రాహుల్‌ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు | Shiv Sena Sanjay Nirupam Criticizes Rahul Gandhi On His Dharavi Visit, More Details Inside | Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌కి ఎక్కువ.. రాహుల్‌ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు

Published Sat, Mar 8 2025 11:52 AM | Last Updated on Sat, Mar 8 2025 12:11 PM

Shiv Sena Sanjay Nirupam Criticizes Rahul Gandhi Dharavi visit

ముంబై: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్‌ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు  సంధించారు.

గురువారం ధారావిలోని ఛామర్‌ స్టూడియోను సందర్శించిన రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్‌ సుధీర్‌ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్‌ మీడియాలో  రాజ్బర్‌ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.

 అయితే ఒక కాంగ్రెస్‌ నేతగా కాకుండా.. యూట్యూబర్‌లాగా రాహుల్‌ ధారావిలో పర్యటించారంటూ సంజయ్‌ నిరుపమ్‌ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్‌ యూనిట్‌ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు.

 

ముంబైలో కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్‌ కార్యాలయం కరెంట్‌ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్‌ కాంగ్రెస్‌ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్‌ నేతలా కాకుండా.. యూట్యూబర్‌లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్‌ యూనిట్‌ చీఫ్‌గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్‌ నిరుపమ్‌ అన్నారు.

బాల్‌థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్‌ నిరుపమ్‌.. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్‌లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్‌ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement