Top Stories
ప్రధాన వార్తలు

గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
పీసీ సర్కార్ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్ మ్యాజిక్ ట్రిక్స్ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్ ట్రిక్స్ మాత్రం ప్రజలను షాక్ మీద షాక్కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్ షో. అంతా మ్యాజిక్ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా తనను తాను ప్రమోట్ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్ బిల్లుల భారంతో వేలాది ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్ మ్యాజిక్ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్ చేస్తున్నది. ఈ ప్రమోషన్కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్ఎస్ 111 సెక్షన్ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్బుక్’ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్ క్యాపి టల్ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్’ ఈజ్ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్ కోసం ఆయన ‘పీ–ఫోర్’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్ మేకోవర్ ఎక్సర్సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్బుక్ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్ చానల్లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

చంద్రబాబు మరో మహా ప్యాలెస్
సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్మనేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున కొండాపూర్లో హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్..! వీటికితోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పున ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకుముందే జూబ్లీహిల్స్లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూడలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్నమాట. మరోవైపు హైదరాబాద్లో సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్ రాజభవనం నిర్మాణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్లో, మదీనాగూడలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు.

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం....వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నీలం, లేత గులాబీరంగులు. శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.వృషభం..పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.మిథునం.... గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. శ్రీ భువనేశ్వరీదేవి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.సింహం...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. శ్రీవారాహీ స్తోత్రం పఠించండి..కన్య...ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, తెలుపు రంగులు. శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.తుల...ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శ్రీ దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.వృశ్చికం...అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక ఆందోళన. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. .శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సు..కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థికంగా బలం చే కూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విహారాదియాత్రలు చేస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం చివరిలో ధనవ్యయం. విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యసమస్యలు. లేత ఎరుపు, పసుపు రంగులు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.మకరం...చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు చాలావరకూ తీరతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. బంధువుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. భూవివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. నీలం, నేరేడు రంగులు. శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.కుంభం..ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. ఆప్తుల నుండి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.. తెలుపు, నేరేడురంగులు. శ్రీవిష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మీనం...మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. గణేశ్ను పూజించండి.

భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్ మరో బాంబు పేల్చారు. గ్రీన్కార్డు, హెచ్1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్ఆర్) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్ 325ఆర్ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్ లక్ష్యమని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్ అప్డేట్ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్కార్డు, హెచ్–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్కార్డ్, హెచ్1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్

సిక్సర్ల అభి ‘ షేక్ ’
తొలి ఐదు మ్యాచ్లలో కలిపి 51 పరుగులు...ఈ సీజన్లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఇది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అతను తన గత ఏడాది ఆటను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న ట్లున్నాడు. పంజాబ్పై మ్యాచ్లో ఒక్కసారిగా తన కసినంతా ప్రదర్శిస్తూ వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం బౌండరీలతోనే 116 పరుగులు బాది శతకనాదం చేశాడు. ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ ఈ ఇన్నింగ్స్ విలువేమిటో చెప్పాడు. అభిషేక్కు హెడ్ మెరుపులు తోడవడంతో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సన్రైజర్స్ సంచలనం సృష్టించింది. మరో వైపు సమష్టి ప్రదర్శనతో 245 పరుగులు చేసి కూడా ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ తీవ్ర నిరాశకు లోనైంది. ఓవరాల్గా 492 పరుగులతో అభిమానులకు ఫుల్ జోష్ దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నాలుగు వరుస పరాజయాల తర్వాత నిస్తేజంగా కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఘనమైన రీతిలో కోలుకుంది. తమ అసలు ఆటను ప్రదర్శిస్తూ లీగ్లో తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాన్ని ఇచ్చింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్లు) ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేయగా, ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 75 బంతుల్లో 171 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్...పవర్ప్లేలో 89 పరుగులు...10 ఓవర్లు ముగిసే సరికి 120. తర్వాతి 5 ఓవర్లలో 57 పరుగులు...ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు... పంజాబ్ కింగ్స్ ఇలా దాదాపు అన్ని దశల్లోనూ ఒకే తరహాలో దూకుడుగా సాగింది. టాప్–7లో ఇద్దరు మినహా మిగతావారంతా చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. షమీ వేసిన తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 3 ఫోర్లతో మొదలు పెట్టగా, షమీ తర్వాతి ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 బాదాడు. కమిన్స్ తొలి ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్తో పంజాబ్ 16 పరుగులు రాబట్టింది. అయితే తన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులిచ్చిన హర్షల్...ప్రియాన్‡్షను అవుట్ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మలింగ తన తొలి వికెట్గా ప్రభ్సిమ్రన్ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత శ్రేయస్, నేహల్ వధేరా (22 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం కూడా జోరుగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. అన్సారీ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదిన శ్రేయస్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. శశాంక్ సింగ్ (2) విఫలం కాగా, మలింగ ఓవర్లో శ్రేయస్ 4 ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండు బంతుల వ్యవధిలో మ్యాక్స్వెల్ (3), శ్రేయస్లను హర్షల్ అవుట్ చేయడంతో 18, 19 ఓవర్లలో కలిపి 13 పరుగులే వచ్చాయి. ఒకే ఓవర్లో 27 పరుగులు...షమీ వేసిన ఆఖరి ఓవర్లో కింగ్స్ పండగ చేసుకుంది. ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న స్టొయినిస్ ఈ ఓవర్లో చెలరేగిపోయాడు. చివరి 4 బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6 బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. బౌండరీల వర్షం...అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో హెడ్ 2 ఫోర్లు కొట్టడంతో రైజర్స్ విధ్వంసం మొదలైంది. యాన్సెన్ ఓవర్లో అభిషేక్ నాలుగు ఫోర్లు కొట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో హెడ్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత యశ్ ఠాకూర్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగిపోయాడు. పవర్ప్లేలో జట్టు 83 పరుగులు సాధించింది. 19 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మరో వైపు మ్యాక్స్వెల్ ఓవర్లో రెండు భారీ సిక్స్లు బాదిన హెడ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాన్సెన్ వేసిన ఓవర్లో మళ్లీ శివమెత్తిన అభిషేక్ 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదాడు. చహల్ ఓవర్లో ఎట్టకేలకు హెడ్ వెనుదిరిగిన తర్వాత అదే ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి 40 బంతుల్లో అభిషేక్ సెంచరీ మార్క్ను చేరుకొని గర్జించాడు. ఆ తర్వాత చెలరేగి బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్ జట్టును అలవోకగా విజయం దిశగా నడిపించాడు. సాహసవంతులకే అదృష్టం కలిసి వస్తుందన్నట్లు అభిషేక్కు రెండు లైఫ్లు లభించాయి. 28 వద్ద ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ ఇవ్వగా అది నోబాల్గా తేలింది. ఆ తర్వాత 56 వద్ద చహల్ తన బౌలింగ్లోనే సునాయాస క్యాచ్ను వదిలేశాడు. దీనిని అతను బ్రహ్మండంగా వాడుకున్నాడు. స్కోరు వివరాలుపంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) హర్షల్ 36; ప్రభ్సిమ్రన్ (సి) కమిన్స్ (బి) మలింగ 42; శ్రేయస్ (సి) హెడ్ (బి) హర్షల్ 82; వధేరా (ఎల్బీ) (బి) మలింగ 27; శశాంక్ (ఎల్బీ) (బి) హర్షల్ 2; మ్యాక్స్వెల్ (బి) హర్షల్ 3; స్టొయినిస్ (నాటౌట్) 34; యాన్సెన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–66, 2–91, 3–164, 4–168, 5–205, 6–206. బౌలింగ్: మొహమ్మద్ షమీ 4–0–75–0, కమిన్స్ 4–0–40–0, హర్షల్ 4–0–42–4, ఇషాన్ మలింగ 4–0–45–2, అన్సారీ 4–0–41–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 66; అభిషేక్ (సి) (సబ్) దూబే (బి) అర్‡్షదీప్ 141; క్లాసెన్ (నాటౌట్) 21; ఇషాన్ కిషన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 10; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–171, 2–222. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–1, యాన్సెన్ 2–0–39–0, యశ్ ఠాకూర్ 2.3–0–40–0, మ్యాక్స్వెల్ 3–0–40–0, ఫెర్గూసన్ 0.2–0–1–0, స్టొయినిస్ 0.4–0–6–0, చహల్ 4–0–56–1, శశాంక్ 2–0–27–0.75 ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. అతను 75 పరుగులివ్వగా, ఇదే సీజన్లో రాజస్తాన్ బౌలర్ ఆర్చర్ 76 పరుగులు ఇచ్చాడు.1 ఐపీఎల్లో భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కేఎల్ రాహుల్ (132) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ సవరించాడు.ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: జైపూర్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X ముంబై వేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థను సులువుగా హ్యాక్ చేయొచ్చని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. అందువల్ల దేశ (అమెరికా) వ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లకు మారాలని పిలుపునిచ్చారు. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన క్యాబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలను సమావేశం ముందుంచారు. 2020 ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెబ్స్ చర్యలపై దర్యాప్తు చేయాలని జస్టిస్ డిపార్ట్మెంట్ (డీవోజే)ని ఆదేశిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది. తద్వారా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ఈ విధానంలో ఫలితాలను తారుమారు చేయడానికి, దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని చెప్పేందుకు మా వద్ద పలు ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లను తీసుకురావాలనే మీ (ట్రంప్) ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే ఓటర్లు ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారు’ అని గబ్బార్డ్ స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ స్మిత ప్రకాశ్ తెలిపారు. కాగా, గబ్బార్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్లో ఎన్నికల భద్రతపై ఈ వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి.ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి ఇటీవల టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆధార పడటం సరికాదని చెప్పారు. అవి హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. ‘సాంకేతికత, ఏఐ ద్వారా హ్యాక్ అవ్వడానికి ఉన్న అవకాశం చిన్నదైనా, అది ఎంతో పెద్ద సమస్యకు దారితీస్తుంది’ అని మస్క్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. కాగా, తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలపై మన దేశంలో కూడా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.

బ్రేక్ పడింది బాసు!
ఎప్పటి కప్పుడు తమ ఫ్యాన్స్ కోసం సరికొత్త సినిమాలు చేయాలని, స్క్రీన్పై సరికొత్తగా కనిపించాలని హీరోలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు సమయం పట్టొచ్చు. ఇలా ఓ ఏడాది, రెండు మూడేళ్లు కొందరు హీరోలు సిల్వర్ స్క్రీన్ను మిస్ కావొచ్చు. అలా ఈ ఏడాది ఇప్పటికే కొంతమంది సిల్వర్ స్క్రీన్ను మిస్ కానున్నారు. అలా సోలో హీరోగా ఈ ఏడాది థియేటర్స్కు రాని కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.కథలు వింటున్నారు... ‘నా సామిరంగ’ సినిమాతో గత ఏడాది సంక్రాంతికి థియేటర్స్కు వచ్చి సూపర్డూపర్ హిట్ అందుకున్నారు నాగార్జున. అయితే ఈ మూవీ తర్వాత నాగార్జున సోలో హీరోగా మరో మూవీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. యువ దర్శకులు నవీన్, కార్తీక్ చెప్పిన కథలను నాగార్జున విన్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల మరో యువ దర్శకుడు చెప్పిన కథను కూడా నాగార్జున విన్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపించాయి. కానీ ఇప్పటివరకైతే నాగార్జున సోలో హీరో మూవీ అనౌన్స్మెంట్ రాలేదు. ఇలా ఈ ఏడాది నాగార్జున సోలో హీరోగా నటించే మూవీ థియేటర్స్కు రాకపోవచ్చని ఊహించవచ్చు. అయితే నాగార్జున అభిమానులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాగార్జున ఓ లీడ్ రోల్లో నటించిన ‘కుబేర’ (ఇందులో ధనుష్ హీరో), ‘కూలీ’ (రజనీకాంత్ హీరో) చిత్రాలు ఈ ఏడాదే స్క్రీన్పైకి వస్తాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ‘కుబేర’ సినిమా జూన్ 20న విడుదల కానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.రెండేళ్లు ఆగాల్సిందే... గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమాతో సందడి చేశారు మహేశ్బాబు. ఆ తర్వాత వెంటనే రాజమౌళితో మూవీ ప్రకటించారు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది. క్వాలిటీ, కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహేశ్బాబు, రాజమౌళి. దీంతో సహజంగానే ఈ మూవీ థియేటర్స్లోకి రావడానికి సమయం పడుతుంది. పైగా రాజమౌళితో మూవీ అంటే కనీసం రెండేళ్లైనా పడుతుంది.ఇలా ఈ ఏడాది, వచ్చే ఏడాది మహేశ్బాబు స్క్రీన్పై కనిపించే అవకాశాలు లేనట్లే. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. రెండు కీలక షెడ్యూల్స్ చిత్రీకరణ జరిగింది. వేసవి సమయం కావడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లారు మహేశ్బాబు. ఇటు ‘ఆర్ఆర్ ఆర్’ (ఎన్టీఆర్–రామ్చరణ్లు హీరోలుగా నటించిన మూవీ) మూవీపై తీసిన ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి జపాన్లో ఉన్నారు. రాజమౌళి, మహేశ్బాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ షూట్ మళ్లీ ప్రారంభం అవుతుందని ఊహించవచ్చు.కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ఒకటే మూవీగానే విడుదలవుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు... 2027 మార్చి 25న ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనల్లో రాజమౌళి అండ్ టీమ్ ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ప్రకారం మహేశ్బాబు సిల్వర్స్క్రీన్పై కనిపించేందుకు రెండేళ్లు ఆయన అభిమానులు ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. రాజాసాబ్ రానట్లే... ప్రస్తుతం ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలోని ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సింది. కానీ రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి సంబంధించి కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉందని ఈ చిత్రదర్శకుడు మారుతి ఇటీవల పేర్కొన్నారు.పైగా ‘ది రాజా సాబ్’ మూవీ కోసం ముందుగా అనుకున్న పాటలను క్యాన్సిల్ చేసి, ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లుగా కొత్త పాటలను కంపోజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, సాంగ్స్ బ్యాలెన్స్ ఉండటం, పైగా భారీగా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉండటం వల్ల ‘ది రాజా సాబ్’ సినిమా ఈ ఏడాది థియేటర్స్కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభాస్ చేస్తున్న మరో మూవీ ‘ఫౌజి’ చిత్రీకరణ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది.సో... ఈ మూవీ 2026లో రిలీజయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ పీరియాడికల్ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... విష్ణు మంచు హీరోగా చేసిన ‘కన్నప్ప’ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్కు కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పవచ్చు.డ్రాగన్ వచ్చేది వచ్చే ఏడాదే... గత ఏడాది ‘దేవర’ మూవీ తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత హిందీ మూవీ ‘వార్ 2’తో ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయిపోయారు. హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ మరో మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ హిందీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాత. ఈ ‘వార్ 2’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ సోలోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) మూవీ అనౌన్స్మెంట్ రెండేళ్ల క్రితమే వచ్చింది.కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 20న మొదలైంది. ఈ నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు ఎన్టీఆర్. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ రిలీజ్ ఏప్రిల్కి వాయిదా పడిందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ నటి రుక్ష్మిణీ వసంత్, మరో లీడ్ రోల్లో టొవినో థామస్ నటించనున్నారని తెలిసింది. మళ్లీ గ్యాప్... ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల సక్సెస్తో అల్లు అర్జున్ మంచి జోష్లో ఉన్నారు. ముఖ్యంగా ‘పుష్ప: ది రూల్’ చిత్రం బ్లాక్బస్టర్గా నిలవడం, సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించడం అనేవి అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ను మరింత పెంచినట్లున్నాయి. అయితే ‘పుష్ప: ది రైజ్’ మూవీ విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత కానీ... ‘పుష్ప: ది రూల్’ సినిమా థియేటర్స్లోకి రాలేదు.ఇలా అల్లు అర్జున్ను స్క్రీన్పై చూసుకునేందుకు ఆయన అభిమానులు మూడు సంవత్సరాలు వెయిట్ చేశారు. కాగా మళ్లీ అల్లు అర్జున్ను స్క్రీన్పై చూసేందుకు మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయనున్నారట అట్లీ. భారీగా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంటుందట.పైగా ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ మరో రెండు సంవత్సరాలు థియేటర్స్లోకి రాదని ఊహించవచ్చు. అలాగే 2018లో ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన మరో మూవీ ‘అల... వైకుంఠపురములో..’ 2020లో విడుదలైంది. ఈ గ్యాప్ గురించి, ‘గ్యాప్... ఇవ్వలా వచ్చింది’ అన్నట్లుగా అల్లు అర్జున్ అప్పట్లో పేర్కొన్నారు. ఇలా మరోసారి అల్లు అర్జున్ కెరీర్లో మళ్లీ గ్యాప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ ఏడాది సోలో హీరోగా సిల్వర్ స్క్రీన్ని మిస్ చేసుకోనున్న హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

పైలెట్గా 3 మండలాల్లో భూ భారతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తీసుకొస్తున్న భూ భారతి పోర్టల్ను తొలుత పైలెట్ పద్ధతిలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ పోర్టల్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కాగా దీనిని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని మూడు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మండలాల్లో అమలు సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేసి, ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో భూ భారతి, హౌసింగ్ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు. ప్రజలు, రైతులకు అవగాహన సదస్సులు భూ భారతి ప్రారంబోత్సవం అనంతరం రాష్ట్రంలోని 3 మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని, ఆయా మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సదస్సుల్లో వ్యక్తమయ్యే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని సూచించారు.ఈ మండలాల్లో నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ సదస్సులు నిర్వహించాలని, ప్రజల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్రెడ్డి, రెవెన్యూ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇళ్లు కేటాయించాలి అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని, అర్హులనే ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని, ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లైతే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పారు.ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుకు మంజూరైన ఇంటిని అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

హైరింగ్ ప్రణాళికల్లో కంపెనీలు...
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కంపెనీలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వర్క్ఫోర్స్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ’హైరింగ్, కాంపన్సేషన్, అట్రిషన్ మేనేజ్మెంట్ అవుట్లుక్ సర్వే 2025–26’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా 1,520 మంది సీఎక్స్వోలు, సీనియర్ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదిక ప్రకారం 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకువాలని భావిస్తుండగా 13 శాతం కంపెనీలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు లేక ఖాళీ కాబోతున్న పోస్టులను భర్తీ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ మరికొన్ని సంస్థలు హైరింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ ప్రణాళికలేమీ లేవని 16 శాతం సంస్థలు తెలిపాయి. తాత్కాలిక స్టాఫింగ్ వైపు మొగ్గు.. తాత్కాలిక కొలువులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. 26 శాతం కంపెనీలు టెంపొరరీ, కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ ఆధారిత పనుల కోసం ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. గిగ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అధారిత ఉద్యోగులు, అడ్వైజరీ సేవలందించే వారిని హైరింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పర్మనెంట్ ఉద్యోగులకు బదులుగా తాత్కాలిక సిబ్బందిని తీసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 37 శాతం కంపెనీలు మిడ్–లెవెల్ నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపాయి. మరోవైపు, 19 శాతం కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తుండగా, 18 శాతం సంస్థలు సీనియర్ లీడర్షిప్ స్థానాల్లోకి సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నాయి. ‘ఆర్థిక అనిశ్చితులను దాటుకుంటూ కంపెనీలు ముందుకెళ్తున్న క్రమంలో ప్రతిభావంతులైన నిపుణులకు డిమాండ్ నెలకొంది. మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్కి భారీగా డిమాండ్ ఉండటంతో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రిసు్కలను అధిగమించి, సిబ్బందిని అట్టే పెట్టుకోవడంపై కంపెనీలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 2025–26లో కంపెనీలు సమర్ధవంతమైన విధంగా హైరింగ్ ప్రణాళికలను వేసుకునేందుకు ఈ విశేషాలు ఉపయోగపడతాయి‘ అని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆర్పీ యాదవ్ చెప్పారు. మరిన్ని విశేషాలు.. → 53 శాతం కంపెనీలు హైరింగ్ వృద్ధి ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు 33 శాతం కంపెనీలు 10–15 శాతం అధికంగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయి. → పరిశ్రమలవారీగా చూస్తే రిటైల్, క్యూ–కామర్స్లో అత్యధికంగా 21 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ విభాగాల్లోనూ సుమారు 9 శాతం సంస్థలు సిబ్బందిని తీసుకోనున్నాయి. → ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లో రిక్రూట్మెంట్ అధికంగా ఉంటుందని 15 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. రెన్యూవబుల్స్, ఎనర్జీ, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల విభాగాల్లో 11 శాతం కంపెనీలు రిక్రూట్మెంట్ చేపట్టనున్నాయి. → ఐటీ సర్వీసులు, టెలికం, టెక్నాలజీ విభాగాల్లో 13 శాతం, తయారీ, ఇంజినీరింగ్లో 11 శాతం, ఇన్ఫ్రా, రవాణా, రియల్ ఎస్టేట్లో 10 శాతం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా)లో 9 శాతం సంస్థలు హైరింగ్ యోచనలో ఉన్నాయి. → ఇక, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, హాస్పిటాలిటీ, మీడియా..ఎంటర్టైన్మెంట్, విద్య తదితర రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హైరింగ్ ఒక మోస్తరుగానే ఉండవచ్చని అంచనా.

రాష్ట్రపతికీ మూడు నెలలే
న్యూఢిల్లీ: గవర్నర్ల నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిపై రాష్ట్రపతి మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. తమిళనాడు గవర్నర్కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మూణ్నెల్లు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో సంబంధిత రా ష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల విషయంలో 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతమేమీ కాదు. వాటిని కోర్టులు సమీక్షించవచ్చు’’అని కూడా పేర్కొనడం విశేషం! బిల్లులపై నిర్ణయం విషయంలో గవర్నర్లకు స్పష్టమైన గడువు నిర్దేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్థీవాలా, జస్టిస్ ఎం.మహదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ మూడు నెలల్లోపు నిర్ణ యం తీసుకోవాలి. రెండోసారీ పంపితే నెలలోపు వి« దిగా ఆమోదించాల్సిందే తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధం’’అని స్పష్టం చేసింది. అలా ఈ విషయమై గవర్నర్కు తొలిసారిగా గడువు విధించింది. బిల్లుల విషయమై మూడు నెలల గడువును రాష్ట్రపతికి కూడా వర్తింపజేయడం విశేషం. ఆ తీర్పు తాలూకు 415 పేజీల పూర్తి ప్రతిని సుప్రీంకోర్టు శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడాలి ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదా పెండింగ్లో పెట్టవచ్చు. అది ఎంతకాలమన్న విషయమై అందులో రాజ్యాంగం గడువూ నిర్దేశించలేదు. అంతమాత్రాన బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రపతికి ‘పాకెట్ వీటో’అధికారాలేమీ ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రాష్ట్రపతి తన వద్దకొచి్చన బిల్లుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే (షల్ డిక్లేర్) అని ఆర్టికల్ 201లో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి ఆమోదం తెలపడమో, పెండింగ్లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరన్నదే దాని ఉద్దేశం. అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలూకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చని కాదు. అదీగాక ఏ అధికారన్నైనా వాడుకునే విషయంలోనైనా సముచిత కాలావధి తప్పనిసరి. చట్టపరంగా కూడా అదే సరైనది. ఈ సాధారణ న్యాయసూత్రానికి 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు’’అని పేర్కొంది. ‘‘ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో అందుకు తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి. రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు, సమాధానాలివ్వడం ద్వారా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలి’’అని స్పష్టం చేసింది.కోర్టుల పాత్ర పోషించొద్దు చట్టసభలు రూపొందించే బిల్లుల రాజ్యాంగబద్ధత విషయంలో కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆ కారణంగా బిల్లులను పెండింగ్లో పెట్టే పక్షంలో వాటి రాజ్యాంగబద్ధతను తేల్చాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే. కనుక ఆర్టికల్ 143 ప్రకారం ఈ అంశాన్ని విధిగా సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది’’అని స్పష్టం చేసింది. అంతే తప్ప వాటిపై ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుని కోర్టుల పాత్ర పోషించడానికి వీల్లేదని పేర్కొంది. ‘‘ఫక్తు న్యాయపరమైన అంశాలివి. ఇలాంటి వాటిలో కార్యనిర్వాహక విభాగం వేలు పెట్టడానికి వీల్లేదని చెప్పడానికి మేం ఎంతమాత్రమూ సంశయించడం లేదు. ఎందుకంటే బిల్లుల రాజ్యాంగబద్ధతపై లోతుగా పరిశీలన జరిపి తగిన చర్యలను సిఫార్సు చేసే అధికారం కేవలం రాజ్యాంగ ధర్మాసనాలది మాత్రమే’’అని వివరించింది.
న్యూ కెరీర్ ఎక్స్ప్రెస్.. సూపర్ బోగీలెన్నో..!
జైలర్ –2లో నేనున్నా.. సీనియర్ హీరోయిన్
ఔరంగజేబ్ ఓటమిపాలై సమాధి అయ్యిందిక్కడే
సూట్కేస్లో గర్ల్ఫ్రెండ్
విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ?
సరిహద్దుల్లో చొరబాట్లను నిలువరించి.. ఆర్మీ జేసీవో వీరమరణం
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ జీవితాన్నిచ్చింది
పుతిన్తో ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్ భేటీ
చలో మైదాన్
అమెరికా కాలేజీల్లోనూఅక్రమ వలసదారుల వేట!
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
తిరుమలలో మరో అపచారం
ఉప్పల్లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
నా సినిమాలో ఆ సీన్ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
ఈ రాశి వారికి వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
రెడ్బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
దానివల్లే గెలిచానని నిత్యం పూజిస్తూ ఉంటార్సార్!
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
'ఛావా' టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
బేబీ.. ఇలా అయితే కష్టమే!
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా?.. ఇప్పటికైనా పృథ్వీ షాను తీసుకోండి!
రాజాసింగ్తో బండి సంజయ్ చర్చలు సఫలం
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
చంద్రబాబు మరో మహా ప్యాలెస్
LSG VS GT: డబుల్ సెంచరీ కొట్టిన శార్దూల్ ఠాకూర్
భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ప్రాణం తీసిన వేగం
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
IPL 2025: గుజరాత్ టైటాన్స్కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
గోల్డెన్ డేస్..
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి క్రికెటర్గా
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
నేపాల్కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్కు రాకపోవడమేంటి?
సిక్సర్ల అభి ‘ షేక్ ’
మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్-సాయి సుదర్శన్ జోడీ
గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
జాన్వీ కపూర్కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
వచ్చేవారం స్టాక్మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
IPL 2025: పూరన్ సిక్సర్ల సునామీ.. గుజరాత్ను చిత్తు చేసిన లక్నో
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. వీటికి మినహాయింపు
ఐపీఎల్కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
పంజాబ్ కింగ్స్పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
మార్పు తథ్యమేనా?.. సీఎం పదవిపై మంత్రి శ్రీధర్బాబు రియాక్షన్
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
హైదరాబాద్లో పెరుగుతున్న స్మార్ట్ ఇళ్లు..
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
సరిగ్గానే దిద్దుతున్నారా?
LSG VS GT: మిచెల్ మార్ష్ ఎందుకు ఆడటం లేదు.. ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..?
కిలో మీటర్కు రూ.64.01 కోట్లు
న్యూ కెరీర్ ఎక్స్ప్రెస్.. సూపర్ బోగీలెన్నో..!
జైలర్ –2లో నేనున్నా.. సీనియర్ హీరోయిన్
ఔరంగజేబ్ ఓటమిపాలై సమాధి అయ్యిందిక్కడే
సూట్కేస్లో గర్ల్ఫ్రెండ్
విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ?
సరిహద్దుల్లో చొరబాట్లను నిలువరించి.. ఆర్మీ జేసీవో వీరమరణం
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ జీవితాన్నిచ్చింది
పుతిన్తో ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్ భేటీ
చలో మైదాన్
అమెరికా కాలేజీల్లోనూఅక్రమ వలసదారుల వేట!
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
తిరుమలలో మరో అపచారం
ఉప్పల్లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
నా సినిమాలో ఆ సీన్ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
ఈ రాశి వారికి వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
రెడ్బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
దానివల్లే గెలిచానని నిత్యం పూజిస్తూ ఉంటార్సార్!
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
'ఛావా' టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
బేబీ.. ఇలా అయితే కష్టమే!
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా?.. ఇప్పటికైనా పృథ్వీ షాను తీసుకోండి!
రాజాసింగ్తో బండి సంజయ్ చర్చలు సఫలం
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
చంద్రబాబు మరో మహా ప్యాలెస్
LSG VS GT: డబుల్ సెంచరీ కొట్టిన శార్దూల్ ఠాకూర్
భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ప్రాణం తీసిన వేగం
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
IPL 2025: గుజరాత్ టైటాన్స్కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
గోల్డెన్ డేస్..
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి క్రికెటర్గా
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
నేపాల్కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్కు రాకపోవడమేంటి?
సిక్సర్ల అభి ‘ షేక్ ’
మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్-సాయి సుదర్శన్ జోడీ
గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
జాన్వీ కపూర్కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లు
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
వచ్చేవారం స్టాక్మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
IPL 2025: పూరన్ సిక్సర్ల సునామీ.. గుజరాత్ను చిత్తు చేసిన లక్నో
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. వీటికి మినహాయింపు
ఐపీఎల్కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
పంజాబ్ కింగ్స్పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
మార్పు తథ్యమేనా?.. సీఎం పదవిపై మంత్రి శ్రీధర్బాబు రియాక్షన్
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
హైదరాబాద్లో పెరుగుతున్న స్మార్ట్ ఇళ్లు..
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
సరిగ్గానే దిద్దుతున్నారా?
LSG VS GT: మిచెల్ మార్ష్ ఎందుకు ఆడటం లేదు.. ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..?
కిలో మీటర్కు రూ.64.01 కోట్లు
సినిమా

క్రిష్ 4లో?
బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుంచి ‘క్రిష్ 4’ రానున్న సంగతి తెలిసిందే. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాల్లో హీరోగా నటించిన హృతిక్ రోషన్... ‘క్రిష్ 4’ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. రాకేష్ రోషన్, ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు.వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీలో ప్రీతీ జింతా, వివేక్ ఓబెరాయ్ వంటి వారు నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ప్రియాంకా చోప్రా పేరు తెరపైకి వచ్చింది. కాగా ఇటీవల ప్రియాంకా చోప్రా – నిక్ జోనస్ (ప్రియాంక భర్త)లను హృతిక్ అమెరికాలో కలిసి, మాట్లాడటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. వీరి మధ్య ‘క్రిష్ 4’ అంశం కూడా చర్చకు వచ్చిందని, ఈ మూవీలో ప్రియాంకా చోప్రా దాదాపు ఖరారు అయ్యారని ప్రచారం జరుగుతోంది.

ప్రామిస్ని నిలబెట్టుకున్నాం: హీరో ప్రదీప్
‘‘ఈ వేసవిలో మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అని భావించే ప్రతి ఫ్యామిలీని ‘మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి ఆహ్వానిస్తున్నాం. మా సినిమా చూసి, థియేటర్స్ నుంచి బయటకొచ్చే ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు కనిపిస్తోంది. మా సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామిస్ చేశాను.ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నాం’’ అని ప్రదీప్ మాచిరాజు అన్నారు. ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్–భరత్ దర్శకత్వంలో ఈ సినిమాను మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మించింది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్మీట్లో... ‘‘క్లీన్ కామెడీతో అందర్నీ నవ్విస్తామని చెప్పం. అదే చేశాం’’ అన్నారు నితిన్–భరత్. గెటప్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ రథన్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు.

సారంగపాణి వినోదం
‘జెంటిల్మన్, సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందిన మూడో చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలనే నా కల ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మా చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు, మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న రిలీజ్ చేస్తున్నాం. ‘బలగం, 35 చిన్న కథ కాదు, కోర్టు’ సినిమాలతో ప్రియదర్శి స్థాయి పెరిగింది. ‘సారంగపాణి జాతకం’తో వంద శాతం వినోదం పంచుతారాయన. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని తెలిపారు.

స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
మన దేశంలో చాలామంది సింగర్స్ ఉన్నారు. వాళ్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే గాయకుల లిస్ట్ తీస్తే కచ్చితంగా ఉండే పేరు నేహా కక్కర్. ఇప్పుడు సింగింగ్ షో జడ్జిగా పేరు తెచ్చుకుంది గానీ ఒకప్పుడు పాటలు బాగానే పాడింది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.(ఇదీ చదవండి: మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్) నేహా కక్కర్ కు అక్క సోనూ కక్కర్, తమ్ముడు టోనీ కక్కర్ ఉన్నారు. వీళ్లు ముగ్గురు కూడా సింగర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి పాటలు పాడారు. స్టేజీ ఫెర్మార్మెన్స్ లు కూడా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు అక్క సోనూ కక్కర్ షాకింగ్ ట్వీట్ చేసింది.తాను తమ్ముడు చెల్లి నుంచి విడిపోతున్నానని.. ఇక నుంచి వాళ్లకు తనకు సంబంధం లేదని సోనూ కక్కర్ ట్వీట్ చేసింది. తర్వాత కొన్ని గంటలకే ఈ ట్వీట్ డిలీట్ చేసింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఇదంతా కొత్త ఆల్బమ్ కోసం చేస్తున్న స్టంట్ అని, పీఆర్ స్టంట్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరిగిందనేది కక్కర్ సిస్టర్స్ చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
న్యూస్ పాడ్కాస్ట్

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు
క్రీడలు

ఫిలిప్స్కు గాయం... ఐపీఎల్కు దూరం
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు దూరమయ్యాడు. న్యూజిలాండ్కు చెందిన ఫిలిప్స్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండబోడని గుజరాత్ ఫ్రాంచైజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తాజా సీజన్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఫిలిప్స్... ఈ నెల 6న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో కిందపడ్డాడు. ఈ సమయంలో అతడి గజ్జల్లో గాయమైంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరుగు పయనం కాగా... ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు గ్లెన్ ఫిలిప్స్ సేవలను కూడా కోల్పోయింది.

సిక్సర్ల అభి ‘ షేక్ ’
తొలి ఐదు మ్యాచ్లలో కలిపి 51 పరుగులు...ఈ సీజన్లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఇది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అతను తన గత ఏడాది ఆటను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న ట్లున్నాడు. పంజాబ్పై మ్యాచ్లో ఒక్కసారిగా తన కసినంతా ప్రదర్శిస్తూ వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం బౌండరీలతోనే 116 పరుగులు బాది శతకనాదం చేశాడు. ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ ఈ ఇన్నింగ్స్ విలువేమిటో చెప్పాడు. అభిషేక్కు హెడ్ మెరుపులు తోడవడంతో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సన్రైజర్స్ సంచలనం సృష్టించింది. మరో వైపు సమష్టి ప్రదర్శనతో 245 పరుగులు చేసి కూడా ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ తీవ్ర నిరాశకు లోనైంది. ఓవరాల్గా 492 పరుగులతో అభిమానులకు ఫుల్ జోష్ దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నాలుగు వరుస పరాజయాల తర్వాత నిస్తేజంగా కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఘనమైన రీతిలో కోలుకుంది. తమ అసలు ఆటను ప్రదర్శిస్తూ లీగ్లో తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాన్ని ఇచ్చింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్లు) ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేయగా, ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 75 బంతుల్లో 171 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్...పవర్ప్లేలో 89 పరుగులు...10 ఓవర్లు ముగిసే సరికి 120. తర్వాతి 5 ఓవర్లలో 57 పరుగులు...ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు... పంజాబ్ కింగ్స్ ఇలా దాదాపు అన్ని దశల్లోనూ ఒకే తరహాలో దూకుడుగా సాగింది. టాప్–7లో ఇద్దరు మినహా మిగతావారంతా చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. షమీ వేసిన తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 3 ఫోర్లతో మొదలు పెట్టగా, షమీ తర్వాతి ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 బాదాడు. కమిన్స్ తొలి ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్తో పంజాబ్ 16 పరుగులు రాబట్టింది. అయితే తన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులిచ్చిన హర్షల్...ప్రియాన్‡్షను అవుట్ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మలింగ తన తొలి వికెట్గా ప్రభ్సిమ్రన్ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత శ్రేయస్, నేహల్ వధేరా (22 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం కూడా జోరుగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. అన్సారీ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదిన శ్రేయస్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. శశాంక్ సింగ్ (2) విఫలం కాగా, మలింగ ఓవర్లో శ్రేయస్ 4 ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండు బంతుల వ్యవధిలో మ్యాక్స్వెల్ (3), శ్రేయస్లను హర్షల్ అవుట్ చేయడంతో 18, 19 ఓవర్లలో కలిపి 13 పరుగులే వచ్చాయి. ఒకే ఓవర్లో 27 పరుగులు...షమీ వేసిన ఆఖరి ఓవర్లో కింగ్స్ పండగ చేసుకుంది. ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న స్టొయినిస్ ఈ ఓవర్లో చెలరేగిపోయాడు. చివరి 4 బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6 బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. బౌండరీల వర్షం...అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో హెడ్ 2 ఫోర్లు కొట్టడంతో రైజర్స్ విధ్వంసం మొదలైంది. యాన్సెన్ ఓవర్లో అభిషేక్ నాలుగు ఫోర్లు కొట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో హెడ్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత యశ్ ఠాకూర్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగిపోయాడు. పవర్ప్లేలో జట్టు 83 పరుగులు సాధించింది. 19 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మరో వైపు మ్యాక్స్వెల్ ఓవర్లో రెండు భారీ సిక్స్లు బాదిన హెడ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాన్సెన్ వేసిన ఓవర్లో మళ్లీ శివమెత్తిన అభిషేక్ 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదాడు. చహల్ ఓవర్లో ఎట్టకేలకు హెడ్ వెనుదిరిగిన తర్వాత అదే ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి 40 బంతుల్లో అభిషేక్ సెంచరీ మార్క్ను చేరుకొని గర్జించాడు. ఆ తర్వాత చెలరేగి బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్ జట్టును అలవోకగా విజయం దిశగా నడిపించాడు. సాహసవంతులకే అదృష్టం కలిసి వస్తుందన్నట్లు అభిషేక్కు రెండు లైఫ్లు లభించాయి. 28 వద్ద ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ ఇవ్వగా అది నోబాల్గా తేలింది. ఆ తర్వాత 56 వద్ద చహల్ తన బౌలింగ్లోనే సునాయాస క్యాచ్ను వదిలేశాడు. దీనిని అతను బ్రహ్మండంగా వాడుకున్నాడు. స్కోరు వివరాలుపంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) హర్షల్ 36; ప్రభ్సిమ్రన్ (సి) కమిన్స్ (బి) మలింగ 42; శ్రేయస్ (సి) హెడ్ (బి) హర్షల్ 82; వధేరా (ఎల్బీ) (బి) మలింగ 27; శశాంక్ (ఎల్బీ) (బి) హర్షల్ 2; మ్యాక్స్వెల్ (బి) హర్షల్ 3; స్టొయినిస్ (నాటౌట్) 34; యాన్సెన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–66, 2–91, 3–164, 4–168, 5–205, 6–206. బౌలింగ్: మొహమ్మద్ షమీ 4–0–75–0, కమిన్స్ 4–0–40–0, హర్షల్ 4–0–42–4, ఇషాన్ మలింగ 4–0–45–2, అన్సారీ 4–0–41–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 66; అభిషేక్ (సి) (సబ్) దూబే (బి) అర్‡్షదీప్ 141; క్లాసెన్ (నాటౌట్) 21; ఇషాన్ కిషన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 10; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–171, 2–222. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–1, యాన్సెన్ 2–0–39–0, యశ్ ఠాకూర్ 2.3–0–40–0, మ్యాక్స్వెల్ 3–0–40–0, ఫెర్గూసన్ 0.2–0–1–0, స్టొయినిస్ 0.4–0–6–0, చహల్ 4–0–56–1, శశాంక్ 2–0–27–0.75 ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. అతను 75 పరుగులివ్వగా, ఇదే సీజన్లో రాజస్తాన్ బౌలర్ ఆర్చర్ 76 పరుగులు ఇచ్చాడు.1 ఐపీఎల్లో భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కేఎల్ రాహుల్ (132) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ సవరించాడు.ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: జైపూర్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X ముంబై వేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

