Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లేదా నెగోíÙయేటెడ్ సెటిల్మెంట్స్ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.

నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం
ఈరోజు (ఏప్రిల్ 14) తమిళుల నూతన సంవత్సరం.. తెలుగువారంతా ఉగాది జరుపుకున్న మాదిరిగానే తమిళులు నేడు వారి నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. దీనిని వారు ‘పుతండు’(Puthandu)గా పిలుస్తుంటారు. నేడు తమిళ క్యాలెండర్లోని చిత్తిరై నెలలోని మొదటి రోజు. ‘పుతండు’ రోజున తమిళనాడులో కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సవం చేసుకుంటారు. అలాగే రాష్ట్రంలోని వ్యాపారులు ఈ రోజున తమ నూతన ఆర్ధిక సంవత్సర లావాదేవీలను ప్రారంభిస్తారు. దీనిని "కై-విశేషం" అని పిలుస్తారు. కాగా తమిళనాట హిందీని వ్యతిరేకిస్తూ, సొంత భాషకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తున్న తరుణంలో తమిళులంతా తమ భాషలోనే పరస్పరం ‘పుతండు’ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. పురాణాల ప్రకారం పుతండు రోజున బ్రహ్మదేవుడు(Lord Brahma) విశ్వ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అలాగే ఈ రోజునే ఇంద్రుడు భూమిపైకి శాంతి, ఆశ, ఆనందాన్ని తీసుకువచ్చాడని భక్తులు విశ్వసిస్తారు. తమిళ సంస్కృతిలో ఈ రోజున కొత్త పనులు తలపెడితే శ్రేయస్సు, సంతోషం కలుగుతుందని చెబుతారు. పుతండును సంగమ యుగం నుంచి జరుపుకుంటున్నారని, ఇది వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉందని చరిత్ర చెబుతోంది. పుతండు రోజున తమిళులు తమ ఇళ్లను కోలం (రంగోలీ)తో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి వేడుకలు చేసుకుంటారు. ‘మంగాయ్ పచ్చడి’ని తింటారు. దీనిని బెల్లం, మామిడి, వేప ఆకులు, ఎర్ర మిరపకాయలతో తయారుచేస్తారు. ఇది జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది. ఈ రోజున ఆలయాలను సందర్శించడం, కొత్త బట్టలు ధరించడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం చేస్తారు.పుతండు ఉత్సవం తమిళులకు కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సమయంగా భావిస్తారు. పుతండు వేడుకలు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. ఈ ఉత్సవాన్ని శ్రీలంక, మలేషియా, సింగపూర్ తదితర తమిళ జనాభా అధికంగా కలిగిన దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్ ఆశయాలకు తూట్లు: దళిత రైతు దారుణ హత్య.. ఏడుగురు అరెస్ట్

వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
సాక్షి, అనంతపురం: ఏపీలో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదంలో చిక్కుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం విషయంలో జయరాం తనను మోసం చేశారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..‘గుత్తి మండలం మామడూరు గ్రామానికి చెందిన బోలే యల్లప్ప ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. యల్లప్ప ఆత్మహత్యయత్నం చేయడానికి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కారణమని అన్నారు. ఎమ్మెల్యే జయరాం.. యల్లప్ప నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అదే ఉద్యోగాన్ని 8 లక్షలకు మరొకరికి ఇచ్చేశారు. ఈ కారణంగా ఉద్యోగం పోయిందనే ఆవేదనతో యల్లప్ప ఇలా చేశాడని తెలిపారు. ఈ క్రమంలో జయరాం పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు.

Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..

DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో అత్యంత అరుదైన హ్యాట్రిక్ రనౌట్స్ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.లీగ్ ఆరంభ సీజన్లో (2008) ఓ సారి ఒకే ఓవర్లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.నిన్నటి మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మొహిత్ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.నేటికి అది రికార్డే2008 సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ మ్యాచ్లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు.

వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు
బ్రస్సెల్స్: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు.. పీఎన్బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. Fugitive diamond trader Mehul Choksi, who is wanted in connection with the Rs 13,500-crore Punjab National Bank (PNB) loan fraud case, has been arrested by the police in Belgium, according to a report. The 65-year-old was taken into custody on Saturday (April 12) at the request… pic.twitter.com/xQlq2T3E0C— News9 (@News9Tweets) April 14, 2025

ట్రేడింగ్ పేరుతో మోసపోయిన సినీ రచయిత.. కొంపముంచిన వీడియో
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగానికి ఆకర్షితుడై ఓ వ్యక్తి బొక్కబోర్లా పడ్డాడు. ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టడంపై ఆమె చేసిన ప్రసంగ వీడియో తిలకిస్తున్న సమయంలో స్క్రీన్పై వచ్చిన ఓ యాప్ అతడి కొంపముంచింది. పెట్టుబడి పెడితే రెండు వారాల్లోపు మంచి రాబడి వస్తుందని ఇచ్చిన హామీ మేరకు రూ.39,694లు చెల్లించి మోసపోయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్గూడ ప్రగతినగర్లో నివసించే జనార్దన్రెడ్డి(44) సినీ రచయిత. ఈ నెల 11న ఉదయం ఫేస్బుక్లో వీడియోలు తిలకిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్రేడింగ్, పెట్టుబడి గురించి వివరించే వీడియో కనిపించింది. అది నిజమైనదిగా భావించి వీడియో ఓపెన్ చేశాడు. ట్రేడింగ్ ప్రయోజనాల కోసం రూ.21 వేలు పెట్టుబడి పెట్టడం గురించి మాట్లాడుతుండగా ఆకర్షితుడై, అక్కడ ఉన్న లింక్పై క్లిక్ చేశాడు. మరిన్ని వివరాల కోసం జీపీడీ అడిపెక్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడంతో యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తన పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని నమోదు చేశారు. పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రాబడి వస్తుందని నమ్మబలికారు. దీంతో ఆయన తన క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.39,694లను చెల్లించాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు చూపించగా అది నకిలీదిగా గుర్తించారు. వెంటనే బ్యాంక్కు సమాచారం ఇచ్చి ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించారు. అనంతరం 1930కు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్వేర్ సేవల ఔట్సోర్సింగ్కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం!

‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
గతంలో బస్తా ఫీడ్ రూ.900 ఉండగా ఇప్పుడు రూ.2,700 అయిపోయింది. మేత ధర మూడు రెట్లు పెరగగా రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్ రూ.600 ఉండగా ఇప్పుడు రూ.300కి పడిపోయింది. 30 కౌంట్కు రూ.వంద, మిగిలిన కౌంట్లకు సగటున రూ.60 చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం వంద కౌంట్ రూ.220 చొప్పున కొనాలని చెబుతున్నా రూ.180కి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలి. – మద్దాల గోపాలకృష్ణ, మేడపాడు, పశ్చిమగోదావరి జిల్లా ⇒ ‘30 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నా. ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్ను ఎక్స్పోర్టర్స్, ప్రాసెసింగ్ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు. ఫీడ్ ధరలు మాత్రం పెంచేశారు. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జోన్తో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. నెలకు రూ.1.20 లక్షలు అదనంగా విద్యుత్ బిల్లులు కడుతున్నా. ప్రభుత్వం నిర్దేశించిన రూ.220 ఏమాత్రం గిట్టుబాటు కాదు’ – గుండు నరసింహం, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ⇒ ‘ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లీజులకే పోతోంది. ఆక్వా సాగుకు ఎకరాకు రూ. 4.5 లక్షలకుౖపైగా ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే ఫీడ్ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి. మాది నాన్ ఆక్వా జోన్ ప్రాంతం. యూనిట్ రూ.4 చొప్పున కరెంట్ చార్జీలు చెల్లిస్తున్నా. నాన్ ఆక్వా జోన్ పరిధిలో యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ఆశపడ్డాం. ఆర్నెల్లకు ఒకసారి ట్రూఅప్, లోడింగ్ చార్జీల పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేలు భారం వేస్తున్నారు. అదనపు వినియోగ సుంకం (ఏసీడీ) పేరిట మరో రూ.30వేల నుంచి రూ.40 వేలు బాదేస్తున్నారు. ట్రంప్ సుంకం వాయిదా పడినా కంపెనీలు కౌంట్ రేట్లను మాత్రం పెంచలేదు. సీఎం ప్రకటించిన 100 కౌంట్ రూ.220 కూడా అమలు కావడం లేదు. మొత్తంగా రూ.5–10 లక్షల మేర నష్టపోతున్నాం. – మల్లిడి సందీప్రెడ్డి, గంటి, కొత్తపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ⇒ జాతీయ స్థాయిలో 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కాగా, దాంట్లో 35 శాతం (దాదాపు రూ. 20వేల కోట్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు 20–50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అయినా సరే ఇప్పుడు 60–100 కౌంట్ ధరలను తగ్గించేశారు. సాక్షి, అమరావతి: రొయ్య రైతులను కూటమి సర్కారు రోడ్డున పడేసింది! ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం.. కాల్చుకు తింటున్న కరెంట్ చార్జీలు.. పతనమవుతున్న ధరలు.. ప్రభుత్వ భరోసా కరువవడంతో రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫీడ్ ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ మేరకు కిలోకు రూ.20–25 మేర అన్ని రకాల ఫీడ్ ధరలు తగ్గించాల్సి ఉంది. ఫీడ్ రేట్లు తగ్గకపోగా మూడు రెట్లు పెరిగాయి. దీనిపై ఆక్వా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు గత పది నెలల్లో ట్రూ అప్ చార్జీలు, లోడింగ్, అదనపు వినియోగ సుంకం పేరిట విద్యుత్ చార్జీల బాదుడు మొదలైంది. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చకపోవడంతో మోసపోయిన రైతులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్ల సాకుతో కౌంట్కు రూ.30–80 మేర తగ్గించిన కంపెనీలు, అమెరికా విధించిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కౌంట్ ధర ఆ మేరకు పెంచలేదు.ఫీడ్ రేట్లు తగ్గించకుండా పది నెలల పాటు ఆక్వా రైతును దోపిడీ చేసిన కంపెనీలు కంటితుడుపు చర్యగా రూ.4 చొప్పున తగ్గించి చేతులు దులుపుకొన్నాయి. కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించటాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడేకు సిద్ధం కావడం, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే బాట పడుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.. రూ.1.50కే విద్యుత్ హామీ గాలికి.. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం.. ఇలా మెరెన్నో∙హామీలిచ్చారు. అయితే వీటి అమలు కోసం రూ.1,099 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్ పోర్టర్స్తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు. కమిటీలో రైతులకు చోటే లేదు.. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంట్ రేట్లను దారుణంగా తగ్గించాయి. ఎక్స్పోర్టర్స్తో సమావేశమైన సీఎం చంద్రబాబు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వారంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. వంద కౌంట్ రూ.220గా నిర్ణయించారు. ఇదే అదునుగా కంపెనీలు మిగిలిన కౌంట్ ధరలను రూ.20–60 వరకు తగ్గించేశాయి. 100 కౌంట్ను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కూడా కొనడం లేదు. కొందరు ట్రేడర్లు రూ.180కి మించి ఇవ్వడం లేదు. ట్రంప్ టారిఫ్ల వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంట్పై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కరువైంది. మెజార్టీ కంపెనీలు 20–50 కౌంట్ రొయ్యలను కొనడమే నిలిపివేశాయి. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఫీసుల (రొయ్య) మాదిరిగా ధరలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. సోయా ధర కిలో రూ.85 ఉన్నప్పుడు మేత ధర టన్ను రూ.15 వేలు ఉండేది. నేడు సోయా ధర కిలో రూ.23 కు తగ్గింది. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాల్సి ఉన్నా కంటి తుడుపు చర్యగా కేవలం రూ.4 తగ్గించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. ఆక్వాలో నంబర్ వన్ ఏపీ రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.69 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.56 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్ స్టోరేజ్లు, 1,104 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయి. 2023–24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నంబర్ వన్గా నిలవగా జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.09 శాతం ఏపీ నుంచే జరిగాయి. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్వాకు అండగా వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ తమకు అండగా నిలిచిందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరా కోసం ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చింది. నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్థారణ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. కరోనా వేళ 100 కౌంట్ రూ.150–180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. ఈక్వెడార్ సంక్షోభ సమయంలో సీనియర్ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సమీక్షించి 100 కౌంట్ రూ.245 కంటే తగ్గకుండా చర్యలు తీసుకుంది. 30 కౌంట్ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. అంతేకాకుండా పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860కి మించి పడకుండా అడ్డుకుందని గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా జోన్ పరిధిలో పదెకరాల లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ను అందించింది. 2014–19 మధ్య నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల విద్యుత్తు సబ్సిడీ బకాయిలు చెల్లించడంతోపాటు ఐదేళ్లలో ఏకంగా రూ.3,394 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంది.పంట విరామం మినహా మార్గం లేదు... ట్రంప్ ట్యాక్స్ను సాకుగా చూపించి కౌంట్ ధరలు దారుణంగా తగ్గించేశారు. సుంకాల పెంపు అమలు 90 రోజులు పాటు వాయిదా వేసినా 100 కౌంట్ రూ.200–220కు మించి కొనడం లేదు. కిలోకి రూ.30 నష్టపోతున్నాం. మేత ధర కనీసం రూ.20 తగ్గించాలి. రొయ్యల పెంపకంలో 20% మందులకే ఖర్చవుతుంది. వాటి ధరలు కూడా తగ్గించాలి. ఆక్వా సాగులో 80 %రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట విరామం మినహా మరో మార్గం లేదు. – భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు (బుల్లిరాజు), ఎదుర్లంక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాసబ్సిడీ విద్యుత్తు హామీని నెరవేర్చాలి.. 12 ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నా. యూనిట్ విద్యుత్తు రూ.1.50కే అని ఇచ్చిన హామీని కూటమి పార్టీలు నెరవేర్చాలి. రూ.3.50 నుంచి రూ.4 వరకు యూనిట్పై భారం పడుతోంది. ఎగుమతి దారులు, ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్గా మారటంతో చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 100 కౌంట్ రూ.260 నుంచి రూ.270 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – బొల్లెంపల్లి శ్రీనివాస్, అండలూరు, పశ్చిమగోదావరి జిల్లాపెట్టుబడి ఖర్చులు పెరిగాయి గతంతో పోలిస్తే ఆక్వా సాగు పెట్టుబడి ఏకంగా 50 శాతం పెరిగింది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. – బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లరేవు, కాకినాడ జిల్లాఅన్యాయమైపోతున్నాం.. గతేడాది కేంద్ర బడ్జెట్లో ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేయడంతో ఇంపోర్టెడ్ మేతపై పన్నులు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినప్పటికీ కంపెనీలు మేత ధర ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇప్పుడు అమెరికాలో దిగుమతి సుంకం పెంచారనే సాకుతో ఆగమేఘాల మీద కౌంట్ రేట్లు తగ్గించడం దుర్మార్గం. ట్యాక్స్ పెంపు వాయిదా పడ్డా కౌంట్ ధర ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. –టి.నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు

సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!
ఉరుకుల పరుగుల జీవనంలో ఉల్లాసం కావాలి. వారంలో ఒక్కరోజైనా, ఒక్క పూటైనా ఒత్తిడి నుంచి విముక్తి కావాలి. అందుకే నగరవాసులు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలాల్లో ఇప్పుడు, ఆఫ్రికన్ డ్రమ్ అయిన జెంబే ఒకటిగా నిలిచింది. మ్యూజిక్ థెరపీలో భాగంగా దీనిని నగరవాసులు ఆస్వాదించడం పెరుగుతోంది. చక్కని సంగీతం వినడం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే సంగీత వాయిద్యాన్ని పలికించడం కూడా అంతకు మించిన ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని జెంబే నిరూపిస్తోంది. ఇప్పటికే ముంబై వంటి నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా మాల్స్లో సర్వసాధారణంగా జెంబే సంగీత కార్యక్రమం ఇప్పుడిప్పుడే నగరంలోనూ ప్రాచుర్యం పెంచుకుంటోంది. డ్రమ్ మారో డ్రమ్.. సంగీత పరికరమైన డ్రమ్ – దాని అంతర్గత లయ స్వభావం కారణంగా – దానిని పలికించే వారికి ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గిటార్ లేదా హార్మోనికాతో పోలిస్తే సరళమైన సంగీత వాయిద్యం డ్రమ్స్. దీనిని పలికించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సైకోథెరపిస్ట్ నీతా మాట్లాడుతూ, ‘డ్రమ్ శిక్షణ స్ట్రోక్ పేషెంట్లకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపయుక్తం. నడక, చేయి నియంత్రణ ద్వారా వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారి కదలికల్లో ఖచ్చితత్వం, వేగం, సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది’ అంటున్నారు. ‘ఇది మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. అయితే అధికంగా డ్రమ్మింగ్ మీద ఆధారపడితే మాత్రం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు’ అని కూడా నీతా చెబుతున్నారు. ఒంటరిగా డ్రమ్మింగ్ చేయడం ఏకాగ్రతను పెంచుతుంది, లోతైన శ్వాస ద్వారా మెరుగైన ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సమన్వయ శక్తిని పెంచుతుంది. ప్రస్తుతంలో జీవించడం (మైండ్ ఫుల్ నెస్) సాధనలో సహాయపడుతుంది. స్నేహితులు లేదా ఇతరులతో కలిసి ప్లే చేయడం ఉత్తమ మార్గం. ఇందులో పాల్గొనేవారు అతని/ఆమె సౌలభ్యం, నైపుణ్యం ప్రకారం వాయిద్యాన్ని పలకిస్తారు కాబట్టి ఇది బంధాలను బలపరుస్తుంది, సహనాన్ని అలవరుస్తుంది. అపరిచితులను ఒకచోట చేర్చడం ద్వారా నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడే వ్యక్తులకు ఆ ఫీలింగ్ పోయేలా చేస్తుంది. ఆఫ్రికాలో సందేశాలు పంపే సంగీతం.. జెంబే పశ్చిమ ఆఫ్రికాలో, ముఖ్యంగా మాలి, గినియా ఐవరీ కోస్ట్ ప్రాంత మూలాలను కలిగి ఉంది. వివాహాలు, దీక్షా ఆచారాల వంటి ఉత్సవ సందర్భాల్లో ఈ డ్రమ్ వాయించడం సంప్రదాయం. వీటి ధ్వని మైళ్ల దూరం వినబడుతుందట. అందుకని, సుదూర ప్రాంతాల్లో ముఖ్యమైన సందేశాలను చేరవేయడానికి కూడా ఉపయోగిస్తారట. కాలక్రమేణా, జెంబే ఆఫ్రికా ను దాటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రాచుర్యం పొందిన వాయిద్యాల్లో జెంబే ఒకటి. గోబ్లెట్ ఆకారపు ఈ డ్రమ్ ఆఫ్రికాలోని డిజాలా/లెంకె చెట్టుకు చెందిన సింగిల్ పీస్ హార్డ్ వుడ్తో తయారవుతుంది. పైభాగం.. అంటే డ్రమ్హెడ్ గొర్రె/జంతు చర్మంతో రూపొందుతుంది. పెర్కుషన్ వాయిద్యం.. ఆరోగ్యమార్గం.. ‘దక్షిణాఫ్రికా నుంచి వచి్చన జెంబే ఒక పెర్కుషన్ వాయిద్యం. జాజ్, తబలా మృదంగం పెర్కుషన్ రంగంలో బాగా తెలిసిన ఎంపికలు అయితే, జెంబే నన్ను ఆకర్షించింది. అప్పటికే దీనిలో రాణిస్తున్న ఓ దక్షిణాఫ్రికా స్నేహితుడి ప్రోద్బలంతో దీన్ని సాధన చేశాను. సంగీతంలో పీహెచ్డీ చేశాను. మన శరీరంలోని ఏడు చక్రాల ప్రాముఖ్యతను నేను గుర్తించాను. నగరంలో తొలిసారి జెంబే ద్వారా మ్యూజికల్ థెరపీని పరిచయం చేశాను. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడి నిర్వహణలోనూ ఉపకరిస్తుంది. లయ ఆనందం ద్వారా ప్రజలను కనెక్ట్ చేసే అద్భుతమైన వాయిద్యం జెంబే. అన్ని వయసుల వారికీ సంగీతం తాలూకు మ్యాజిక్ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొంతకాలంగా నగరంలోని పాఠశాలలు కళాశాలల్లో ప్రదర్శనలు, వర్క్షాపులు నిర్వహిస్తున్నాం. – సాయి కుమార్, ది జెంబే సర్కిల్ వ్యవస్థాపకుడు ఎవరికి నప్పదు.. అంటే.. పెద్దపెద్ద శబ్దాలకు వ్యతిరేకంగా స్పందించే స్వభావం కలిగినవారు.. అలాగే.. భుజం కీళ్లు, మోచేతులు లేదా మణికట్టుకు గాయాలు, లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి ఈ జెంబే నప్పదు. అలాగే కార్డియో యాక్టివిటీని తక్కువగా మాత్రమే చేయాలని వైద్య సలహా పొందిన వారు కూడా దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది. (చదవండి: అక్కడ న్యూ ఇయర్కి శుభాకాంక్షలు చెప్పుకోరు..! ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వుతారు)
చనిపోయే ముందు మేము గుర్తుకు రాలేదా అమ్మ..!
కర్నూలులో డీఆర్డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్.. భారత్ సరికొత్త రికార్డు
మండే ఎండల్లో..మంటలతో జాగ్రత్త..! అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ముంబై పై హైదరాబాద్ పై చేయి... ఇండియన్ సినిమా అడ్రెస్ మారనుందా?
అంబేద్కర్ జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
ట్రేడింగ్ పేరుతో మోసపోయిన సినీ రచయిత.. కొంపముంచిన వీడియో
ఆవు పిడకలు...ఆరోగ్యం..!
క్యాన్సర్ను జయిస్తూ.. చదువులో రాణిస్తూ!
ఐపీఎల్తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
నేను కెప్టెన్ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
రెడ్బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
మనోజ్ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
అతడి బ్యాటింగ్కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
వారెవ్వా కరుణ్.. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇరగదీశాడు
తిరుమలలో మరో అపచారం
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్లోనూ..
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
హిట్ ఇచ్చిన డైరెక్టర్కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
సాక్షి కార్టూన్ 13-04-2025
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
నా సినిమాలో ఆ సీన్ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
అంతరిక్షం నుంచి అందాల భారతం
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
అక్టోబరులో ఆన్ డ్యూటీ
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
యూఎస్లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
బీఆర్ఎస్ సభకు అనుమతి
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
రష్యా గ్యాస్ పైప్లైన్ మాకిచ్చేయండి
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
'జాట్' సినిమాను బాయ్కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు
క్షమించు అత్తా.. ఇక నిన్ను బాధించే పని చేయను..!
గోల్డెన్ డేస్..
బేబీ.. ఇలా అయితే కష్టమే!
చంద్రబాబు,నితీశ్ వల్లే వక్ఫ్ చట్టం: అసదుద్దీన్ ఒవైసీ
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
వామ్మో.. అంత ఫీజులా!
ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
దానివల్లే గెలిచానని నిత్యం పూజిస్తూ ఉంటార్సార్!
ఎండలు మండుతాయి
ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!
చనిపోయే ముందు మేము గుర్తుకు రాలేదా అమ్మ..!
కర్నూలులో డీఆర్డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్.. భారత్ సరికొత్త రికార్డు
మండే ఎండల్లో..మంటలతో జాగ్రత్త..! అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ముంబై పై హైదరాబాద్ పై చేయి... ఇండియన్ సినిమా అడ్రెస్ మారనుందా?
అంబేద్కర్ జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
ట్రేడింగ్ పేరుతో మోసపోయిన సినీ రచయిత.. కొంపముంచిన వీడియో
ఆవు పిడకలు...ఆరోగ్యం..!
క్యాన్సర్ను జయిస్తూ.. చదువులో రాణిస్తూ!
ఐపీఎల్తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
నేను కెప్టెన్ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
రెడ్బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
మనోజ్ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
అతడి బ్యాటింగ్కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
వారెవ్వా కరుణ్.. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇరగదీశాడు
తిరుమలలో మరో అపచారం
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్లోనూ..
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
హిట్ ఇచ్చిన డైరెక్టర్కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
సాక్షి కార్టూన్ 13-04-2025
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
నా సినిమాలో ఆ సీన్ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
అంతరిక్షం నుంచి అందాల భారతం
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
అక్టోబరులో ఆన్ డ్యూటీ
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
యూఎస్లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
బీఆర్ఎస్ సభకు అనుమతి
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
రష్యా గ్యాస్ పైప్లైన్ మాకిచ్చేయండి
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
'జాట్' సినిమాను బాయ్కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు
క్షమించు అత్తా.. ఇక నిన్ను బాధించే పని చేయను..!
గోల్డెన్ డేస్..
బేబీ.. ఇలా అయితే కష్టమే!
చంద్రబాబు,నితీశ్ వల్లే వక్ఫ్ చట్టం: అసదుద్దీన్ ఒవైసీ
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
వామ్మో.. అంత ఫీజులా!
ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
దానివల్లే గెలిచానని నిత్యం పూజిస్తూ ఉంటార్సార్!
ఎండలు మండుతాయి
ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!
సినిమా

అక్టోబరులో ఆన్ డ్యూటీ
అక్టోబరులో పోలీసాఫీసర్గా ప్రభాస్ చార్జ్ తీసుకోనున్నారట. ప్రభాస్ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న చిత్రం ఇది. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభించడానికి సందీప్ రెడ్డి వంగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సో... పోలీస్ ఆఫీసర్గా అక్టోబరు నుంచి ప్రభాస్ ఆన్ డ్యూటీ అన్నమాట. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒకవైపు ఈ చిత్రం సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతూనే, మరోవైపు ‘స్పిరిట్’ సినిమా లొకేషన్స్ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు సందీప్రెడ్డి. ఇందులో భాగంగా ఆయన ఇటీవల మెక్సికో వెళ్లొచ్చారు. అక్కడ ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్ను కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా సందీప్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్రెడ్డి వంగా నిర్మించనున్న ‘స్పిరిట్’ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మనోజ్ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఆ మధ్య కాస్త సైలెంట్ అయిపోయారనుకునేలోపే మరోసారి వీరి కుటుంబంలో చిచ్చు రాజుకుంది. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ మోహన్బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు మనోజ్ (Manchu Manoj). కూతురి బర్త్డే కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని ఆరోపించారు. అటువైపు మనోజ్, మోహన్బాబు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించనేలేదు.కూతురితో ర్యాంప్ వాక్ఇలా కుటుంబ గొడవలతో మంచు ఫ్యామిలీలో ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. మోహన్బాబు కూతురు లక్ష్మీ (Manchu Lakshmi Prasanna).. ఈ వివాదాలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు. తాజాగా ఆమె 'టీచ్ ఫర్ ఛేంజ్' వార్షిక ఫండ్రైజర్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కూతురితో కలిసి ర్యాంప్ వాక్ కూడా చేసింది. మనసారా ఏడ్చేసిన మంచు లక్ష్మిఆమె స్టేజీపై నిలబడిన సమయంలో మనోజ్ దంపతులు వెనక నుంచి వచ్చి సర్ప్రైజ్ చేశారు. తమ్ముడిని చూసి లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు. స్టేజీపై ఉన్న సంగతి కూడా మర్చిపోయి అతడిని పట్టుకుని మనసారా ఏడ్చేసింది. దీంతో మనోజ్-మౌనిక దంపతులు ఆమెను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధం ఎంత గొప్పదో అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by NAMASTE.BIGGBOSS (@namaste_biggboss) చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్.. అమ్మ ఒప్పుకోవట్లే

OTT Movie Review: వీడి జాతకంలో పెళ్లి లేదా?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ఒరు జాతి జాతకం(Oru Jati Jathakam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.కల్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ పెళ్లి యోగమే లేని మన కథానాయకుడు తన పెళ్లి కోసం చేసే ప్రయత్నాల హడావిడే ఈ ‘ఒరు జాతి జాతకమ్’ సినిమా. గతంలో ఇదే కథాంశం మీద ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు గాని ఈ సినిమా మాత్రం డిఫరెంట్. ఇంకా చె΄్పాలంటే... ఇదో హైబ్రిడ్ పీస్. మోహనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వినీత్ శ్రీనివాసన్ కథానాయకుడు. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... జయేష్కు 30 సంవత్సరాలు వచ్చినా ఏ సంబంధం కుదరదు. పెళ్లి కోసం జయేష్ పరితపిస్తుంటాడు. అంతేనా ఏకంగా మ్యారేజ్ ఏజెన్సీకి లైఫ్ టైమ్ మెంబరై వాళ్లని వేధిస్తుంటాడు. ఈ కోవలోనే శినిత అనే అమ్మాయి సంబంధం తెలుస్తుంది. శినిత తాను పామిస్ట్రీ చదివానని, జయేష్ చేయి చూస్తానని చెబుతుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. జయేష్ చేయి చూసిన శినిత... జయేష్ జీవితంలో అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయని, ఓ వ్యక్తి జయేష్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అలాగే జయేష్కి వివాహం విచిత్రంగా అయ్యే అవకాశం కనబడుతోందని, అంతేకాదు... ఆ వివాహం వల్ల కొన్ని వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరుగుతాయని చెబుతుంది.అయితే జయేష్కు తనతో వివాహం చేసుకునే రాత కనిపించలేదని చెప్పి వెళ్లిపోతుంది శినిత. ఈ శినిత క్యారెక్టర్ ఆఖర్లో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈలోపు జయేష్కు తన కుటుంబం నుండి అనుకోని సమస్యలు చాలానే వచ్చి పడతాయి. మరి... జయేష్కు పెళ్లవుతుందా? లేదా అన్నది మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘ఒరు జాతి జాతకమ్’ సినిమాలో చూడాలి. ఈ సినిమా మాత్రం ఆద్యంతం కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇది వేరే లెవెల్ కామెడీ అని చెప్పవచ్చు. దర్శకుడు తన కథానాయకుడు ఎలా నటించాలని అనుకున్నారో అంతకు వేయి రెట్లు వినీత్ వినూత్నంగా నటించారు. ఇట్స్ ఎ మస్ట్ వాచబుల్ కామెడీ ఫిల్మ్. – హరికృష్ణ ఇంటూరు

సమాజానికి ఉపయోగపడేలా...
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిద్దేష్, ‘శుభలేఖ’ సుధాకర్, ‘శంకరాభరణం’ తులసి, షాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో లాంచ్ వేడుకకు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్. నారాయణమూర్తి, జయసుధ తదితర ప్రముఖులు హాజరై... సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావా లని, ఈ చిత్రం విజయం సాధించాలని పేర్కొన్నారు.‘‘ఒక గొప్ప సామాజిక లక్ష్యంతో మా ప్రజా నాట్యమండలి బాబ్జీ తీసిన ఈ సినిమాను విజయవంతం చేయాలని, ఇటువంటి చిత్రాలు మరిన్ని రావడానికి రెండు రాష్ట్రాల్లోని మా పార్టీల, ప్రజా సంఘాల సభ్యులు, అభిమానులు కృషి చేయాలని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం’’ అన్నారు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ. ఈ వేడుకలో వివిధ వామపక్ష పార్టీల నేతలు, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎమ్ఎల్సీ సత్యం తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం
క్రీడలు

చెన్నై కోలుకునేనా!
లక్నో: వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు... ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్తో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి పోరులో గెలుపొందగా... ఆ తర్వాత వరుసగా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓడింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకొని లీగ్లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై... తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నీకి దూరం కాగా... గత మ్యాచ్లోనే ‘మాస్టర్ మైండ్’ మహేంద్రసింగ్ ధోని జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే పరాజయాలతో డీలా పడ్డ జట్టును అతడి సారథ్యం కూడా గట్టెక్కించలేకపోయింది. కోల్కతాతో జరిగిన పోరులో బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకుంది. వాటన్నింటిని పక్కన పెట్టి తిరిగి సత్తా చాటాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సీజన్లో 6 మ్యాచ్లాడి 4 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసుకుంది. గత మూడు మ్యాచ్ల్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్లపై గెలిచి లక్నో ఫుల్ జోష్లో ఉంది. మరి లక్నో జోరును అడ్డుకొని చెన్నై విజయాల బాట పడుతుందా చూడాలి! హిట్టర్లతో దట్టంగా... గత మూడు మ్యాచ్ల్లోనూ పవర్ప్లే వికెట్లు కోల్పోని లక్నో జట్టు... హిట్టర్లతో దట్టంగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల గుజరాత్తో మ్యాచ్కు అందుబాటులో లేని మిచెల్ మార్ష్... చెన్నైతో పోరులో బరిలోకి దిగడం ఖాయమే. మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్తో లక్నో టాపార్డర్ శత్రుదుర్బేధ్యంగా ఉంది. గత కొన్నాళ్లుగా కేవలం సిక్స్లు కొట్టడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోతున్న పూరన్ను అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తి మీద సామే!ఈ సీజన్లో సీఎస్కే ప్లేయర్లంతా కలిసి 32 సిక్స్లు బాదితే... పూరన్ ఒక్కడే 31 సిక్స్లు కొట్టాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగుతున్న ఈ విండీస్ వీరుడు మరోసారి చెలరేగితే లక్నో జైత్రయాత్ర కొనసాగినట్లే. రిషబ్ పంత్, ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్లతో మిడిలార్డర్ బలంగా ఉండగా... డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్తో ఆకట్టుకుంటుండగా... యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ... ‘సంతకం’ సంబరాలు కొనసాగించాలని చూస్తున్నాడు. అవేశ్ ఖాన్, ఆకాశ్దీప్, రవి బిష్ణోయ్తో లక్నో బౌలింగ్లో మంచి వైవిధ్యం ఉంది. లోపాలు దిద్దుకుంటేనే! చెన్నైకు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. నిలకడ కనబర్చలేకపోతున్న ఆ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నా... ఆ తర్వాత ఇన్నింగ్స్ను నడిపించే వారు కరువయ్యారు. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో అశ్విన్ తర్వాత క్రీజులోకి వస్తున్న ధోని... గతంలో మాదిరిగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం కనబర్చ లేకపోతున్నాడు. ఇతర జట్లలో దేశీయ ఆటగాళ్లు చెలరేగుతుంటే... చెన్నైలో ఆ బాధ్యత తీసుకునే ప్లేయర్లు కనపించడం లేదు. కోల్కతాతో జరిగిన చివరి మ్యాచ్లో అయితే చెన్నై మరీ పేలవ ఆటతీరు కనబర్చింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లంతా సమష్టిగా సత్తాచాటాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ వరుసగా ఐదు మ్యాచ్లు ఓడని సీఎస్కే... మరో పరాజయం మూటగట్టుకుంటే ఇక కోలుకోవడం కష్టమే. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న చెన్నై బ్యాటర్లు... దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయ్లను ఎలా ఎదుర్కంటారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్ ), మార్క్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, పంత్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్, ఆకాశ్దీప్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్ ), కాన్వే, రచిన్, త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అశ్విన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ.

పియాస్ట్రి... మళ్లీ గెలిచాడు
సాఖిర్ (బహ్రెయిన్): క్వాలిఫయింగ్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ఫార్ములావన్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన సీజన్ నాలుగో రేసు బహ్రెయిన్ గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఆ్రస్టేలియాకు చెందిన పియా్రస్టి... నిర్ణీత 57 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 39.435 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో చైనా గ్రాండ్ప్రిలోనూ పియాస్ట్రి టైటిల్ సాధించాడు. మెర్సిడెస్ జట్టుకు చెందిన జార్జి రసెల్ రెండో స్థానాన్ని పొందగా... మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ మూడో స్థానంలో నిలిచాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్గా నిలుస్తున్న రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన లూయిస్ హామిల్టన్ ఐదో స్థానాన్ని సాధించాడు. 24 రేసుల ఈ సీజన్లో నాలుగు రేసులు పూర్తయ్యాయి. 77 పాయింట్లతో లాండో నోరిస్ అగ్ర స్థానంలో... 74 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానంలో... వెర్స్టాపెన్ 69 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని ఐదో రేసు సౌదీ అరేబియా గ్రాండ్ప్రి ఈనెల 20న జిద్దా నగరంలో జరుగుతుంది.

సెమీస్లో బాలాజీ జోడీ ఓటమి
చెన్నై: మెక్సికో సిటీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ మూడో ర్యాంకర్ శ్రీరామ్ బాలాజీ పోరాటం ముగిసింది. మెక్సికో సిటీలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ రేయస్ వరేలా (మెక్సికో) ద్వయం 4–6, 5–7తో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఆస్టిన్క్రాయిసెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బాలాజీ–వరేలా మూడు ఏస్లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. సెమీఫైనల్లో ఓడిన బాలాజీ–వరేలాలకు 3470 డాలర్ల (రూ. 2 లక్షల 98 వేలు) ప్రైజ్మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

16 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
స్టాక్హోమ్ (స్వీడన్): పురుషుల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. స్విమ్ ఓపెన్ స్టాక్హోమ్ టోర్నీలో జర్మనీకి చెందిన లుకాస్ మార్టిన్ ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన లుకాస్ మార్టిన్ 400 మీటర్లను 3 నిమిషాల 39.96 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2009 నుంచి పాల్ బీడెర్మన్ (3ని:40.07 సెకన్లు; జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మార్టిన్ బద్దలు కొట్టాడు. 2009లో రోమ్లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్లో ‘సూపర్ సూట్స్’ ధరించి బీడెర్మన్ ఈ రికార్డు నెలకొల్పాడు. 2010లో ప్రపంచ స్విమ్మింగ్ సమాఖ్య ‘సూపర్ సూట్స్’ను నిషేధించింది.
బిజినెస్

మహిళలకు ప్రత్యేక బీమా పాలసీలు
మహిళ ఆరోగ్యం ఒక కుటుంబానికి ఎంతో అవసరం. ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సాఫీగా ముందుకునడుస్తుంది. అయితే మహిళల ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రసూతి సంబంధిత ఖర్చులు, గైనకాలజీ సమస్యలు, రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలు వంటి ప్రత్యేకమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ఆరోగ్య బీమా ఒక కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.అందుకే దేశంలోని అనేక బీమా ప్రొవైడర్లు ఇప్పుడు ఈ అవసరాలను తీర్చే మహిళల కోసమే ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఉమెన్ స్పెసిఫిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, అవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ఉమన్ టర్మ్ ప్లాన్క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కూడా కవరేజీ లభించేలా మహిళల కోసం బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు ’బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ఉమన్ టర్మ్ (ఎస్డబ్ల్యూటీ) ప్లాన్’. ఇది సంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన బెనిఫిట్స్, ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ మొదలైన వాటితో ఆర్థిక భద్రతను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ స్మార్ట్ ఉమెన్ ప్లాన్ » గర్భధారణ సంబంధిత సమస్యలను కవర్ చేస్తుంది.» క్లిష్టమైన అనారోగ్యాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.టాటా-ఏఐజీ వెల్సూరెన్స్ ఉమెన్ పాలసీ» హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది.» క్యాన్సర్, స్ట్రోక్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేస్తుందిస్టార్ వెడ్డింగ్ గిఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి, వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ నవ వధూవరుల కోసం రూపొందించిన ప్రత్యేక పాలసీ ఇది.రెలిగేర్ జాయ్ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి ప్రయోజనాలు, నవజాత శిశువుల సంరక్షణపై దృష్టి పెడుతుందిన్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ» మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్లాన్ వారికి పూర్తి ఆరోగ్య కవరేజీని కల్పిస్తుంది.రిలయన్స్ హెల్త్ పాలసీ» అదనపు వెల్ నెస్ లక్షణాలతో సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.సరైన ప్లాన్ను ఎలా ఎంచుకోవాలి?ఉత్తమ హెల్త్ ప్లాన్ను ఎంచుకోవడం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.కవరేజ్: పాలసీలో మీకు సంబంధించిన ప్రసూతి, క్రిటికల్ ఇల్ నెస్ కవర్ అయ్యేలా చూసుకోండి.ప్రీమియం ఖర్చు: ఖర్చు, ప్రయోజనాల ఆధారంగా విభిన్న ప్లాన్లను పోల్చి చూడండి.వెయిటింగ్ పీరియడ్: ప్రసూతి కవరేజీ, ముందుగా ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్ చెక్ చేయండి.అదనపు ప్రయోజనాలు: వెల్నెస్ కార్యక్రమాలు, నివారణ సంరక్షణ, ఆసుపత్రిలో చేరిక ప్రయోజనాల కోసం చూడండి.

బీమాతో సైబర్ మోసాలకు చెక్!
ఐటీ ఉద్యోగి వంశీరామ్ (32) మొబైల్కు ఒక సందేశం వచ్చింది. విద్యుత్ బిల్లు గడువు ముగిసిపోయిందని.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ నిలిపివేస్తామని అందులో ఉంది. వెంటనే లింక్పై క్లిక్ చేసి చెల్లించేశాడు వంశీ. కానీ, ఖాతా నుంచి రూ.80,000 డెబిట్ అయిపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. ఇలాంటివి రోజుకు వేలాది ఘటనలు జరుగుతున్నాయి. గ్రోసరీ షాపింగ్, సోషల్ మీడియా ముచ్చట్లు, వర్తకులకు క్యూఆర్ కోడ్ చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు, బ్యాంకింగ్ సేవలు.. నేడు లావాదేవీలన్నీ మొబైల్ ఫోన్ల నుంచే. దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలు డిజిటల్ రూపంలోకి మళ్లాయి. సౌకర్యంగా ఉండడంతో అందరూ స్మార్ట్ఫోన్ నుంచే కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ఇది సైబర్ మోసాలకు అడ్డాగా మారిపోయింది. ఏటా 15 లక్షల సైబర్ మోసాలు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించుకోవడంపై తప్పకుండా దృష్టి సారించాలి. దీని గురించి అవగాహన కల్పించే కథనం ఇది... 2018లో సైబర్ నేరాలు 2.08 లక్షలు కాగా, ఇప్పుడు ఏటా 15 లక్షలకు చేరాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. బాధితులు అందరూ బయటకు చెప్పుకోలేరు. కనుక, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. సైబర్ నేరాలతో ఆర్థికంగా నష్టపోవడమే కాదు, మానసికంగా ఎంతో వేదనకు గురికావాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి ఆదుకునేదే సైబర్ ఇన్సూరెన్స్. దేశంలో 84 శాతం ఇంటర్నెట్ యూజర్లు ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. షాపింగ్, బ్యాంకింగ్ లేదా సోషల్ మీడియా చాటింగ్, ఆన్లైన్ కార్యకలాపాలు ఏవైనా సరే... ఇంటర్నెట్తో అనుసంధానమైన ప్రతి ఒక్కరికీ డేటా లీకేజీ, సైబర్ దాడులు, మోసాల రిస్క్ ఉంటుంది. సైబర్ నేరస్థులు డీప్ఫేక్ టెక్నాలజీ, ఏఐ తదితర అత్యాధునిక టెక్నాలజీలతో దాడులకు దిగుతున్నారు. ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ను సైతం తప్పుదోవ పట్టించి.. నకిలీ లింక్ ద్వారా బ్యాంక్ ఖాతా ఊడ్చేస్తున్న ఘటనలు వింటున్నాం. టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం లేని విశ్రాంత జీవుల నుంచి జీవితకాల పొదుపు నిధులను మాయం చేస్తున్నారు. నేడు ప్రపంచం మొత్తం డిజిటల్గా అనుసంధానమై ఉంది. దీంతో నేరగాళ్లు ఏదో ఒక దేశంలో ఉండి, మరో దేశంలోని వారిని సులభంగా మోసం చేయగలుగుతున్నారు. ఒకవైపు సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. చాలా మందికి దీని గురించి అవగాహన లేకపోవడం ఒకటి అయితే, తాము జాగ్రత్తగా ఉంటామన్న ధీమా కొందరిని బీమాకు దూరంగా ఉంచుతోంది. సైబర్ రక్షణ...సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాన్ని పాలసీదారులకు సైబర్ ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు సమ్ అష్యూర్డ్ (బీమా) తీసుకోవచ్చు. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం సుమారు రూ.600 వరకు.. రూ.కోటి కవరేజీకి రూ.25,000 వరకు ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి దురి్వనియోగం చేయడం, సైబర్ వేధింపులు, బెదిరింపులు, వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం వంటి కేసుల్లో.. చట్టపరమైన చర్యలకు అయ్యే వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. మాల్వేర్, రాన్సమ్వేర్ రక్షణ కూడా ఉంటుంది. మాల్వేర్ దాడుల కారణంగా సర్వర్, నెట్వర్క్, కంప్యూటర్లకు వాటిల్లే నష్టానికి పరిహారం లభిస్తుంది. సైబర్ నేరస్థులు డివైజ్ను (మొబైల్ లేదా పీసీ/ల్యాప్టాప్) హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో డేటా రికవరీకి, డివైజ్ రిపేర్ వ్యయాలను బీమా కంపెనీ భరిస్తుంది. డేటా చోరీతో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఆన్లైన్ బ్లాక్ మెయిల్, సైబర్ బుల్లీయింగ్ తదితర ఘటనల్లో న్యాయపరమైన చర్యలకు, సాంకేతిక సాయానికి అయ్యే వ్యయాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. సైబర్ ఇన్సూరెన్స్లోనూ విభిన్న ప్లాన్లు ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయి. మొబైల్ వాలెట్లకూ రక్షణ కల్పించుకోవచ్చు. ఈమెయిల్ స్పూఫింగ్ దాడి వల్ల ఎదురయ్యే ఆర్థిక నష్టం, నేరస్థులపై చర్యలకు అయ్యే వ్యయాలకూ చెల్లింపులు ఉంటాయి. సందేశాలు పంపడం, ఫోన్ కాల్స్, నకిలీ వెబ్సైట్ల ద్వారా సున్నితమైన డేటాను పొందడం ద్వారా ఆర్థికంగా నష్టం కలిగించడం వంటి ఫిషింగ్ దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. ఎంత కవరేజీ అవసరం? కంపెనీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి ఫైర్వాల్స్ వంటి సాఫ్ట్వేర్ టూల్స్తో సైబర్ దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అదే మాదిరి వ్యక్తులు సైతం తమ వంతుగా సైబర్ బీమా రక్షణను తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ముందుగా బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్, క్రెడిట్ కార్డ్ లిమిట్, ఈ–వ్యాలెట్ ఇలా సైబర్ దాడుల రిస్క్ ఉన్న పెట్టుబడుల విలువను ఒకసారి పరిశీలించాలి. మీ లిక్విడ్ అసెట్స్ విలువకు సరిపడా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తరచూ, అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి అధిక కవరేజీ అవసరం. వీటికి కవరేజీ రాదు.. సైబర్ ఇన్సూరెన్స్లో మినహాయింపులు కూడా ఉంటాయి. వీటి గురించి పాలసీదారులు ముందుగానే సమగ్రంగా తెలుసుకోవాలి., చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా చేసే వ్యవహారాలు, లావాదేవీలు, ఉద్దేశపూర్వక ఉల్లంఘనల కారణంగా జరిగే నష్టానికి ఇందులో పరిహారం రాదు. వాణిజ్య రహస్యాలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించి ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలకూ ఇందులో మినహాయింపులు ఉన్నాయి. యుద్ధం, సైబర్ యుద్ధం, సహజ ప్రమాదాల కారణంగా వాటిల్లే నష్టానికీ రక్షణ ఉండదు. క్రిప్టో పెట్టుబడులు, గ్యాంబ్లింగ్, మోసపూరిత చర్యలు, అనధికారికంగా డేటా సమీకరించడం, నిషేధిత సైట్లలోకి ప్రవేశించడం వల్ల వాటిల్లే నష్టం తదితర వాటికి సైబర్ బీమాలో కవరేజీ ఉండదు. వెంటనే రిపోర్ట్ చేయాలి.. మోసపూరిత లావాదేవీలు జరిగాయంటే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్కు కాల్ చేసి వాటి ఖాతా/క్రెడిట్/డెబిట్కార్డుల యాక్సెస్ను తాత్కాలికంగా బ్లాక్ చేయించాలి. వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాలి. 1930కు కాల్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత బీమా కంపెనీకి సమాచారం అందించాలి. పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం, ఆ కాపీ తీసుకుని బీమా కంపెనీ వద్ద నిబంధనల మేరకు క్లెయిమ్ దాఖలు చేయాలి. బ్యాంక్/ఎన్బీఎఫ్సీ వద్ద ఫిర్యాదుకు సంబంధించి రుజువులను జత చేయాలి. జరిగిన నష్టానికి సంబంధించి ఆధారాలూ సమర్పించాలి. సైబర్ టిప్స్.. → చాలా మంది ఆన్లైన్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం సైబర్ దాడులకు అవకాశం ఇచి్చనట్టు అ వుతోంది. ప్రతి ఒక్కరూ తమవంతు రక్షణ చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. → స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లలో సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. → తెలియని వెబ్సైట్లను యాక్సెస్ చేయకుండా ఉండాలి. → గూగుల్ సెర్చ్లో శోధించే క్రమంలో ఎదురయ్యే వెబ్ పోర్టళ్లు, కాంటాక్టుల వివరాలు, చిరునామాలు నిజమైనవేనా? అన్న పరిశీలన తర్వాతే ముందుకు వెళ్లాలి. → డొమైన్ చిరునామాలో హెచ్టీటీపీఎస్ లేకపోతే యాక్సెస్కు దూరంగా ఉండాలి. → బలహీన పాస్వర్డ్లు కాకుండా.. స్మాల్, క్యాపిటల్ లెటర్లు, స్పెషల్ క్యారెక్టర్లు, నంబర్లతో కూడిన పటిష్ట పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవాలి. → పబ్లిక్ వైఫై, ఉచిత నెట్ వర్క్ల యాక్సెస్కు దూరంగా ఉండాలి → టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఏ)ను ఎనేబుల్ చేసుకోవాలి. → ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్, యాప్లు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎప్పుడూ అప్డేటెడ్గా ఉంచుకోవాలి. → సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను కొత్తవారు యాక్సెస్ చేయకుండా నియంత్రణలు పెట్టుకోవాలి. → మెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే యూఆర్ఎల్ లింక్లపై క్లిక్ చేయొద్దు. అవి విశ్వసనీయ సంస్థల నుంచి వచి్చనవేనా అన్నది ధ్రువీకరించుకోవాలి. → పేమెంట్ యాప్లు సహా అన్ని ముఖ్యమైన యాప్లకు ఫింగర్ ప్రింట్ లాగిన్ ఎనేబుల్ చేసుకోవాలి. → ఎప్పటికప్పుడు ముఖ్యమైన డేటాను క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి బ్యాకప్ తీసుకోవాలి. → ఓటీపీలు, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా, చిరునామా, ఫోన్ నంబర్లు ఇలా కీలక వివరాలను ఫోన్లో, ఆన్లైన్లో ఎవరితోనూ పంచుకోరాదు. → ఈ జాగ్రత్తలతోపాటు తగినంత రక్షణ కవరేజీతో సైబర్ బీమా తీసుకోవడం మరవొద్దు. హెచ్ఏఎల్కు నేరగాళ్ల బురిడీప్రభుత్వరంగ రక్షణ ఉత్పత్తుల కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ను సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించడం గమనార్హం. కంపెనీ కాన్పూర్ శాఖను తప్పుదోవ పట్టించి రూ.55 లక్షలు కాజేశారు. యూఎస్కు చెందిన పీఎస్ ఇంజనీరింగ్ ఐఎన్సీ నుంచి హెచ్ఏఎల్ విడిభాగాలు కొనుగోలు చేయాలనుకుంది. కంపెనీ అధికారిక ఈ మెయిల్తో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ రెండు సంస్థల మధ్యలో సైబర్ నేరగాళ్లు ప్రవేశించారు. యూఎస్ కంపెనీ పీఎస్ ఇంజనీరింగ్ అధికారిక ఈమెయిల్ చిరునామాలో ఒక ఇంగ్లిష్ ‘ఇ’ తొలగించి, మిగిలిన అక్షరాలన్నీ ఉండేలా ఈమెయిల్ ఐడీ సృష్టించి హెచ్ఏఎల్తో సంప్రదింపులు చేశారు. రూ.55 లక్షల అడ్వాన్స్ను తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. జరిగిన మోసాన్ని హెచ్ఏల్ ఆలస్యంగా గుర్తించింది. అలాగే, ఆ మధ్య ఓ ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కీలక డేటా లీక్ అయ్యింది. 68,000 డాలర్లు చెల్లించాలంటూ హ్యాకర్ డిమాండ్ చేశాడు. – సాక్షి, బిజినెస్ డెస్క్

పాత బైక్ ధరకే 2025 సుజుకి హయబుసా
సుజుకి మోటార్సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఖరీదైన బైకులలో సుజుకి హయబుసా ఒకటి. దీనిని కంపెనీ OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. అయితే ఈ అప్డేట్ బైక్ ధరలో మాత్రమే ఎలాంటి మార్పు లేదు. అంటే ఈ కొత్త బైక్.. పాత బైక్ ధరకే అందుబాటులో ఉందన్నమాట.2025 సుజుకి హయబుసా బైక్ ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). చూడటానికి మునుపటి బైక్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఉద్గార నియమాలకు అనుగుణంగా అప్డేట్ అయింది. ఈ బైక్ అదే 1340 సీసీ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 150 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్ లాంచ్: రేటెంతంటే?కొత్త హయబుసా ఇప్పుడు మెటాలిక్ మ్యాట్ స్టీల్ గ్రీన్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్/మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్, మెటాలిక్ మిస్టిక్ సిల్వర్/పెర్ల్ వైగర్ బ్లూ అనే కొత్త డ్యూయెల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తీసుకున్న నోట్ప్యాడ్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. టెస్లా సీఈఓ కాన్ఫరెన్స్ టేబుల్ వద్ద కూర్చుని 'ఎలాన్ మస్క్' అని రాసి ఉన్న నేమ్ కార్డ్ కనిపిస్తుంది. అక్కడే ఒక పేపర్ మీద 'టాప్ సీక్రెట్' రాసి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫోటోలో ఒక పెన్ను, ఖాళీ గాజు మాత్రమే కాకుండా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ముద్ర ఉన్న కోస్టర్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరక్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా వినియోగదారులు మస్క్ నోట్ప్యాడ్ను జూమ్ చేయడంతో “టాప్ సీక్రెట్” అనే పదాలు కనుగొన్నారు. మీడియాను గందరగోళంలోకి నెట్టడానికి మస్క్ ఈ విధంగా చేసి ఉంటాడని.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఎలాన్ నవ్వుతున్న ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..ఒక ట్రిలియన్ నుంచి రెండు ట్రిలియన్ డాలర్ల వరకు.. అమెరికా వ్యయాలను తగ్గిస్తామని ఒకప్పటి నుంచి చెబుతున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు మాట మార్చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో.. 150 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించగలమని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ట్రంప్ నేతృత్వంలోని డోజ్ టీమ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని మస్క్ మెచ్చుకున్నారు.😂 https://t.co/0NsNM4yAdR— Elon Musk (@elonmusk) April 12, 2025
ఫ్యామిలీ

సమ్మర్లో వర్కౌట్లు చేసేటప్పుడు.. బీ కేర్ఫుల్..!
సమ్మర్ ముదరగానే చెమటలు పడుతుండటంతో దేహం ద్రవాలను కోల్పోయి, చాలామందిలో మజిల్ క్రాంప్స్ రావడం పెరుగుతుంది. అకస్మాత్తుగా నిద్రలో గానీ, కొందరిలో పగటివేళలోనే పిక్కలు, తొడకండరాలు, ఛాతీ కండరాలు పట్టేస్తుంటాయి. కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారంలో కొన్ని అవసరమైన పోషకాలు లోపించడం, దేహానికి అలసటతో కలిగే నిస్సత్తువతోపాటు కొన్ని రకాల మందులు వాడకంతోనూ కొందరిలో మజిల్ క్రాంప్స్ కనిపించవచ్చు. కండరాల అలసట వల్ల, అలాగే వ్యాయామానికి ముందు తగినంతగా స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయకపోవడం, రక్తంలో ఎలక్ట్రోలైట్స్ పరిమాణం తగ్గిపోవడం కూడా కారణాలవుతాయి. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా తాజాగా తయారు చేసుకున్న మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడం, చక్కెర లేకుండా పండ్లరసాలు, ద్రవాహారాలు తీసుకోవచ్చు. అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ ఉండటంతోపాటు, కంటినిండా నిద్రపోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. వ్యాయామానికి ముందు చేసే వార్మప్ కూడా ఈ సమస్య నివారణకు బాగానే తోడ్పడుతుంది. (చదవండి:

చిటికెలో జుట్టుని నచ్చిన హెయిర్ స్టైల్లో మార్చుకోవచ్చు ఇలా..!
జుట్టును మృదువుగా, అందంగా సరిచేసుకోవాలంటే చేతిలో స్ట్రెయిటెనర్ ఉండాల్సిందే అంటారు చాలామంది ఆడవారు. అయితే సమయం ఉన్నా లేకున్నా, వీలున్నా లేకున్నా– పవర్ ప్లగ్ సమీపంలోనే చాలా స్ట్రెయిటెనర్లతో కేశాలంకరణ సాధ్యమవుతుంది. కానీ ఈ లేటెస్ట్ వైర్లెస్ గాడ్జెట్తో సులభంగా ఎక్కడైనా, ఎప్పుడైనా జుట్టును నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఈ గాడ్జెట్ భలేగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రీచార్జబుల్ స్ట్రెయిటెనర్. దీన్ని వైర్లెస్ గాడ్జెట్లా వాడుకునే వీలుంటుంది. ఇది చూడటానికి, ఉపయోగించడానికి అచ్చం దువ్వెనలా ఉండటంతో జుట్టు దువ్వుకున్నట్లే దువ్వుకుని, ఈజీగా స్ట్రెయిటెనింగ్ చేసుకోవచ్చు. దీనిలో 120 డిగ్రీస్ నుంచి 200 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మొత్తం మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఆరోగ్యమైన జుట్టుకు, బలహీనపడిన జుట్టుకు ఉష్ణోగ్రతను ఎంపిక చేసుకోవడంలో వ్యత్యాసం పాటించాలి. దీనితో పొడిబారి చిట్లిన జుట్టును సరి చేసుకోవచ్చు. వంకీల జుట్టును సులభంగా నిటారుగా మార్చుకోవచ్చు. ఉంగరాల జుట్టును మృదువుగా చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్కు అటాచ్ చేసుకునేందుకు అనువుగా చార్జింగ్ బేస్ కూడా లభిస్తుంది. ఈ కూంబ్ మెషిన్ ముందువైపు పవర్ బటన్ పైన ఆప్షన్స్ టెంపరేచర్ డీటైల్స్తో పాటు చార్జింగ్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. దీన్ని కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని, వినియోగదారుల రివ్యూలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం.జుట్టు రాలు సమస్యకు చెక్..ఈరోజుల్లో చాలామందికి జుట్టు రాలడమే ప్రధాన సమస్యగా మారింది. అందుకు పరిష్కారంగా ‘హెయిర్ మెసోథెరపీ’ అనే విధానాన్ని సూచిస్తున్నారు ప్రొఫెషనల్ బ్యూటీషియన్స్. మెసోథెరపీలో చాలా సన్నని సూదులను ఉపయోగించి.. విటమిన్లు, ఎంజైమ్లు, హార్మోన్లు వంటివి జుట్టు కుదుళ్లలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ జుట్టు రాలడాన్ని తగ్గించి, బలమైన జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ థెరపీ మాడులో రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది. ఈ చికిత్స సాధారణంగా కొన్ని వారాల వ్యవధిలో అనేక సెషన్లలో జరుగుతుంది. ఒక్కో సెషన్ సుమారు 30 నిమిషాలు పడుతుంది. హెయిర్ మెసోథెరపీని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. చికిత్సకు ముందు, తరువాత వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి. (చదవండి: Biodegradable Plastics: ప్లాస్టిక్ని వదిలించుకోవాలంటే.. చేతికి మట్టి అంటాల్సిందే..!)

Biodegradable Plastics: చేతికి మట్టి అంటాలి..!
ప్రపంచానికి ప్లాస్టిక్ దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని వదిలించటానికి శాస్త్రవేత్తలు విస్తృత ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. ప్లాస్టిక్కు ప్రత్నామ్నాయంగా ‘బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్’ను సృష్టించి, ప్లాస్టిక్ దెయ్యం విశ్వరూపం దాల్చకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే... మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్. మనిషంటేనే మట్టి. కానీ, మట్టి అంటకుండా మనిషి తన జీవితాన్ని సాగించటం మొదలు పెట్టాక... మనిషికి–మట్టికి మధ్య బాంధవ్యం తెగిపోతూ వచ్చింది. ఇప్పుడు మనిషి చేతులకు అంటింది మట్టి కాదు, ప్లాస్టిక్! మనిషి నిండు నూరేళ్లకు కాలం చేసినా, మనిషి వాడేసిన ప్లాస్టిక్ మాత్రం– ఏడేడు జన్మలు కూడా దాటి వెయ్యేళ్లు జీవించే ఉంటుంది. ఈ ప్లాస్టిక్ మహమ్మారి భూమిలో శిథిలం కాదు, సముద్రంలో చివికిపోదు. అగ్నిలో వేస్తే అసలుకే మోసం! ఆ కాలుష్య జ్వాలలు భూతాల్లా లేచి, భూతాపాన్నే పెంచేస్తాయి! మట్టిలో కలిసిపోకుండా కొండల్లా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వెలువడే విషవాయువులు పర్యావరణానికి హాని చేస్తాయి. ప్రాణుల ఆరోగ్యాన్ని హరిస్తాయి. భూసారం క్షీణిస్తుంది. సముద్రగర్భం కలుషితమైపోతుంది. అంతరిక్షంలోనూ అక్కడ ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలు భవిష్యత్ వ్యోమగాముల కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తాయి. మొత్తంగా పంచభూతాలనే ప్లాస్టిక్ పొట్టన పెట్టుకుంటుంది. ఎంత విషాదం! మనిషిని సృష్టించిన ప్రకృతిని, మనిషి సృష్టించిన ప్లాస్టిక్ మింగేస్తోంది. ∙∙ ప్రపంచంలో ప్రతి నిముషానికి 10 లక్షల ప్లాస్టిక్ బ్యాగులు వాడకంలోకి వస్తున్నాయి! ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 98 కోట్ల 35 లక్షల 61 వేల కిలోల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. అత్యంత ప్రమాదకారి అయిన ‘ఒకసారి వాడి పడేసే’ ప్లాస్టిక్... వాడకంలో ఉన్న ప్లాస్టిక్లో 50 శాతం వరకు ఉంటోంది! ఇక సముద్ర వ్యర్థాల్లో 80 శాతం వరకు ప్లాస్టిక్ చెత్తే. ఈ ప్రమాదాన్ని మరింతగా పెరగనివ్వకుండా ఉండేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం అయ్యాయి. మనిషి దైనందిన జీవితంలోని అవసరాలకు అనుగుణంగా బయోప్లాస్టిక్ (బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్) పై పరిశోధనలు జరిపిస్తున్నాయి. మట్టిలో కలిసిపోయే బయోప్లాస్టిక్తో బ్యాగులు, వంటింటి పాత్రలు, కప్పులు, సాసర్లు, తేలికపాటి గృహోపకరణాలు, ప్యాకింగ్ మెటీరియల్ వంటివి ఉత్పత్తి చేయటానికి పనికొచ్చే పదార్థాల అన్వేషణపై పెట్టుబడులు పెడుతున్నాయి. బయో–ప్లాస్టిక్ పరిశోధనలుచైనా: సూక్ష్మజీవులను ఉపయోగించి బయో ప్లాస్టిక్ను ఉత్పత్తి చేసే కొత్త పద్ధతులను చైనా పరిశోధకులు అన్వేషిస్తున్నారు.అమెరికా: ఒక ఏడాది లోపు విచ్ఛిన్నమయ్యే ‘క్లింగ్ ఫిల్మ్’ వంటి వినూత్నమైన బయో ప్లాస్టిక్ను సృష్టించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆహార పదార్థాలను చాలాకాలం పాటు నిల్వ ఉంచేందుకు వాటి కంటెయినర్లకు చుట్టే పల్చటి పారదర్శక మెటీరియలే క్లింగ్ ఫిల్మ్.ఐరోపా: ఐరోపా దేశాలు బయో ప్లాస్టిక్ల పరిశోధనలో చురుగ్గా పాల్గొంటున్నాయి. పర్యావరణ హితమైన ప్లాస్టిక్లను కనిపెట్టేందుకు కృషి చేస్తున్నాయి. ఇండియా: బయో ప్లాస్టిక్ల ఉత్పత్తిలో వినూత్న విధానాలను ఆవిష్కరించే పరిశోధనల కోసం గువాహటి, మద్రాస్ ఐఐటీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మద్రాస్ ఐఐటీ పుట్టగొడుగులు, చెరకుపిప్పి, వరిగడ్డి నుంచి బయోప్లాస్టిక్ను తయారు చేసే పనిలో ఉంది.బ్రెజిల్: ‘బ్రాస్కెమ్’ వంటి పెట్రో కెమికల్ కంపెనీలు బయో ప్లాస్టిక్పై విస్తృతమైన పరిశోధనలు జరుపుతున్నాయి.దక్షిణాఫ్రికా: వ్యర్థ పదార్థాల నుండి బయో ప్లాస్టిక్లను అభివృద్ధి చేయటానికి దక్షిణాఫ్రికా పరిశోధకులు విశేష కృషి సల్పుతున్నారు. ఈ దేశాలే కాక, కొరియా.. బాక్టీరియా నుంచి బయోడీగ్రేడబుల్ నైలాన్ ఉత్పత్తి చేస్తోంది. నార్వే.. నాచుతో స్ట్రాలు, స్పూన్లు తయారు చేస్తోంది. కెనడా పుట్టగొడుగుల నుండి అత్యంత పటిష్ఠమైన ప్లాస్టిక్లను వృద్ధి చేస్తోంది. బయో ప్లాస్టిక్ తయారీలో ప్రధానంగా మొక్కజొన్న పిండి, చెరకుపిప్పి, బంగాళదుంపల పిండి, గోధుమ పిండి వంటి పంట వనరుల్ని ఉపయోగిస్తున్నారు. బయో ప్లాస్టిక్ ప్రయోజనాలుకార్బన్ ఫుట్ప్రింట్ తగ్గుతుంది: బయో ప్లాస్టిక్లు వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను తొలగించడంలో సహాయపడతాయి. అవి మొక్కల నుండి తయారౌతాయి కనుక మొక్కల పెరుగుదలకు అవసరమైన కార్బన్ డైయాకైడ్ను వాతావరణం నుండి సంగ్రహిస్తాయి. దీనినే ‘కార్బన్ సింక్’ అని పిలుస్తారు.తక్కువ శక్తి వినియోగం: మామూలు ప్లాస్టిక్లతో పోలిస్తే బయోప్లాస్టిక్లను ఉత్పత్తి చేయడానికి తక్కువ శక్తి అవసరం. ఇలా శక్తి వినియోగం తగ్గటం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తోడ్పడుతుంది.వేగంగా విచ్ఛిన్నం: బయో ప్లాస్టిక్లు తయారీ పద్ధతిని అనుసరించి 18 నుండి 36 నెలల్లో అవి విచ్ఛిన్నమవుతాయి. ఇందుకు భిన్నంగా మామూలు ప్లాస్టిక్లు మట్టిలో పూర్తిగా కలిసిపోవటానికి 1,000 సంవత్సరాల పట్టవచ్చు. పర్యావరణానికి మేలు: పరిశోధకులు సూక్ష్మ జీవ బ్యాక్టీరియాతో తయారు చేసిన బయోప్లాస్టిక్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ బయోప్లాస్టిక్లను సహజ రబ్బరు, ఇతర పదార్థాలతో కలిపి మరింత పర్యావరణ హిత ప్లాస్టిక్లను సృష్టించవచ్చు. అలవాటు మానాలిప్లాస్టిక్ను వాడే అలవాటు మనిషి నరనరాన ఎలాగైతే జీర్ణించుకుపోయిందో, అలా – ఆ ప్లాస్టిక్లోని విష రసాయనాలు మనిషి రక్తంలో కలిసిపోయి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక కొత్త విషయాన్ని కనిపెట్టటం కంటే కూడా ఒక పాత అలవాటును మార్పించటానికే ఒక్కోసారి ప్రపంచ దేశాలకు ఎక్కువ ఖర్చు అవొచ్చు. అయినప్పటికీ తగిన ప్రచారంతో, హెచ్చరికలతో, శిక్షల భయంతో ప్రజా చైతన్యం తెచ్చి, ప్లాస్టిక్ నుండి మనిషిని ప్రభుత్వాలే విముక్తం చేయాలి. శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనిపెట్టినంత మాత్రాన మార్పు రాదు. మార్పువైపు మనిషిని నడిపించటం కూడా ముఖ్యమే.– సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: అభినవ శ్రవణుడి ఆధ్యాత్మిక యాత్ర..!)

ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల కూతురు ఉంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. ఇంకో బేబీకి ప్లాన్ చెయ్యాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – రాధ, ధర్మవరంవయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు తల్లికి, బిడ్డకి ఎక్కువ ఉంటాయి. మొదటి డెలివరీ, ప్రెగ్నెన్సీలో ఏదైనా సమస్యలు ఉంటే అవి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే ఇప్పుడు ఆ సమస్యలు ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏం చేసి వాటిని నార్మల్కి తీసుకురావాలి అని ముందే గైనకాలజిస్ట్ని కలవాలి. మధుమేహం సమస్య ఇప్పుడు ఎక్కువ అయితే, హెచ్బి ఏ1సీ లెవెల్స్ డైట్ చెక్ చెయ్యండి. లెవెల్స్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యకు మందుల ద్వారా ముందే కరెక్ట్ చెయ్యాలి. థైరాయిడ్ లెవెల్స్ చాలామందికి ముందే తెలియటం లేదు. అది బేబీ మెదడు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే, ముందు టీఎస్హెచ్ లెవెల్స్ చెక్ చెయ్యండి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో శిశువు ఎదుగుదల సమస్యలు వచ్చినట్టయితే ఈసారి రాకుండా కొన్ని మందులు, డైట్ ముందే మార్చి ఇస్తాం. రక్తం గడ్డకట్టడం అవుతుందా అనే రక్తపరీక్షలు ముందే చేయించుకొని, దానికి తగిన మందులు వాడాలి. రక్తహీనత వలన రెండో ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపంతో ఇబ్బంది రావచ్చు. అందుకే సీబీపీ, విటమిన్ బీ–12, విటమిన్–డీ3 లెవెల్స్ ముందే చెక్ చేసుకోవాలి. భర్త వీర్య విశ్లేషణ కూడా ఒకసారి చేయించు కోవాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఇద్దరూ పాటించాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు ప్లానింగ్కి మూడు నెలల ముందు నుంచి తీసుకోవాలి. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఏవైనా చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉంటే అవి ఇప్పుడు రాకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. వాక్సినేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఫ్లూ వాక్సిన్, ఎమ్ఎమ్ఆర్ వాక్సిన్, ఆటలమ్మ, రుబెల్లా వాక్సిన్స్ ముందు తీసుకోకపోతే ఇప్పుడు తీసుకొని, ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. మీ బరువు ఉండవలసిన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) కన్నా ఎక్కువ ఉంటే, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే కొంత బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సమతుల్యమైన, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వ్యాయామం ప్రారంభించాలి. మీరు ఏదైనా సమస్యలకు మందులు వాడుతుంటే అవి ప్రెగ్నెన్సీలో మంచివి కాకపోతే, సంబంధిత డాక్టర్ని కలసి మందులను మార్పించుకోవాలి. చాలామందికి ఆందోళన తగ్గించే మందులు, మూర్చవ్యాధికి మందులు మారుస్తాము. ఉద్యోగం ఒత్తిడి ఎక్కువ ఉంటే ఆ ప్రభావం శిశువు ఎదుగుదలపై పడుతుంది. అందుకే సరైన వర్క్ ప్లేస్ సెలక్ట్ చేసుకోండి. ధ్యానం, యోగా చేయటం మంచిది. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగితే సమస్యలు వస్తాయా..?
ఫొటోలు


హైదరాబాద్ : జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)


వెళ్లొస్తాం.. లింగమయ్యా ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


వైట్ డ్రెస్ లో ప్రణీత సుభాష్ అందాల మెరుపులు (ఫోటోలు)


హైదరాబాద్ లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో వడగండ్ల వాన బీభత్సం (ఫొటోలు)


రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


సోమాజిగూడ జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన ఇన్ఫ్లూయెన్సర్స్ (ఫొటోలు)


ఫిలిం ఫైనాన్షియర్ బంగారు బాబు కుమారుడి వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు (ఫోటోలు)


Meenakshi Chaudhary : తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి (ఫోటోలు)


వితిక-వరుణ్ సందేశ్ తిరుమల ట్రిప్ (ఫోటోలు)
అంతర్జాతీయం

Jesus Nut: టెక్ సీఈవో ఫ్యామిలీ ప్రాణం తీసిన ‘జీసెస్ నట్’ కథ!
వాషింగ్టన్: జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ (agustin escobar) కుటుంబం మరణానికి ‘జీసెస్ నట్’ (jesus nut) కారణమైందని నిపుణులు భావిస్తున్నారు.గత గురువారం ఆగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, మెర్సి కాంప్రూబి మాంటాల్, వారి ముగ్గురు పిల్లలు (వయస్సు 4, 5, 11), పైలట్తో సహా సైట్ సీయింగ్ కోసం బయల్దేరారు. ఇందుకోసం బెల్ 206 అనే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ను వినియోగించారు.అయితే, సీఈవో కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాల్ స్ట్రీట్ హెలిపోర్ట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. మన్హట్టన్ వినువీధిలో .. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దిశగా వెళ్లింది. ఆ సమయంలో గిరిగిరా తిరుగుతూ న్యూయార్క్ నగరంలోని ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ (miracle on the hudson) నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. పక్షి ఢీకొట్టడం వల్లే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని అందరూ భావించారు. హెలికాప్టర్కు ప్రమాదం జరిగే సమయంలో స్థానికులు వీడియోలు తీశారు. ఆ వీడియోల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఘోరం జరిగే సమయంలో పక్షుల జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. పలు ఆధారాలు, ఏవియేషన్ రంగ నిపుణులు, ప్రమాదానికి ముందు జరిగిన నిర్లక్ష్యం ఆధారంగా బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ‘జీసెస్ నట్’ కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏంటి ‘జీసెస్ నట్’ జీసెస్ నట్ అనేది హెలికాప్టర్ మెయిన్ రోటర్ మాస్ట్పై(mast) అమర్చబడి ఉంటుంది. అంటే ఇది హెలికాప్టర్ రెక్కలు..హెలికాప్టర్ ఇంజిన్కు జాయింట్ చేసి ఉంటుంది. ఈ భాగం వద్ద జీసెస్ నట్ ఉంటుంది. అది ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా, ఊడినా హెలికాప్టర్ మొత్తం అదుపు తప్పుతుంది. ఆ నట్టు ఊడి పోతే హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడేయడం పైలెట్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్లోని ఈ జీసెస్ నట్ ఊడిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్న న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్ఏఏ (fedaral viation Administration) విచారణను వేగవంతం చేసింది.‘జీసెస్ నట్’ అంటే ఏమిటి?.. చరిత్ర ఏం చెబుతోందిజీసెస్ నట్ అనే పదం వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైనికుల నోట తొలిసారి ఈ పదం వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1930, 1940లలో యుద్ధ సమయంలో అమెరికా నేవి ప్రత్యర్థుల్ని మట్టికరింపించేందుకు చిన్న ఎయిర్ క్ట్రాప్ట్లను భారీ సంఖ్యలో డిజైన్ చేయించింది. కాన్సాలిడేటెడ్ మోడల్ 28లో పీబీవై కాటలినా అనే ఎయిర్ క్ట్రాప్ట్లో తొలిసారి ఈ నట్టును వినియోగంలోకి తెచ్చారు. పైన చెప్పుకున్నట్లుగా ఈ నట్టు ఎయిర్ క్ట్రాప్ట్ రెక్కలకు, ఇంజిన్కు అనుసంధానం చేసి ఉంటుంది. అయితే వియత్నంతో జరిగే యుద్ధంలో ఈ ఎయిర్ క్ట్రాఫ్ట్లో సైనికులు ప్రయాణిస్తుండగా ఎదైనా ప్రమాదం జరిగితే ఆ నట్టు బిగించిన రూటర్ మాస్ట్ ఊడిపోతే .. జీసెస్ను ప్రార్థించడం తప్ప ఏం చేయలేం అని అమెరికా సైనికులు అనేవారంటూ వీకీపీడియా సమాచారం చెబుతోంది.ప్రయాణానికి ముందే అంతేకాదు, ఈ తరహా జీసెస్ నట్ ఉన్న ఎయిర్క్రాప్ట్లలో ప్రయాణించే ముందు నట్టు సరిగ్గా ఉందా? లేదా? అని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాల్సి ఉంది. లేదంటే ప్రాణాలు గాల్లోనే కలిసి పోవడం ఖాయం. తాజాగా ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ నదిలో చోటు చేసుకున్న సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం హెలికాప్టర్ ప్రమాదం ఈ జీసెస్ నట్ పనితీరుపై దృష్టిసారించకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

సూడాన్లో మారణహోమం.. వందలాది మంది మృతి
కర్టోమ్: ఆఫ్రికా దేశం సూడాన్ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పౌరుల శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, సూడాన్లో మారణహోమం జరిగింది.వివరాల ప్రకారం.. పశ్చిమ సూడాన్లోని నార్త్ డార్ఫర్లో గత రెండు రోజులుగా పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దాడులు జరుపుతున్నాయి. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. జామ్జామ్లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. #Sudan 🇸🇩: a desperate situation is unfolding in #Darfur as the #RSF has overrun the Zamzam IDP camp near #ElFasher, leaving hundreds killed and forcing thousands to flee towards the besieged city.The city of El-Fasher is on the brink after a year of brutal siege. pic.twitter.com/NReidyJklJ— Thomas van Linge (@ThomasVLinge) April 12, 2025 ఇక, శనివారం అబూషాక్ శిబిరంపై దాడులు జరిపారు. ఇందులో 14 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ శిబిరంపై జరిగిన దాడిలో 40 మందికి పైగా మృతి చెందారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి బలగాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల సందర్భంగా భయంతో పౌరులు పరుగులు తీశారు. బతుకు జీవుడా అంటూ ప్రాణలు అరచేతిలో పట్టుకున్నారు. మరోవైపు.. దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు.. కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, 2023 ఏప్రిల్లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. Scenes of Mourning: Funeral Held for Victims of Zamzam Camp MassacreHeartbreaking scenes unfolded in Darfur as residents gathered to bury the martyrs of Zamzam displacement camp, following the brutal attack carried out by the UAE-backed Rapid Support Militia.The funeral… pic.twitter.com/gvd6sNQUEV— Sudanese Echo (@SudaneseEcho) April 12, 2025

మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను టార్గెట్ చేసిన రష్యా దళాలు.. భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో, పేలుడు సంభవించి దట్టమైన మంటలు చెలరేగాయి. మరోవైపు.. రష్యా దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.వివరాల ప్రకారం.. కీవ్లోని భారతీయ ఔషధ కంపెనీ కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై శనివారం రష్యా దాడి చేసింది. రష్యాకు చెందిన డ్రోన్ల దాడిలో గోదాం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు గోదాంపై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై ఇలా దాడులు చేస్తోందని విమర్శించింది. భారత్తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది.Breaking⚡️ : #Ukraine allege Indian pharmaceutical company godown hit by Russia leading to loss of medicines meant for children and distress people. Still to receive any statement from India or Moscow. #RussiaUkraineWar pic.twitter.com/VfpYND8PNq— Neeraj Rajput (@neeraj_rajput) April 12, 2025ఇక, అంతకుముందు ఉక్రెయిన్లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్తోపాటు 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్ హెల్త్కేర్ వెబ్సైట్లో ఉంది. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి.
జాతీయం

మీరట్ కేసు.. నిందితురాలికి జైల్లో స్పెషల్ సదుపాయాలు
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితురాలు, అతడి భార్య ముస్కాన్ రస్తోగిని జైల్లోని ప్రత్యేక ప్రసూతి బ్యారక్లోకి మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు గర్భంతో ఉన్న మరో మహిళా ఖైదీని కూడా తరలించనున్నారు.ప్రస్తుతం ఆరు వారాల గర్భవతిగా ఉన్న ముస్కాన్ రాస్తోగిని గర్భిణీ ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారక్లోకి పంపనున్నట్లు జైలు అధికారి తెలిపారు. బిడ్డ జన్మించేంత వరకు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ముస్కాన్ రస్తోగికి ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. దీనిపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు.సౌరబ్ రాజ్పుత్ సోదరుడు బబ్లూ రాజ్పుత్ మాట్లాడుతూ.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్లు ఇద్దరూ మీరట్ జిల్లా జైల్లో వేర్వేరు బారక్ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్ ఇవ్వమని డిమాండ్ చేసినా జైలు రూల్స్ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్ రూమ్లే కేటాయించారు అధికారులు.కాగా, సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్తో సీల్ చేసింది.

భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
న్యూఢిల్లీ: భారత్ అమ్ములపొదిలో హై పవర్ లేజర్ ఆయుధం వచ్చి చేరింది. అధునాతన అధిక శక్తి కల్గిన 30 కిలోవాట్ల లేజర్ బీమ్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఫలితంగా లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్( (DEW) సిస్టమ్ ద్వారా అధునాతన పవర్ ఫుల్ వెపన్ ను తయారు చేసిన దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. ఇప్పటివరకూ ముందు వరుసలో అమెరికా, రష్యా, చైనాలు ఉండగా, ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది.ఆదివారం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (NOAR)లో ఈ విజయవంతమైన ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఫిక్స్ డ్ వింగ్ డ్రోన్ లు, స్వార్మ్ డ్రోన్ లపై అధునాతన లేజర్ బీమ్ను ప్రయోగించారు. ఇది భారత్ సాధించిన మరో విజయందీన్ని సక్సెస్ ఫుల్ గా లేజర్ బీమ్ కూల్చివేయడంతో డీఆర్డీవో సంబరాలు చేసుకుంది. టెక్నాలజీలో ఇది భారత్ సాధించిన మరో విజయంగా పేర్కొంది. భారత్ ట్రయల్ రన్ నిర్వహించిన ఈ లేజర్ బీమ్ కు ఎయిర్ క్రాఫ్ట్ లను, మిస్సెల్స్ ను క్షణాల్లో కూల్చివేసి సామర్థ్యం ఉంది. డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ ఆధ్వర్యంలోని ఈ ప్రయోగం చేపట్టారు. ఇది విజయవంతమైన తర్వాత టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఇది గగనతలం రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం కావడంతో అధునాతన టెక్నాలజీ కల్గిన అరుదైన దేశాల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల చైనా కూడా ఇదే తరహా టెక్నాలజీతో ఓ పవర్ ఫుల్ బీమ్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.మనముందు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి..కామత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ శక్తి సామర్థ్యాలను కల్గి ఉండగా, ఇప్పుడు మనం కూడా వాటి సరసన చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉందన్నారు.మనం ఇంకా చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిని సాధించే పనిలోనే ఉన్నాం. హై ఎనర్జీ సిస్టమ్ తో అత్యధిక పవర్ కల్గిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ ఆయుధాలను తయారు చేయడానికి సమాయత్తమైనట్లు ఆయన వెల్లడించారు. మనకున్న పలు రకాలైన సాంకేతిక విజ్ఞానంతో స్టార్ వార్స్ శక్తిసామర్థ్యాలను కల్గిన ఆయుధాలను తీసుకురావచ్చన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్టార్ వార్స్ సామర్థ్యం కల్గిన వెపనే అంటూ ఆయన పేర్కొన్నారు. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… https://t.co/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025

గంటలో నాలుగు భూకంపాలు.. భారత్లోనూ..
న్యూఢిల్లీ: ఈ రోజు(ఆదివారం, ఏప్రిల్ 13) ఉదయం ఒక గంట వ్యవధిలో భారతదేశం, మయన్మార్(Myanmar), తజికిస్తాన్లలో నాలుగు భూకంపాలు సంభవించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మొదటి భూకంపం తజికిస్తాన్లోని ఫైజాబాద్కు సమీపంలో సంభవించగా, ఆ తర్వాత మయన్మార్లోని మీక్టిలాలో, అనంతరం భారతదేశంలోని జమ్మూ కశ్మీర్లోగల కిష్ట్వార్లో, ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భూకంపాలు నమోదయ్యాయి. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.తజికిస్తాన్(Tajikistan)లో భూకంప తీవ్రత 6.0గా నమోదయ్యింది. దేశంలోని ఫైజాబాద్ సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఉదయం 9:00 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక గంటలో సంభవించిన నాలుగు భూకంపాలలో ఇది మొదటిది. మయన్మార్లో భూకంపం 5.5 తీవ్రతతో వచ్చింది. మీక్టిలా సమీపంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2025, మార్చి 28న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ఈరోజు తిరిగి బలమైన భూకంపం సంభవించింది. జనం ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని హిమాలయన్ ప్రాంతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు. ఇదేవిధంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నాలుగు భూకంపాలు ఒక గంట వ్యవధిలో చోటుచేసుకున్నాయి. ఈ భూకంపాలు భారత ఫలకం యురేషియన్ ఫలకంతో ఢీకొనడం కారణంగా సంభవించే టెక్టోనిక్ కదలికల ఫలితంగా చోటుచేసుకుంటున్నాయి. మయన్మార్లో 2025, మార్చి 28న సంభవించిన భూకంపంలో 3,600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు.ఇది కూడా చదవండి: Jallianwala Bagh Anniversary: దేశ చరిత్రలో ఘోర అధ్యాయం: ప్రధాని మోదీ

భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
లక్నో: భూమికి సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమెకు మద్యం తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో అంజలి(28) జీవిస్తోంది. తన భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్దే ఉంటోంది. కాగా, అంజలి, రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర యాదవ్ మధ్య ఓ భూమికి సంబంధించి కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. అంజలికి శివేంద్ర యాదవ్ డబ్బు ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు. దీంతో, తనకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని అంజలి డిమాండ్ చేయడంతో శివేంద్ర తప్పించుకునేందుకు ప్లాన్ చేశాడు. అంజలిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో మరో వ్యక్తి గౌరవ్తో కలిసి అంజలిని హత్య చేసేందుకు శివేంద్ర ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో అంజలికి ఫోన్ చేసి.. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని తన ఇంటికి రావాలిని శివేంద్ర చెప్పాడు. అతడి మాటలు నమ్మిన అంజలి.. అక్కడికి వెళ్లడంతో.. వారిద్దరూ కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం, గొంతు కోసి హత్యచేసి మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ క్రమంలో గత ఐదు రోజులుగా అంజలి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు.. ఫోన్ ట్రాకింగ్, స్కూటీ ఆధారంగా యుమునా నది వద్ద ఉన్నట్టు తేల్చారు. దర్యాప్తులో భాగంగా శివేంద్ర, గౌరవ్.. ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు.దీంతో, వారిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన తీరులో విచారించగా.. అంజలిని తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. భూమి వివాదంలో అంజలి పదేపదే డబ్బులు అడుగుతున్న కారణంగానే హత్య చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అంజలి మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, అంజలి బిడ్డలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో బోరున విలపిస్తున్నారు. ఇదే సమయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.Etawah, Uttar Pradesh: Senior Superintendent of Police (Etawah), Sanjay Kumar Verma says, "A report was received yesterday at the Civil Lines police station regarding a woman named Anjali, aged around 28-30 years, who had gone missing. She was a widow with two children. Upon… pic.twitter.com/Dc2gfdNwKP— IANS (@ians_india) April 12, 2025
ఎన్ఆర్ఐ

Ugadi 2025 సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

ఉప్పల్ స్టేడియంలో సెల్ఫోన్ దొంగల చేతివాటం
హైదరాబాద్ : ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం అభిమానులు ఆనందంలో మునిగి తేలగా సెల్ఫోన్ దొంగలు చేతి వాటం చూపించారు. స్టేడియం భద్రతలో దాదాపుగా 3 వేలకు పైగా పోలీసులు పహారా కాస్తున్నా వారిని లెక్క చేయకుండా సెల్ఫోన్ దొంగలు హాల్చల్ సృష్టించారు. వందలాది సెల్ ఫోన్లను దొంగిలించడంతో బాధితులు లబోదిబో మంటూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ పరుగుల వరద సృష్టించిన ఆనందంలో ప్రేక్షకులుండగా..దొంగలు చేతి వాటం చూపించినట్లు తెలిసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇంతగా సెల్ఫోన్లు దొంగిలించిన సంఘటన బçహుషా ఇదే మొదటి సారి కావచ్చంటున్నారు. ఈ విషయంలో ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని వివరణ కోరగా దాదాపుగా 15 నుంచి 20 మంది మాత్రం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
జనగామ జిల్లా: పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో జనగామ జిల్లా కొడ కండ్ల మండలం నీలి బండ తండాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గుగులోత్ నీల (26) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుగులోత్ హేమ, చిన్ని దంపతుల రెండో కుమార్తె నీల 2020లో ఏఆర్ కానిస్టే బుల్గా ఎంపికై వరంగల్లో పనిచేస్తోంది. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన నీల.. ఎవరూ లేని సమయంలో ప్యాన్కు ఊరి వేసుకుంది. పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో తన కూతురు ఆత్మహత్య చేసు కుందని మృతురాలి తల్లి చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులుముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఆదివారం ఓ గర్భిణికి ముగ్గురు శిశువులు జన్మించారు. తల్లితో పాటు ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన కొడెండ్ల సృజనకు ఆదివారం పురిటినొప్పులు రాగా.. మండల కేంద్రంలోని శ్రీతిరుమల నర్సింగ్హోమ్కు తరలించారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు స్రవంతి, శ్రీకాంత్లు.. సృజన గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించి.. వెంటనే శస్త్రచికిత్స చేశారు. సృజన ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ 15వేల మంది గర్భిణుల్లో.. ఇలా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మిస్తారని తెలిపారు.

'వారికి ఆనందమైతే మనమేం చేస్తాం'.. ట్రోల్స్పై బుల్లితెర నటి రియాక్షన్
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి మౌనీ రాయ్ తెలుగువారికి సైతం సుపరిచితమైన పేరు. నాగిని సీరియల్తో తెలుగులోనూ ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్లోనే ఉంటుంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటోంది. అయితే సన్నగా.. మరింత అందంగా కనిపించే మౌనీ రాయ్.. ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలొచ్చాయి. ఆమె ఇన్స్టా కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేయగా తనపై నెట్టింట విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. తాజా ఈవెంట్లో తనపై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది ఈ బుల్లితెర నటి.తాజాగా 'ది భూత్నీ' అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను ముంబయిలో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన ముద్దుగుమ్మ తనపై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది. ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తూ ఆనందం పొందే వారి ట్రోల్స్ను తాను అస్సలు పట్టించుకోనని మౌనీ రాయ్ తెలిపింది. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిపడేసింది.మౌనీ రాయ్ మాట్లాడుతూ.. "ట్రోల్స్ వల్ల నాకు ఎలాంటి బాధ లేదు. నేను అలాంటి వాటిని చూడను కూడా. ప్రతి ఒక్కరూ వారి పనిని చేయనివ్వండి. నేను అలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇతరులను ట్రోల్ చేయడానికి మీరు తెర వెనుక దాక్కుని.. వాటితో ఆనందాన్ని పొందితే మనమే చేస్తాం. అలాంటి వారిని అలానే ఉండనివ్వండి" అంటూ కామెంట్స్ చేసింది.కాగా.. మౌనీ రాయ్ ప్రస్తుతం హారర్ యాక్షన్ కామెడీ చిత్రం 'ది భూత్నీ'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె మొహబ్బత్ అనే దెయ్యం పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో సంజయ్ దత్, సన్నీ సింగ్, పాలక్ తివారీ, బెయోనిక్, ఆసిఫ్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ది భూత్నీ' ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా అక్షయ్ కుమార్ 'కేసరి- 2'తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

నీవు నాకు తెలుసు.. నీ నంబర్ నా దగ్గర ఉంది..!
వట్పల్లి(అందోల్): ఫోన్లో పరిచయమైన ఓ వ్యక్తి వివాహిత మహిళను అత్యాచారం చేసి ఆమె మెడలో ఉన్న బంగారు నగలతోపాటు సెల్ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన వట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ విఠల్ కథనం మేరకు.. మండల పరిధిలోని పల్వట్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(35) ఆదివారం జోగిపేటలో చీరలు కొన్నది. చీర డ్యామేజ్ ఉండటంతో తిరిగి ఇవ్వడానికి గురువారం జోగిపేటకు వెళ్లింది. ఫోన్కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగా లిఫ్ట్ చేసి మాట్లాడగా.. కొత్త వ్యక్తి అని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేసి నీవు నాకు తెలుసు, నీ నంబర్ నా దగ్గర ఉంది.. అంటూ పరిచయం చేసుకొని ఎక్కడ ఉన్నావు అని అడుగగా తాను ఉన్న బట్టల షాపు అడ్రస్ చెప్పింది. వెంటనే అక్కడికి వచ్చి వ్యక్తి ఆమె డబ్బులను షాపులో చెల్లించాడు. షాపింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మహిళను బైక్పై ఎక్కించుకున్నాడు. అల్లాదుర్గం మండలం బహిరన్దిబ్బ గ్రామ రోడ్డు సమీపంలోకి రాగానే వర్షం రావడంతో తన బైక్ను నిలిపాడు. మళ్లీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళను ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్పై వట్పల్లి మీదుగా బాధిత మహిళ గ్రామం పల్వట్ల వైపు వెళ్తూ నాగులపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మహిళను దిగమన్నాడు. నన్ను మా ఇంటి దగ్గర దించాలంటూ ఆమె బైక్ దిగలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అతడు మహిళను బయపెట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్ఫోన్ తీసుకొని పరారయ్యాడు. బాధిత మహిళ అదే రాత్రి వట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్డేటా ఆధారంగా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వీడియోలు


అమరావతిలో మళ్లీ భూదందా.. ప్రైవేట్ చేతికి అంబేద్కర్ స్మృతివనం


చంద్రబాబు లౌకిక వాదం అవసరాన్ని బట్టి మారుతుంది : రాజ్ దీప్


అంబేడ్కర్ పైన చందబ్రాబు ప్రభుత్వం క్షుద్ర రాజకీయం


బెల్జియంలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్


మీ ధైర్యం సూపరంటే సూపరమ్మా


అమెరికాలో ఉంటున్న విదేశీయులకు షాక్


ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం


ఆక్వా రైతు విలవిల.. 10 నెలల్లో తలకిందులైన జీవితాలు


చంద్రబాబు భూ దాహం.. మరో 44,676 ఎకరాలు


ఆదివారం శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు