Top Stories
ప్రధాన వార్తలు

టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా అబద్ధాలు.. బుకాయింపు మరోసారి పటాపంచలయ్యాయి! టీటీడీ గోశాలలో అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించగా.. స్వయంగా టీడీపీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్మీట్లతో ముమ్మాటికీ గోవులు చనిపోయాయనే విషయం రుజువైంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే అటు టీటీడీ.. ఇటు టీడీపీ అసలు అలాంటి ఘటన ఏదీ జరగనే లేదంటూ బుకాయిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి. వైఎస్సార్సీపీపై దుమ్మెత్తి పోశాయి. కానీ నిజం నిలకడ మీద తేలుతుందన్నట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవుల మృత్యుఘోష వెలుగు చూడటంతో ఉలిక్కిపడ్డ కూటమి సర్కారు కప్పిపుచ్చేందుకు విఫల యత్నాలు చేసింది. గోవులు చనిపోయాయంటూ అబద్ధాలాడుతున్నారని సీఎం చంద్రబాబు యథాప్రకారం బుకాయించగా.. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనలతో గోమాతల మృతి నిజమేనని తేటతెల్లమైంది. పరమ పవిత్రంగా పూజించే క్షేత్రంలో గోమాతల మృత్యుఘోషపై భక్తులు భగ్గుమంటున్నారు. టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృత్యువాత పడినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 11న సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు 40 గోవులు మాత్రమే మరణించాయని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈనెల 13న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి గోశాలలో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. 20 నుంచి 22 గోవులు మాత్రమే మరణించినట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ప్రకటించారు. ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయి..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అసత్య ప్రచారం చేస్తోంది అంటూనే.. నిజాలను ఒప్పుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం యథాప్రకారం అసలు గోవులు మరణించనే లేదని, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం గుంటూరు జిల్లా పొన్నెకల్లులో వైఎస్సార్ సీపీపై అసహనం వెళ్లగక్కారు. నాలుగు రోజులుగా పొంతన లేని ప్రకటనలతో టీటీడీని అడుగడుగునా అభాసు పాలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది నెలలుగా అపచారాలు.. !కూటమి ప్రభుత్వం వచ్చాక గత పది నెలల కాలంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని మహాపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న మహాపచారాలను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాల్సిందిపోయి.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ పార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు. పంది కొవ్వు కలిసిందంటూ..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది.. అంటూ గతేడాది సెపె్టంబర్ 19న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీసే రీతిలో వ్యాఖ్యలు చేయటం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తొక్కిసలాటలో భక్తుల మృతి..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధారి్మక క్షేత్రం తిరుమలకు లక్షలాదిమంది భక్తులు వచి్చనా టీటీడీ చరిత్రలో గతంలో ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకున్న దాఖలాలు లేవు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా నియంత్రించడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత పటిష్ట ప్రణాళికలు మరెక్కడా లేవు. అటువంటి చోట భక్తుల తొక్కిసలాట ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. అసత్య ఆరోపణలే.. 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు: టీటీడీ చైర్మన్ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందటం, 40 మందికిపైగా గాయాలు పాలవడం అందరినీ కలచి వేసింది. ఆ తరువాత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.మందు.. ఎగ్ బిర్యానీ⇒ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషిద్ధం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన వెలుగుచూసింది. ⇒ ఈ ఏడాది మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్చల్ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్టుషాపు వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్టుషాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఏర్పాటవుతున్న రీతిలోనే తిరుమలలో కూడా బెల్టు దుకాణం వెలసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.⇒ తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్చగా తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు.

ట్రంప్తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
వాషింగ్టన్ డీసీ: ట్రంప్ సర్కారు హార్వాడ్ విశ్వవిద్యాలయం(Harwad University)పై వేటు వేసింది. యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ట్రంప్ సర్కారు జారీచేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపధ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను(సుమారు రూ. 18,300 కోట్లు) స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలన అధికారులు హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీనికి స్పందించిన హార్వర్డ్ వర్శిటీ హెడ్ అలాన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వార్డ్ పరిధిలోని కళాశాల ప్రాంగణాలలో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధాని(Israel's war)కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తదనంతరం అమెరికాలోని విద్యా శాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ(Immigration Policy)లతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్ సర్కారు పేర్కొంది. ఈ నిధులను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాగా ట్రంప్ సర్కారు చర్యపై హార్వర్డ్ వర్శిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు.ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

రేవంత్ సర్కార్కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
సాక్షి, దుబ్బాక: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగుచెంది.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు అంటూ బాంబు పేల్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చును తాము భరిస్తామని అనుకుంటున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను కొంటారో కొనండి.. అందుకే అయ్యే ఖర్చును తామే భరిస్తామని అడుగుతున్నారు.మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

అంతరిక్షంలోకి మహిళల టీమ్.. సింగర్ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..
అంతరిక్ష పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 11 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్ కింగ్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్ ఆయేషా బోవ్ ఇందులో భాగస్వాములయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ భార రహితస్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాలు పాటు సాగిన ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. బ్లూ ఆరిజిన్కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర. ✨ Weightless and limitless. pic.twitter.com/GQgHd0aw7i— Blue Origin (@blueorigin) April 14, 2025అయితే, ఈ అంతరిక్ష యాత్ర సందర్బంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్ చేశారు. వారంతా భార రహిత స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక, రోదసి నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ పెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.A smooth landing in West Texas. Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH— Blue Origin (@blueorigin) April 14, 2025 ఇదిలా ఉండగా.. బ్లూ ఆరిజిన్ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో రోదసి యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మిషన్లు చేపట్టగా, 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7— Blue Origin (@blueorigin) April 14, 2025 ‘YOUR KISS IS COSMIC 🎶’US pop star Katy Perry kissed the ground after returning to Earth following a flight aboard Blue Origin’s New Shepard NS-31. The rocket soared past the Kármán line—the internationally recognized boundary of space—before landing safely in Van Horn, West… pic.twitter.com/1PjjDWD2v4— Philstar.com (@PhilstarNews) April 15, 2025

లేఆఫ్స్పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. 25 శాతం ఉద్యోగులను తగ్గించుకునే అవకాశం ఉందనే వార్తలపై తాజాగా సంస్థ అధికారికంగా స్పందించింది. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇలా వస్తున్న వార్తలను ఖండించింది. ఇది అవాస్తవమని స్పష్టం చేసింది. అలాంటి చర్యలేమీ తీసుకోలేదని వివరించింది.ఇదీ చదవండి: డీజిల్కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..ఖర్చులను తగ్గుంచుకోవడంలో భాగంగానే కంపెనీ లేఆప్స్ కార్యక్రమాన్ని చేపట్టనుందని ఇటీవల వార్తలొచ్చాయి. కంపెనీలోని రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేస్తున్న 50 నుంచి 55 సంవత్సరాల వయసున్న ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అంతే కాకుండా వివిధ విభాగాల్లో ఏడాదికి కోటి రూపాయల జీతం పొందుతున్న అనేకమంది ఉద్యోగులను రాజీనామా చేయాలని సంస్థ ఇప్పటికే కోరినట్లు ఆయా వార్తల్లో తెలిపారు. జాతీయ మీడియా సంస్థలతో సహా చాలా ప్రాంతీయ సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. దీనిపై కంపెనీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. సంస్థలో సిబ్బంది తగ్గింపు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.

ట్రంప్ టార్గెట్: ఇక ఔషధాలు, సెమీకండక్టర్ల వంతు
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్(Trump) తన పాలనలో ప్రత్యేక మార్క్ చూపిస్తున్నారు. తాజాగా ఔషధాలు, సెమీకండక్టర్ల దిగుమతులపై కొత్త టారిఫ్లను విధించేదిశగా ట్రంప్ యోచిస్తున్నారని సమాచారం. ఇందుకోసం జాతీయ భద్రతపై వాటి ప్రభావంపై పరిశోధించేందుకు కసరత్తు మొదలుపెట్టారు.ట్రంప్ సర్కారు ఔషధాలు, సెమీకండక్టర్ల దిగుమతులపై కాత్త టారిఫ్లను(tariffs) నిర్ణయించాలన్న నిర్ణయాన్ని 1962 ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ ఆధారంగానే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చట్టం జాతీయ భద్రతకు అనుగుణంగా పలు ప్రధానమైన వస్తువులపై టారిఫ్లను విధించడానికి వీలు కల్పిస్తుంది. దీనిపై ట్రంప్ చేపట్టిన పరిశోధన విదేశీ ఉత్పత్తుల విషయంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై ట్రంప్ సర్కారు 21 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ గడువు విధించింది. ఔషధాలు, సెమీకండక్టర్ల టారిఫ్ల ప్రక్రియ అనేది గతంలో ప్రకటించిన పరస్పర సుంకాల విధానాలను అనుసరించి ఉంటుందని అంటున్నారు.ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ విధానాలనేవి దిగుమతి సుంకాలు(Import tariffs) గణీయంగా పెరిగేలా చేశాయి. వీటి కారణంగా నిరుద్యోగంతో పాటు ధరలు పెరగడంలాంటివి జరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. అయితే ట్రంప్ మాత్రం తన టారిఫ్లను దేశ ఆర్థిక, జాతీయ భద్రతా విధానాలలో ముఖ్యమైన భాగమని చెబుతున్నారు. ట్రంప్ సర్కారు తెలిపిన వివరాల ప్రకారం చైనాతోపాటు ఇతర దేశాల నుండి వచ్చే ఔషధాలు తదితర ఉత్పత్తులు అమెరికాలోని స్థానిక పరిశ్రమలకు హాని కలిగిస్తున్నాయి. అందుకే ఈ విధమైన టారిఫ్లు విధిస్తే అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి వీలవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. కాగా డెమోక్రాట్లు, ఆర్థిక నిపుణులు ఈ ట్టారిఫ్లు గ్లోబల్ ట్రేడ్ను దెబ్బతీస్తాయని వాదిస్తున్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు ఇది అమెరికాలో ఉద్యోగాలు, ఉత్పత్తుల సంరక్షణకు దోహదపడుతుందని అంటున్నారు. ఈ టారిఫ్ విధానాల కారణంగా చైనాతో అమెరికా వాణిజ్య ఘర్షణలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలున్నాయి. ఇది కూడా చదవండి: ట్రంప్తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్

పవన్ కల్యాణ్ను కలిసిన అల్లు అర్జున్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను స్టార్ హీరో అల్లు అర్జున్ కలుసుకున్నారు. హైదరాబాద్లోని పవన్ ఇంటికి వెళ్లిన బన్ని మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు 30 నిమిషాల పాటు అల్లు అర్జున్ దంపతులు మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ, అందుకు సంబంధించిన ఫోటోలు వంటివి అధికారికంగా వెలువడలేదు.

IPL 2025: చెన్నై గెలిచిందోచ్...
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్కు కాస్త ఊరట... వరుసగా ఐదు పరాజయాల తర్వాత పూర్తిగా ఆట మరచినట్లు కనిపించిన జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి లక్నోను ఆ జట్టు వేదికపైనే స్పిన్తో కట్టడి చేసిన సీఎస్కే ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేరింది. బౌలింగ్లో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించగా, బ్యాటింగ్లో శివమ్ దూబే రాణించాడు. అన్నింటికి మించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజ్లోకి వచ్చిన ధోని తడబాటు లేకుండా, దూకుడుగా ఆడి జట్టుకు అవసరమైన ‘విలువైన’ పరుగులు సాధించడం మరో సానుకూలాశం. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీద కనిపించిన లక్నో సమష్టి వైఫల్యంతో ఓటమిని ఆహా్వనించింది. లక్నో: ఐపీఎల్లో ఎట్టకేలకు మూడు వారాల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో సీఎస్కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెపె్టన్ రిషభ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, మిచెల్ మార్‡్ష (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) గెలుపు దిశగా నడిపించగా, ఎమ్మెస్ ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 28 బంతుల్లో అభేద్యంగా 57 పరుగులు జోడించారు. పంత్ హాఫ్ సెంచరీ... తొలి ఓవర్లోనే మార్క్రమ్ (6) అవుట్ కాగా, టోర్నీ ప్రస్తుత టాప్ స్కోరర్ నికోలస్ పూరన్ (8) కూడా విఫలం కావడంతో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. ఖలీల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి మార్‡్ష జోరు ప్రదర్శించగా, పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 80 స్ట్రయిక్రేట్తో 40 పరుగులే చేసిన పంత్ ఈ మ్యాచ్లో పట్టుదలగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్లో మార్‡్షను జడేజా వెనక్కి పంపగా... ఒవర్టన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన ఆయుశ్ బదోని (17 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా జడేజా బౌలింగ్లోనే అవుటయ్యాడు. అప్పటి వరకు మెరుగ్గానే ఆడిన పంత్ను చెన్నై స్పిన్నర్లు పూర్తిగా కట్టిపడేశారు. ముఖ్యంగా నూర్ బౌలింగ్లో 15 బంతులు ఆడిన పంత్ 10 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు! అయితే ఆ తర్వాత పతిరణ ఓవర్లో 2 సిక్స్లు బాదడంతో 42 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. చివరి 3 ఓవర్లలో లక్నో 45 పరుగులు సాధించింది. కీలక భాగస్వామ్యం... 2023 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు)కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కొన్ని చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. ఆకాశ్దీప్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అవేశ్ ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్లో రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) కూడా వేగంగా ఆడటంతో పవర్ప్లేలో చెన్నై 59 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్శంకర్ (9) వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన స్థితిలో దూబే, ధోని జత కలిశారు. తాను ఆడిన తొలి బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్ బాది ధోని దూకుడు ప్రదర్శించడంలో ఒత్తిడి కాస్త తగ్గింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరమయ్యాయి. శార్దుల్ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ సహా 19 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న చెన్నై... మరో మూడు బంతుల్లో లాంఛనం పూర్తి చేసింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) త్రిపాఠి (బి) అహ్మద్ 6; మార్‡్ష (బి) జడేజా 30; పూరన్ (ఎల్బీ) (బి) కంబోజ్ 8; పంత్ (సి) ధోని (బి) పతిరణ 63; బదోని (స్టంప్డ్) ధోని (బి) జడేజా 22; సమద్ (రనౌట్) 20; మిల్లర్ (నాటౌట్) 0; శార్దుల్ (సి) రషీద్ (బి) పతిరణ 6; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–23, 3–73, 4–105, 5–158, 6–158, 7–166. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–1, అన్షుల్ కంబోజ్ 3–0–20–1, ఒవర్టన్ 2–0–24–0, జడేజా 3–0–24–2, నూర్ అహ్మద్ 4–0–13–0, పతిరణ 4–0–45–2. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) పూరన్ (బి) అవేశ్ 27; రచిన్ (ఎల్బీ) (బి) మార్క్రమ్ 37; రాహుల్ త్రిపాఠి (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 9; జడేజా (సి) మార్క్రమ్ (బి) రవి బిష్ణోయ్ 7; శివమ్ దూబే (నాటౌట్) 43; విజయ్శంకర్ (సి) అవేశ్ (బి) దిగ్వేశ్ రాఠీ 9; ధోని (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–52, 2–74, 3–76, 4–96, 5–111. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–56–0, ఆకాశ్దీప్ 1–0–13–0, దిగ్వేశ్ రాఠీ 4–0–23–1, అవేశ్ ఖాన్ 3.3–0–32–1, రవి బిష్ణోయ్ 3–0–18–2, మార్క్రమ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడుపంజాబ్ X కోల్కతా వేదిక: ముల్లాన్పూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

పెగాసస్ నిఘా నిజమే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ చెప్పిందే నిజమైంది. 2018–19లో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు తమ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయింది. భారత్లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు, సామాజికవేత్తల వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కొంతకాలం క్రితం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వ బాగోతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది. స్పైవేర్ నిఘాలో రెండో స్థానంలో భారత్ నిఘా సాఫ్ట్వేర్ స్పైవేర్ను రూపొందించిన ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ జాబితాలో, పెగాసస్ను ఉపయోగించిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం.–2018–19లో భారత్లో వందమంది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్ నంబర్లపై ఎన్ఎస్వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టింది. ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా రూ.58 కోట్లు ఎన్ఎస్వో గ్రూప్నకు చెల్లించాయి. –ఎన్ఎస్వో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 1,223 మందిపై నిఘా పెట్టింది. వారిలో వందమంది భారత్కు చెందినవారే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికోలో 456 మంది ప్రముఖుల నంబర్లపై నిఘా ఉంచింది.పెగాసస్ నిఘా పెట్టిన వివిధ దేశాల్లోని ప్రముఖుల సంఖ్యభారత్: 100, బ్రిటన్: 82, మొరాకో: 69, పాకిస్థాన్: 58, ఇండోనేసియా: 54, ఇజ్రాయెల్: 51, స్పెయిన్: 12, నెదర్లాండ్స్: 11, హంగేరీ: 8, ఫ్రాన్స్: 7, యూకే: 2.అప్పట్లోనే వెల్లడించిన వైఎస్సార్సీపీ 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపింది. పెగాసస్ ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి కూడా పాల్పడింది. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆరోపణలను చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే, నాడు వైఎస్సార్సీపీ చెప్పింది నిజమేనని.. మెటా సంస్థ అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది.అసెంబ్లీలోనే బయటపెట్టిన మమత2018–19లో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్ను ఉపయోగించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కొంతకాలం క్రితం వెల్లడించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆమె మాట్లాడుతూ.. 2019 ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ ప్రతినిధులు తనను సంప్రదించారని తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ఆ ప్రతినిధులు చెప్పినట్టు కూడా మమతా తెలిపారు. బెంగాల్లోనూ ఒప్పందం చేసుకోవాలని ఎన్ఎస్వో గ్రూప్ ప్రతినిధులు కోరారని చెప్పారు. కానీ, తాను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. కాగా, మమతా బెనర్జీ వ్యాఖ్యలతో.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్ ను ఉపయోగించినట్లు స్పష్టమైంది.

ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆర్ఎల్జేపీ తెగదెంపులు
పట్నా: కేంద్ర మాజీ మంత్రి పశుపతి కుమార్ పరాస్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ఎల్జేపీ) ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుంది. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పరాస్ ఈ విషయం ప్రకటించారు. దివంగత రాం విలాస్ పాశ్వాన్ సోదరుడే పరాస్.అయితే, పాశ్వాన్ కుమారుడు చిరాగ్తో పొసగక లోక్ జనశక్తి పార్టీని వీడి బయటకు వచ్చిన పరాస్ 2021లో ఆర్ఎల్జేపీ ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)పార్టీకి ఐదు సీట్లు కేటాయించడంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. పరాస్ సొంత సీటు హజీపూర్ సహా ఆ ఐదు సీట్లనూ చిరాగ్ పార్టీ గెలుచుకుంది. ఎన్డీఏను అంటిపెట్టుకునే ఉన్నా ఆయన పార్టీకి ఇచ్చిన బంగ్లాను ప్రభుత్వం ఖాళీ చేయించి, చిరాగ్కు కేటాయించింది. ఈ పరిస్థితుల్లోనే పరాస్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
టారిఫ్లకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
‘అతి’ వల్ల అనర్థాలు తప్పవు!.. చాలా బాధగా ఉంది..
తమిళ భాష కోసం ఏఆర్.రెహ్మాన్ సరికొత్త ప్రయత్నం
రేవంత్ సర్కార్కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
మీ భంగిమ 'వెన్న'దన్నుగా ఉందా..? సరైన పోష్చర్ అంటే..?
అంతరిక్షంలోకి మహిళల టీమ్.. సింగర్ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
లేఆఫ్స్పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
డీజిల్కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
ఐపీఎల్తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
సొరంగం జిందాబాద్..!
ఎండలో నిలబెడతానంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడ్సార్..!
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
IPL 2025: చెన్నై గెలిచిందోచ్...
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
పంజాబ్ కింగ్స్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
నేను కెప్టెన్ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజులైనా ఆ మార్క్ దాటలేదు!
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త: తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ రేటు
పెద్ది ఫైట్
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
డబ్బులెక్కడ సార్?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
ఫోక్స్వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
అతడి బ్యాటింగ్కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్కు బ్రేక్!
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
పళ్ల సెట్కి గుడ్బై చెప్పేయండి..! హాయిగా యథావిధిగా వచ్చేస్తాయట..!
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
హిట్ ఇచ్చిన డైరెక్టర్కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
తిరుమలలో మరో అపచారం
వన్ వే రూటు
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
అంతరిక్షం నుంచి అందాల భారతం
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆర్ఎల్జేపీ తెగదెంపులు
పెగాసస్ నిఘా నిజమే!
రష్యా గ్యాస్ పైప్లైన్ మాకిచ్చేయండి
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
తమిళ పొన్నులా జాన్వీ కపూర్.. వజ్రాల హారంతో అనసూయ
యువతిని వేధించి.. ఆపై పోలీస్ స్టేషన్లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ పక్కా’
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్?
Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా?
ఖనిజాలు బంద్
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు
IPL 2025: అక్షర్ పటేల్కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు
విడుదలకు సిద్ధమైన హారర్ మూవీ 'త్రిగుణి'
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
మనోజ్ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
సుందర్ సీ సినిమాలో గ్లామర్తో దుమ్మురేపిన 'కేథరిన్ థ్రెసా'
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. యువతి అనుమానాస్పద మృతి!
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్గా, సాంప్రదాయంగా
ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..
ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్లోనూ..
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
ట్రంప్తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
HYD: అర్ధరాత్రి పబ్లో అసభ్యకర డ్యాన్స్.. 17 మంది యువతులతో కస్టమర్స్..
బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
జగన్ విజన్ బాబు తలకెక్కిందా?
ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్' విలన్
వైఎస్ జగన్కి ముద్రగడ పద్మనాభం లేఖ
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
కమల్ హాసన్కు పదవి ఇవ్వనున్న స్టాలిన్..?
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో లేఆప్స్?
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
టారిఫ్లకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
‘అతి’ వల్ల అనర్థాలు తప్పవు!.. చాలా బాధగా ఉంది..
తమిళ భాష కోసం ఏఆర్.రెహ్మాన్ సరికొత్త ప్రయత్నం
రేవంత్ సర్కార్కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
మీ భంగిమ 'వెన్న'దన్నుగా ఉందా..? సరైన పోష్చర్ అంటే..?
అంతరిక్షంలోకి మహిళల టీమ్.. సింగర్ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
లేఆఫ్స్పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
డీజిల్కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
ఐపీఎల్తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
సొరంగం జిందాబాద్..!
ఎండలో నిలబెడతానంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడ్సార్..!
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
IPL 2025: చెన్నై గెలిచిందోచ్...
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
పంజాబ్ కింగ్స్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
నేను కెప్టెన్ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజులైనా ఆ మార్క్ దాటలేదు!
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త: తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ రేటు
పెద్ది ఫైట్
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
డబ్బులెక్కడ సార్?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
ఫోక్స్వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
అతడి బ్యాటింగ్కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్కు బ్రేక్!
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
పళ్ల సెట్కి గుడ్బై చెప్పేయండి..! హాయిగా యథావిధిగా వచ్చేస్తాయట..!
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
హిట్ ఇచ్చిన డైరెక్టర్కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
తిరుమలలో మరో అపచారం
వన్ వే రూటు
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
అంతరిక్షం నుంచి అందాల భారతం
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆర్ఎల్జేపీ తెగదెంపులు
పెగాసస్ నిఘా నిజమే!
రష్యా గ్యాస్ పైప్లైన్ మాకిచ్చేయండి
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
తమిళ పొన్నులా జాన్వీ కపూర్.. వజ్రాల హారంతో అనసూయ
యువతిని వేధించి.. ఆపై పోలీస్ స్టేషన్లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ పక్కా’
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్?
Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా?
ఖనిజాలు బంద్
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు
IPL 2025: అక్షర్ పటేల్కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు
విడుదలకు సిద్ధమైన హారర్ మూవీ 'త్రిగుణి'
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
మనోజ్ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
సుందర్ సీ సినిమాలో గ్లామర్తో దుమ్మురేపిన 'కేథరిన్ థ్రెసా'
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. యువతి అనుమానాస్పద మృతి!
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్గా, సాంప్రదాయంగా
ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..
ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్లోనూ..
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
ట్రంప్తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
HYD: అర్ధరాత్రి పబ్లో అసభ్యకర డ్యాన్స్.. 17 మంది యువతులతో కస్టమర్స్..
బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
జగన్ విజన్ బాబు తలకెక్కిందా?
ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్' విలన్
వైఎస్ జగన్కి ముద్రగడ పద్మనాభం లేఖ
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
కమల్ హాసన్కు పదవి ఇవ్వనున్న స్టాలిన్..?
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో లేఆప్స్?
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
సినిమా

మదరాసి డేట్ ఫిక్స్
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్స్ . శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో శివ కార్తికేయన్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.‘‘హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మదరాసి’. ఈ మూవీలో సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నారు మురుగదాస్’’ అని యూనిట్ పేర్కొంది. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమేరా: సుదీప్ ఎలామోన్.

అది మనం క్రియేట్ చేసుకున్నదే.. వదిలేస్తే బాగుంటుంది: హీరో నాని
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం హిట్-3. టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను హిట్ సిరీస్లో వస్తోన్న మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ వయొలెంట్గా కనిపిస్తోంది. ముఖ్యంగా చాగంటి ప్రవచనాలు ట్రైలర్లో ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు.మూవీ రిలీజ్ తేదీ ఇంకా రెండు వారాలు పైగా సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన హీరో.. ఇక టైర్- 1 జాబితాలో చేరినట్టేనా? అని ఒకరు ప్రశ్నించగా.. దానిపై నాని స్పందించారు.నాని మాట్లాడుతూ.. 'అది మన డిక్షనరీలో ఉన్నది కాదు. కేవలం మనం క్రియేట్ చేసుకున్న పదమే. నటుడికి తగినట్లుగానే సినిమాలు తెరకెక్కిస్తారు. వారిని ఆ పేర్లతో ఎందుకు డివైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది చాలా స్టుపిడ్ కాన్సెప్ట్. ఎవరు మొదలుపెట్టారోగానీ.. మనమంతా దానినే పెంచి పోషిస్తున్నాం. ఇకపై ఆ వేరియేషన్ ఆపితే మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిది. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం' అని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించింది.

అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. థియేటర్లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు హడావుడి చేస్తుంటారు. ఇక అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా అంతా ఇంతా కాదు. కటౌట్స్, డ్యాన్స్లు, డైలాగ్స్తో ఊగిపోతుంటారు. ముఖ్యంగా థియేటర్ల వద్ద అభిమాన సంఘాలు రచ్చ రచ్చ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇవీ కాస్తా శృతి మించి గొడవలు కూడా జరుగుతుంటాయి.అయితే తాజాగా కేరళలోని ఓ థియేటర్లో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇటీవల కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన కొందరు ఫ్యాన్స్.. విజయ్, విజయ్ అంటూ కేకలు వేశారు. దీంతో అక్కడే అజిత్ అభిమానులు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్లోని ఓ థియేటర్లో జరిగినట్లు సమాచారం.కాగా.. అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. అర్జున్ దాస్ విలన్గా మెప్పించారు. సిమ్రాన్ ముఖ్య అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. கேரளாவில் தியேட்டர் ஒன்றில் Good Bad Ugly படம் ஓடிக்கொண்டிருக்கும்போது TVK, Tvk இன்று கோஷமிட்ட விஜய் ரசிகர்கள், விஜய் ரசிகர்களை வெளுத்து வாங்கிய அஜித் ரசிகர்கள் #GoodBadUgly #Ajithkumar #TvkVijay #Kerala pic.twitter.com/BjLMRZWOgG— VSV Cinemas (@vsvcinecreation) April 12, 2025

సైఫ్ అలీ ఖాన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం జ్యువెల్ థీఫ్య ది హెయిస్ట్ బిగిన్స్ అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఖరీదైన వజ్రాలను దొంగతనం చేసే వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్ఫిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ బాలీవుడ్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో జైదీప్ అహ్లావత్,కునాల్ కపూర్ రాయ్, వికితా దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. Danger. Deception. Desire. And a diamond that's worth everything 💎🔥Watch Jewel Thief, out 25 April, only on Netflix.#JewelThiefOnNetflix #SaifAliKhan pic.twitter.com/sg58YnJ8oz— Netflix India (@NetflixIndia) April 14, 2025
న్యూస్ పాడ్కాస్ట్

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.
క్రీడలు

రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు.ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. రచిన్ రవీంద్ర(37), షేక్ రషీద్(27) పరుగులతో రాణించారు.లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. దిగ్వేష్, మార్క్రమ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..

ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి ఎదురు తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్ల మొత్తానికి దూరమయ్యాడు. ఆడమ్ జంపా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.గాయం నుంచి కోలుకునేందుకు జంపా తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో జంపా స్దానాన్ని కర్ణాటక ప్లేయర్ స్మరన్ రవిచంద్రన్తో ఎస్ఆర్హెచ్ భర్తీ చేసింది. రూ. 30ల లక్షల కనీస ధరకు రవిచంద్రన్ని సన్రైజర్స్ సొంతం చేసుకుంది. అతడి రిప్లేస్మెంట్ను ఐపీఎల్ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది. 21 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ గతేడాది కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మొత్తం మూడు ఫార్మాట్లలోనూ అద్బుతంగా రాణిస్తున్నాడు. కర్ణాటక తరఫున స్మరన్ 7 ఫస్ట్-క్లాస్, 10 లిస్ట్ A, 6 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) సీజన్లో స్మరన్ అసాధారణ ప్రదర్శన చేశాడు. ఈ కర్ణాటక ఆటగాడు 6 మ్యాచ్ల్లో 34 సగటుతో 170 పరుగులు చేశాడు. స్మరన్కు అద్బుతమైన పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అయితే ఈ ఏడాది మార్చిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మరన్ను ట్రయల్స్కు పిలిచింది. ఎవరైనా గాయపడితే అతడిని జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ భావించింది. కానీ అంతలోనే రవిచంద్రన్ను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.చదవండి: IPL 2025: అక్షర్ పటేల్కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా

పంజాబ్ కింగ్స్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఫెర్గూసన్ మోకాలికి గాయమైంది.అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి ఫెర్గూసన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ కూడా ధృవీకరించాడు. లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.అతడు ప్రస్తుతం జట్టుతో ఉన్నప్పటకి, మిగిలిన టోర్నమెంట్లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని హోప్స్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఫెర్గూసన్ మంచి టచ్లో కన్పించాడు. ఫెర్గూసన్ పంజాబ్ తరపున నాలుగు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.అయితే అతడి స్ధానంలో జేవియర్ బార్ట్లెట్ లేదా అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ కింగ్స్ పర్వాలేదన్పిస్తోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు పంజాబ్ మూడింట గెలుపొందింది.ఐపీఎల్-2025కు పంజాబ్ కింగ్స్ జట్టు..శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, అర్ష్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, నెహాల్ వధేరా, హర్ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్, హర్నూర్ పన్ను, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే.చదవండి: IPL 2025: అక్షర్ పటేల్కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా

IPL 2025: ధోని మెరుపులు.. లక్నోపై సీఎస్కే విజయం
LSG vs CSK Live Updates: సీఎస్కే ఘన విజయంఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు. ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. 18 ఓవర్లకు స్కోర్: 143/518 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(26), ధోని(20) ఉన్నారు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 127/516 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(19), ధోని(9) ఉన్నారు. సీఎస్కే విజయానికి 24 బంతుల్లో 44 పరుగులు కావాలి.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్..జడేజా రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జడేజా.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.రవీంద్ర ఔట్..రచిన్ రవీంద్ర రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. మార్క్రమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.సీఎస్కే తొలి వికెట్ డౌన్..షేక్ రషీద్ రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన షేక్ రషీద్.. అవేష్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర(25), రాహుల్ త్రిపాఠి(5) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సీఎస్కే167 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(22), రచిన్ రవీంద్ర (15) ఉన్నారు.రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?ఎక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..రిషబ్ పంత్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. లక్నో వేదికగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. 55 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.లక్నో మూడో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన మార్ష్.. రవీంద్ర జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(29), బదోని(20) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్..నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పూరన్.. కాంబోజ్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు 42 పరుగులు చేసింది. క్రీజులో పంత్(6), మార్ష్(22) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నో..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నోకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన మార్క్రమ్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్కు డెవాన్ కాన్వే, అశ్విన్ దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో షేక్ రషీద్, ఓవర్టన్ వచ్చారు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ
బిజినెస్

ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. నువ్వా నేనా అన్నట్లుగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ విషయం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు, రెండు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో.. చైనా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను 125 శాతానికి పెంచింది.అమెరికా విధిస్తున్న సుంకాల భారీ నుంచి తప్పించుకోవడం ఎలా అని చాలామంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి ఓ మార్గం కూడా ఉంది. సుంకాల భారీ నుంచి తప్పించుకోవాలంటే.. ఇక స్మగ్లింగ్ చేయాలేమో అనే మీకు రావొచ్చు. అలాంటి సాహసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎలా తప్పించుకోవాలో క్లారిటీగా వెల్లడించే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.చైనా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తే 145 శాతం సుంకాలను కట్టాల్సి ఉంటుంది. ఎగుమతి అంటేనే భారీ మొత్తం. కానీ చైనాలో వస్తువు కొని మనవెంట అమెరికాకు తెచ్చుకుంటే.. దానికి ప్రత్యేకంగా టారిఫ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్ఉదాహరణకు ఒక అమెరికన్.. చైనాలో పర్యటించేటప్పుడు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాటిని తనతో పాటు అతని దేశానికి కూడా తీసుకెళ్లవచ్చు. ఇది పూర్తిగా లీగల్.. పర్సనల్ షాపింగ్ సర్వీస్ కిందికి వస్తుంది. అయితే ఎన్ని వస్తువులు కొనాలి?, ఎన్ని వస్తువులను తనతో పాటు తీసుకెళ్లవచ్చు అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటిస్తే.. మీపై టారిఫ్స్ ప్రభావం ఉండదు. ఇది ఒక్క అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఈ ఫార్ములాతో మీరు ఏ దేశీయులైన.. ఇతర దేశాల్లో వస్తువులను సుంకాలతో పనిలేకుండా హ్యాపీగా కొనేయొచ్చు.China is now providing tariff advice. 🤣 pic.twitter.com/esNxGshMe6— James Wood 武杰士 (@commiepommie) April 13, 2025

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో లేఆప్స్?
ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. 25 శాతం ఉద్యోగులను తగ్గించుకునే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గుంచుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ లేఆప్స్ కార్యక్రమాన్ని చేపట్టనుందని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. దీనిపై సంస్థ అధికారిక ప్రకటన వెలువడలేదు.కంపెనీలోని రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న 50 నుంచి 55 సంవత్సరాల వయసున్న ఉద్యోగులకు కంపెనీ స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేసింది. అంతే కాకుండా వివిధ విభాగాల్లో ఏడాదికి కోటి రూపాయల జీతం పొందుతున్న అనేకమంది ఉద్యోగులను రాజీనామా చేయాలని సంస్థ ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది.

కొత్త క్యాంపెయిన్ ప్రారంభించిన భీమ్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుబంధ సంస్థ ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBSL)కి చెందిన భారతీయ పేమెంట్ యాప్ భీమ్, ‘భారత్ కా అప్నా పేమెంట్స్ యాప్’గా తన స్థానాన్ని పటిష్టం చేసుకునేలా కొత్త బ్రాండ్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. చెల్లింపు విధానాల్లో మార్పులు వచ్చే కొద్దీ.. నగదు విషయాల్లో విశ్వసనీయతకు భారతీయులిచ్చే ప్రాధాన్యతకు నిదర్శనంగా ‘పైసోం కా కదర్’ పేరిట ఈ ప్రచార కార్యక్రమం ఉంటుంది.ఎన్పీసీఐ ప్రారంభించిన ఈ కొత్త కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజల రోజువారీ చెల్లింపు అవసరాలను తీర్చే విధంగా రూపొందింది. ఇది పేమెంట్స్ యాప్గా భీమ్ (BHIM) స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేసే విధంగా ఉంటుంది. టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ డిజైన్ చేసిన ఈ క్యాంపెయిన్లో అయిదు బ్రాండ్ ఫిలింలు ఉంటాయి.యాప్ వినియోగ సౌలభ్యాన్ని తెలియజేసేలా భీమ్ విశ్వసనీయత, భద్రత, కస్టమర్ - ఫస్ట్ విధానాలు, సిసలైన సమ్మిళితత్వానికి సంబంధించిన కీలక విలువలను హైలైట్ చేసేవిగా ఉంటాయి. అందరికీ చేరువయ్యేలా మొత్తం తొమ్మిది భారతీయ భాషల్లో ఈ ఫిలింలు విడుదలవుతాయి.కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండే భీమ్ 3.0ని ఈ క్యాంపెయిన్ ఆవిష్కరిస్తుంది. ఇది 15 కంటే ఎక్కువ భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ అంతగా ఉండని ప్రాంతాల్లోనూ ఇది పని చేస్తుంది. ఖర్చుల విభజన, ఫ్యామిలీ మోడ్, వ్యయాల విశ్లేషణ, యాక్షన్ నీడెడ్ రిమైండర్లు మొదలైన మనీ మేనేజ్మెంట్ సాధనాలు ఇందులో ఉంటాయి.

చైనాలో యాపిల్ ఉత్పత్తికి కారణం ఇదే: టిక్ కుక్
సుంకాల యుద్ధాన్ని ప్రారంభించిన సమయంలో.. అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' యాపిల్ సహా కంపెనీలు తమ ఉత్పత్తులను దేశంలో తయారు చేయాలని కోరుకున్నారు. కానీ నిపుణులు, పరిశ్రమ నాయకులు అమెరికాలో పెద్ద ఎత్తున ఉత్పత్తుల తయారీ సాధ్యం కాదని చెప్పారు.టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ 'టిమ్ కుక్' చైనాను తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ఎందుకు ఎంచుకుంటారనే దానిపై 2024లో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఒక నిమిషం కంటే తక్కువ నిడివి కలిగిన వీడియోలో టిమ్ కుక్.. చైనాలో కార్మికులు తక్కువ ధరకే లభిస్తారు. కార్మిక వ్యయాలు తక్కువగా ఉండటం వల్లనే.. దిగ్గజ కంపెనీలన్నీ చైనాలో ఉత్పత్తులు చేయడానికి ఆసక్తి చూపుతాయి. అంతే కాకుండా నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య కూడా చైనాలో చాల ఎక్కువగా ఉందని చెప్పారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..అమెరికాలో ఉన్న టూలింగ్ ఇంజనీర్లను మొత్తం సమావేశపరిచిన.. ఒక గది నిండదు. అదే చైనాలో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ నిండేంతకంటే ఎక్కువ ఉన్నారని టిమ్ కుక్ వివరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నారు.Tim Cook breaks down why Apple builds in China and why the U.S. isn’t ready to replace it yet.pic.twitter.com/OiEpyIEZlN— Nigel D'Souza (@Nigel__DSouza) April 11, 2025
ఫ్యామిలీ

వైరుద్ధ్య భారతంలో జాతీయవాదమా?
బాబా సాహెబ్ అంబే డ్కర్ ఒక సందర్భంలో గాంధీజీతో జరిపిన సంభా షణలో ‘నాకు మాతృ దేశం లేదు’ అంటారు.అందుకు గాంధీజీ ‘లేదు, మీకు మాతృ దేశం వుంది’ అని బదులిస్తే... ‘మమ్మల్ని కుక్కలు, పందు లకంటే హీనంగా చూసే దేశాన్ని చూసి ఏ అంట రానివాడైనా ఈ దేశం నాది అని ఎలా అనుకో గలడు?’ అని అంబేడ్కర్ పేర్కొనడం విశేషం. భారత్లో ఇటీవలి కాలంలో జాతీయవాదం లేదా దేశభక్తి అనే భావనలు తరచూ వివాదాస్పద చర్చలకు దారితీస్తున్న క్రమంలో అంబేడ్కర్ జాతీ యవాదంపై వెలిబుచ్చిన అభిప్రాయాలను చర్చించడం అవసరం. ఒకవైపు బ్రిటీష్ వలసవాదం అంతమై దేశానికి పాలనాధికారాలు బదిలీ అవుతున్న సందర్భంలో ఆయన జాతీయవాదంపై వ్యక్తపరి చిన అభిప్రాయాలు ఎంతో కీలకమైనవి. బ్రిటిష్ పాలన అంతమొందడంతోనే ఇక్కడి సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయని అంబేడ్కర్తో పాటు అణ గారిన కులాలు భావించకపోవడం గమనార్హం.బ్రిటిష్ వారికంటే ఇక్కడ ప్రత్యక్షంగా తమపై కుల దాష్టీకాన్ని ప్రదర్శించే నల్ల దొరలే తమ ప్రధాన శత్రువులు అనే అవగాహన అణగారిన వర్గాల్లో దేశ వ్యాప్తంగా పెంపొందింది. ఉత్తరాదిన పంజాబ్లో ‘ఆదిధర్మి’ ఉద్యమం, ఒరిస్సాలో ‘మహిమ ధర్మం’, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ రాష్ట్రాలలో ‘ఆది హిందూ’, దక్షిణాదిలో ‘ఆది ద్రావిడ’, ‘ఆది ఆంధ్ర’, ‘ఆది కన్నడ’ వంటి ఉద్య మాలు దళితులు ఈ దేశ మూలవాసులనే ఆత్మ గౌరవ ప్రకటనలు వెలువడుతున్న కాలమది. ఆధి పత్య కులాలకు చెందిన కవి గరిమెళ్ళ సత్యన్నా రాయణ బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకిస్తూ ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే గేయాన్ని రాస్తే... కుసుమ ధర్మన్న అనే దళిత కవి ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అనే గేయాన్ని రాసి స్వరాజ్యం, స్వతంత్రం అనే అంశాలలో దళితుల ఆకాంక్షలను వ్యక్తీక రించడం గమనార్హం. తమిళనాట పండిత అయోతీ దాస్, పెరియార్ల నాయకత్వంలో జరిగిన ఆది ద్రావిడ ఉద్యమం కూడా ఆధిపత్య కులాల జాతీ యోద్యమంలో భాగస్వామి కాకుండా తమదైన స్వతంత్ర ఆకాంక్షలను వ్యక్తపరచడం చూస్తాం.ప్రాంతీయంగా వ్యక్తమవుతున్న అణగారిన కులాల స్వతంత్ర ఆకాంక్షలకు అంబేడ్కర్ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ పెద్ద కాన్వాసు మీద తమ జాతీయవాదం ఏమిటో నిర్మొహ మాటంగా చెబుతూ బ్రాహ్మణ బనియాల జాతీయవాద లొసుగులను దుయ్యబట్టాడు. అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతీయ అస్తి త్వాలు, వాటిమధ్య వైరుద్ధ్యాలు గల భారతదేశం ఒక జాతిగా ఉండే అవకాశం లేదని చెబుతూ ఇక్కడ జాతీయతా భావన ఇంకా సాధించాల్సిన ఆదర్శమేనని పేర్కొన్నారు. ఈ ‘దేశభక్తులు’ ఎంత సేపటికీ తమకూ, తమ వర్గానికీ అధికారం దక్కా లని తాపత్రయ పడుతుంటారని అన్నారు. తన జాతీయవాదం అన్ని రకాల గుత్తాధిపత్యాలనూ తిరస్కరిస్తుందని అన్నాడు.అంబేడ్కర్ జాతీయవాదంపై వెలిబుచ్చిన భావాలకు నేటికీ ప్రాసంగికత ఉంది. ఆయన ఒక సందర్భంలో తన కాలపు దేశ భక్తులను ఉద్దేశించి వీరికి తమ పూర్వీకులు అణగారిన ప్రజలపై సాగించిన దారుణాలపై ఎటువంటి ప్రాయశ్చిత్త ధోరణీ లేకపోగా రాబోయే కాలంలో తమ వారు గతంలో సాగించిన ధోరణినే తిరిగి ప్రదర్శించడానికి వెన కాడబోరు అని పేర్కొన్నారు. అది ఈనాటి దేశ భక్తుల విషయంలో అక్షర సత్యమని తెలుస్తుంది. ఇప్పుడు అణ గారిన కులాలు, ఆది వాసులు, స్త్రీలు, మైనారిటీల పట్ల పెత్తందారీ కులాల వారు సాగించే హత్యలు, అత్యా చారాలు సమస్తమైన దౌర్జన్యాలకు వారు దేశభక్తినీ, దైవ భావ ననూ అడ్డు పెట్టుకోవడం కళ్ళారా చూస్తున్నాం. కుహనా జాతీయవాదుల రెండు నాల్కల ధోర ణిని ఆయన సరిగ్గానే అంచనా వేయడం గమ నార్హం. ఆయన చూపించిన వెలుగు దారిలో సమ కాలీన ప్రజా వ్యతిరేక శక్తుల ఆట కట్టించి సామా జిక, రాజకీయ వైరుద్ధ్యాలను పరిష్కరించుకోవడం మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. ప్రొ. చల్లపల్లి స్వరూపరాణి వ్యాసకర్త ప్రముఖ దళిత కవి, రచయిత్రి

Deomali Hills: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..!
ప్రపంచ పర్యాటక రంగంలో పేరు తెచ్చుకుంటున్న దేవమాలి పర్వత పరిరక్షణకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెడుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన నూతన చిత్రానికి సంబంధించి ఇక్కడ షూటింగ్ చేయడంతో ఈ ప్రాంతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన షూటింగ్ ముగించుకుని వెళ్లిపోతూ ఈ పర్వతంపై పర్యాటకులు చెత్త వదిలి వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఈ పర్వత పరిరక్షణ పై తీవ్రంగా దృష్టి సారించింది. రాత్రిపూట రాకపోకలు నిషేధం దేవమాలి పర్వతం మీద సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకే గుడారాలు వేసి రాత్రి బస చేస్తుంటారు. దీంతో రాత్రి ఇక్కడ పర్యవేక్షణ ఉండేది కాదు. ఈ క్యాంప్ ఫైర్ల వల్ల ఔషధ మొక్కలు కాలిపోయేవి. విందు వినోదాల కారణంగా చెత్త పేరుకుపోయేది. అందుకే రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు దేవమాలిపై పర్యాటకులు ఉండకూడదని నిషేధం విధించారు. 2023 నాటి భారతీయ నాగరిక సురక్ష సంహిత 163 ప్రకారం,1986 నాటి పర్యవరణ పరిరక్షణ చట్టం 15 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశారు. వ్యర్థాలపై కఠిన చర్యలు దేవమాలిపైకి వచ్చే పర్యాటకులు తాము తెచ్చే వ్యర్థాలు తామే తిరిగి తీసుకొని వెళ్లేటట్లు సంచులు తెచ్చుకోవాలని రాజమౌళి సూచించారు. దాన్నే ప్రభుత్వం కఠిన నిబంధనగా మార్చింది. ఇకపై పర్యాటకులు అక్కడ వ్యర్థాలు వదల రాదని, తిరిగి తీసుకొని వెళ్లడానికి సంచులు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు పైకి తీసుకురావద్దని హెచ్చరించింది. అధికారుల పర్యటనలు కొరాపుట్ కలెక్టర్ వీ.కీర్తి వాసన్ ఆదివారం దేవమాలి పర్వతంపై ఉన్నత స్థాయి అధికారులతో పర్యటించారు. రక్షణ చర్యల పై ఎస్పీ రోహిత్ వర్మ కూడా వెళ్లారు. ఇదే సమయంలో సీఎల్పీ నాయకుడు రామచంద్ర ఖడం కూడా అదే సమయంలో తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా అక్కడకే వెళ్లారు. వీరంతా అనుకోకుండా కలుసుకోవడంతో అక్కడే సమావేశమయ్యారు. దేవమాలి పై భారీ ఎత్తున పర్యాటక సదుపాయాలు కల్పించడానికి కలెక్టర్ సమీక్ష చేశారు. (చదవండి: ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం..)

Sharmila Tagore: కీమోథెరపీ చేయంచుకోకుండానే కేన్సర్ని ఓడించారామె..!
బాలీవుడ్ దిగ్గజ నటి షర్మిలా ఠాగూర్కి ఊపిరితిత్తుల కేన్సర్ నిర్థారణ అయ్యినట్లు ఓ ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ కేన్సర్ని కీమోథెరఫీ వంటి చికిత్సలతోనే పనిలేకుండానే సునాయాసంగా ఓడించారు. ఇప్పుడామె పూర్తిగా కోలుకున్నారు కూడా. ఆ విషయాన్ని కూతురు నటి సోహా అలీ ఖాన్ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ముందుగానే ఆ వ్యాధిని గుర్తించడంతోనే తన తల్లి సురక్షితంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలిగారని అన్నారు. ఆ సమయంలో మా కుటుంబం పడిన బాధ అంతఇంతగాదంటూ నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారామె. అందరూ తనతల్లిలా బాధకరమైన చికిత్సల జోలికిపోకుండానే సులభంగా ఈ కేన్సర్ని జయించడం ఎలాగో కూడా వివరించారు. అదెలాగా చూద్దామా..!.సోహా తన యూట్యూబ్ ఛానెల్లో నయన్దీప్ రక్షిత్కి ఇచ్చిన ఇంటర్వ్వ్యూలో తన ఫ్యామిలీ ఫేస్ చేసిన క్లిష్ట సమయాన్ని పంచుకున్నారు. నిజానికి ఒక వ్యాధి నిర్థారణ యావత్తు కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేస్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. ఆ సమయం తామెంతో ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. అయితే దేవుడి దయ వల్ల తన తల్లి ఆరోగ్య పరిస్థతి మరింత క్షీణించక మునుపే గుర్తించగలిగాం. చెప్పాలంటే కేన్సర్ స్టేజ్ జీరోలో ఉండగానే గుర్తించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంకా ఆమె శరీరంలో కేన్సర్ వ్యాపించని దశ. అందువల్ల ఆమెకు కీమోథెరపీ లేదా రేడియేషన్ వంటి అదనపు చికిత్సలు లేకుండానే శస్త్ర చికిత్సతో ద్వారా నయం చేశారు. ఊపిరితిత్తుల కేన్సర్ని ముందుగానే ఎలా గుర్తించొచ్చంటే..ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ సంబంధిత మరణాలలో ఊపిరితిత్తుల కేన్సర్ కూడా ఒకట. ఇది ముందస్తు హెచ్చిరికలతో మన శరీరాన్ని అప్రమత్తం చేస్తుందట. అవేంటంటే..సాధారణ కార్యకలాపాల సమయంలో శ్వాస ఆడకపోవడం లేదా ఊపిరి ఆడకపోవడం.ఛాతీ నొప్పి లోతైన శ్వాస లేదా తీవ్రమైన దగ్గుబరువు తగ్గిపోవడంరక్తం లేదా తుప్పు రంగు కఫం దగ్గుబ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లునిజానికి ఇవన్నీ చూడటానికి సాధారణ వైద్య పరిస్థితులే. అవి తరుచుగా కొనసాగి..ఆందోళనకు గురిచేస్తే తక్కణమే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. అలాకాకుండా ధూమపానం లేదా సెకండ్హ్యాండ్ పొగకు గురైన చరిత్ర కలిగినవారు క్రమంతప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ అలవాట్లతో ప్రమాదాన్ని నివారించొచ్చు..ధూమపానానికి దూరంగా ఉండటంపొగ పీల్చే వ్యక్తులకు దూరంగా ఉండటంఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడంవ్యాయామం చేయడంఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.(చదవండి: సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!)

మండే ఎండల్లో..మంటలతో జాగ్రత్త..! అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లాలో రోజురోజుకు ఎండతీవ్రత పెరిగిపోతోంది. అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్న సమయమిది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అగ్నిప్రమాదాల బారి నుంచి తమను, తమతో పాటు చుట్టు ఉన్న సమాజాన్ని కాపాడుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. ప్రజలకు అవగాహన కల్పించేందుకే సోమవారం నుంచి ఈ నెల 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఎలా స్పందించాలి.. నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి.. అసలు అగ్ని ప్రమాద శాఖ సిబ్బంది తదితర వివరాలతో ప్రత్యేక కథనం. వేసవికాలంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అప్రమత్తంగా ఉన్నా కొన్ని సమయాలలో ప్రాణనష్టంతో పాటు, ఆస్తినష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పైగా ప్రమాదాలను నివారించే అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత వేధిస్తుండడం కలవరపరిచే అంశం. అరకొర సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. లీడింగ్ ఫైర్మెన్లు, ఫైర్మెన్లు, డ్రైవర్ కమ్ ఆపరేటర్లు, సిబ్బంది కొరతతో అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో ఇబ్బంది పడుతున్నారు. ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు గాను ఇద్దరే ఉన్నారు. ఇక స్టేషన్ ఫైర్ ఆఫీసరు రెండు స్టేషన్లలో లేకపోవడంతో ఇన్చార్జి లీడింగ్ పైర్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ కమ్ ఆపరేటర్ 31 మందికిగాను ప్రస్తుతం 26 మంది విధులు నిర్వహిస్తున్నారు. 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పైర్మెన్ 102 మంది ఉండాల్సి ఉండగా కేవ లం 42 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నా రు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 211 మందికి గాను 142 మందే పనిచేస్తున్నారు. దీంతో జిల్లాలో ఒకేసారి రెండుమూడు చోట్ల ప్రమాదాలు జరిగితే నష్టనివారణ చేయడం వీరికి కష్టసాధ్యంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా 30 మంది హోంగార్డులతోనే విధులు నిర్వహిస్తున్నారు. ముద్దనూరుకు ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాలో 8 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పాత భవనాలు కలిగి ఉన్న కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో నూతన భవనాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ముద్దనూరులో ఫైర్ స్టేషను’ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపడంతో ప్రభు త్వం ఆమోదం తెలిపింది. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు..జిల్లాలోని అన్ని అగ్నిమాపక కేంద్రాల పరిధిల్లో 14 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. కడప ఫైర్ స్టేషన్లో ఉదయం 10 గంటలకు ఈ వారోత్సవాలను ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది అగ్నిమాపక శాఖ వారు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ‘అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. అలాగే అవకాశం ఉన్నపుడల్లా... స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, కడప నగర శివార్లలోని ఐఓసి గ్యాస్ ప్లాంట్, కర్మాగారాలలో అగి్నమాపక అధికారులు విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. సిద్ధంగా ఉన్నాం ఎటువంటి అగ్ని ప్రమాదాలు, విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వాహనాలకు చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ మరమ్మతులు చేయించా ం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ హోంగార్డుల కు కూడా రెస్క్యూ ఆపరేషన్పై శిక్షణ ఇచ్చాం –ధర్మారావు, జిల్లా అగి్నమాపక శాఖ అధికారి అగ్ని ప్రమాదాల నివారణపై పాటించాల్సిన నియమాలు 👉: ఇంట్లోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు,లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు. 👉: కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా అజాగ్రత్తగా పారవేయరాదు. 👉: ఐ.ఎస్.ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగించాలి. 👉: పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్లోడ్ వేయకూడదు. ఎలక్ట్రికల్ సాకెట్ నందు దాని కెపాసిటీకి తగిన ప్లగ్ను మాత్రమే వాడాలి. 👉: ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులకు బయటకు వెళ్లునపుడు ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయడం ఉత్తమం. 👉: ప్రమాదవశాత్తు అగి్నప్రమాదం జరిగితే ఆర్పటానికి ఎళ్లవేళలా నీటిని ఇంట్లో నిల్వ చేయాలి. 👉: గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ వాల్్వను ఆపివేయాలి. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్లు ఆన్/ఆఫ్ చేయరాదు. 👉: స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్లలో ఆర్సిసి లేదా కాంక్రీట్ శ్లాబులను మాత్రమే పైకప్పుగా వాడాలి. 👉: ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు ఉపయోగించాలి. 👉: గోడౌన్లలో వస్తువులను నిల్వ ఉంచేటపుడు స్టాక్లకు మధ్య ఖాళీస్థలం ఉంచాలి. 👉: గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేసి, వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. 👉: కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్నిప్రదేశాలు గుర్తించేలా చేయాలి. వారికి బేసిక్ ఫైర్ ఫైటింగ్పై శిక్షణ ఇవ్వాలి. 👉: విద్యుత్ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి. 👉: పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోడౌన్లలో వాహనదారులు, బంక్ల యందు డీజల్గాని, పెట్రోల్గాని నింపుకొన్నపుడు వాహనం ఇంజను పూర్తిగా ఆఫ్ చేయాలి. వాహనదారులు ఇంధన నింపుకున్న తరువాత కొద్ది దూరం వెళ్లిన తరువాత బండి స్టార్ట్ చేయాలి. వాహనదారులు గాని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిగానీ పెట్రోల్ బంక్ ఉన్న ప్రదేశంలో బీడీగాని, సిగరెట్గాని కాల్పరాదు. సెల్ఫోన్ ద్వారా సంభాషించరాదు. నీటివసతి అందుబాటులో ఉండాలి. (చదవండి: పర్యావరణ స్పృహతో రైతు సృష్టిస్తున్న అద్భుతం..! దాంతో ఇన్ని ఆరోగ్యప్రయోజనాలా..!)
ఫొటోలు


గరుడ పక్షి రాకతో వైభవోపేతంగా రఘునాయకుని కల్యాణోత్సవం (ఫొటోలు)


నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)


తమన్నా ‘ఓదెల 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


'టీచ్ ఫర్ ఛేంజ్' సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మెరిసిన తారలు (ఫోటోలు)


రెండో తరగతిలోనే ప్రధానికి లేఖ.. ఆ స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా? (ఫోటోలు)


గైక్వాడ్ రాజు దగ్గర విజయ్ మాల్యా కారు - ఫోటోలు


మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' చిత్రం నుంచి మొదటి గీతం 'తు మేరా లవర్' విడుదల


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ (ఫోటోలు)


సింహాచలం : దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా? (ఫొటోలు)


హైదరాబాద్ : జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
అంతర్జాతీయం

వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు
బ్రస్సెల్స్: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు.. పీఎన్బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. Fugitive diamond trader Mehul Choksi, who is wanted in connection with the Rs 13,500-crore Punjab National Bank (PNB) loan fraud case, has been arrested by the police in Belgium, according to a report. The 65-year-old was taken into custody on Saturday (April 12) at the request… pic.twitter.com/xQlq2T3E0C— News9 (@News9Tweets) April 14, 2025

చిందేసిన ట్రంప్..!
మియామి: వలసదారుల బహిష్కరణలు, సుంకాలతో హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కాస్త రిలాక్సయ్యారు. తన బృందంలో కీలక సభ్యులైన ఎలాన్ మస్క్, తులసీ గబార్డ్ తదితరులతో కలిసి ఫ్లోరిడాలోని మియామిలో అలి్టమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని తిలకించారు. అభిమానులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేసి, పిడికిలి బిగించి ఉత్సాహపరిచారు. పూర్తిగా ఫిట్ 78 ఏళ్ల ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసే సామర్ధ్యం ఆయనకుందని పేర్కొన్నారు. శుక్రవారం ట్రంప్కు జరిపిన సాధారణ వైద్య పరీక్షల ఫలితాలను వైట్హౌస్ విడుదల చేసింది. ‘2020లో అధ్యక్షుడిగా ఉండగా చివరిసారిగా జరిపిన పరీక్షల్లో ట్రంప్ 110.677 కిలోలుండగా ఇప్పుడు 9 కిలోలు తగ్గారు. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గాయి. అధ్యక్షుడిగా రోజూ సమావేశాలు, సభల్లో భేటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ గోల్ఫ్ పోటీలో విజేతగా నిలిచారు కూడా. ఆరోగ్యవంతుల్లో కొలెస్టరాల్ స్థాయి 200కు మించరాదు. బీపీ మాత్రం కాస్త ఎక్కువ (128/74)గా ఉంది. హృదయ స్పందన రేటు గతంలో మాదిరిగా 62గానే ఉంది. గుండెపోటు రిస్్కను నివారించేందుకు ట్రంప్ నిత్యం ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు’’ అని పేర్కొంది. Trump Dance at UFC 314 🇺🇸 pic.twitter.com/Ud01BkHp8M— Margo Martin (@MargoMartin47) April 13, 2025

హసీనాకు మరో అరెస్ట్ వారెంట్
ఢాకా: అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఆదివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమె సోదరి షేక్ రెహానా, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా మరో 50 మంది పేర్లు పొందుపరిచింది. అధికార దుర్వినియోగంతో పుర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో 10 అంతస్తుల స్థలాన్ని కొనుగోలు చేశారంటూ జనవరి 13న రెహానాపై ఏసీసీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హసీనా, రెహానా కుమార్తె బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా 15 మందిని నిందితులుగా చేర్చారు. మరో 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీసీ మార్చి 10న సమర్పించిన తుది చార్జిషీట్లోలో మరో 18 మంది పేర్లు చేర్చింది. మూడు వేర్వేరు ఛార్జిషీట్లను పరిశీలించిన అనంతరం ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి జాకీర్ హుస్సేన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు ఉత్తర్వుల అమలుపై నివేదికలను సమీక్షించడానికి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు. రజుక్ ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన మరో అవినీతి కేసులో హసీనా, ఆమె కుమార్తె సైమా వజీద్ పుతుల్, మరో 17 మందిపై ఏప్రిల్ 10న ఇదే కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పుతుల్ 2023 నవంబర్ 1 నుంచి న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. హసీనాపై సామూహిక హత్యలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, బలవంతపు అదృశ్యాలు వంటి అనేక అభియోగాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆగస్టు 5న తిరుగుబాటు అనంతరం తన ప్రభుత్వం కూలిపోవడంతో, 77 ఏళ్ల హసీనా అప్పటి నుంచి భారత్లోనే ఉంటున్నారు.

ప్రొఫెసర్ చింపాంజీలు!
చింపాంజీలను మన పూర్వీకులుగా చెబుతారు. అదెంత నిజమో గానీ మనిషిలాగే వాటికి కూడా భౌతిక శాస్త్ర సూత్రాలు బాగానే వంటబట్టాయని తాజా అధ్యయనంలో తేలింది. కడుపు నింపుకునేందుకు చెద పురుగులను తినడం చింపాంజీలకు అలవాటు. ఎర్రమట్టిలో, మెత్తటి నేలలు, మట్టి దిబ్బల్లో చెదపురుగులను చేత్తో ఏరకుండా, బొరియల్లో చెదలను ఒంపులు తిరిగిన కర్ర పుల్లలతో ఒడుపుగా పట్టుకోవడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అందుకోసం కనిపించిన కర్రపుల్లనల్లా వాడేయకుండా తమకు చక్కగా పనికొచ్చే పుల్లను మాత్రమే వేటకు వినియోగిస్తాయట. దాంతో, ఏ పుల్ల బాగా అక్కరకొస్తుందన్నది చింపాంజీలు ఎలా కనిపెడతాయో తెల్సుకోవాలనే జిజ్ఞాస పరిశోధకుల్లో ఎక్కువైంది. భౌతికశాస్త్రంపై వాటికి పట్టు ఎలా చిక్కిందనే అంశంపై పరిశోధన మొదలెట్టారు. వాటిలోనూ అభిజ్ఞాన వికాసం ఎక్కువేనని అందులో తేలింది. ఈ వివరాలు ఐసైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. గట్టిగా ఉండే పుల్లలకు బదులు స్ప్రింగ్లాగా ఒంగిపోయే లక్షణమున్న కాస్తంత గట్టి పుల్లలతో వేట సులభమవుతుందని చింపాంజీలు గ్రహించాయని, ఇవి వాటిలోని సహజ సంగ్రహణ సామర్థ్యం వల్లే సాధ్యమైందని పరిశోధకులు చెబుతున్నారు. మట్టిదిబ్బల్లో మహా ఒడుపుగా మట్టిదిబ్బల్లో ఇబ్బడిముబ్బడిగా చెదపురుగులు ఉంటాయి. చైనా వాళ్లు నూడుల్స్ను ఎలాగైతే తెల్లని సన్నని చిన్న కర్రపుల్లతో తింటారో అచ్చం అలాగే చింపాంజీలు చెదపురుగులను పుల్లలకు అంటుకునేలా చేసి ఆబగా ఆరగిస్తాయి. అలాగే అలా తినాలంటే వాటికి సహజసిద్ధ పుల్లలు కావాలి. మట్టిదిబ్బ బురద బొరియలో ఒకసారి లోపలికి దూర్చాక బయటకు తీస్తే మట్టి బరువుకు పుల్ల విరిగిపోవచ్చు. మెత్తడి పుల్ల తీసుకుంటే మట్టి తడికి మెత్తబడిపోతుంది. అలాగని గట్టి పుల్ల తీసుకుంటే గట్టిగా లాగితే విరిగిపోతుంది. దీంతో మెత్తబడని, సులువుగా ఒంగిపోయే బలమైన పుల్ల అవసరం చింపాంజీలకు ఏర్పడింది. బిరుసుగా ఉండే కర్రపుల్లకు బదులు బురద బొరియల్లో అలవోకగా ఒంగుతూ దూరిపోయే ఫ్లెక్సిబుల్ పుల్లతోనే పని సులువు అవుతుందని చింపాంజీలు కనిపెట్టాయని పరిశోధనల్లో ముఖ్య రచయిత అలెజాండ్రా పాస్కల్ గరిడో చెప్పారు. ‘‘ దగ్గర్లోని ప్రతి పుల్లను అవి మొదట సరిచూస్తాయి. మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, వంచేస్తే విరుగుతుందా, ఎంత కోణం వరకు విరగకుండా వంగగలదు? ఇలాంటి టెస్ట్లన్నింటినీ పుల్లలపై చేస్తాయి. అన్ని టెస్టుల్లో పాసైన పుల్లనే చెదపురుగుల వేటకు వినియోగిస్తాయి. టాంజానియా దేశంలోని గాంబే నేషనల్ పార్క్లోని చింపాంజీల వేట విధానాలపై ఈ పరిశోధన చేశారు. అడవిలో భిన్న రకాల చెట్ల నుంచి ఒకతరహా పుల్లలు వస్తున్నప్పటికీ కొత్త జాతుల చెట్ల పుల్లలనే చింపాంజీలు వినియోగిస్తుండటం విశేషం. చింపాంజీలు నివసించే ప్రదేశాల్లో వేర్వేరు రకాల పుల్లలు ఉన్నప్పటికీ ఏకంగా 175 శాతం ఎక్కువగా ఒంగిపోయే సామర్థ్యమున్న పుల్లలనే చింపాంజీలు ఎంపికచేసి వాడుతున్నాయి. ఒకే జాతి చెట్ల పుల్లల్లో ఒంగిపోయే గుణమున్నా, ఎక్కువ ఒంగే లక్షణమున్న ఉపజాతి చెట్ల పుల్లలనే అవి కనిపెట్టి వాడుతుండటం చూస్తుంటే వీటిని నిజంగా ఫిజిక్స్ మీద మంచి పట్టు ఉన్నట్లు చెప్పొచ్చు’’ అని పాస్కల్ వ్యాఖ్యానించారు. ‘‘ ఒంగే పుల్లల్లోనూ ఏది ప్రస్తుతం వాడేందుకు అనువుగా ఉంది అనే అంశాన్ని తీరా వేట మొదలెట్టేటప్పుడూ పరీక్షించి చూస్తున్నాయి. తోటి చింపాంజీ ఏ రకం పుల్లను వాడుతోంది? అది పుల్లను ఎలా వినియోగిస్తోంది? వేట ఫలితం బాగుందా? అనే వాటినీ పక్కక ఉన్న మరో చింపాంజీ గమనిస్తుంది. మానవుల పూర్వీకులు సైతం ఇలాగే సమష్టిగా వేటాడుతూ వనోత్పత్తులను తమ వేటకు ఉపకరణాలుగా వాడుకునేవారు. ఇలాగే చెక్క సంబంధ వస్తువుల వినియోగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయి’’ అని పాస్కల్ వ్యాఖ్యానించారు. ‘‘ చింపాంజీలపై చేసిన ఈ పరిశోధన వాటికి ఏ పుల్ల అనువుగా ఉంది, అందుబాటులో ఉంది అనేది మాత్రమే కాదు వాటి అభిజ్ఞానవికాస స్థాయినీ తెలియజేస్తోంది. మన ఇంజనీరింగ్ సామర్థ్యాలు వేల సంవత్సరాల క్రితమే పరిణామ క్రమంలో మనలో ఇమిడిపోయాయనడానికి ఇదొక తార్కాణం. ఆదిమ మానవుల కాలం నుంచే అనాదిగా మనిషిలో ఇలా మేధాశక్తి పరంపరగా వస్తోంది’’ అని ఆయన అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు135వ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ హర్యానా రాష్ట్రం, యమునా నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పాలనని ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో ప్రజల ఆందోళనతో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్ భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదంప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చింది. ఈ తరుణంలో కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ స్పందించారు.
PM Modi Targets Congress Over Waqf Act
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ హర్యానాలో పలు అభివృద్ది పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ కాంగ్రెస్పై ఆరోపణల దాడి చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టంపై తమ వైఖరి వెల్లడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మతవాదులను సంతృప్తి పరచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందన్నారు.

మతవాదులను సంతృప్తి పరిచిన కాంగ్రెస్: ప్రధాని మోదీ
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ హర్యానాలో పలు అభివృద్ది పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ(Prime Minister Modi) కాంగ్రెస్పై ఆరోపణల దాడి చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టంపై తమ వైఖరి వెల్లడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మతవాదులను సంతృప్తి పరచిందని ప్రధాని మోదీ ఆరోపించారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మతవాదులను సంతృప్తి పరచిందనడానికి వక్ఫ్ చట్టమే రుజువు అని అన్నారు. లక్షల హెక్టార్ల భూమిని వక్ఫ్ పేరుతో దక్కించుకున్నారని, వీటితో పేద ముస్లింలు ఏనాడూ ప్రయోజనం పొందలేదని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ లాభపడింది భూ మాఫియానే అని అన్నారు. ఈ దోపిడీ ఇకపై కొత్త చట్టంతో ఆగిపోతుందని, సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు(Waqf Board) ఏ ఆదివాసీ భూమినీ క్లెయిమ్ చేయలేదని అన్నారు. ఇదే నిజమైన సామాజిక న్యాయమని, దీంతో పేద ముస్లింలు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. డాక్టర్ అంబేద్కర్ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం ఇవ్వాలని కలలు కన్నారని, కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్ను వ్యాప్తి చేసి, అంబేదర్కర్ దార్శనికతకు అడ్డుకట్ట వేసిందని ప్రధాని పేర్కొన్నారు. వారు అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా అతనిని అవమానించారని, ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారని, ఆయన వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నదని, ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఇప్పుడు లౌకిక పౌర కోడ్ అమలులో ఉందని, కాంగ్రెస్ ఇప్పటికీ దానిని వ్యతిరేకిస్తున్నదని ప్రధాని ఆరోపించారు.ప్రధాని వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలపై తమ పార్టీ ట్రాక్ రికార్డ్ను సమర్థించుకుంటూ, బీజేపీ చారిత్రక వంచనకు పాల్పడిందని ఆరోపించారు. ఇలాంటివారు అప్పట్లో బాబా సాహెబ్కు శత్రువులని, నేటికీ అలాగే ఉన్నారన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు ఆయన అంటరానివాడిగా మారారని వారు ఆరోపించారని ఖర్గే పేర్కొన్నారు. నాడు ఆయనను హిందూ మహాసభ వ్యతిరేకించిందని అన్నారు. మహిళా చట్టంలో రిజర్వేషన్ కల్పించి, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను ఖర్గే గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. ఇటువంటి విషాద ఘటనలు దేశంలో గతంలోనూ చోటుచేసుకున్నాయి. బాణసంచా తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో భారత్లో చోటుచేసుకున్న 10 భారీ అగ్ని ప్రమాదాలివే..1. దబ్వాలి, హర్యానా 1995, డిసెంబర్ 24న హర్యానాలోని దబ్వాలిలో డీఏవీ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెదురు బొంగుల వేదికపై అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 400 మంది మృతిచెందారు. 160 మంది గాయపడ్డారు.2. బరిపద, ఒడిశా 1997, ఫిబ్రవరి 23న ఒడిశాలోని బరిపదలో ఒక మతపరమైన సమావేశంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 176 మంది మరణించారు. ఇది ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.3. ఉపహార్, ఢిల్లీ 1997 జూన్ 13న ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 60 మంది మరణించారు. 103 మంది గాయపడ్డారు. థియేటర్లో సరైన ఎగ్జిట్ ద్వారాలు లేకపోవడం, భద్రతా నిబంధనలను పాటించకపోవడం ప్రమాద తీవ్రతను మరింతగా పెంచాయి.4. కుంభకోణం, తమిళనాడు 2004,జూలై 16న తమిళనాడులోని కుంభకోణంలో ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల అగ్ని అంతటా వేగంగా వ్యాపించింది. ఈ ఘటనలో 94 మంది పాఠశాల విద్యార్థులు మృతిచెందారు.5. శ్రీరంగం, తమిళనాడు 2004, జనవరి 23న తమిళనాడులోని శ్రీరంగంలో గల పద్మప్రియ మ్యారేజ్ హాల్లో వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వీడియో కెమెరాకు సంబంధించిన ఎలక్ట్రిక్ వైర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 57 మంది అతిథులతో పాటు వరుడు కూడా మృతి చెందాడు..6. మీరట్, ఉత్తరప్రదేశ్ 2006, ఏప్రిల్ 10న ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నిర్వహించిన ‘బ్రాండ్ ఇండియా’ కన్స్యూమర్ గూడ్స్ ఫెయిర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 65 మంది మృతిచెందారు. 150 మందికి పైగా జనం గాయపడ్డారు.7. జైపూర్, రాజస్థాన్ 2009 అక్టోబర్ 29న రాజస్థాన్లోని జైపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయిల్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు ట్యాంకుల మధ్య ఇంధన బదిలీ సమయంలో సుమారు 1,000 టన్నుల పెట్రోల్ లీక్ అయి, ఆవిరి మేఘం ఏర్పడి పేలుడుకు దారితీసింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు. ఈ ఘటన తరువాత ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.8. కోల్కతా, పశ్చిమ బెంగాల్ 2010, మార్చి 21న కోల్కతాలోని పార్క్ స్ట్రీట్లో ఉన్న చారిత్రాత్మక స్టీఫెన్ కోర్ట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 43 మంది మృతిచెందారు. భవనంలో అగ్ని రక్షణ వ్యవస్థలు లేకపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం ఏర్పడింది.9. కోల్కతా, పశ్చిమ బెంగాల్ 2011 డిసెంబర్ 9న కోల్కతాలోని ధాకూరియాలోని ఎఎంఆర్ఐ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. బేస్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మండే పదార్థాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో ఊపిరాడక 105 మంది మృతిచెందారు.10. పరవూర్ , కేరళ 2016, ఏప్రిల్ 10న కేరళలోని కొల్లం జిల్లాలోగల పరవూర్ పుట్టింగల్ దేవీ ఆలయంలో మీన-భరణి ఉత్సవం ముగింపు సందర్భంగా బాణసంచా పేలుడు కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 114 మంది మృతిచెందారు. దాదాపు 400 మంది గాయపడ్డారు. ఇది కేరళలో జరిగిన అత్యంత ఘోరమైన బాణసంచా పేలుడు ప్రమాదంగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘నాడు 74.. నేడు 150’.. హిసార్- అయోధ్య విమాన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
ఎన్ఆర్ఐ

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అబుదాబిలో ఘనంగా ఉగాది వేడుకలు..
సనాతనం, సత్సంబంధం, సంఘటితం, సహకారం, సత్సంగం వంటి పంచ ప్రామాణికాలతో ప్రారంభించబడిన యు.ఏ.ఈ లోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్వ్యర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నారుప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ష సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆద్యంతం చక్కటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాజధాని అబుదాబిలో కన్నుల పండుగగా జరిగింది. దీపారాధన, విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారిచే పంచాంగ పఠనం, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల, సంగీత గురువులు రాగ మయూరి, ఇందిరా కొప్పర్తి గార్లు తమ శిష్య బృందంతో సంగీత, నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస మూర్తి గారు లాస్య వల్లరి, శివ తాండవ స్తోత్రం, ప్రముఖ తెలుగు కవులు ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి ఆర్ధ్వర్యంలో, శ్రీలక్ష్మి చావలి, వెంపటి సతీష్ల కవి సమ్మేళనం, భగవద్గీత, అన్నమాచర్య, రామదాసు కీర్తనలు, సుభాషితాలు, సాహిత్య కార్యక్రమాలతో గాయత్రీ కుటుంబానికి సంబంధించిన చిన్నారులు, పెద్దలు తమ అద్భుతమైన ప్రతిభతో పూర్తి తెలుగింటి సంప్రదాయాన్ని కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ రసజ్ఞులను సమ్మోహితులను చేశారు .ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి ఉషా బాల కౌతా గారు అందర్నీ ఆకట్టుకున్నారు. ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గాయత్రీ కుటుంబం ప్రధాన ఉద్దేశ్యాల గురించి వివరిస్తూ.. స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కుటుంబం అండదండగా నిలుస్తోంది. వారికి విద్య, వైద్య , వివాహం వంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకూ గాయత్రి కుటుంబ సభ్యులు సుమారు కోటిన్నర రూపాయల వరకు సహాయం అందించారని, భవిష్యత్తులో బ్రాహ్మణ సంక్షేమానికి మరింత సహకారం అందిస్తామని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు గాయత్రీ కుటుంబం సమైక్యతను అభినందిస్తూ..ఈ సమూహం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే "ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశ సంస్కృతిని గౌరవిస్తూనే బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. బ్రాహ్మణులు ధర్మ జీవనం, ధర్మ పరిరక్షణ వదిలిపెట్టవద్దని, ఎల్లప్పుడూ జ్ఞానార్జన చేస్తూ.. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నారు. పట్టుదల, దీక్ష, తపస్సు, సహనం, నియమ నిష్ఠలతో నిత్యం గాయత్రీదేవిని ఆరాధించి, బ్రాహ్మణత్వాన్ని పొందాలి అని పిలుపునిచ్చారుఈ మొత్తం కార్యక్రమానికి సంపంగి గ్రూపు పూర్తి సహకారాన్ని అందించినందుకు నిర్వాహకులు ఆ గ్రూపు పెద్దలను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి, తిరుమల శ్రీవారి తీర్ధ ప్రసాదాలతో పాటు, అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గాయత్రీ కార్యకారిణీ బృందం రాయసం శ్రీనివాసరావు, మోహన్ ముసునూరి, గడియారం శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ, వంశీ చాళ్లురి, రమేష్ సమర్ధవంతంగా నిర్వహించింది. (చదవండి: Ugadi 2025: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు..)

Ugadi 2025 సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.
క్రైమ్

మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. యువతి అనుమానాస్పద మృతి!
చిత్తూరు: చిత్తూరులోని మసీదు మిట్టలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. అయితే అది పరువు హత్య అని భర్త సాయి తేజ్ ఆరోపిస్తున్నాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతోనే చంపేశారని భర్త అంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం యాస్మిన్ భాను, సాయి తేజ్ లు పెళ్లి చేసుకున్నారు. పూతలపట్టు మండలంకు చెందిన సాయి తేజ్ నాలుగేళ్లగా యాస్మిన్ భానుతో ప్రేమలో ఉన్నాడు. వీరు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అనంతంర ఫిబ్రవరి 13వ తేదీన తమకు రక్షణ కావాలంటూ తిరుపతి ముత్యాలరెడ్డి పలి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. అప్పట్నుంచీ యాస్మిన్ భానును ఫోన్ లో సంప్రదిస్తున్నారు తల్లిదండ్రులు.ఇదిలా ఉంటే, యాస్మిన్ భాను తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని తమ కూతుర్ని ఒకసారి పంపించాలని సాయి తేజ్ ను కోరారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 11 గంటలకు యాస్మిన్ భానును చిత్తూరు తీసుకు రాగా, అక్కడ నుంచి ఇంటికి కారులో తీసుకెళ్లాడు యాస్మిన్ సోదరుడు లాలు. అయితే యాస్మిన్ భాను పుట్టింట్లో చనిపోయింది. ఈ విషయం సాయి తేజ్ కు తెలియడంతో ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
విశాఖపట్నం,సాక్షి: విశాఖలో (Visakhapatnam) దారుణం జరిగింది. మరో 24 గంటల్లో ప్రసవం కావాల్సిన భార్యను భర్తే గొంతు నులిమి చంపాడు. తప్పించుకునేందుకు పథకం వేశాడు. ఆపై దారుణానికి ఒడిగట్టింది తానేనని నిజం ఒప్పుకున్నాడు పోలీసుల సమాచారం మేరకు.. పీఎం పాలెం ఉడా కాలనీలో జ్ఞానేశ్వర్, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వారిది ప్రేమ వివాహం. జ్ఞానేశ్వర్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ను నిర్వహిస్తుండగా.. భార్య అనుష గర్భవతి. మంగళవారమే డెలివరీ కావాల్సి ఉంది. ఈ తరుణంలో సోమవారం ఉదయం అనూషకు ఆరోగ్యం బాగోలేదని జ్ఞానేశ్వర్ ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా ఉన్న అనూషను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. భర్త జ్ఞానేశ్వర్ తీరుపై పోలీసులు అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో తనకు, తన భార్య అనుషకు మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో భార్య అనుషను గొంతు నులిమి హత్య చేసినట్లు భర్త జ్ఞానేశ్వర్ పీఎం పాలెం పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
చిత్తూరు: ఉపాధ్యాయ దంపతులు నూతన కారు కొనుగోలు చేశారు.. అదే సమయంలో కుమారై ఇంటర్లో అధిక మార్కులు సాధించడంతో సంతోషంగా తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగీ ఇంటికి వెళ్లే సమయంలో తీర్థయాత్ర అంతిమ యాత్రగా మారింది. ఓ లారీ మృత్యువు రూపంలో వచ్చి ఆ సంతోషాన్ని క్షణాల్లో చిదిమేయడంతో తల్లి మృతి చెందగా భర్త , కుమారై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషాదకర సంఘటన ఆదివారం జరిగింది. దీంతో మూడు జిల్లాల్లో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తి జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉన్న వెంకటరమణ (48) , శారద (45) ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి కుమారై కీర్తన (17) , కుమారుడు శ్రీకర్ (12) ఉన్నారు. ఇలా ఉండగా వెంకటరమణ నూతనంగా కారు కొనుగోలు చేశారు. కుమారై ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 976 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుమారుడు శ్రీకర్ గుడివాడలో 7వ తరగతి చదువుతున్నాడు. అంతా సంతోషంగా పున్నమి రోజున శనివారం తమిళనాడులోని తిరువణ్నామలైలో గిరి ప్రదక్షిణానికి వెళ్లారు. స్వామి వారిని భక్తితో పూజించుకుని , మొక్కులు చెల్లించుకుని ఆదివారం ఉదయం అక్కడి నుంచి కదిరికి బయలు దేరారు. మార్గ మధ్యలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా మదనపల్లె నుంచి అతివేగంగా వచ్చిన ఐషర్ లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటరమణ, కుమారై కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు. మూడు జిల్లాల్లో విషాదం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శారద, వెంకట రమణ కుటుంబం పుట్టపర్తి జిల్లా కదిరిలో నివాసం ఉన్నారు. శారద అదే మండలం బాలప్పగారిపల్లెలో టీచర్గా పనిచేస్తున్నారు. అలాగే వెంకటరమణ అన్నమయ్య జిల్లా సోంపల్లెలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. కాగా వెంకటరమణ స్వగ్రామం కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లె కావడంతో అంత్యక్రియలు అక్కడ నిర్వహించనున్నారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మూడు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు, బంధుమిత్రుల రోదనలు పలువురిని కలచివేసింది.

మాతో పెట్టుకుంటే రక్తపు మరకలే..
వేములవాడ: వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్ హాల్ మర్డర్తో దద్దరిల్లింది. ఆగ్రహావేశాలతో రెండు గొడ్డళ్లు, కత్తితో హత్య చేసిన దశ్యాలు కలచివేశాయి. ఈ దారుణ ఘటన అనంతరం నేనే బైరెడ్డి.. రక్తపు మరకలే సాక్ష్యం.. ఎవడినీ వదలను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది డ్రగ్స్ ముఠా, గంజాయి గుంపుల మధ్య అంతర్గత వివాదంగా గుర్తించినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బైపాస్ రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ ఆదివారం సాయంత్రం భయంకరమైన హత్య జరిగింది. రెండు గొడ్డళ్లు, ఒక కత్తితో దుండగులు వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పర్శరాం(36)ను నిర్దాక్షిణ్యంగా మెడ, తలపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. మృతుడికి భార్య కల్యాణి, కూతురు అమ్ములు, కుమారుడు బబ్లీ ఉన్నారు. ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు చేరుకొని శవాన్ని ఫంక్షన్ హాల్ బంగ్లాపై నుంచి కిందికి దించి ట్రాక్టర్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచగా.. పోలీసులు స్పందించలేదు. ట్రాక్టర్ వద్ద రోదనలు.. మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి రాగా.. భార్య స్పృహ తప్పి పడిపోయింది. చిన్న పిల్లలు డాడి ఎక్కడ అంటూ అడగడంతో.. స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. అతడి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ ట్రాక్టర్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే.. తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే అంటూ సదరు అనుమానితుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కత్తులు, గొడ్డలితో అత్యంత భయంకరంగా వ్యవహరిస్తూ తమతో పెట్టుకుంటే రక్తపు మరకలు అని బెదిరింపులకు పాల్పడినట్లుగా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. అనుమానితులు 25 ఏళ్ల వయసు లోపున్న వారే కావడం, యువత దారి తప్పిన విధానం వేములవాడలో కలకలం రేపుతోంది. అనుమానితులు ఇప్పటికే ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. వేములవాడలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


Hindupuram: అంబేడ్కర్ జయంతి రోజు ఏపీలో దళితులకు అవమానం


తానే చంపినట్లు పీఎంపాలెం పీఎస్ లో లొంగిపోయిన జ్ఞానేశ్వర్


వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన YSRCP


పులివర్తి నాని వ్యాఖ్యలకు మోహిత్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్


తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల


అంబేద్కర్ విగహాన్ని అమ్మకానికి పెడతారా?


Gadikota Srikanth: అప్పుడు మిస్ అయ్యింది ఈసారి మిస్ కాకుండా ఏబీవీ ప్లాన్..


Vizag: మరో 24 గంటల్లో భార్య డెలివరీ... భార్యను హతమార్చిన భర్త


తన పాలనపై తానే విమర్శలు చేసుకున్న చంద్రబాబు


గోశాల గోవుల ఘటనపై బాబు వ్యాఖ్యలు భూమన కరుణాకర్ ఛాలెంజ్