జ్యోతి సురేఖ జోడీ పసిడి గురి
సెంట్రల్ ఫ్లోరిడా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ (భారత్) జోడీ 153–151 పాయింట్ల తేడాతో హువాంగ్ ఐజు–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. తుదిపోరులో ఐదో సీడ్గా బరిలోకి దిగిన భారత జోడీ... రెండో సీడ్ చైనీస్ తైపీని వెనక్కినెడుతూ స్వర్ణం కైవసం చేసుకుంది. తొలి రెండు సిరీస్లను 37–38, 38–39తో కోల్పోయిన భారత ఆర్చర్లు... మూడో సెట్లో 39–38తో తిరిగి పోటీలోకి వచ్చారు. నాలుగో సిరీస్లో 39–36తో సునాయాసంగా నెగ్గి పసిడి పతకం చేజిక్కించుకున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చిన అనంతరం ఈ విజయం విశ్వక్రీడల్లో భారత పతక ఆశలను మరింత పెంచింది. ఈ టోర్నీలో భారత్కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు కాంపౌండ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు కాంస్య పతకం నెగ్గగా... రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్కు చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి క్రికెటర్గా
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. 246 పరుగుల భారీ టార్గెట్ను సన్రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. ఈ విజయంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మది కీలక పాత్ర. అభిషేక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో అభిషేక్ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. అతడి బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్లతో 141 పరుగులు చేశాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 66), క్లాసెన్(14 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అద్భుతమైన సెంచరీతో మెరిసిన అభిషేక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇండియన్ ప్లేయర్గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(132) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో రాహుల్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్గా అభిషేక్ నిలిచాడు. తొలి స్దానంలో విండీస్ వీరుడు, ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్(175 నాటౌట్) ఉన్నాడు.👉ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్(37 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. తర్వాతి ప్లేస్లో ప్రియాన్ష్ ఆర్య(38 బంతులు) ఉన్నాడు.👉ఐపీఎల్లో ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్(124) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో స్టోయినిష్ను శర్మ అధిగమించాడు. 𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025
బిజినెస్

తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ మోటర్సైకిల్స్ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్లో రెండు, వరంగల్లో ఒకటి చొప్పున మొత్తం 3 షోరూమ్లను ప్రారంభించింది. వీటిలో సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయి. ఒక్కో కొత్త షోరూమ్లో రోర్ ఈజెడ్ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 30 కస్టమర్లకు కాంప్లిమెంటరీగా బంగారు నాణెం అందిస్తున్నట్లు సీఈవో మధుమిత అగ్రవాల్ తెలిపారు.రోర్ ఈజెడ్ వాహనం ధర రూ. 89,999గా ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 175 కి.మీ. రేంజి ఇస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 50 నగరాల్లో 100 పైచిలుకు షోరూమ్లు, సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 35 షోరూమ్లు ఉన్నాయి. ఒబెన్ ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 15 కొత్త షోరూమ్లను ప్రారంభించగా పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా అడుగు పెట్టింది. దీనితో పాటు ఇప్పటికే ఉన్న మార్కెట్లలో తన పరిధిని బలోపేతం చేసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర ప్రదేశ్లలో కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది.

ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రత్యేక 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందులో 7.30% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చే వివిధ ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితులపై బ్యాంక్ వడ్డీ రేట్లను విస్తృతంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.సవరించిన రేట్ల ప్రకారం 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లకు 4.25 శాతం, 180 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లకు 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఏడాది మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 7.05 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ అందిస్తుంది.రూ .3 కోట్ల నుండి రూ .10 కోట్ల లోపు డిపాజిట్లకు సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.75%, 180 నుండి 210 రోజులకు 6.25%, 211 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితికి 6.50%. ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 7.05 శాతంగా, ఏడాది కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.70 శాతంగా ఉంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ వ్యవధితో రూ .3 కోట్ల లోపు డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది.మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అందించే వడ్డీ రేటుకు సంబంధించిన వివరాలను ప్రకటనలో వెల్లడించలేదు. అయితే ఫిక్స్డ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్స్ కోరుకునే కస్టమర్లకు బ్యాంక్ ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తూనే ఉంది. దేశంలోని రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ అధిక వడ్డీ పథకాలను ఉపసంహరించుకోవడం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ మార్గదర్శకాలకు ప్రతిస్పందనగా వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది

ఇలాంటి ఇళ్లకే డిమాండ్..
కరోనా, లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం అనివార్యమైంది. కరోనా కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీపడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్ అండ్ ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్తో సహా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే నగరాలలో 2,500 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. పలు కీలకాంశాలివే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో ఫ్లోర్ ప్లాన్స్లలో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపరీ్టలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తాము ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఓ సంస్థ ఎండీ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ల్యాండ్ బ్యాంక్ను సమీకరించిన డెవలపర్లు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్లను చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రెండో అర్ధ భాగం నుంచి గృహ లాంచింగ్స్లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

ఫ్లిప్కార్ట్కు గట్టిదెబ్బ.. రూ.కోటికి పైగా జరిమానా..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆన్లైన్ బీమా పంపిణీకి సంబంధించిన ఈ-కామర్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్ఐపీఎల్)కు ఐఆర్డీఏఐ రూ.1.06 కోట్ల జరిమానా విధించింది.ఫ్లిప్కార్ట్ పాల్పడిన ఉల్లంఘనలు ఇవే.. ఫ్లిప్కార్ట్ పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. పాలసీ కొనుగోలుదారులను నేరుగా బీమా కంపెనీకి కాకుండా బీమా మధ్యవర్తికి మళ్లించడం ద్వారా ఐఆర్డీఏఐ మార్గదర్శకాలను ఉల్లంఘించింది. గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీమా పాలసీలను విక్రయించడం వల్ల అదనపు జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. తగినంత నైపుణ్యం లేకపోవడం అంటే కేవలం ఒకేఒక శిక్షణ పొందిన బీమా నిపుణుడితో 70,000 కంటే ఎక్కువ బీమా పాలసీలను విక్రయించింది. ఇది వినియోగదారుల భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది.పాలసీదారులపై ప్రభావంరెగ్యులేటరీ చర్య పాలసీ చెల్లుబాటు, క్లెయిమ్ సెటిల్మెంట్లు, కస్టమర్ మద్దతుపై ఆందోళనలను లేవనెత్తుతుంది. తప్పుడు అమ్మకం ప్రమాదాల కారణంగా కొనుగోలుదారులు పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలో అడ్డంకులను ఎదుర్కొంటారు. అయితే రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత జారీ చేసిన పాలసీలు చట్టపరమైన అనిశ్చితులను ఎదుర్కోవచ్చు. అదనంగా, శిక్షణ పొందిన సిబ్బంది పరిమిత లభ్యత పాలసీదారు సహాయం, వివాద పరిష్కారాన్ని ప్రభావితం చేస్తుంది.కఠినంగా బీమా అమ్మకాలుజరిమానాను అంగీకరించిన ఫ్లిప్కార్ట్, పరిశ్రమ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూ ఐఆర్డీఏఐ ఉత్తర్వులను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఈ చర్య ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా బీమా అమ్మకాలను కఠినంగా అమలు చేయడానికి సంకేతం. పాలసీ కొనుగోలుదారులు ఆన్లైన్లో బీమా కొనుగోలు చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ వివరాలను ధృవీకరించడం, పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవడం, సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ నుండి మార్గదర్శకత్వం పొందడం మంచిది.
ఫ్యామిలీ

నేడు స్ట్రీట్ చిల్డ్రన్ డే: వీధి నుంచి ఇంటికి
మన ఉరుకుల పరుగుల జీవనంలో ఒక్క కుదుపుతో ఆపే రెడ్ సిగ్నల్లా బాల్యం కూడలిలో భిక్షం ఎత్తుతూ కనిపిస్తుంది. జాతరలా తోసుకువెళుతున్న సమూహంలో నిలువెల్లా రంగు పూసుకుని చేతి కర్రతో గాంధీ తాతలా బాల్యం నిగ్గదీస్తుంది. చిన్న బొజ్జను నింపుకోలేని చిట్టి చేతులతో జీవితంతో పోరాడలేక దొంగ అవుతుంది, దోపిడీకి గురవుతుంది. బాలనేరస్తులుగా ముద్ర వేయించుకొని భవిష్యత్తును బందిఖానాలా మార్చుకుంటుంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది వీధి బాలలు ఉన్నట్టు యునిసెఫ్ అంచనా. హైదరాబాద్లో 28,000కు పైగా వీధి బాలలు ఉన్నట్టు అంచనా. పాట్నా పట్టణంలో వీధి బాలల సంఖ్య ఎక్కువ.వీధి బాల్యం ఎందుకు పెరుగుతోందంటే..గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పనులు దొరక్క, నిలువనీడ లేక, కనీస అవసరాలు తీరక తల్లిదండ్రులు గొడవలు పడటం, విడిపోవడం, కుటుంబాలు విచ్ఛిన్నమవడంతో దిక్కుతోచని స్థితిలో పిల్లలు రోడ్ల మీదకు వస్తున్నారు. మన దేశంలో గుర్తించినవే కాదు గుర్తింపునకు నోచుకోని స్లమ్స్ చాలా ఉన్నాయి. వీటిల్లో నివాసం, ఆహార భద్రత లేమి, చదువు నూ దూరం చేస్తుంది. ఇప్పటికే వీధి బాలల్లో 82 శాతం మంది చదువును ఆపేశారని నివేదికలు చూపుతున్నాయి. వీరంతా జీవనోపాధి కోసం చిత్తు కాగితాలు ఏరుకోవడం, కూలి పనులు, భిక్షాటన, షూ పాలిష్, పూలు అమ్మడం.. వంటి వాటిని ఎంచుకుంటుంటే కొంతమంది దొంగతనం, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, మాదక ద్రవ్యాల వ్యాపారం.. మొదలైన చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు. హెచ్ఐవి/ఎయిడ్స్ బారిన పడటం, ఆడపిల్లలు చిన్నవయసులోనే గర్భం దాల్చడం, గర్భస్రావాలు.. వంటి సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. సమాజంలో వీధి బాలల పట్ల ఉన్న వ్యతిరేకతను దూరం చేయడానికి అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయడం, మహిళలకు, యువతకు జీవన నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం తప్పనిసరిగా చేయాల్సిన పనులుగా వివరించారు. ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి. ఆత్మీయ ఆహ్వానంవీధి బాలల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో రెయిన్ బో హోమ్స్ ఒకటి. ఈ హోమ్స్ హైదరాబాద్లో 14 ఉంటే, దేశ వ్యాప్తంగా 50 వరకు ఉన్నాయి. ఒక్కో హోమ్లో 70 నుంచి 80 మంది పిల్లలు సంరక్షణను పొందుతున్నారు. రోడ్డు మీద నుంచి హోమ్లోకి వచ్చే పిల్లలకు సంరక్షణ పొందుతున్న పిల్లలు ఆత్మీయ ఆహ్వానం పలుకుతారు. ‘తమ కుటుంబంలో చేరిన కొత్తవారిని తోబుట్టువుల్లా దగ్గరకు తీసుకుంటారు’ అని తెలిపారు నిర్వాహకులు.మూలాన్ని సమీక్షించాలి...సుమతి చదువుకోలేదు. గ్రామీణ నేపథ్యం. తన ఈడు వయసున్న అతన్ని ప్రేమించి, కుటుంబాన్ని వదిలేసి అతనితో పాటు పట్టణం వచ్చేసింది. కొంతకాలం బాగానే ఉన్నా చెడు అలవాట్లకు బానిసైన అతను ఆమెను, పుట్టిన బిడ్డనూ వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో సుమతిది మానసిక కుంగుబాటు, ఎలా బతకాలో తెలియని నిస్సహాయ స్థితి. బిడ్డను కాపాడుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగి, సెక్స్వర్కర్గా మారింది. ‘ఇలాంటి వారిని గుర్తించి తల్లికి, బిడ్డకు సంరక్షణను అందించే బాధ్యతను తీసుకున్నామ’ని తెలిపారు రెయిన్ బో హోమ్స్ డైరెక్టర్ అనూరాధ. ఇలాంటి వేదనాభరితమైన జీవన కథనాలెన్నో సమాజంలో ఉన్నాయని, స్ట్రీట్ చిల్డ్రన్స్ సంరక్షణ విధానాల గురించి అనూరాధ వివరించారు.చిన్న భరోసా!దేశవ్యాప్తంగా వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న 18 లక్షల మంది పిల్లలను గుర్తించాం. 6 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న వీధి బాలలను సంరక్షించి ఆ తర్వాత వదిలేయకుండా 23 ఏళ్ల వరకు స్కిల్స్ అందించి, భవిష్యత్తు బాగుండేలా చూస్తున్నాం. కొన్ని వేల మంది పిల్లలు చదువుకొని, వివిధ నైపుణ్యాలు పెంచుకొని తమ జీవితం తాము ఆనందం గడుపుతున్నారు. నర్సులుగా, వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నవారూ, ఉన్నవారు,, పెళ్లి్ల చేసుకొని తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందిస్తున్న వారున్నారు. మా చేయూతతో తమ బాల్యంలోని చేదును దూరం చేసుకొని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. – అనూరాధ, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, రెయిన్ బో హోమ్స్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

బట్టతల పర్లేదు..! ఎయిర్పోర్ట్లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన
కొన్నిపరిస్థితులు సమాజం ముందుకు రాలేని విధంగా చేస్తాయి. అవమానకరంగా ఉంటాయి. మన తప్పిదం కాకపోయినా..అభ్రతభావంతో ఉండాల్సి వస్తుంటుంది. కొన్ని అనారోగ్యాలు మనకు సోకాయి అని నోరువిప్పడానికే జంకేలా ఉంటాయి. ఒకవేళ్ల ఆ వ్యాధితో బాధపడుతున్నానంటే ..మనల్ని ఎలా చూస్తారన్న భయం, ఆందోళన వంటివి వెన్నాడుతూనే ఉంటాయి. పైగా వాటి కోసం తీసుకునే చికిత్సల కారణంగా మన రూపం మారుతుంది..ఐతే ఆ ఆకృతితో బయటకు రావాలన్నా..గట్స్ ఉండాలి. కానీ అలాంటి సమయంలోనే అసలైన అందం ప్రస్ఫుటంగా బయటకొస్తుందట. అదే అంటోంది బాలీవుడ్ నటి సోనాలి బింద్రే.బాలీవుడ్ నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేకక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్న తార. టాలీవుడ్లో కూడా మంచి సక్సెస్ని అందుకుంది. అయితే ఆమె కేన్సర్తో పోరాడి గెలిచిన గ్రేట్ వారియర్ కూడా. ఆ క్రమంలో తనకు ఎదురైన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు నాలుగో దశ మెటాస్టాటిక్ కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యాక..ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడూ..ఎయిర్పోర్ట్లో విలేకరులను ఎదుర్కొనాల్సి ఉంది. అయితే కీమోథెరపీ కారణంగా జుట్టు ఉండదన్నవిషయం తెలిసిందే. అందువల్ల సోనాలి ముందుగానే ఆ టైంకి ధరించాల్సిన విగ్ తదితరాలను ఏర్పాటు చేసుకున్నారట. కానీ ట్రీట్మెంట్ కారణంగా వచ్చిన అలసట కారణంగా ఆ విగ్ ధరించే ఓపిక తనలో లేదట. వీల్ఛైర్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారట. దీంతో ఎయిర్పోర్ట్లోని విలేకరుల ముందుకు బట్టతలతోనే వెళ్తా పర్లేదు అని చెప్పేశారట తన సన్నిహితులతో. అలానే వారి ముందుకు రాగానే అక్కడున్న ప్రతి జర్నలిస్ట్ చాలా అటెన్షన్తో తనకు సహకరించారట. సోనాలి అలానే వచ్చి.. వాళ్లు అడిగే ప్రశ్నలకు మాట్లాడుతుంటే..ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఈ రూపం అని అన్నారట. అతనెవరో నాకు తెలియదుగానీ ఇప్పటికీ ఆ మాటలు మర్చిపోలేను అంటోంది సోనాలి. అప్పుడే నాకు తెలిసింది మనల్ని మనం అంగీకరిస్తే..ఆటోమేటిగ్గా సమాజం అంగీకరిస్తుంది. మనలోని బలానికి ప్రతీది తలవంచుతుంది అని ఆ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసిందని భావోద్వేగంగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ల నుంచి అలాంటి స్పందన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. "అందులోనూ ఆ పరిస్థితుల్లో జాలి వంటివి నచ్చవు..కేవలం ధైర్యంగా మాట్లాడే మాటలే ఇష్టమవుతాయి. అంతేగాదు అక్కడున్నవాళ్లంతా ఆ వ్యాధితో చేసిన పోరాటానికి, ఓర్పుకి సెల్యూట్ చేయడం మరింత ధైర్యాన్నిచ్చింది. అంటే ఎప్పుడూ మన లుక్స్ కాదు అందాన్ని నిర్దేశించేవి..నిశబ్దంగా మనలో అంతర్లీనంగా ఉండే బలమే అసలైన అందం అని తెలుసుకున్నా." అని అంటోంది సోనాలి. అంతేగాదు వ్యాధుల కొరకు తీసుకునే చికిత్సలు కారణంగా వచ్చే మచ్చలు, శారీరక మార్పులు సిగ్గుపడే విషయాలు కావు..నయం అయ్యి ఆ మహమ్మారి నుంచి బయటపడ్డ వారియర్స్ అని అర్థం అంటోంది. అలాంటి సమయంలో తీసుకునే విశ్రాంతిని నిరుత్సాహంతో నింపొద్దు..మనస్సులో శాంతిని నెలకొల్పి..మరింత బలంతో ముందుకొచ్చే సమయంగా భావించాలని చెబుతోంది సోనాలి. (చదవండి: యూట్యూబ్ సెన్సేషన్ ఈ 74 ఏళ్ల బామ్మ..! నెలకు రూ.5 లక్షలు పైనే..)

యూట్యూబ్ సెన్సేషన్ ఈ 74 ఏళ్ల బామ్మ..! నెలకు రూ.5 లక్షలు పైనే..
సోషల్ మీడియా ఎక్కడెక్కడో వంటింట్లోనే మగ్గిపోయే వనిత లెందరినో బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఎందిరినో స్టార్లుగా మార్చింది. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని బామ్మలను ఓవర్నైట్ స్టార్లుగా మార్చింది. అలానే ఇక్కడొక బామ్మ కూడా యూట్యూబ్ సెన్సేషన్గా మారింది. తన పాకకళతో ఎందరో ఫాలోవర్లును దక్కించుకుని డిజటల్ క్విన్గా మారింది ఈ 74 ఏళ్ల బామ్మ. ఆ బామ్మను అంతా ఆప్లీ ఆజీగా పిలిచే సుమన్ ధమానే. ఆమె యూట్యూబ్ ఛానెల్కి ఏకంగా 1.79 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంచనాలకందని విధంగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతిపెద్ద విషయం అనుకుంటే..ఎవ్వరూ ఊహించని రీతిలో సంపాదన ఆర్థిచడం మరింత విశేషం. ఆమె మనవు యష్ సాయంతో ఈ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టారామె. తన పాకకళతో యూట్యూబ్ ఛానెల్లో మహారాష్ట్ర వంటకాల రుచులను పరిచయం చేసింది ఈ బామ్మ. ఎప్పటికప్పుడూ కొత్తదనంతో..కాలానుగుణ రుచులతో ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలతో అలరించింది. ఇంట్లో ఉండే సుగంధద్రవ్యాలతో ఆరోగ్యకరంగా వంటకాలు తయారు చేయడం ఎలా అనే వీడియోలతో..ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చే ఆహారప్రియులను బాగా ఆకర్షించింది. అదే ఆమెకు మంచి స్టార్డమ్ని తెచ్చిపెట్టింది. ఆకర్షణీయమైన పావ్ భాజీ, కరేలే కి సబ్జీ, మహారాష్ట్ర స్వీట్ల వరకు ప్రతిదీ నోరూరించేలా ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలాగో పరిచయం చేసింది. ఈ యూట్యూబ్ స్టార్డమ్ జర్నీలో ఆమె కెమెరా ముందు నిలబడి మాట్లాడటంలో మొదట్లో తడబాటు, సిగ్గుపడటం వంటి సమస్యలను ఎదుర్కొంది. అలాగే సాంకేతిక లోపాలు, ఛానెల్ హ్యాక్ వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ..తన జర్నీని విరమించలేదు. తాజా కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. అలా యూట్యూబ్ సిల్వర్ బటన్ను కూడా దక్కించుకుంది. ఈ బామ్మ కథ విజయానికి వయసు అడ్డంకి కాదని చూపించడమే గాక కుటుంబ మద్దతుతో దేన్నేనా సాధించగలమని నిరూపించింది. ఈ బామ్మ తన యూట్యూబ్ ఛానెల్తో నెలకు రూ. 5 నుంచి రూ. 6 లక్షల పైనే సంపాదిస్తుందట. (చదవండి: మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..)

మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..
మాతృత్వం ఓ వరం అంటారు. అదిపొందలేక బాధపడుతున్న వాళ్లెందరో. ప్రస్తుత జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, జంక్ఫుడ్లతో మాతృత్వం మసకబారుతోంది. ముఖ్యంగా తల్లులు, కాబోయే తల్లులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టీనేజ్ వయసు నుంచే ఆడపిల్లలు మంచి ఆహారపు అలవాట్లు తీసుకునేలా కేర్ తీసుకుంటే..పెళ్లయ్యాక అలాంటి సమస్యలుబారిన పడరని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు తల్లలు ఆరోగ్యం కోసం ప్రతి ఏడాది ఏప్రిల్11న 'మాతృత్వ సంరక్షణ దినోత్సవం' పేరుతో ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే రోజు మహాత్మాగాంధీ భార్య కస్తుర్బా గాంధీ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా అమ్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా..? కాబోయే తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. బారతదేశంలో మాతృత్వ సంరక్షణ పరంగా మెరుగ్గా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిని వర్గాల్లో మాత్రం ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రసూతి మరణాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటమే అత్యంత ఆందోళన కలింగించే అంశం. పట్టణాల్లో అమ్మల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రసూతి మరణాలు తగ్గించే విషయాల్లో బేషుగ్గానే ఉన్నా..పేదరికం, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ సమస్య ఓ సవాలుగా ఉంది. ప్రధాన కారణాలు.. తీవ్రమైన రక్తస్రావం, ఇన్షెక్షన్లు, అధిక రక్తపోటు, అసురకక్షిత గర్భస్రావాలు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం తదితరాలని చెబుతున్నారు నిపుణులు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకి వీటిపై కొంత అవగాహన ఉంది, పైగా అందుబాటులో ఆస్పత్రులు, ఆరోగ్య నిపుణుల సలహాను సులభంగా పొందగలరు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇంకా నాటు వైద్యాన్నే ఆశ్రయించడం, గర్భిణితో ఉండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేమి తదితరాలు ప్రసూతి మరణాల ప్రమాదాన్నిపెంచుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం చొరవతో..ప్రసూతి మణాలు అడ్డుకట్టే వేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అంగన్వాడి, హోమ్ డాక్టర్ వంటి పథకాలతో అమ్మలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలతో తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పురోగతి సాధిస్తోంది కూడా. పూర్తి స్థాయిలో ఈ ఆరోగ్య అసమానతలను అధిగమించాలంటే..కేవలం అవగాహన కార్యక్రమాలతోనే సాధ్యం. అందుకోసమే ప్రభుత్వాలు తల్లిపిల్లల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం తదితరాలపై అవగాహన కల్పిస్తున్నాయి. గర్భస్రావాలు జరగకుండా ఉండేలా.. ఆడపిల్లల ఆరోగ్యం కోసం పౌష్టిక ఆహారం అందించేలా కొన్ని రకాల పథకాలను కూడా ఇస్తుండటం గమనార్హం. అయితే అవి ఇంకా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్రజలకు పూర్తి స్థాయిలో చేరకపోవడంతోనే భారత్లో ఈ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు నిపుణులు. అందువల్లే ఏటా ఈ దినోత్సవం రోజునైనా పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అందించే ఆరోగ్య సంరక్షణ పథకాలపై అవగాహన కల్పించడం, మాతృత్వ మధురిమను రక్షించేకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి కార్యక్రమాలతో చైతన్యపరుస్తున్నారు. అంతేగాదు స్కూళ్లు, కాలేజ్లు, కార్యాలయాల్లో పెద్దఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత ముఖ్యం అని అంటున్నారు గైనకాలజిస్టులు. కాగా, ఇక ఈ ఏడాది "ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు" అనే థీమ్తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లుల ఆరోగ్యం కోసం..పోషకాహారం తీసుకోవడంగర్భనిరోధక మాత్రలు వైద్యులు పర్యవేక్షణలోనే వాడటం, అతిగా వాడకం నిరోధించటం తదితరాలు..ప్రసవం ముందు, తదనంతరం సరైన జాగ్రత్తలు తీసుకోవడంసరైన ఫ్యామిలీ ప్లానింగ్దీంతోపాటు కుటుంబ సభ్యుల సహకారం తదితరాలతో అమ్మల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే మన కుటుంబానికి ఆధారమైన ఆమె ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇద్దాం. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం)
ఫొటోలు


SRH vs PBKS : ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)


హైదరాబాద్లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)


చాహల్తో డేటింగ్ నిజమేనా? ఆర్జే మహ్వాష్ (ఫోటోలు)


సీరియల్ బ్యూటీ స్రవంతి.. భర్తతో సరదాగా ఇలా (ఫొటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ స్టిల్స్


ఒంటిమిట్ట : కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం (ఫోటోలు)


తెలంగాణ అమరనాథ్గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)


హరిత యాత్రలో అలసిన వనజీవి.. రామయ్య అరుదైన చిత్రాలు


హైదరాబాద్ : ఘనంగా ఉస్మానియా మెడికల్ కళాశాల స్నాతకోత్సవం (ఫొటోలు)


