ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు | Jharkhand Hazaribag Accident Many Dead As Bus Falls Into River | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు

Published Sat, Sep 17 2022 7:16 PM | Last Updated on Sat, Sep 17 2022 7:16 PM

Jharkhand Hazaribag Accident Many Dead As Bus Falls Into River - Sakshi

బస్సు గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో తాతిఝరియా వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి సివేనీ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు

రాంచీ: జార్ఖండ్ హజారీబాగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బస్సులోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

బస్సు గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో తాతిఝరియా వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి సివేనీ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వీరి సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement