్సినేషన్ తీసుకున్న పర్యాటకుల కోసం నిర్భందరహిత పర్యాటక పథకాన్ని ప్రారంభిన నేపథ్యంలో మళ్లీ గతంలో మాదిరిగా పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. అయితే అక్కడ ఉన్న కొందరు పర్యాటకులు తమ కెమెరాలతో కోతులతో ఆడుకుంటూ కనిపించారు. ఈ మేరకు ఈ సంప్రదాయం మళ్లీ తిరిగి ప్రారంభం కావడం పట్ల అక్కడ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేళ్ళ తర్వాత కోతులు ఈ విధంగా అన్ని రకాల పండ్లు, కూరగాయలను తినడం ఇదే మొదటిసారి అని అక్కడ స్థానికుడు థనిడా ఫుడ్జీబ్ చెప్పారు. (చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్) -
ఏమి హాయిలే హల..!
-
లాహిరి..లాహిరి..లాహిరిలో..
ఓ వైపు వంపులు తిరుగుతూ సుందరంగా ప్రవహించే గోదావరి.. మరోవైపు అటు కొండ.. ఇటు కొండ.. నట్టనడుమ ఉరకలు పెట్టే గోదావరి.. ఆ వంక గిరిజనుల జీవన సౌందర్యం.. ఈ వంక పచ్చటి ప్రకృతి.. ఇలా భిన్న దృశ్యాలను తిలకిస్తూ సేద తీరాలంటే పాపికొండలను బోటులో చుట్టిరావాల్సిందే. ఈ అద్భుత ప్రయాణానికి నేటి నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పాపికొండలకు బోట్లు నిలిచిపోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత బోట్లు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో అనుమతులు మంజూరు చేసింది. దీంతో పర్యాటకులు పాపికొండల యాత్రకు ఉవ్విళ్లూరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఆన్లైన్ బుకింగ్కు అవకాశం.. ఉభయ గోదావరి జిల్లాలకు నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. సెలవులు వస్తే చాలు.. పర్యాటకులు జలవిహారం చేస్తూ పాపికొండలను చుట్టేస్తారు. సకుటుంబ సపరివారసమేతంగా వచ్చి పాపికొండల్లోని సుందర ప్రకృతి దృశ్యాలను.. బోటు ప్రయాణంలో ఆహ్లాదాన్ని.. వంపులు తిరుగుతూ హొయలు ఒలకబోసే గోదావరిని చూసి పరవశిస్తారు. బుకింగ్కు ఆన్లైన్ సౌకర్యం ( www. aptdc. gov. in) కూడా ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల పర్యాటకులు కూడా బోటు షికారు కోసం రెక్కలు కట్టుకుని మరీ వచ్చేస్తున్నారు. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు రాజమమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుకోవాలి. ముఖ్యమంత్రి ఆదేశాలతో పటిష్ట భద్రత పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది. ప్రమాదం అనంతరం అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాకే బోట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. బోట్ల ఫిట్నెస్ పరిశీలించాకే అనుమతులు పాపికొండల జలవిహార యాత్రకు ప్రైవేట్ బోట్లతోపాటు ఏపీ టూరిజం బోట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన 16 బోట్లకు ఏపీ మారిటైమ్ బోర్డు అనుమతి ఇచ్చింది. పోచమ్మగండి బోట్ పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 5 బోట్లకు అనుమతులు లభించాయి. వీటిలో తొలి విడతలో పోచమ్మగండి నుంచి ఆదివారం బోట్లు బయలుదేరనున్నాయి. ట్రయల్ రన్ సక్సెస్.. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ ఆదేశాలతో శనివారం పోచమ్మగండి వద్ద పర్యాటక బోట్లకు ట్రయిల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. పైలెట్ బోటు ముందు రాగా వెనుక లాంచీలు పేరంటాలపల్లి లాంచీల రేవు నుంచి బయలుదేరాయి. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవే.. ► పర్యాటకుల రక్షణ, భద్రత కోసం రెవెన్యూ, పోలీసు, పర్యాటక, జలవనరుల శాఖలతో ఐదు చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు ► కంట్రోల్ రూమ్ మేనేజర్గా డిప్యూటీ తహసీల్దార్. ► పర్యాటక, జలవనరులు, పోలీసు అధికారులు కంట్రోల్ రూముల వద్ద పర్యాటకుల రక్షణ భద్రత అంశాలపై మూడు రకాల చెకప్లు చేపడతారు. మేనేజర్ వీటిని పరిగణనలోనికి తీసుకొని బోటు ప్రయాణానికి అనుమతిస్తారు. ► పైలెట్ స్పీడ్ బోటు గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీమ్తో బయలుదేరాలి. దీని వెనుక మరో 3 లేదా 5 బోట్లు ప్రయాణించాలి. ► చివర ఎస్కార్ట్ బోటులో శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉంచారు. ► ప్రతి పాయింట్ దాటాక శాటిలైట్ ఫోన్లో కంట్రోల్ రూమ్కు సమాచారాన్ని అందించాలి. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్కు తెలపాలి. ► పైలెట్ బోటు లేనిదే జలవిహార యాత్ర నిర్వహించరాదు. ► ప్రయాణించే లాంచీని లైసెన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే నడపాలి. ► జలవనరుల శాఖ ధవళేశ్వరం వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలోనే విహార యాత్రకు అనుమతి ► నిర్వాహకుల నుంచి అఫిడవిట్లపై సంతకాలు తీసుకున్నాకే బోట్లకు అనుమతి ► నిర్దేశిత సామర్థ్యాన్ని మించి పర్యాటకులను ఎక్కించరాదు. జాగ్రత్తలు తీసుకునే అనుమతి గోదావరిలో పాపికొండల పర్యాటకానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. గత ఘటనలు పునరావృతం కానివ్వకుండా పర్యాటకుల భద్రతే ప్రథమ లక్ష్యంగా ఏర్పాట్లు చేశాం. బోటులో పరిమితిని బట్టి 70 నుంచి 90 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తున్నాం. –జి.రాఘవరావు, కాకినాడ పోర్టు అధికారి నిర్వాహకులకు మంచి రోజులు గోదావరిలో జలవిహారం ప్రారంభమవ్వడంతో బోటు నిర్వాహకులతోపాటు దానిపై ఆధారపడేవారికి మంచి రోజులు వచ్చినట్టే. బోటు షికారు నిలిచిపోవడంతో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. –మాదిరెడ్డి సత్తిబాబు, బోట్ యజమాని పర్యాటకులు ఇలా చేరుకోవాలి.. తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. అవి.. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు ముందుగా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్కు చేరుకోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా ఏపీటీడీసీ వెబ్సైట్లోనూ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి రూ.1,250 చెల్లించాలి. ఏపీటీడీసీనే పర్యాటకులను రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుస్తుంది. రాజమహేంద్రవరం నుంచి పోచమ్మగండికి దాదాపు 42 కి.మీ. దూరం. పోచమ్మగండిలో ఉదయం 10 గంటలకు బోటు బయలుదేరుతుంది. బోటులో పర్యాటకులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం), సాయంత్రం స్నాక్స్, టీ అందిస్తారు. ఇవన్నీ రూ.1,250 లోనే కలిపి ఉంటాయి. పర్యాటకులు నేరుగా పోచమ్మగండికి కూడా చేరుకుని కూడా టికెట్లు కొనుగోలు చేసి బోటు ఎక్కొచ్చు. పోచమ్మగండి నుంచి ఒక్కో వ్యక్తికి రూ.1,000. తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులు తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం చేరుకోవాలి. అయితే ఇక్కడ నుంచి బోట్లు బయలుదేరడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా టికెట్ రేట్లు కూడా నిర్ణయించలేదు. -
మెరిసే తీరం సూర్యలంక బీచ్
సాక్షి, అమరావతి: బాపట్ల తీరంలోని సూర్యలంక అత్యంత అరుదైన బంగారపు వర్ణపు ఇసుక (గోల్డెన్ శాండ్)తో అంతర్జాతీయ బీచ్ల సరసన నిలుస్తోంది. ఈ బీచ్ అర్ధ చంద్రాకారంలో వంపు తిరిగి ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. అలల ఉధృతి లేకుండా (సైలెంట్ సీ) పర్యాటకులు స్నానాలు చేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తోంది. బీచ్ వెంబడి నీళ్లలో ఎక్కడా రాళ్లు లేని ఈ బీచ్ ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ సాధించే దిశగా అడుగులేస్తోంది. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ (ఐసీజెడ్ఎం) ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించేలా 9 బీచ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాపురం బీచ్లో కేంద్ర పర్యావరణ శాస్త్రవేత్తల బృందం నీటి నాణ్యత, పర్యావరణ, పర్యాటకుల రక్షణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో సూర్యలంక అత్యంత సురక్షితమైన, ఆహ్లాద వాతావరణం అందించే బీచ్గా ఉండటంతో దీని అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఐసీజెడ్ఎం బీచ్లను బ్లూఫ్లాగ్కు అనుగుణంగా తయారు చేసేందుకు ఏపీలో రూ.10 కోట్లతో ‘స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ యూనిట్(ఎస్సీజెడ్ఎంయూ)’ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో 20 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం, 30 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ, మిగిలిన 50 శాతం నిధులను ప్రపంచ బ్యాంకు సమకూరుస్తోంది. నీటి నాణ్యత పరిశీలన ఇలా.. బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్లో సముద్రపు నీటి నాణ్యత పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. ఇటీవల కేంద్ర పర్యావరణ శాస్త్రవేత్తల బృందం సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాపురం బీచ్లలో పర్యటించి వరుసగా ఐదు రోజుల పాటు నీటి నాణ్యతను పరిశీలించారు. దాదాపు ఒక్కోచోట 30 నుంచి 40 వరకూ నమూనాలు సేకరించారు. బీచ్ ఒడ్డు నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్లి వీటిని తీసుకున్నారు. నీటిలో ఉప్పు, ఆక్సిజన్, నైట్రోజన్, పొటాషియం శాతాలను పరిశీలిస్తారు. బీచ్ మొత్తం భాగంలో ఎక్కడ నీటి నమూనాలు బాగుంటాయో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. నీటిలో సముద్రపు జంతువులు లేని, చర్మ వ్యాధులకు అవకాశం లేని, లోతు, పర్యాటకులు ఎంత లోపలికి వెళ్లొచ్చు, కెరటాల ఎత్తు తదితర అంశాలను గుర్తిస్తారు. ఆ సర్కిల్లో వాష్ రూమ్లు, కుర్చీలు, ఆట స్థలం, గార్డెనింగ్, పర్యాటకుల రక్షణ కోసం స్థానిక మత్స్యకారులతో సేఫ్ గార్డులను నియమిస్తారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి బ్లూ ఫ్లాగ్ కోసం బీచ్లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నాం. సూర్యలంక బీచ్కు అన్ని అర్హతలు ఉండటంతో దీనిపై దృష్టి సారించాం. కేంద్ర ప్రభుత్వ సాయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటివరకు 21 బీచ్లు ఉండగా.. మరిన్ని బీచ్లను తయారు చేయనున్నాం. సూర్యలంకకు దేశంలోనే అరుదైన బీచ్గా గుర్తింపు ఉంది. – ఆరిమండ వరప్రసాద్రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ -
ఏడాదిన్నర తర్వాత రోడ్డుపైకి.. ‘ఓపెన్ టాప్’ పునఃప్రారంభం
దాదర్ (ముంబై): పర్యాటకులను ఆకట్టుకునేందుకు బుధవారం నుంచి ఓపెన్ టాప్ (టాప్ లెస్) బస్సులను పునఃప్రారంభించాలని బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్టు (బెస్ట్) నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించింది. దీంతో ముంబైకి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు, నగరంలోని వారసత్వ కట్టడాలు, ఇతర పర్యాటక ప్రాంతాలను ఈ ఓపెన్ టాప్ బస్సుల ద్వారా తిలకించే సౌకర్యాన్ని బెస్ట్ కల్పించింది. దీంతో నష్టాల్లో నడుస్తున్న సంస్థకు ఈ బస్సులు కొంత ఆదాయాన్ని తెచ్చిపెడతాయని బెస్ట్ అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ముంబై నగర అందాలను తిలకించేందుకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. లాక్డౌన్కు ముందు ఈ టాప్ లెస్ బస్సులు పర్యాటకులకు సేవలు అందించాయి. కానీ, లాక్డౌన్ అమలులోకి వచ్చాక ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అయితే, ఇప్పుడు పరిస్థితులు యథాస్థితికి రావడంతో ఇన్నాళ్లూ డిపోలకే పరిమితమైన ఓపెన్ టాప్ బస్సులను మళ్లీ రోడ్డుపైకి తేవాలని బెస్ట్ భావించింది. ఈ మేరకు దీపావళి పర్వదినానికి ముందే ఈ బస్సులను పునఃప్రారంభించాలని బెస్ట్ నిర్ణయించింది. చదవండి: (మళ్లీ తెరపైకి ‘ముల్లై పెరియార్’) అయితే, ఈ బస్సులు రోజంతా నడవవని, కేవలం సాయంత్రం తరువాతే రోడ్డుపైకి వస్తాయని ఓ అధికారి తెలిపారు. ప్రముఖ కట్టడాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, బీఎంసీ ప్రధాన కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ), ప్రిన్స్ వెల్స్ ఆఫ్ మ్యూజియం, మంత్రాలయ, అసెంబ్లీ భవనం, ఎన్సీపీఏ, మెరైన్ డ్రైవ్, చౌపాటి, చర్చిగేట్ రైల్వే స్టేషన్, ఓవల్ మైదాన్, రాజాబాయి టవర్, హుతాత్మ చౌక్, హార్నిమన్ సర్కిల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియాటిక్ లైబ్రరీ, ఓల్డ్ కస్టమ్ హౌస్ తదితరాల కట్టడాలను తిలకించేలా ఈ బస్సుల రూట్ మ్యాప్ ఉంటుందన్నారు. ఈ బస్సుల్లో పై అంతస్తులో కూర్చునేవారు రూ. 150, కింది అంతస్తులో కూర్చునేవారు రూ. 75 చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మొదటి బస్సు గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయలు దేరనుంది. తరువాత 7.45 గంటలకు ఓ బస్సు, 8.00 గంటలకు మరో బస్సు ఉండనుండగా, చివరి బస్సు 9.15 గంటలకు బయలు దేరుతుంది. ఈ బస్సు టికెట్లు సీఎస్ఎంటీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చౌక్, గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న బెస్ట్ సంస్థకు చెందిన సబ్ టికెట్ కౌంటర్ల వద్ద లభిస్తాయని బెస్ట్ సంస్థ అధికారులు తెలిపారు. -
Viral Video: సింహం సైలంట్గా ఉందని వేళాకోళం చేశావో వేటాడేస్తా
-
సింహం సైలంట్గా ఉందని వేళాకోళం చేశావో..
మన సరదాగా వన్యమృగాలతో చూడాలనో లేక సరదాగడుపదామనో మనం నేషలనల్ జూలాజికల్ పార్క్లు వంటి రకరకాల పార్కులకి వెళ్తాం. అయితే పార్క్లో ఉండే సంరక్షణాధికారులు సూచించినట్లుగా అక్కడ ఉన్న జంతువులతో జాగ్రత్తగా మసులుకోకపోతే చేదు అనుభవాలను ఎదర్కొక తప్పదు. (చదవండి: ఇదేం ట్రెండ్....చెత్త వేసే సంచిని ధరించడం ఏమిటి ?) అంతేకాదు ఇలాంటి చేదుఅనుభవాలను ఎదుర్కొన్న వాళ్ల గురించి ఇటీవల కాలంలో చాలానే విని ఉన్నాం. అయినప్పటికి పర్యాటకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి ఎందుకు తెచ్చకుంటారో అర్ధంకాదు. అట్లాంటి చేదు అనుభవమే టాంజానియా పార్క్కి వెళ్లిన ఒక పర్యాటక బృందానికి ఎదురైంది. అసలు ఎక్కడ జరిగింది ఏమైంది చూద్దాం రండి. వివరాల్లోకెళ్లితే....టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్లో ఒక పర్యాటక బృందం కారులో కూర్చోని సింహాన్ని చూస్తుంటారు. అయితే ఆ సింహం వాళ్ల కారు పక్కనే ఉన్నప్పటికీ అది ఆ కారుని గమనించ కుండా అటువైపుకి తిరిగి ఉంటుంది. దీంతో ఒక పర్యాటక బృందంలోని ఒక వ్యక్తి కారు కిటకి డోరు తీసి సింహాన్ని తాకడానికి ప్రయత్నించడమే కాక ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఇక అంతే ఒక్కసారిగా సింహం పెద్దగా గాండ్రిస్తూ కిటికిలోకి తల దూర్చడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సదరు పర్యాటకుడు షాక్కి గురై సీటు వెనక్కి వెళ్లి పోతాడు. ఇంతలో కారులో ఉన్న మిగతావాళ్లంతా కిటికి మూసేయ్ అంటూ కేకలు వేయడంతో కిటికిని మూసేయడానికి చాలా కష్టపడతాడు. ఏది ఏమైనా ఇలాంటి క్రూర జంతువులతో తస్మాత్ జాగ్రత్త. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
పర్యాటకులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: పాపికొండలు బోటు విహార యాత్రను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధరను రూ.1,250 (రవాణా, భోజన వసతి)గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. భవిష్యత్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్ట్ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల పర్యాటక బోటింగ్ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి కూడా పాపికొండలుకు బోట్లును నడపాలని కోరారు. -
ప్రాంతాలవారీ పర్యాటక పండుగలు
సాక్షి, అమరావతి: పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రాంతాల వారీగా పర్యాటక పండుగలు (టూరిజం ఫెస్టివల్స్) నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మంగళవారం సచివాలయంలో పర్యాటకశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత హోటళ్లలో నూరుశాతం ఆక్యుపెన్సీ సాధించేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యం హరిత హోటళ్లు, రిసార్ట్లను పర్యవేక్షిస్తూ నెలరోజుల్లో మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొత్త సంవత్సరంలో టూరిజం యాప్ను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లతో చర్చించి బోటింగ్ సేవలను ప్రారంభించాలని చెప్పారు. సీఎం కప్ టోర్నీకి అపూర్వ స్పందన అనంతరం క్రీడాశాఖాధికారుల సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ సీఎం కప్ టోర్నీకి అపూర్వ స్పందన వస్తోందని చెప్పారు. వచ్చేనెల 6వ తేదీన విజయనగరం, అనంతరం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా టోర్నీ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెనాలి, బాపట్లలోని క్రీడా వికాసకేంద్రాలను నవంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ, ఆంధ్రప్రదేశ్ పర్యాటకసంస్థ సీఈవో సత్యనారాయణ, సాంస్కృతికశాఖ సీఈవో మల్లిఖార్జున, క్రీడాప్రాధికార సంస్థ ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. -
వయస్సు ఏడాదే..సంపాదన ఎంతో తెలిస్తే ముక్కున వేసుకోవాల్సిందే
న్యూయార్క్: ఏడాది వయస్సున్న బుడి బుడి అడుగుల బుబ్జాయి..ముసిముసి నవ్వుల పాపాయి ఏం చేస్తుంది. అమ్ము ఒడిలో సేదతీరుతుంది. కానీ ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. టూరిస్ట్ ప్రాంతాల్ని చుట్టేస్తూ .. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు పోటీ పోటీగా డబ్బులు సంపాదిస్తున్నాడు. అమెరికాలోని ఇడహో ఫాల్స్ కు చెందిన జెస్, స్టీవ్ దంపతులు. ఈ ఇద్దరు దంపతులకు బ్రిగ్స్ డారింగ్టన్ జన్మించాడు. అయితే తల్లి జెస్ గర్భవతిగా ఉన్నప్పుడు కొంతకాలం ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనకు గురైంది. అదే సమయంలో ఆమెకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. అదే బేబీ ఇన్ఫ్లూయెన్సర్. పుట్టబోయే పిల్లల్ని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ని చేయాలని. వెంటనే బేబీ ఇన్ ఫ్లూయెన్సర్లు ఎవరైనా ఉన్నారా అని సోషల్ మీడియాను జల్లెడ పట్టింది. కానీ ఎవరూ లేరు. అందుకే తనకు పుట్టిన బ్రిగ్స్ను సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా మార్చేసింది. టూరిస్ట్ ప్రాంతాలకు బ్రిగ్స్ను తీసుకెళ్లి తిప్పి చూపించేది. ఇలా అమెరికాలో 16 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఆ పర్యాటక ప్రాంతాలకు వచ్చే సమయంలో పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి ఫుడ్ దొరకుతుందో వివరించేంది. అందుకు టూరిజం సంస్థలు బ్రిగ్స్ తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ సంస్థ తరుపు ప్రచారం చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెలిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో 34,000 మంది ఫాలోవర్స్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా ఉన్న బ్రిగ్స్కు సైతం నెలకు 1000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 75 వేలు) స్పాన్సర్ అందిస్తున్నాయి. వీటితో పాటు బ్రిగ్స్కి అవసరమైన డైపర్స్, వైప్స్ లాంటివి కూడా ఉచితంగానే వస్తున్నాయి. -
ఆంధ్రా ఊటీకి అద్దాల బోగీలు
అరకు లోయ: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయకు వచ్చే పర్యాటకుల కోసం రైల్వేశాఖ మరో రెండు అద్దాల బోగీలను అందుబాటులోకి తెస్తోంది. విశాఖ నుంచి అరకు లోయకు నడిచే రెగ్యులర్ ట్రైన్కు వీటిని జత చేసేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక అద్దాల రైలు బోగీ ఉన్నప్పటికీ పర్యాటకుల నుంచి ఈ సీజన్లో డిమాండ్ పెరిగింది. దీంతో అరకు ట్రైన్కు అదనంగా రెండు విస్టోడోమ్ అద్దాల బోగీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాదే అదనంగా రెండు అద్దాల బోగీలు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినప్పటికీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీలను మంగళవారం రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. విశాఖ నుంచి అరకు లోయ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఈ రెండు అద్దాల బోగీలు పర్యాటకులు, స్థానికులను ఆకర్షించాయి. వీటిలో రైల్వే ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా, ఇతర అధికారులు ప్రయాణించారు. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీల్లో 44 సీట్లతో పాటు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని రైల్వే ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న విస్టో డోమ్ బోగీ కన్నా ఈ రెండు బోగీల్లో మరిన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. -
సాగర తీరం.. సుందర దృశ్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని బీచ్లలో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించి పర్యాటకులకు సమున్నతమైన ఆహ్లాదాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తద్వారా విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే విశాఖలోని రిషికొండ బీచ్ ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ పొంది అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకోగా.. అదే జాబితాలో మరిన్ని బీచ్లను చేర్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ 21 బీచ్లను క్షుణ్ణంగా పరిశీలించి అందులో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కు అనుగుణంగా అభివృద్ధి చేసే వీలుగా ఉన్న తొమ్మిదింటిని గుర్తించింది. బ్లూ ఫ్లాగ్ అంటే..? స్వచ్ఛమైన నీరు, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్లలో పొందవచ్చు. డెన్మార్క్కు చెందిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ ఇస్తోంది. ఈ సర్టిఫికెట్ పొందిన బీచ్లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు. వాటిలో అంతర్జాతీయ గుర్తింపునకు చిహ్నంగా నీలం రంగు జెండాను ఎగురవేస్తారు. పర్యాటకుల భద్రత, కాలుష్యరహిత పరిసరాలు, సముద్ర నీటి నాణ్యత, తీరంలోని ఇసుక వంటి 33 అంశాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ లభిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీటిని బీచ్లో కలవకుండా ఉండాలి. బీచ్లో సహజ శిలలు కూడా ఉండకూడదు. అలా ఉంటే పర్యాటకులు స్నానాలు చేసే సమయంలో గాయపడే అవకాశం ఉంటుంది. ఎన్నో సౌకర్యాలు బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ రావాలంటే.. వాటిలో వ్యాయామశాల, క్రీడా ప్రాంగణాలు, సౌర విద్యుత్, పర్యావరణ విద్య, పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు, స్నానం చేయడానికి వీలుగా షవర్స్, బయో టాయిలెట్స్, గ్రే వాటర్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, తాగునీటి ఆర్వో ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. సముద్ర తీరాలను ఆ మేరకు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్(ఐసీజెడ్ఎం)కు బాధ్యతలు అప్పగించింది. ఇందులోని పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన బీచ్లను పరిశీలించి బ్లూ ఫ్లాగ్కు అనుగుణంగా వాటిని కేంద్రానికి సిఫారసు చేస్తారు. అనంతరం ప్రపంచ బ్యాంకు నిధులతో వాటిని అభివృద్ధి చేస్తారు. అనంతరం వాటిని కేంద్రం అంతర్జాతీయ జ్యూరీకి ప్రతిపాదిస్తే.. ప్రత్యేక బృందం వచ్చి పరిశీలిస్తుంది. అక్కడి పరిస్థితులు, సౌకర్యాలు ప్రమాణాల మేరకు ఉంటేనే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఎంపిక చేసిన బీచ్లు ఇవీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కోసం విశాఖపట్నం జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు, గుంటూరు జిల్లాలోని సూర్యలంక, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, చింతలమోరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం, మోళ్లపర్రు, కృష్ణా జిల్లాలోని మంగినపూడి, ప్రకాశం జిల్లాలోని రామాపురం, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ల సుందరీకరణకు ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా కేంద్ర బృందం ఈ బీచ్లలో పరిసరాలు, రవాణా సౌకర్యం, మౌలిక వసతులను పరిశీలించింది. రెండో దశలో రెండేసి బీచ్లలో నీటి నాణ్యతను పరీక్షించనున్నారు. ఇప్పటికే సూర్యలంక, రామాపురంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని బీచ్లను సుందరీకరిస్తున్నాం. బ్లూ ఫ్లాగ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్ర బృందం పరిశీలన చేపడుతోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ -
మెక్సికోలో భారీ భూకంపం, వణికిపోయిన జనం
మెక్సికోలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. కొయుకా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్ పడి ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో టీవీకి చెప్పారు. అకాపుల్క్ మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, చాలా ప్రాంతాలలో గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు. భూకంపం మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. స్నానం చేస్తుండగా, చాలా బలమైన కంపనలు రావడంతో చాలా భయపడిపోయా.. గట్టిగా అరిచాను.. చివరికి బాత్ టవల్తో మాత్రమే బయటపడ్డానంటూ ఒక పర్యాటకుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. "నేను మా అమ్మతో వచ్చాను. హోటల్ 11 వ అంతస్తులో మేముండగా ఒక్కసారిగా కంపించింది. అమ్మ భయపడిపోయింది అంటూ ఏడుస్తున్న తన 86 ఏళ్ల తల్లిని అక్కున చేర్చుకున్నారు. కాగా ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. 1985, సెప్టెంబర్ 19 న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది భవనాలను ధ్వంసమయ్యాయి. మళ్లీ 2017, సెప్టెంబర్లో వచ్చిన 7.1 భూకంపం కారణంగా 370 మంది మరణించారు. Power flashes from the earthquake in #Mexico. 🎥 @franz_gomez pic.twitter.com/ESXPpIgmSE — Michael Armstrong (@KOCOMichael) September 8, 2021 This is how #earthquakes look in the sky from an 11th floor ⚡ What you hear is the building crashing against the one next to it 🤯#earthquakeinthesky #Mexico #surreal pic.twitter.com/XNJESUdOew — elian huesca 🌋⚡ (@elianhuesca) September 8, 2021 A powerful earthquake struck southwestern Mexico near the beach resort of #Acapulco on Tuesday night, causing rock falls and damaging buildings, though there were no immediate reports of casualties. M7.0 #earthquake (#Sismo) strikes 18 km NE of Acapulco de Juárez (#Mexico) pic.twitter.com/f8LisWFmfx — DailyNews/BreakingNews (@DailyNe25683877) September 8, 2021 -
కుప్పకూలిన హెలికాప్టర్: ఏడుగురు గల్లంతు
మాస్కో: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్ గురువారం తెల్లవారుజామున కూలిపోయింది. ఇందులో 13 మంది ప్రయాణీకులతోపాటు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించినట్టుఅ ధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి కోసం రక్షక దళాలు గాలిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఇది సెయింట్ పీటర్స్బర్గ్ నుండి పర్యాటకులను తీసుకువెళుతోందని స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నివేదించింది. ముగ్గురు సిబ్బందితోపాటు స్థానిక పర్యాటకులు ఇందులో ప్రయాణిస్తున్నారన్నారు. రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగుతోందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా కమ్చట్కా చాలా తక్కువ మంది జనాభా నివసించే పెద్ద భూభాగం. కానీ అగ్నిపర్వతాలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో నిండిన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడతారు. -
వైరల్: నలుగురు టూరిస్టులు కత్తులతో హల్చల్
మనాలి: నలుగురు టూరిస్టులు నడిరోడ్డుపై కత్తులతో హల్చల్ చేశారు. రోడ్డు మీద ఉన్న వాళ్లపై దాడి చేయడానికి యత్నించారు. ఈ ఘటన కులు జిల్లాలోని మనాలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఓ కారులో మనాలి బస్స్టాండ్ నుంచి రంగ్రీ ప్రాంతంలో ప్రయాణిస్తూ.. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేశారు. అంతటితో ఆగకుండా తమ కారును నడిరోడ్డు మీద నిలిపి ట్రాఫిక్ జామ్కు పాల్పడ్డారు. ఇతర వాహనాలకు చెందినవారు కారును రోడ్డు మీద నుంచి వెంటనే తొలగించమనడంతో తమ వద్ద ఉన్న కత్తులతో వారిని బెదిరిస్తూ దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వారి దాడిలో ఒకరికి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కులు జిల్లా ఎస్పీ గురుదేవ్ చంద్శర్మా మాట్లాడుతూ.. పంజాబ్లోని సంగ్రూర్ స్థానికులైన రవీందర్, దల్బీర్ సింగ్, అమన్దీప్ సింగ్, జస్రాజ్ను అదులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. Manali Viral Video: One More Video Surfaces, See how a man carrying sword running around the People.#HimachalPradesh pic.twitter.com/kz5cYYRXvv — Ajay Banyal (@iAjay_Banyal) July 15, 2021 -
వైరల్: మాస్కులు లేకుండా గుంపులుగా జలకాలాటలు
కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్తో అనేక పర్యాటక ప్రదేశాలు సుదీర్ఘ కాలంగా మూసివేసిన విషయం తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలైన ముస్సోరి, నైనిటాల్కు సందర్శకుల తాకిడి పెరిగింది. స్థానిక హోటళ్లన్నీ నిండిపోయాయి. వీధుల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంది. అయితే కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్దఎత్తున పర్వతప్రాంతాల వద్ద కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముస్సోరిలోని కెంప్టీ వాటర్ఫాల్స్ వద్ద వందలాది మంది పర్యాటకులు గుంపులు గుంపులుగా మాస్క్ లేకుండా స్నానం చేస్తున్న వీడియో బుధవారం నెట్టింట్లో వైరలవుతోంది. వీడియోలో ఒక్కరూ కూడా మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీడియోపైన నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎమ్టీ బ్రెన్ ఇన్ కెంప్టీ’(కెంప్టీలో మెదడు లేని వాళ్లు) అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ గుంపులను చూస్తుంటే భయమేస్తుందంటున్నారు. కాగా ముస్సొరీలో, కుల్ది బజార్, మాల్ రోడ్ వంటి ప్రదేశాలు తరచుగా రద్దీగా మారుతున్నాయి.. పర్యాటకుల సంఖ్య పెరగడంతో నైనిటాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి తలెత్తింది. ఉత్తరాఖండ్తో పాటు, కోవిడ్ నిబంధనలు సడలించిన తరువాత ఐదు లక్షలకు పైగా పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్కు తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నగరాలు, హిల్ స్టేషన్లలోనే కాకుండా దేశంలో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజలు మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కోవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ నిబంధనలను పాటించాలని కేంద్రం పదేపదే చెబుతోంది. -
‘సాగర’ తోరణాలు
సాక్షి, విశాఖపట్నం: సహజ అందాలకు నెలవైన విశాఖ సాగర తీరం దేశ, విదేశీ పర్యాటకులను కట్టిపడేస్తుంటుంది. తూర్పు కనుమలు ఓవైపు.. అలల సయ్యాటలు మరోవైపు.. ఇసుక తిన్నెలపై కనువిందు చేసే రాతి దిబ్బల రమణీయత ఇంకొకవైపు.. ఎల్లప్పుడూ సందర్శకుల్ని ఆహ్వానిస్తుంటాయి. ఈ అందాలకు అదనపు ఆకర్షణగా సాగర తీరంలో ఏర్పడిన సహజ శిలా తోరణం.. ప్రతి ఒక్కర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. ఇప్పుడు అదే విశాఖకు మరో అద్భుతం తోడైంది. సాగర గర్భంలో మరొక శిలా తోరణం బయటపడింది. సరికొత్త అనుభూతి.. రాతి శిలా సంపదతో సరికొత్త అనుభూతిని అందించే తొట్లకొండ బీచ్కు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న సహజ శిలా తోరణం మధ్య నుంచి ఎగసిపడే అలల్ని సందర్శకులు ఆస్వాదిస్తుంటారు. విశాఖ సాగర గర్భంలో ఇటీవల మరో సహజ శిలా తోరణం బయటపడింది. రుషికొండ తీరంలో సాహస క్రీడలు నిర్వహిస్తూ.. స్కూబా డైవింగ్ చేసే లివిన్ అడ్వెంచర్ సంస్థ ప్రతినిధులు దీన్ని కనిపెట్టారు. తీరం నుంచి సాగర గర్భంలోకి 2 కిలోమీటర్ల దూరంలో.. 30 అడుగుల లోతులో.. ఈ రాతి అందం దర్శనమిచ్చింది. ఒక మీటరు ఎత్తు, 150 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ శిలా తోరణం ఉన్నట్లు లివిన్ అడ్వెంచర్స్ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. వేల సంవత్సరాల పాటు అలల తాకిడికి రాళ్లు కరిగి ఈ సహజ అందం ఏర్పడిందని భావిస్తున్నారు. దీన్ని తిలకించేందుకు స్కూబా డైవర్లకు అవకాశం కల్పించాల్సిన అవసరముందన్నారు. దీనిపై పర్యాటక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సహజ అందాలకు పొంచి ఉన్న ముప్పు.. తొట్లకొండ శిలాతోరణం.. తన సహజత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. యువతీ, యువకులు ఈ శిలా తోరణంపైన చిందులు వేస్తున్నారు. కొందరు ఫొటోలు దిగుతుండగా, మరికొందరు ఏకంగా ద్విచక్ర వాహనాల్ని ఎక్కించేసి ఫొటో షూట్లు చేస్తున్నారు. అలల తాకిడికి రాయి కరిగి తోరణంగా ఏర్పడింది. బలహీనంగా ఉండే దీనిపై నిలబడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే విరిగిపోయే ప్రమాదముందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సంరక్షించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. వాహనాలు వెళ్లకుండా చర్యలు సహజ శిలా తోరణాన్ని కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. స్థానికంగా అక్కడ ఉండే వారిని సంరక్షకులుగా నియమించాం. శిలాతోరణం వద్దకు వాహనాలు వెళ్లకుండా.. రోడ్డు వద్దే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రకృతి సిద్ధమైన అందాల్ని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నాం. – పూర్ణిమాదేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సాగర గర్భంలో అద్భుతంగా ఉంది రుషికొండ తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో శిలాతోరణం బయటపడింది. దగ్గరకు వెళ్లి చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. తొట్లకొండలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. 45 నిమిషాల పాటు ఈ శిలాతోరణం పరిసరాల్ని రికార్డు చేశాం. స్కూబా డైవర్లకు ఇది గొప్ప అనుభూతిని అందిస్తుంది. – బలరాంనాయుడు, లివిన్ అడ్వెంచర్స్ ఎండీ -
ట్రావెల్.. ట్రెండ్స్: పర్యాటకంపై తగ్గని ఆసక్తి
కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో పర్యాటక ప్రేమికుల ప్రణాళికలకు అవాంతరం ఏర్పడిందే గానీ వారి అభిరుచులకు కాదు. తమ కలల తీరాలను చేరుకోవడానికి నగరంలోని టూర్ ‘ఇష్టులు’ ఆసక్తిగానే ఉన్నారు. బోట్ ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ సర్వే ప్రకారం ఒక్కసారి కోవిడ్ ప్రభావం పరి సమాప్తం అవగానే తమ పర్యాటక ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి 63శాతం మంది ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా పర్యాటక రంగం ఎంతో నష్టపోయినప్పటికీ కొన్ని లాభాలనూ అందుకుందని విఎఫ్ఎస్ గ్లోబల్ రీజనల్ గ్రూప్ సిఒఒ వినయ్ మల్హోత్రా విశ్లేషిస్తున్నారు. కోవిడ్ నేపధ్యంలో ట్రావెల్ ట్రెండ్స్పై ఆయన ఏమన్నారంటే... సురక్షితమే...సముచితం.. కోవిడ్ లాక్ డౌన్ల నేపధ్యంలో పర్యాటకుల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా సురక్షితమైన, నమ్మదగిన ప్రాంతాలపైనే దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో ట్రావెల్ పరిశ్రమ కూడా వేగంగా డిజిటల్ మయం అవుతోంది. అలాగే ట్రావెల్ ప్లానింగ్ నుంచి కస్టమర్ ఎంగేజ్మెంట్ దాకా కాంటాక్ట్ లెస్ లావాదేవీలను పెంచుకుంటూ పోతోంది. ప్లానింగ్...కింగ్.. కేవలం ఒక బ్యాక్ ప్యాక్తో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా స్వల్ప దూరాలకు, ప్రాంతాలకు వెళ్లొచ్చేయడం వంటి ప్లానింగ్ లెస్ ట్రావెల్ ఇటీవల క్రేజీగా మారింది. అయితే ఇప్పుడు ఆ ఆలోచనలు మార్చుకోక తప్పడం లేదు. తాము ఎక్కడ బస చేయబోతున్నాం, ఏం తినబోతున్నాం.. వంటి ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకుంటూ ముందస్తు ప్లాన్ చేసుకోవాలి. వ్యయ..ప్రయాణాలకు సై పర్యాటకాభిరుచి బాగా పెరిగిపోతున్న దశలో తక్కవ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలు చూడాలనే ఆలోచన.. వల్ల పెద్ద సంఖ్యలో సామూహిక ప్రయాణాలు, నాసిరకం విమానాలు, హాస్టల్స్, హోమ్ స్టే, గ్రూప్ టూర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్... వంటివి కూడా ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా కోవిడ్ విస్తరణ పరిస్థితుల్లో ఇది ఆమోద యోగ్యంగా కాదు. వీలున్నంత వరకూ సోలో/లేదా చిన్న చిన్న బృందాలతో మాత్రమే ప్రయాణాలు చేయాలని, తగినన్ని పారిశుధ్య ప్రమాణాలు పాటిస్తున్న చోట్ల బస చేయడం, చిన్న చిన్న దూరాలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బుదులుగా క్యాబ్స్, సైకిల్స్, వాకింగ్.. వంటివి ఎంచుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఈ ట్రెండ్ కనిపిస్తోంది. తాజాగా థామస్ కుక్ నిర్వహించిన ఎస్ఒటిసి హాలిడే రెడీనెస్ సర్వేలో తాము ఆపరేటర్స్, హోటల్స్ తమ ప్రయాణం మొత్తం ప్రముఖ బ్రాండ్స్కే ప్రాధాన్యమిస్తామని 72శాతం మంది చెప్పారు. తద్వారా తమకు ప్రయాణ ఖర్చులు గతంతో పోలిస్తే కనీసం 35శాతం వరకూ పెరుగుతున్నా పర్లేదని వీరు అంటున్నారు. నెంబర్ టూ.. త్రీలకే డిమాండ్ సాధారణంగా ప్రతీ దేశంలో బాగా పేరొందిన టూరిస్ట్ ప్లేస్గా ఏదో ఒక సిటీ/ ప్లేస్ తప్పక ఉంటుంది. సహజంగానే అలాంటి చోట్ల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే కోవిడ్ పరిస్థితుల్లో అటువంటి బాగా పాప్యులర్ టూరిస్ట్ ప్లేస్ల కన్నా... టాప్లో 2, 3 స్థానాల్లో ఉన్న వాటినే పర్యాటకులు ఎంచుకుంటున్నారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో ఉండే సమూహాల నుంచి తప్పించుకోవచ్చునని భావిస్తూ.. వీలున్నంత వరకూ అత్యంత తక్కువ మందికే తెలిసిన పర్యాటక ప్రాంతాలపై ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్...ఫుల్ ప్రస్తుతం పర్యాటక పరిశ్రమ తమ వ్యాపార కార్యకలాపాల డిజిటలైజేషన్ను మరింతగా విస్తరించింది. కస్టమర్కి అవసరమైనవన్నీ క్లిక్ దూరంలోకి తెస్తోంది. ట్రావెల్ ప్లానింగ్ నుంచి వీసా అప్లికేషన్స్, ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్స్... వరకూ.. ఆసాంతం డిజిటల్ ప్రక్రియకే ప్రాధాన్యత ఇస్తోంది. ఆన్లైన్ ట్రావెల్ ప్రాసెస్, డోర్ స్టెప్ వీసా సర్వీస్, ఇ వీసా సర్వీసెస్, పాస్పోర్ట్ రిటర్న్ కు కొరియర్, ఎయిర్పోర్ట్స్లో సెల్ఫ్ చెక్ కియోస్క్లు.. వంటివి వాడుకలోకి వచ్చేశాయి. ట్రావెల్ కంపెనీలన్నీ డిజిటల్ టచ్పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ముందుంది..పర్యాటక పండుగ సాధారణంగా వేసవి సీజన్ అనేది పర్యాటక శాఖలు సంస్థలకు చాలా ముఖ్యమైంది. దాదాపుగా వార్షిక వ్యాపారంలో కనీసం 60 నుంచి 65శాతం ఈ సీజన్లోనే అందుతుందని అంచనా. లాక్ డౌన్ తో 2020లో దీన్ని సంపూర్ణంగా కోల్పోయారు. అయితే మరోవైపు పర్యాటక ప్రాధామ్యాలనే ఇది మార్చేయడం, మరీ ముఖ్యంగా సురక్షితమైన పర్యాటక అనుభవాలపై అవగాహన పెరగడం వంటి పలు లాభాలూ ఒనగూరాయి. అంతర్జాతీయ విమానాల రాకపోకల సందడి లేక ప్రస్తుతం పర్యాటక రంగం స్తబ్ధుగా కనిపిస్తున్నప్పటికీ... ఈ సీజన్ చివర్లో మళ్లీ పర్యాటకం బాగా ఊపందుకోవచ్చుననేది అంచనా. - వినయ్ మల్హోత్రా, రీజనల్ గ్రూప్ సిఒఒ, విఎఫ్ఎస్ గ్లోబల్ -
అరుదైన దృశ్యం.. ఒకేసారి మూడు పులులు
మైసూరు: సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఒకేసారి మూడు పులులు దర్శనమిచ్చాయి. ఈ ఘటన చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా బిళిగిరి రంగనాథస్వామి అటవీ ప్రాంతంలో జరిగింది. దీంతో పర్యాటకులు ప్రాణభయానికి గురయ్యారు. అడవిలో పులులు ఉన్నా పర్యాటకులకు కనిపించడం అరుదు. (చదవండి: కిలాడీ దంపతులు: బండారం బట్టబయలు..) బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం -
దేశంలోనే తొలి ఇగ్లూ కేఫ్.. ఎక్కడంటే!
కరోనా వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చిన్న చితక సంస్థల నుంచి భారీ స్థాయి వ్యాపారాల వరకు అన్నీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయాయి. మహమ్మారితో కుదేలైన రంగాల్లో టూరిజం(పర్యాటకం) కూడా ఒకటి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో అన్ని రంగాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయి. 9 నెలల పాటు ఇళ్లకే పరిమితమైన జనాలు బయట ప్రపంచానికి అడుగుపెడుతున్నారు. ఆనందం, ఆహ్లాదం కోసం షికార్లు, టూర్ల బాట పడుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకోవడానికి అన్ని రకాల సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆఫర్లతో పాటు నూతన ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి.ఇ దే క్రమంలో కశ్మీర్లోని గుల్మార్గ్లో ఓ హోటల్ వినూత్న ఆలోచన చేసింది. ఏకంగా దేశంలోని తొలి ఇగ్లూ హోటల్ను రూపొందించింది. గుర్మార్గ్లోని కొలాహోయ్ స్కీ రిసార్ట్లో ఈ మంచు కేఫ్ను నిర్మించారు. చదవండి: అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు! ఇగ్లూ ఆకారంలో నిర్మించిన ఈ కేఫ్ పూర్తిగా మంచుతోనే నిర్మితమైంది. గోడల దగ్గరి నుంచి టేబుళ్లు, కుర్చీలు అన్నీ మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. చల్లటి ఇగ్లూ హోటల్లో పర్యాటకులు కూర్చొని వెచ్చని ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఇగ్లూ కేఫ్ మొత్తం 15 అడుగుల ఎత్తు.. 26 అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడి స్థానిక నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో డిజైన్లు తయారు చేశారు. నాలుగు టేబుల్స్తో దాదాపు 16 మంది ఒకేసారి కూర్చునేందుకు వీలుగా ఈ కేఫ్ ఉంది. అక్కడికి వెళ్లిన టూరిస్టులు కేఫ్ ముందు దీగిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త ఆలోచన కావడంతో ప్రజలు అధికసంఖ్యలో ఇగ్లూ కేఫ్కు వెళ్లేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది. చదవండి: పర్యాటకం పట్టాలెక్కేనా? -
రుషికొండ బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రుషికొండ బీచ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్లకు అందించే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ని ఆదివారం ఈ బీచ్ దక్కించుకుంది. బ్లూఫ్లాగ్ ఇంటర్నేషనల్ జ్యూరీ బృందం ఆయా బీచ్ల్లో నిర్వహించిన పనుల్ని వర్చువల్ ద్వారా పరిశీలించింది. అనంతరం దేశంలో 13 బీచ్ల నుంచి ఎనిమిది బీచ్లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్కు ఎంపికయ్యాయని వెల్లడించింది. అదేవిధంగా తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు భారత్ తీసుకుంటున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని బ్లూఫ్లాగ్ బీచెస్ ఆఫ్ ఇండియా మిషన్ లీడర్ సంజయ్ జల్లా ప్రకటించారు. బ్లూఫ్లాగ్ గుర్తింపు వల్ల లాభమేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్ బీచ్లకు విశేష ఆదరణ ఉంటుంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్ బీచ్నే ఎంపిక చేసుకుంటారు. ఈ సర్టిఫికెట్ని పొందాలంటే బీచ్ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్ పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్ని డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ని పొందాయి. మరిన్ని బీచ్ల గుర్తింపునకు కృషి చేస్తాం బీచ్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, అధికారులు కష్టపడటం వల్లే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభించింది. దేశంలో కేవలం 8 బీచ్లు ఈ గుర్తింపు పొందగా అందులో రుషికొండ ఉండటం గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలకు అనుగుణంగా ఏడాది కాలంగా బీచ్లో చేపట్టిన పనులు జ్యూరీ ప్రశంసలు పొందాయి. ఏపీ నుంచి మరిన్ని బీచ్లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వచ్చేందుకు కృషి చేస్తాం. - పర్యాటక మంత్రి ముత్తంశెట్టి -
ఎగసిన ఉత్తేజం.. పర్యాటకం కళకళ..
సహజ ప్రకృతి సందడి చేస్తోంది.. పర్యాటకుల పలకరింతలతో కొండకోనలు పులకరిస్తున్నాయి.. అలరారుతున్న అందాలని చూసి.. ఎన్నాళ్లకెన్నాళ్లకంటూ సందర్శకులు సంబరపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఒంటరైన పర్యాటకం.. సందర్శకుల అడుగుల సడితో కొత్త రూపు సంతరించుకుంది. కోవిడ్–19 కారణంగా వెలవెలబోయిన టూరిజం.. నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం రోజుకు వెయ్యి మంది వరకూ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: కరోనా కారణంగా పడకేసిన పర్యాటక రంగం మళ్లీ ఊపందుకుంది. సుమారు ఐదున్నర నెలల పాటు మూతపడిన పర్యాటక కేంద్రాలు కళకళలాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల పునఃప్రారంభానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన ప్రకృతి ప్రేమికులు.. ఇప్పుడు సందర్శన స్థలాల్లో విహరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఆగస్ట్లో లక్ష మంది మాత్రమే.. పర్యాటక ప్రాంతాలతో, సహజ సిద్ధమైన అందాలతో భాసిల్లుతున్న విశాఖ జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. కరోనాకు పూర్వం జిల్లాలో నెలకు సుమారు 15 నుంచి 18 లక్షల మంది పర్యాటకులు వచ్చేవారు. కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ విధించడంతో సందర్శకుల సంఖ్య సున్నాకు పడిపోయింది. 2019 జనవరి నుంచి జూలై వరకూ 1,57, 86,500 మంది పర్యాటకులు జిల్లాను సందర్శించగా.. ఈ ఏడాది మార్చి 21 వరకూ 26,71,579 మంది మాత్రమే సందర్శించారు. జూలై వరకు లాక్డౌన్ ఉండటంతో ఒక్క పర్యాటకుడు కూడా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లలేదు. అదే విధంగా.. 2019 ఆగస్టులో 19,43,392 మంది రాగా.. ఈ ఏడాది ఆగస్ట్లో కేవ లం లక్ష మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆంధ్రా ఊటీకి రోజుకు 200 మంది.. ఆంధ్రా ఊటీ అరకు ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇన్నాళ్లూ టూరిస్టులు లేక బోసిపోయిన మన్యం.. ఇప్పుడు వారి రాకతో కళకళలాడుతోంది. ఇప్పుడిప్పుడే పర్యాటకానికి అనుమతులు లభించడంతో అక్టోబర్నాటి కల్లా.. పర్యాటకం పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అరకు, పాడేరు, బొర్రా గుహలు మొదలైన ప్రాంతాలను రోజుకు 200 మంది సందర్శిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం ఈ సంఖ్య 5 రెట్లకు పెరిగి వెయ్యి మంది వరకు వస్తున్నారు. అయితే గతేడాది మాత్రం ఏజెన్సీకు రోజుకు 1000 నుంచి 1500 మందికి పైగా రాగా.. వారాంతాల్లో 3 వేలకు పైగా మన్యం అందాలు చూసేందుకు పర్యాటకులు వచ్చేవారు. డముకు వ్యూ పాయింట్ వద్ద సందర్శకులు.. తీర ప్రాంతాల్లో జనసందడి ఐదున్నర నెలల తరువాత వీఎంఆర్డీఏ ఆధీనంలో ఉన్న పార్కులు, మ్యూజియాలు, సందర్శన కేంద్రాలు తెరుచుకున్నాయి. కైలాసగిరి, వైఎస్సార్ సెంట్రల్ పార్కు, తెన్నేటి పార్కులతో పాటు అన్నింటినీ పునఃప్రారంభించడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. తీర ప్రాంతాల్లో జనసందడి నెలకొంటుంది. బీచ్ ఒడ్డున సేదతీరుతూ ఆస్వాదిస్తున్నారు. దసరాకు పెరిగే అవకాశం జిల్లాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్కే బీచ్, ఏజెన్సీలు కళకళలాడుతున్నాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి పర్యాటక కేంద్రం వద్ద పూర్తి రక్షణాత్మక చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా సందర్శకులకు అనుమతి లేకపోవడంతో నెమ్మదిగా పుంజుకుంటోంది. దసరా నాటికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం. – ఆర్.పూర్ణిమాదేవి, జిల్లా పర్యాటక అధికారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే.. కురుసుర సబ్మెరైన్ మ్యూజియం, టీయూ –142 మ్యూజియం వంటి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున.. వాటిలో సందర్శకులకు ఇంకా అనుమతించలేదు. కైలాసగిరి రోప్వే, టాయ్ ట్రైన్ ఆరు నెలలుగా ప్రారంభించకపోవడంతో వాటికి పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహిస్తున్నాం. ట్రయల్ రన్ వేసి, తర్వాత ప్రారంభిస్తాం. –పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
టూరిస్టుల కోసం గోవా రెడీ!
