-
‘హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు’.. సుప్రీంకోర్టుకు మాజీ సీఎం సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్త పిటిషన్ దాఖలు చేశారు.తన పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదంటూ తాజా పిటిషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న వాదనలు పూర్తి కాగా, హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని.. ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని లేదని తెలిపారు. ఈ మేరకు సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు ప్రస్తావించారు.చదవండి: కవిత బెయిల్పై మే మొదటి వారంలో తీర్పుహైకోర్టు తీర్పు నిరాకరించడం వల్ల తరువాత ఏం చేయాలనే విషయంలో సోరెన్ ప్రతిష్టంభనలో ఉన్నారని పేర్కొన్నారు. చట్టపరమైన పరిష్కారాల కోసం ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. తాము మళ్లీ హైకోర్టుకు వెళ్లి కనీసం తీర్పు ఇవ్వాలని కోరినా జడ్జి ఏం స్పందించలేదని చెప్పారు. సోరెన్ ఇక జైల్లోఏ ఉంటారా? లోక్సభ ఎన్నికలు కూడా ముగిసిపోతాయి. అప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం’ అని తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా .. ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ ఈ అంశాన్ని విచారించే తేదీలను ప్రకటిస్తుందని పేర్కొన్నారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్ను జనవరి 31న అరెస్టు చేసింది. ఈ కేసులో గతంలోనే సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఫిబ్రవరి 2న హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం తెలిపింది. సోరెన్ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
జార్ఖండ్ తదుపరి సీఎం ఆమె? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని.. తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పన బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేత సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నిశికాంత్ దుబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని, సంకీర్ణాన్ని, సీఎం హేమంత్ సోరెన్ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘ఎమ్మెల్యేగా సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా కొత్త ఏడాదిలో సోరెన్ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. త్వరలో హేమంత్ సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారు.ఆయన భార్య కల్పన సీఎం పదవిని చేపడతారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్.. న్యాయ సలహా తీసుకోవాలని బీజేపీ పేర్కొంది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2019లో కొలుదీరిన విషయం తెలిసిందే. झारखंड के गांडेय विधायक सरफराज अहमद ने विधानसभा से इस्तीफ़ा दिया,इस्तीफ़ा स्वीकार हुआ । हेमंत सोरेन जी मुख्यमंत्री पद से इस्तीफ़ा देंगे,झारखंड की अगली मुख्यमंत्री उनकी पत्नी कल्पना सोरेन जी होंगी । नया साल सोरेन परिवार के लिए कष्टदायक @itssuniltiwari pic.twitter.com/jl06AtXurh — Dr Nishikant Dubey (@nishikant_dubey) January 1, 2024 జేఎంఎం ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు జరిగే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎంపీ నిశికాంత్ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారించడానికి ఇప్పటివరకు ఈడీ.. సీఎం హేమంత్ సోరెన్కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సీఎం హేమంత్ సోరెన్ జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాల పైకి దర్యాప్తు సంస్థలను పంపి వాటిని వాడుకుంటోందని మండిపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు అవినీతి కేసులో ఈడీ విచారణపై సీఎం హేమంత్ సోరెన్ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం సోమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం పదవిని తన భర్య కల్పనకు అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది. చదవండి: Lalan Singh: నేను హిందువునే.. వాళ్లలా కాదు.. -
‘త్వరలో మరో పుల్వామా దాడి’ అంటూ పోస్ట్.. రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: ‘పుల్వామా దాడి’ మాదిరి మరో దాడి త్వరలో జరగనుందని ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఒక్కసారిగా దుమారం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఉత్తర ప్రదేశ్లో సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జార్ఖండ్కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ‘పుల్వామా దాడి... వంటి మరో దాడి తర్వలో జరగనుంది’ అని ఆ విద్యార్థి ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశాడు. మంగళవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు పుల్వామాలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద లభించిన తుపాకాలను స్వధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆర్మీ భద్రతా సిబ్బంది, పోలీసులు సంయూక్తంగా విచారణ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ స్టూడెంట్ పెట్టిన షోషల్ మీడియా పోస్ట్ వెలుగు చూడటంతో అప్రమత్తమైన షహరాన్ పూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు మృతి చెందిన విషయం తెలిసిందే. చదవండి: Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం -
జార్ఖండ్లో యువతిపై దారుణం.. బట్టలు విప్పి చెట్టుకి కట్టేసి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని నలుగురు తమ కుమారుడితో ప్రేమ వ్యవహారంలో 26 ఏళ్ల యువతిని అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కేంద్రానికి ఊరట.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన సుప్రీంకోర్టు -
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు
రాంచీ: జార్ఖండ్ హజారీబాగ్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బస్సులోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బస్సు గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో తాతిఝరియా వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి సివేనీ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వీరి సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్కేస్లో కుక్కి.. -
నా ఎమ్మెల్యే పదవిపై త్వరగా తేల్చండి: హేమంత్
రాంచీ: జార్ఖండ్లో గత మూడు వారాలుగా కొనసాగుతున్న అనిశ్చితిని తొలగించాలని, తన ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర గవర్నర్ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గవర్నర్కు లేఖ రాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ఎమ్మెల్యేలను కొనేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. గనుల లీజుల వ్యవహారంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం ఈ ఏడాది ఆగస్టు 25న తన అభిప్రాయాన్ని గవర్నర్కు పంపించింది. హేమంత్పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయడంపై గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. (చదవండి: లిక్కర్ స్కామ్లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్ టెన్షన్) -
జార్ఖండ్ సీఎంకు టెన్షన్ టెన్షన్.. బ్యాగ్లు ప్యాక్ చేసుకున్న ఎమ్మెల్యేలు
రాంఛీ: సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్లో అస్థిరత నెలకొంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు లగేజీతో పాటు సీఎం ఇంటికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ కుంటీ జిల్లాలోని గెస్ట్ హౌస్కు తరలించారు సోరెన్. పటిష్ఠ భద్రత నడుమ రెండు బస్సుల్లో వీరిని అక్కడకు తీసుకెళ్లారు. ప్రయాణంలో వారితో పాటు బస్సులో సెల్ఫీ దిగారు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరందరినీ గెస్ట్ హౌస్కు తరలించడానికి ముందు మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు సోరెన్. Two buses, carrying Jharkhand MLAs, left from CM Hemant Soren's residence earlier this afternoon after a meeting of the UPA legislators. Pics from inside the buses. pic.twitter.com/nGodgPV7FY — ANI (@ANI) August 27, 2022 మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్కు 18, ఆర్జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు గవర్నర్ ఆయన ఎమ్మెల్యే పదవిని శుక్రవారం రద్దు చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నికకావాల్సి ఉంటుంది. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్లో ఎవరికీ లేదు -
జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు
రాంఛీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాంఛీలో బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఇంట్లో రెండు ఏకే-47 రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సన్నిహితుడు కావడం చర్చనీయాంశమైంది. ప్రేమ్ ప్రకాశ్ ఈ ఆయుధాలు అక్రమంగా కలిగి ఉన్నారా? అనే విషయంపై మాత్రం ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. వీటిని సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రూ.100కోట్ల మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్లో 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సీఎం సన్నిహితుడు పంకజ్ మిశ్రా, బచ్చు యాదవ్లు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పంకజ్ మిశ్రా, అతని సన్నిహితుల నివాసాల్లో ఈడీ అధికారులు జులై 8నే దాడులు చేశారు. మొత్తం 19 చోట్ల సోదాలు చేశారు. మార్చిలోనే వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈమేరకు చర్యలు తీసుకున్నారు. మైనింగ్ స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. సోదాల్లో కీలకమైన పత్రాలు, బ్యాంకు బ్యాలెన్స్కు సంబంధించిన వివరాలు లభించాయి. అయితే ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో లభించిన ఏకే 47 తుపాకుల విషయంపై ఆయన గానీ, సీఎం సోరెన్ గానీ స్పందించలేదు. చదవండి: టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు.. -
దారుణం.. తొమ్మిదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలలపాటు..
రాంచీ: జార్ఖండ్ బోకారోలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులై 19న బాధితురాలు ఎలాగోలా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. అప్పటికే తమ బిడ్డ కన్పించట్లేదని కేసు పెట్టిన తల్లిదండ్రులు విషయం తెలిసిన వెంటనే బాధితురాల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను మనోజ్ కుమార్, విష్ణు కుమార్, మంతోష్ కుమార్లుగా గుర్తించారు. మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఏప్రిల్ 20న బాలిక మార్కెట్ నుంచి తిరిగివస్తుండగా.. ఆటోలో వచ్చిన మంతోష్ కుమార్ మరో ఇద్దరి సాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికను ఓ గదిలో బంధించి రోజు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను గదిలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయేవారు. జులై 19న అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ బాధితురాలి పరిస్థితిని చూసి రాయితో తాళం పగలగొట్టి విముక్తి కల్పించింది. వెంటనే బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కన్నతండ్రే కాలయముడై... కూతురిని, అల్లుడిని చంపి... -
ఒకప్పుడు నెట్ బౌలర్గా.. ఇప్పుడు ఏకంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో..!
సన్రైజర్స్ హైదరాబాద్ మీడియం పేసర్ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో జార్ఖండ్ లెఫ్టార్మ్ పేసర్ సుశాంత్ మిశ్రాను సన్రైజర్స్ భర్తీ చేసింది. సుశాంత్ మిశ్రా 2020 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టులో సభ్యడిగా ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో మిశ్రా ఏడు వికెట్లు పడగొట్టాడు. మరో వైపు దేశీవాళీ క్రికెట్లో నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడిన సుశాంత్ 13 వికెట్లు సాధించాడు. ఇక 2020 నుంచి 2021 ఐపీఎల్ సీజన్ వరకు ఆర్సీబీ నెట్ బౌలర్గా సుశాంత్ మిశ్రా ఉన్నాడు. కాగా రూ.20 లక్షలకు సుశాంత్ మిశ్రాతో ఎస్ఆర్హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్.. ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం(మే5) తలపడనుంది. చదవండి: Diego Maradona: మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్’ జెర్సీకి కళ్లు చెదిరే మొత్తం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పెళ్లి రోజు కానుకగా భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని
రాంఛీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అతని ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. ఇక, రిటైర్ దగ్గర నుంచి.. ఫామ్ హౌస్ లో భార్య సాక్షి, కూతురు జీవాలతో సరదాగా గడిపేస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి సింగ్ల వివాహ వార్షికోత్సవం నేడు. 2010లో ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి 11 ఏళ్లు నిండాయి. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి సాక్షి సింగ్ కి ధోని ఓ మధురమైన బహుమతి ఇచ్చాడు. సాక్షి కోసం స్పెషల్ గా ఓ వింటేజ్ కారును కొనుగోలు చేశాడు మహీ. లేత నీలం, వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న కారును యానివర్సరీ కానుకగా ఇచ్చాడంటూ ఇన్స్టా స్టోరీలో సాక్షి సింగ్ పోస్టు చేసింది. ధోనీ..సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. దీంతో సాక్షినే.. ధోనీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా ధోని ఫ్యాన్స్కు షేర్ చేస్తుంటోంది. వీరిద్దరికీ జీవా ధోనీ అనే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల జీవాకి ఇన్స్టాలో సెపరేట్ అకౌంట్ ఉండడమే కాదు, దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు. -
యాస్ తుపాను: మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్ల తక్షణ సాయం
న్యూఢిల్లీ: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్ బాలేశ్వర్ జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్లోని పూర్బా మెడినిపూర్లో తుపాను ప్రభావిత ప్రాంతాలలో నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యల కింద రూ.1,000 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించారు. భువనేశ్వర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పునరావాస చర్యలకు సంబందించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాస్ తుపాను కారణంగా గరిష్ట నష్టం ఒడిశాలో జరిగిందని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు ప్రధానికి అధికారులు వివరించారు. ఇందులో ఒడిశాకు రూ.500 కోట్లు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కలిపి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి అవసరమయ్యే అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా బాధపడుతున్న వారందరికీ ప్రధాని తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు. తుఫాను కారణంగా తుపాను వల్ల చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సందర్శించడానికి ఒక మంత్రి బృందాన్ని నియమించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన ఆధారంగా మరింత సహాయం అందించనున్నట్లు తెలిపింది. చదవండి: యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే -
ఝార్ఖండ్ లోని రాంచీలో ఏనుగు బీభత్సం
-
అశ్లీల దృశ్యాలు, ఐటెంసాంగ్స్ వల్లే: శివానంద్
రాంచీ: జార్ఖండ్లో జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ స్పందించారు. సమాజంలో అత్యాచారాలు పెరగడానికి మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు లభించడమే కారణమని అన్నారు. సినిమాలలో ఐటెమ్సాంగ్స్, ఫోన్లలో అశ్లీల వీడియోలు లైంగిక దాడులు జరగడానికి ముఖ్య కారణమని, ఇలాంటివి ఉన్నంతకాలం చట్టాలు కూడా ఈ దారుణాలను ఆపలేవని పేర్కొన్నారు. ఎలాంటి అత్యాచారాలు, నేరాలు జరగని గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరగడం అక్కడ సంస్కృతిని నాశనం చేస్తున్నాయన్నారు. ‘‘గిరిజన ప్రాంతంలో మహిళలపై అత్యాచారం జరుగుతుందని ఎవరూ ఊహించరు. గిరిజన సంస్కృతిలో అత్యాచారాలు అనేవి ఇంతవరకు జరగలేదు. కాని ఆధునిక యుగం మొదలయ్యాక ప్రస్తుత మహిళలను ఆట బొమ్మలాగా చూస్తున్నారు’’ అని తివారీ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్లోని డుమ్కాలో 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణలు రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా సంచలనం సృష్టించిన విషయం విధితమే. మంగళవారం సాయంత్రం డుమ్కా జిల్లాలోని ముఫాసిల్ ప్రాంతంలో మహిళపై 17 మంది సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితురాలి భర్తను కట్టేసి అత్యాచారం చేశారు. అనంతరం మహిళ ఫిర్యాదు చేయగా, నిందితుల్లో ఒకరిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి జార్ఖండ్ ప్రభుత్వాన్ని నిందించారు. ఇది జార్ఖండ్ ప్రభుత్వం తప్పు అని, అత్యాచారాల నిషేదానికి చట్టాలు తీసుకొచ్చి వాటిని అమలు చేయాలన్నారు. నిందితులను కఠినంగా శికక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించి ఈ అత్యాచారాన్ని సుమోటోగా గుర్తించింది. లైంగిక వేధింపుల కేసుల్లో 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఎంహెచ్ఏ మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ జార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో చర్య తీసుకున్న సమగ్ర నివేదికను కూడా కోరింది. బాధితురాలు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఘటన జరిగిందని, దర్యాప్తు పప్రారంభించినట్లు డీజీపీ సుదర్శన్ మండల్ తెలిపారు. వైద్య పరీక్ష నిమిత్తం బాధితురాలిని హాస్పటల్కి పంపామని పేర్కొన్నారు. -
భార్య కోసం.. బైక్పై 1000 కిమీ
రాంచీ: భార్య తనకంటే విద్యాధికురాలు అయితే చాలా మంది మగవారికి నచ్చదు. ఇక పెళ్లాయ్యాక ఆడవారికి చదువుకునే వెసులుబాటు కల్పించే భర్తలు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో పదో తరగతితోనే చదువు ఆపేసి.. వంట మనిషిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. టీచర్ కావాలన్న తన భార్య కలను నెరవేర్చడం కోసం సుమారు 1000 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేసిన అరుదైన ఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివారాలు.. జార్ఖండ్ గొడ్డా ప్రాంతానికి చెందిన ధనంజయ్ కుమార్ పదవ తరగతి పాస్ అవుట్. తర్వాత వంట మనిషిగా పని చేస్తున్నాడు. ధనంజయ్ భార్య సోని హెంబ్రామ్కు టీచర్ కావాలని ఆశ. ఇందుకు గాను మధ్యప్రదేశ్ బోర్డు అందించే ప్రాథమిక విద్య డిప్లోమా కోర్సులో చేరింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతోంది. పరీక్షలు జరగుతున్నాయి. ఎగ్జామ్ సెంటర్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. గొడ్డా నుంచి పరీక్ష కేంద్రానికి మధ్య దూరం 1100 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్, కొన్ని షార్ట్కట్ మార్గాల వల్ల దూరం 1000 కిలోమీటర్లకు తగ్గింది. (చదవండి: క్లాస్ టీచర్) దాంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కోసం మూడు రోజుల పాటు బైక్ మీద 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు ఈ దంపతులు. ఈ సందర్భంగా ధనంజయ్ మాట్లాడుతూ.. ‘నా భార్య 2019లో మధ్యప్రదేశ్లో టీచర్ కోర్సులో చేరింది. జార్ఖండ్లో ఫీజు చాలా ఎక్కువగా ఉండటంతో ఇలా చేసింది. దాంతో తనకు గ్వాలియర్లో ఎగ్జామ్ సెంటర్ పడింది. అక్కడికి చేరుకోవడానికి ప్రస్తుతం రైళ్లు అందుబాటులో లేవు. సోని టీచర్ ఒకరు విద్యార్థులను గొడ్డా నుంచి గ్వాలియర్ తీసుకెళ్లడానికి కారు మాట్లాడారు. కానీ 30 వేల రూపాయలు చెల్లించాలని చెప్పారు. గత నాలుగు నెలలుగా నాకు ఉద్యోగం లేదు. దాంతో బైక్ మీద వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం నా భార్య ఆరోనెల గర్భవతి. ఆగస్టు 27 రాత్రి మా ప్రయాణం ప్రారంభమయ్యింది. బిహార్, లక్నోలోని ముజఫర్పూర్ మీదుగా ప్రయాణించి ఆగస్టు 30 సాయంత్రం గ్వాలియర్ చేరుకున్నాం. బంధువుల దగ్గర నుంచి 10 వేలు బదులు తీసుకుని పరీక్షకు వెళ్లడానికి బయలుదేరాం’ అని తెలిపాడు ధనంజయ్. (చదవండి: పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్) గ్వాలియర్లోని డీడీ నగర్ ప్రాంతంలో ఉండటానికి వారు 1,500 రూపాయలతో గది అద్దెకు తీసుకున్నారు. ధనంజయ్ మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికే 7,000 రూపాయలు ఖర్చు చేసాము. ఇప్పుడు 3 వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆరు నెలల గర్భవతి అయిన నా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నంది. ఇప్పుడు, నేను తిరిగి వెళ్ళడానికి అవసరమయిన డబ్బు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపాడు. -
వైరల్ వీడియో.. పాములతో కేక్ తినిపించారు
రాంచీ: ప్రతి ఏటా జూలై 16న ‘ప్రపంచ పాముల దినోత్సవం’ జరుగుతుంది. ఈ ఏడాది కూడా పాములకు సంబంధించి పలు అంశాలు, ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ క్రమంలో జార్ఖండ్కు చెందిన ఓ వీడియో తెగ వైరలవ్వడమే కాక నెటిజనుల ఆగ్రహానికి కూడా కారణమవుతోంది. ఈ వీడియోలో జార్ఖండ్కు చెందిన పాముల సంరక్షకులు కొందరు ‘వరల్డ్ స్నేక్ డే’ సందర్భంగా కేక్ కట్ చేసి పాములతో దాన్ని తినిపించారు. ఈ చర్యల పట్ల నెటిజనుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ జర్నలిస్ట్, ఫోటాన్ సహ వ్యవస్థాపకుడు విరాట్ ఏ సింగ్ ఈ వీడియోను షేర్ చేయడమే కాక వీరిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను ట్యాగ్ చేశాడు. To celebrate #WorldSnakeDay2020 they cut a cake and even fed some to the snake and were so happy abt it. If these r snake rescuers thn they are more dangerous for snakes. This Video wch is viral seems to b frm Jharkhand@Saket_Badola @rameshpandeyifs @Kedarsbhide @ParveenKaswan pic.twitter.com/r5sVmZL8VN — Virat A Singh (@tweetsvirat) July 17, 2020 ‘ఈ వీడియోలోని వారంతా ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి.. పాములతో కూడా తినిపించి ఎంతో ఆనందించారు. వీరంతా పాములను కాపాడే వారు.. కానీ వాటికన్నా వీరే ఎక్కువ ప్రమాదం’ అన్నారు. ఈ వీడియో పట్ల రమేష్ పాండే అనే ఐఎఫ్ఎస్ అధికారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ‘సమాజానికి సహజ వనరుల పరిరక్షణకు సంబంధించిన విద్యను బోధించడం ఎంత అవసరమో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతోంది. ప్రకృతి, వన్యప్రాణుల పట్ల ధర్మబద్ధమైన విధానాన్ని ప్రోత్సహించడంలో జూలు, సఫారీలు కీలక పాత్ర పోషిస్తాయని నేను భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. మరోక ఐఎఫ్ఎస్ అధికారి వీరి చర్యలను మూర్ఖపు చేష్టలుగా వర్ణించడమే కాక తక్షణమే వీటికి అడ్డుకట్టవేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక వీరి గురించి మరిన్ని వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాల్సిందిగా కోరాడు. వీరి గురించి పీసీసీఎఫ్(డబ్ల్యూఎల్) జార్ఖండ్కు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. (పెట్రోల్ పోయలేదని పామును వదిలాడు) This shows the importance of serious conservation education needed to any society. After working both in in-situ and ex-situ conservation fields, I feel this is where Zoos & Safaris play a pivotal role in inculcating righteous approach towards nature and wildlife, in youth. https://t.co/5aM7xru9fL — Ramesh Pandey IFS (@rameshpandeyifs) July 17, 2020 ఇక నెటిజనులు వీరి పనులు మంచివి కావని.. ఈ సంరక్షకుల వల్ల పాములకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు. ‘వీరి చర్యలకు బాధ కల్గుతుంది. ఎలా కోప్పడాలో తెలీడం లేదు. ఇప్పటికే నాగుల పంచమి నాడు పాముల చేత బలవంతంగా పాలు తాగిస్తున్నాం. ఇప్పుడు కేక్ తినిపిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే త్వరలోనే పాముల్లో కార్బోహైడ్రేట్ ఎంజైమ్లను అభివృద్ధి చేసే వ్యవస్థ కూడా తయారవుతుంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. -
టిక్టాక్లో దుమ్మురేపుతున్న తోబుట్టువులు
రాంచీ: జార్ఖండ్కు చెందిన ఈ తోబుట్టువులిద్దరు డాన్స్ వీడియోలతో టిక్టాక్లో ఇప్పటికే మిలియన్ మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరు ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతున్నారు. సనాతన్ కుమార్ మహాతో, అతని సోదరి టిక్టాక్ వీడియోలతో ఎందరినో అలరిస్తున్నారు. ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఇంటి బయట నిల్చుని చేసే వీరి డాన్స్కు నెటిజనులు ఫిదా అవుతున్నారు. తమ ప్రతిభ, స్వయం కృషితో వీరు జనాల హృదయాలను గెలుచుకోగలిగారు. వీరి వీడియోలు ఇప్పుడు ట్విట్టర్లోను ట్రెండ్ అవుతున్నాయి. వీరి ప్రతిభను ప్రశంసించే వారిలో టీవీ హోస్ట్ మినీ మాథుర్ కూడా ఉన్నారు. ‘ఈ రోజు ఉదయం నేను చూడవలసినది ఇదే !! 2020లో సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా ప్రేమ’ అని ట్వీట్ చేశారు. Yes! This is what I needed to see this morning!! So much love to everyone who is trying to stay positive through 2020. https://t.co/dhbEoDGh6Z — Mini Mathur (@minimathur) June 1, 2020 -
‘పౌర రగడ వెనుక విపక్షం’
-
‘పౌరసత్వ రగడ వెనుక విపక్షం’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై హింసాత్మక నిరసనల వెనుక విపక్షాల ప్రమేయం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, దిక్కుతోచని స్ధితిలో హింసకు దిగుతున్నాయని ఆరోపించారు. ఆందోళనలు చేస్తున్న వారిని వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ వాదననే కాంగ్రెస్ ముందుకు తెస్తోందని ఎద్దేవా చేశారు. జార్ఖండ్లో ప్రధాని మోదీ ఆదివారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ పౌర బిల్లుపై రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి భారత్కు పారిపోయి వచ్చిన మైనారిటీ వర్గాలు శరణార్ధులుగా బతుకీడుస్తున్నారని, వారికి గౌరవప్రదమైన స్ధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదించాయని గుర్తుచేశారు. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల నేపథ్యంలో బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. -
అంబులెన్స్ లేక.. బైక్ మీదే రక్తమోడుతూ..
రాంచీ : స్థానిక ఎంపీ ఆ గ్రామాన్ని మోడల్ విలేజ్గా ఎంపిక చేశాడు. కానీ కనీస వసతలు కల్పించడం మర్చిపోయాడు. దాంతో ఆ గ్రామానికి చెందిన నిండు గర్భిణిని ప్రసవం నిమిత్తం బైక్ మీద ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఓ పక్క అప్పటికే ఆ మహిళ తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. మరో వైపు వైద్యులు ఇక్కడ కాదు అంటూ మూడు ఆస్పత్రులు చుట్టూ తిప్పారు. ఈ హృదయవిదారక సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శాంతిదేవి అనే మహిళకు నెలలు నిండాయి. దాంతో ఆమె భర్త చండ్వా పీహెచ్సీకి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించడంతో పాటు 108 హెల్ప్లైన్కు ఫోన్ చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో వేరేదారి లేక బైక్పై అక్కడికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు లతేహర్ సదార్ ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించడంతో మళ్లీ బైక్ మీదనే తీసుకెళ్లారు. లతేహర్ వైద్యులు రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు శాంతిదేవిని తీసుకెళ్లమని చెప్పి, అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెను అంబులెన్స్లో తీసుకెళ్లి రిమ్స్లో చేర్పించారు. వైద్యుల తీరు పట్ల శాంతీ దేవి కుటుంబ సభ్యులే కాక సామాజిక కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక సీపీఎం నాయకుడు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘లతేహర్ డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకున్నా ఆమెకు అంబులెన్స్ లభించలేదు. అనంతరం సదార్ ఆస్పత్రి వైద్యులు రక్తమార్పిడి చేసేందుకు నిరాకరించా’రని ఆరోపించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఓ గర్భిణీని వైద్యులు మంచి వైద్యం పేరు చెప్పి ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి అలా తిప్పడం సరైనది కాదని ఆయన తప్పుబట్టారు. -
జార్ఖండ్లో మావోయిస్టుల మెరుపు దాడి
-
జార్ఖండ్లో భారీ పేలుడు
రాంచీ : జార్ఖండ్లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు వణికించాయి. ఐఈడీ పేలుడుతో 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. సరైకెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలడంతో ఆ సమయంలో స్పెషల్ ఆపరేషన్స్లో నిమగ్నమైన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విమానాల్లో రాంచీలోని ఆస్పత్రులకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్లో నక్సల్స్ ఏరివేతకు భద్రతా సిబ్బంది, పోలీసులు చేపట్టిన ఆపరేషన్కు ప్రతీకారంగా గతవారంలోనూ నక్సల్స్ ముగ్గురు భద్రతా సిబ్బందిని హతమార్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓటేసిన శతాధిక వృద్ధురాలు
జార్ఖండ్ : లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు సోమవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులుతీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జార్ఖండ్లోని హజారిబాగ్లో ఓ వ్యక్తి తన 105 సంవత్సరాల తల్లిని ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమె ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. బిహార్, జమ్ము కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. -
ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే..
భువనేశ్వర్ : ఓ 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు. సోదరి వరుసయ్యే యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసి మరో ఐదుగురితో కలిసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్నయ్య స్నేహితుడే కదా! అని నమ్మిన ఆ యువతికి తీరని శోకాన్ని మిగిల్చాడు. రెండు రోజుల పాటు ఓ గదిలో బంధించి నరకం చూపించారు. మృగాళ్లలా ఆ యువతిని అతికిరాతకంగా చెరచటంతో బాధితురాలు ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తమ వాంఛను తీర్చుకున్న దుండగులు బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. జార్ఖండ్లోని చక్రదాపుర్లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రూర్కెలాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని గత డిసెంబర్ 30న ఇంటికెళ్లడానికి రైల్వే స్టేషన్లో వేచి ఉంది. ఈ క్రమంలో ఆ యువతి దగ్గరకు వచ్చిన ఆమె అన్నయ్య స్నేహితుడు ఆమెను నమ్మించి తప్పుడు ట్రైన్ ఎక్కించాడు. రైలు ఎక్కాక తాను సరైన ట్రైన్ ఎక్కలేదనే విషయాన్ని గ్రహించిన ఆమె.. నిలదీయడంతో జార్ఖండ్ లోథపుర్ స్టేషన్లో దిగుదామని, అక్కడి నుంచి బస్సులుంటాయని నమ్మించాడు. ముందే ప్లాన్ చేసిన నిందితులు యువతిని బలవంతంగా లోథ్పుర్లోని ఓ ఇంటిని తీసుకెళ్లి రెండు రోజుల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయడంతో బాధితురాలు స్థానికులు సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ గ్యాంగ్ రేప్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనపై రూర్కెలా ఎస్పీ మాట్లాడుతూ.. ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని, బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతుందని తెలిపారు. -
సామూహిక వివాహ వేడుకలో ముఖ్యమంత్రి డ్యాన్స్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు
బొలెరో ఢీకొని వ్యక్తి దుర్మరణం
డీజిల్ కుంభకోణంపై రీజినల్ డైరెక్టర్ విచారణ
ప్రేమ పేరిట యువతి మోసం
ఈఏపీసెట్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’కు అత్యున్నత ర్యాంకులు
ఠాణాలో ఆత్మహత్యాయత్నం
ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
పట్టించుకుంటలేరు
స్ట్రాంగ్రూమ్లను నిరంతరం పర్యవేక్షించాలి
సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలి
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement