
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల మే 9 వ తేదీ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం విడుదల చేశారు.
సీఎం జగన్.. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సిటీ వై ఎస్సార్ సర్కిల్లోని ఎస్వీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.