పనాజీ : కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్లతో బోసిపోయిన గోవా మళ్లీ పర్యాటకులతో కళకళలాడనుంది. అక్కడి బీచ్లు సందడిగా మారనున్నాయి. పర్యాటకులను గురువారం నుంచి అనుమతించనున్నట్టు గోవా ప్రభుత్వం పేర్కొంది. 250 హోటళ్లకు ప్రభుత్వం టూరిస్టులను అనుమతించవచ్చని పర్మిషన్ ఇచ్చింది. కాగా గోవాలో పర్యాటకులు ప్రవేశించాలంటే కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ చూపనిపక్షంలో గోవాలోనే కోవిడ్-19 పరీక్షకు సంసిద్ధం కావాలని టూరిజం మంత్రి ఎం అజగోంకర్ చెప్పారు.చదవండి : 90 శాతం పేషెంట్లు వాళ్లే: గోవా సీఎం -
లాక్డౌన్ వేళ... విహారమేల ?
విశాఖ ,కొమ్మాది: కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరో వైపు లాక్ డౌన్ కొనసాగుతుంది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇవన్నీ పట్టని కొంత మంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆహ్లాదం కోసం నిబంధనలను పట్టించుకోకుండా బీచ్ల వద్ద గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వీటికి సాక్ష్యమే మంగమారిపేట బీచ్ వద్ద ఆదివారం కనిపించిన పర్యాటకుల తాకిడి. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, పార్కులు అన్నీ మూతపడ్డాయి. దీంతో తీర ప్రాంతమైన మంగమారిపేట తీరానికి ఆదివారం వందలాది మంది ఒక్కసారిగా చేరుకున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కింగు చేశారు. ఇది తెలుసుకున్న స్థానికులు పోలీసులు బీచ్ వద్దకు చేరుకుని పర్యాటకులను వెనక్కి పంపించారు. లాక్ డౌన్ ఉన్నంతవరకు బీచ్ల వద్దకు పర్యాటకులకు అనుమతి లేదని గ్రహించాలని పోలీసులు తెలిపారు. మంగమారిపేట బీచ్ వద్ద పర్యాటకులను వెనక్కి పంపిస్తున్న పోలీసులు -
కరోనాపై ఆనంద్ మహీంద్ర టిప్స్
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19)ను అధిగమించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పలు సూచనలు చేశారు. ఇంత పెద్ద సంక్షోభంలో కూడా దేశం అభివృద్ధి చెందడానికి కొన్ని సానుకూల అంశాలున్నాయని.. వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన విలువైన సూచనలను మహీంద్రా సోమవారం ట్విటర్లో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ వల్ల చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని..వినియోగాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని సూచిస్తూ ట్వీట్ చేశారు. చైనాను వణికిస్తున్న కరోనా కారణంగా ఆ దేశంలో పర్యటించేందుకు వెనుకంజ వేస్తున్న పర్యాటకులను భారత్ ఆకర్షించాలని ఆనంద్ మహీంద్రా తెలిపారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు పరిశుభ్రత, స్వచ్ఛ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తయారీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందిన చైనాలో ప్రస్తుతం కరోనా కారణంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకొని పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సరళమైన ఆర్థిక విధానాలను రూపొందించాలని పేర్కొన్నారు. చదవండి: గుర్తుంచుకోండి.. అందరం టీ కప్పు లాంటి వాళ్లమే So this is what a global meltdown feels like. For India, it’s a crisis we mustn’t waste. Three opportunities we need to leverage: A) The Govt can use low oil prices both to spur consumption but also retain some of the windfall gains to tackle the deficit. (1/2) https://t.co/uIzM95F2Y2— anand mahindra (@anandmahindra) March 9, 2020 ...B) Step up sanitization & the Swachh movement which will make India more appealing to tourists looking for alternatives to China C) Step up our incentives & ‘step down’ regulations for global investors who will now look for alternative manufacturing sites to China. (2/2)— anand mahindra (@anandmahindra) March 9, 2020 -
వైరల్ అవుతున్న రోల్స్ రాయిస్ ట్యాక్సీ
సోషల్ మీడియాలో పాత తరం రోల్స్ రాయిస్ కారు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కారు మోటార్ రేసింగ్ ఔత్సాహికులకు ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. పసుపు(గోల్డెన్) నెంబర్ ప్లేట్తో ప్రయాణిస్తున్నట్టుగా ఉన్న రాయిస్ కారు ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళకు చెందిన బాబీ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. బంగారు రంగులో ఉన్న ఆ కారును అతడు ఓ ప్రైవేటు రిసార్టుకు అద్దెకిచ్చాడు. ఆ రిసార్టులో దిగే వాళ్లు ఎవరైన దీన్ని బుక్ చేసుకుంటే పికప్, డ్రాప్ కోసం రోల్స్ రాయిస్లో ప్రయాణించే అవకాశం కల్పించాడు. 25,000 చెల్లిస్తే ఈ ప్యాకేజీలో 300 కిలోమీటర్లు ప్రయాణించడమే కాకుండా రెండుమూడు రోజులు వరకు ఉంచుకోవచ్చని యజమాని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ కారుకు సంబంధించి నెటిజన్లు స్పందించారు. ఈ కారులో ఏ విధమైన మీటర్ను అమర్చారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, మరోవైపు ఈ కారును ట్యాక్సీగా ఉపయోగించడానికి కారణం ఏంటని మరో నెటిజన్ ప్రశ్నలు సంధించాడు. -
కరోనా కలవరం: మొత్తం 28 పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో పుట్టి దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్-19 (కరోనా వైరస్) తాజాగా భారత దేశాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణలో వైరస్లను గుర్తించగా, ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన మరో 16 మందికి ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయులు కాగా 16 మందిని ఇటలీకి చెందిన వారుగా పేర్కొన్నారు. దీంతో భారతదేశంలో ఇప్పటివరకు 28 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ బుధవారం అధికారికంగా ధృవీకరించారు. వీరులో ఒకరు ఢిల్లీకి చెందినవారు. ఆగ్రాలో ఆరుగురు, 16 మంది ఇటాలియన్లు, వారికి డ్రైవర్గా పనిచేసిన భారతీయుడు, తెలంగాణలో ఒకరు, ఇప్పటికే నిర్ధారించిన కేసులు అని తెలిపారు. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణీకులందరూ ఇప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవలసి ఉంటుందని తెలిపారు. . వీరందరినీ ఎయిమ్స్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త కేసులు గుర్తించడంతో భారతదేశంలో కరోనా వైరస్ భయాందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇటలీ నుండి తిరిగి వచ్చి ఢిల్లీ నివాసి ఏర్పాటు చేసిన పార్టీకి కొంతమంది విద్యార్థులు హాజరైనందున రెండు నోయిడా పాఠశాలల్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ఎవరికీ వైరస్ సోకలేదని తేలింది. కాగా చైనాలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 80,270 కు చేరుకుంది. మార్చి 3 నాటికి మొత్తం చైనాలో మరణాల సంఖ్య 2,981కి చేరింది. ఇటలీలో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 79కి చేరింది. కరోనా వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ అమెరికా సహా ఇతర దేశాలలో వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఇలావుంటే కరోనా వైరస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోలీ వేడుకలకు దూరంగా వుంటున్నానని ప్రకటించారు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని ట్వీట్ చేశారు. చదవండి : హోలీ వేడుకలకు దూరంగా ఉందాం! -
షెంగన్ వీసా రుసుం పెంచిన ఈయూ
న్యూఢిల్లీ: యూరప్లోని 26 దేశాల్లో పర్యటించడానికి అవసరమయ్యే షెంగన్ వీసా ఫీజును యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెంచింది. ఇన్నాళ్లూ 60 యూరోలుగా (సుమారు రూ.4,750) ఉన్న ఫీజును 80 యూరోలకు (రూ.6,350) పెంచినట్టు ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల పర్యటనకు షెంగన్ వీసా అవసరం. ఆర్థిక మాంద్యం కారణంగానే వీసా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వీసా ఫీజు పెంపుతో ఆయా దేశాలు వీసా ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా జారీ చేయడానికి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తాయని వెల్లడించారు. యూరప్ పర్యాటకులు ఇప్పుడు ఆరు నెలల ముందుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018లో షెంగన్ వీసా కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలింది. -
చిలక చిక్కింది!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇసుక తిన్నెలతో అలరించే సుందర బారువా తీరం ఒకవైపు.. మహేంద్ర తనయ నదీ సంగమం మరోవైపు. పచ్చని ప్రకృతి పరచుకునే తోటలతో శ్రీకాకుళం జిల్లాలోని ఈ తీర ప్రాంతం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు బీచ్ వదిలి వెళ్లినా ఓ సందేహాన్ని మాత్రం వెంట తీసుకెళ్తుంటారు. బీచ్లో కొంతదూరంలో కనిపించే ఆ కర్ర ఏమిటని..? సుడిగుండాల భయంతో.. అవి.. ‘చిలకా’ అనే పేరున్న నౌక ఆనవాళ్లు. ఎప్పుడో వందేళ్ల నాడు మునిగిపోయిందని స్థానికులు చెబుతుంటారే తప్ప సుడిగుండాల భయంతో అక్కడికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ బృందం సుడిగుండాల వెనుక రహస్యాల్ని ఛేదించింది. నౌక అవశేషాలు స్కూబా డైవింగ్తో అన్వేషణ బారువ సముద్ర తీరంలో ఈనెల 27వతేదీన ముగ్గురితో కూడిన లివిన్ అడ్వెంచర్స్ బృందం పరిశోధన మొదలైంది. ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు, డైవ్ మాస్టర్ రాహుల్, అడ్వాన్స్ డైవర్ లక్ష్మణ్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ అన్వేషణ ప్రారంభించారు. ఒడ్డుకు 400 మీటర్ల దూరంలో ఉన్న కర్ర వద్దకు చేరుకున్నారు. సాగర గర్భంలో 7 మీటర్ల లోతు వెళ్లాక వారికి నౌక అవశేషాలు కనిపించాయి. శిథిలావస్థలో ఉన్న నౌకలో గోలియత్ గ్రూపర్స్, లయన్ ఫిష్, ఎలక్ట్రిక్ రే, సిల్వర్ మూనీ తదితర జలచరాలు నివాసమున్నట్లు గుర్తించారు. దాదాపు 45 నిమిషాల పాటు సముద్ర గర్భంలో గడిపి నౌక వివరాలను సేకరించారు. నౌక వెనుక భాగం పైకి ఉండటం వల్ల అలలు వచ్చినప్పుడు ఆ తాకిడికి రిప్ కరెంట్లా మారి సుడిగుండాలు ఏర్పడినట్లు కనిపిస్తుంటుందని, ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. సాహస యాత్ర చేసిన లివిన్ అడ్వెంచర్స్ బృందం ‘నౌక పూర్తిగా శిథిలమైంది. అగ్ని ప్రమాదం సంభవించినట్లు చెబుతున్న భాగాలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల అలలు ఉధృతంగా వెనుక భాగానికి తగిలి సుడిగుండాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా నౌక వెడల్పు కొలవలేకపోయాం. గతంలో మా బృందం విజయనగరం జిల్లా చింతపల్లి తీరంలో, విశాఖ జిల్లా భీమిలి తీరంలో మునిగిన నౌకల్ని అన్వేషించింది. – బలరాం నాయుడు (లివిన్ అడ్వెంచర్ సంస్థ ఇన్స్ట్రక్టర్) -
టూరిస్టులకు కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం భలే ఆఫర్ను ప్రకటించింది. సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ అందించనుంది. ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. కోణార్క్లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. సంవత్సరం లోపు ఈ టాస్క్ను పూర్తి చేసిన టూరిస్టులను ప్రభుత్వం రివార్డుతో సంత్కరిస్తామన్నారు. టూరిస్టులను మరింత ప్రోత్సాహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్యాటన్ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా అతడు /ఆమె 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలి. స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి అనేది ప్రధాన షరతు. ఇందుకు గాను వారికి ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే ఇది నగదు రూపంలో కాకుండా ప్రోత్సాహక బహుమతిగా వుంటుందని స్పష్టం చేశారు. సంబంధిత ఫోటోలను తమ వెబ్సైట్లో పొందు పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తామన్నారు. త్వరలోనే కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని 'ఐకానిక్ సైట్ల' జాబితాలో చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి తెలిపారు. అంతేకాదు టూరిస్టు గైడ్స్గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్ కూడా నిర్వహిస్తోంది. కానీ ఈ కార్యక్రమంలో ఒడిశా పాల్గొనడం చాలా తక్కువ, దీనిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపైందర్ బ్రార్ అన్నారు. మరోవైపు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడానికి మరిన్ని పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టాలని ఫిక్కీ ఈస్టర్న్ టూరిజం కమిటీ చైర్మన్ సౌభాగ్య మోహపాత్ర కోరారు. -
అంత దగ్గరనుంచి తీస్తే పోతారు
సిమ్లా: తరుముకొస్తున్న హిమపాతం నుంచి పర్యాటకులు తప్పించుకున్న ఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. కిన్నౌర్ జిల్లాలోని టింకు నల్లా ప్రాంతంలో మంచు కొండలను చూడటానికి పర్యాటకులు వెళ్లారు. ఆ సమయంలో హిమపాతం కదులుతూ వీరు వెళుతున్న రోడ్డుపై ప్రవేశించింది. అయితే కొంతమంది పర్యాటకులు దీన్ని లెక్క చేయకుండా ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అయితే హిమపాతం వారిని వెంటాడుతున్నట్టుగా రోడ్డుపై మరింత ముందుకు వస్తూనే ఉంది. దీంతో ఓ పర్యాటకుడు ‘వెనక్కి వెళ్లిపొమ్మని ఇతరులకు సూచించాడు. కొంతమంది భయంతో వెనక్కి వెళ్లి తమ కార్లలో ఎక్కి కూర్చున్నారు. కానీ కొందరు మాత్రం కదులుతున్న మంచు కొండను వీడియో తీస్తూనే పరుగెత్తుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నవీద్ ట్రుంబో అనే అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది క్షణాల్లోనే వైరల్గా మారింది. మంచు ముద్ద.. వెంటాడుతున్న యముడిలా రోడ్డు మీదకు రావటాన్ని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక పర్యాటకులు కొంచెం కూడా జాగ్రత్తపడకుండా దాన్ని దగ్గర నుంచి వీడియో తీయడాన్ని పలువురు తప్పుపట్టారు. ‘అంత దగ్గర నుంచి తీస్తే పోతారు’ అంటూ ఓ నెటిజన్ టూరిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘హిమపాతం భారీ పరిమాణంలో ఉండి చాలా నెమ్మదిగా కదులుతుంది. మరి అది నిజంగానే హిమపాతమేనా?’ అని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేయగా ‘హిమపాతంలో అది ఓ భాగం అయ్యుండొచ్చ’ని మరో నెటిజన్ సమాధానమిచ్చాడు. -
విదేశీ పర్యాటకులపై క్యాబ్ ఎఫెక్ట్
-
పవన్ ఉన్నాడంటూ ఓవర్ యాక్షన్..
సాక్షి, చిత్తూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన.. పర్యాటకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పవన్ కల్యాణ్ గురువారం హార్సిలీ హిల్స్లోని గాలిబండకు చేరుకున్నారు. గాలిబండ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. హార్సిలీ హిల్స్కు వచ్చిన ప్రతి టూరిస్ట్ గాలిబండకు వెళ్లాలని, అక్కడి అందాలను చూడాలని అనుకుంటాడు. కానీ, పవన్ కల్యాణ్ అక్కడ ఉన్నారంటూ పర్యాటకుల పట్ల జనసేన కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పర్యాటకులు గాలిబండకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి జనసేన కార్యకర్తలు పర్యాటకులను అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో గాలిబండకు వెళ్లాలకుంటున్న పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. జనసేన కార్యకర్తల ఓవర్ యాక్షన్ పై మండిపడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తల తీరు బాగాలేదని టూరిస్టులు తప్పుబడుతున్నారు. బుధవారం మదనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అటు నుంచి నేరుగా హార్సిలి హిల్స్కు చేరుకున్నారు.