ఉప్పల్లో ప్రాక్టీస్ అదరగొట్టిన SRH, పంజాబ్ ప్లేయర్స్ (ఫొటోలు)
అంతర్జాతీయం

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ట్రంప్ వచ్చాక 12వ ప్రమాదం
ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం న్యూయార్క్లో హెలికాప్టర్ ప్రమాదం మరువకముందే.. ఈరోజు మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో చిన్న విమానం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో రహదారిపైనే చిన్న విమానం కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా సెస్నా 310 అనే విమానం విమానాశ్రయానికి సమీపంలోని ఇంటర్స్టేట్-95 సమీపంలో కూలిపోయింది. బోకా రాటన్ విమానాశ్రయం నుండి బయలుదేరి తల్లాహస్సీ వైపు వెళుతున్న కొద్ది క్షణాల్లోనే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం సందర్భంగా విమానం నుంచి మంటలు వచ్చి దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించింది. ప్రమాదం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది.another day in the presidency of the clown who only trusts white men as plane pilots, another plane crash, this time in Boca Raton, Florida. 3 dead, one injuredaccidents happen, but is it a coincidence everything in this country is crumbling under Trump?pic.twitter.com/T7BN9kjuhA— 𝕸𝖔𝖓𝖆𝖗𝖈𝖍𝖔 (@_monarcho) April 11, 2025ఒక్కసారిగా గాల్లో నుంచి విమానం.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడిపోయింది. ఈ కారణంగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై ప్రమాదం కారణంగా అక్కడి రోడ్లను మూసివేసి సహాయక చర్యలు చేపట్టినట్టు రాటన్ ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ చీఫ్ మైఖేల్ లాసల్లె నివేదించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Son 3 muertos por desplome de #avioneta en #BocaRatón, #FloridaDe acuerdo a autoridades locales, el incidente dejó un saldo de 3 personas fallecidas, una herida y un #incendio que alcanzó al menos un vehículo. Por ahora, autoridades ya investigan el siniestro. pic.twitter.com/AJVaENkCyT— Cuarto Poder (@CuartoPoderMX) April 11, 2025 రెండు రోజులలో రెండు ప్రమాదాలుఈ ఘటనకు ముందు రోజు, న్యూయార్క్లో ఓ హెలికాప్టర్ హడ్సన్ నదిలో కూలిపోయిన ఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. వరుసగా రెండు రోజులలో రెండు గగనతల ప్రమాదాలు జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. విమాన రవాణా భద్రతపై సర్వత్రా ప్రశ్నలు వేగంగా వెల్లివిరుస్తున్నాయి. నిపుణులు ఈ ఘటనలపై విచారణ చేపట్టి, కారణాలు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 12వ విమాన ప్రమాదం కావడం గమనార్హం. అమెరికాలో విమాన భద్రత ప్రమాణాలపై పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బెస్ట్ ఎయిర్పోర్టు ‘చాంగీ’
సింగపూర్: ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్లో చాంగీ ఎయిర్పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఎయిర్పోర్టుకు ఈ ఘనత దక్కడం ఇది 13వసారి కావడం విశేషం. దోహా, టోక్యో ఎయిర్పోర్టులు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ అవార్డ్స్–2025ను ఈ నెల 9న ప్రకటించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ‘బెస్టు ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, సౌత్ అసియా’అవార్డు, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్టు ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’అవార్డు లభించింది. గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ అండర్ 5 మిలియన్ ప్యాసింజర్స్’కేటగిరీలో అవార్డు దక్కింది. అలాగే ‘క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’గా నిలిచింది. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ‘బెస్టు ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’అవార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలోని టాప్–20 విమానాశ్రయాలు 1. సింగపూర్ చాంగీ ఎయిర్పోర్టు, 2. దోహా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 3. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 4. ఇంచెయాన్ ఎయిర్పోర్టు, 5. నారిటా ఎయిర్పోర్టు, 6. హాంకాంగ్ ఎయిర్పోర్టు, 7. పారిస్ చార్లెస్ డిగాల్ ఎయిర్పోర్టు, 8. రోమ్ ఫుమిసినో ఎయిర్పోర్టు, 9. మ్యూనిక్ ఎయిర్పోర్టు, 10. జ్యూరిచ్ ఎయిర్పోర్టు, 11. దుబాయ్ ఎయిర్పోర్టు, 12. హెల్సింకీ–వాంటా ఎయిర్పోర్టు, 13. వాంకోవర్ ఎయిర్పోర్టు, 14. ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు, 15. వియన్నా ఎయిర్పోర్టు, 16. మెల్బోర్న్ ఎయిర్పోర్టు, 17. చుబూ సెంట్రాయిర్ ఎయిర్పోర్టు, 18. కోపెనహగెన్ ఎయిర్పోర్టు, 19. అమ్స్టర్డ్యామ్ ఎయిర్పోర్టు, 20. బహ్రెయిన్ ఎయిర్పోర్టు.

ఒమన్లో నేడు ఇరాన్–అమెరికా అణు చర్చలు
మస్కట్: ఆకాశహర్మ్యాలు, హంగూ ఆర్భాటాలు కనిపించని ప్రశాంతమైన తీరప్రాంత మస్కట్ నగరం పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో భాగమైన కీలక చర్చలకు మరోసారి వేదికగా మారనుంది. తమ అణు కార్యక్రమంపై ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ శనివారం అమెరికాతో చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఒప్పందం కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించకున్నా ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక అంగీకారానికి రాని పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా వైమానిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తుండటం.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మాత్రం ఆపేది లేదని ఇరాన్ కరాఖండిగా చెబుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో రెండు దేశాలకు సన్నిహితంగా ఉండే ఒమన్ కల్పించుకోవాల్సి వచ్చింది. ట్రంప్ కూడా చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వంపై అనూహ్యంగా సానుకూలత ప్రకటించారు. ఒమన్ వైపు మొగ్గు ఎందుకు? ఒమన్ కీలకంగా వ్యవహరించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘గల్ఫ్ స్టేట్ అనాలిటిక్స్’సీఈవో జార్జియో కెఫియెరో అంటున్నారు. దౌత్యపరంగా ఒమన్ పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. చారిత్రకంగా చూసినా ప్రపంచ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన గత అనుభవం ఒమన్కు ఉందని హైడెల్బర్గ్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ మార్క్ అంటున్నారు. ఒమన్ ప్రజల్లో అత్యధికులు ఇబాదీ ముస్లింలు. ఇది సున్నీ–షియా విభజనకు ముందు నుంచీ ఉన్న ఉదారవాద ఇస్లాం శాఖ అని వివరించారు. ఇరాన్తో వ్యవహరించే విషయంలో గత కొన్నేళ్లుగా అమెరికా ప్రధానంగా ఒమన్పైనే ఆధారపడుతోందని ఆయన అన్నారు. 2015లో ఇరాన్తో అణు ఒప్పందం కుదరటానికి అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రహస్య చర్చల్లో ఒమన్ ఎంతో సాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ దేశం ఎప్పుడూ వార్తల్లో ప్రధానంగా కనిపించేందుకు ప్రయతి్నంచలేదని, కేవలం తెరవెనుక ప్రభావవంతమైన పాత్ర పోషించిందన్నారు.అమెరికాతో నేరుగా చర్చలు జరపం: ఇరాన్ అమెరికాతో తాము నేరుగా చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ అంటోంది. అణు కార్యక్రమంపై ఒప్పందం విషయంలో ముందుగా ఒమన్ విదేశాంగ మంత్రితో మాట్లాడుతామని, తమ సందేశాన్ని ఆయనే అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు అందజేస్తారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ బద్ర్ తెలిపారు. 2015లో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ 3.67 శాతం శుద్ధి చేసిన యురేనియంను కొద్ది మొత్తంలో మాత్రమే నిల్వ ఉంచుకునేందుకు అవకాశముంది. అయితే, ఆ దేశం వద్ద ప్రస్తుతం 60 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో, ఇరాన్తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటికి వస్తూ ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉండగా ప్రకటించారు. ప్రస్తుతం అణ్వాయుధం తయారీ దిశగా సాంకేతికంగా ఇరాన్ అతి సమీపంలో ఉన్నట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగా హిందూ మహా సముద్రంలోని డీగో గార్సియా మిలటరీ స్థావరానికి ఆరు బీ2 బాంబర్లను తరలించారు. చమురు అన్వేషణ, అణు కార్యక్రమంపై మరిన్ని ఆంక్షలు తప్పవని కూడా ట్రంప్ అంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని, ఐరాస అణు పరిశీలకులను దేశం నుంచి బహిష్కరించడానికి కైనా వెనుకాడబోమని ఇరాన్ అంటోంది.

అధ్యక్ష బరిలో మ్యుంగ్
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రతిపక్ష నేత లీ జే మ్యుంగ్ ప్రకటించారు. అధ్యక్ష పదవి నుంచి యూన్ సుక్ యోల్ తొలగింపు సబబేనన్న రాజ్యాంగ న్యాయస్థానం తీర్పుతో దేశంలో ఎన్నికలు అనివార్యం కావడం తెలిసిందే. జూన్ 3న ప్రజలు కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. తాను బరిలోకి దిగుతున్నట్లు లీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. మానవ హక్కుల న్యాయవాదిగా చేసిన ఆయన దేశ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక నేత. 61 ఏళ్ల వయసులో ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు. 2022 అధ్యక్ష ఎన్నికల్లోనూ లీ పోటీ చేశారు. దేశ చరిత్రలోనే అతి తక్కువ తేడాతో యూన్ చేతిలో ఓడారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం విపక్ష డెమొక్రటిక్ పార్టీకి భారీ విజయం సాధించిపెట్టారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధిరేటు క్షీణించడంతో కేవలం ప్రైవేటు రంగం బలంతో ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం, అభివృద్ధి చేయడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని లీ ప్రకటించారు. ‘‘దేశంలో విభజనను, సామాజిక సంఘర్షణలను సైనిక చట్టం బహిర్గతం చేసింది. పేద, ధనిక అంతరం పెరగడమే దీనికి కారణం’’అని లీ అన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు, ఆదాయ ధ్రువీకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వ వ్యయాన్ని ముమ్మరం చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘గతంలో కంటే మన దగ్గర ఎక్కువే ఉన్నాయి. కానీ సంపద కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది. అమెరికాతో బలమైన మైత్రిని, జపాన్ తో త్రిముఖ సహకారాన్ని కొనసాగించడం ముఖ్యం. జాతీయ ప్రయోజనాలే మా పరమావధి’’అని ఉద్ఘాటించారు. సర్వేలో ముందంజ శాసనసభ్యుడిగా, ప్రొవిన్షియల్ గవర్నర్గా, మేయర్గా పనిచేసిన లీది నిర్మొహమాట శైలి. సంపన్నుల వ్యతిరేకిగా కొనసాగుతూ వస్తున్నారు. విపక్ష నేతగా సమర్థ పనితీరుతో ప్రజల మద్దతు పెంచుకున్నారు. 34 శాతం మంది మద్దతుతో ప్రస్తుతానికి లీ ముందంజలో ఉన్నట్లు ఏప్రిల్ 4న జరిగిన గాలప్ కొరియా సర్వే తేల్చింది. లీ బలమైన పోటీదారుగా కనిపిస్తున్నా ఆయనకు అడ్డంకులు లేకపోలేదు. లంచం ఆరోపణలు, బిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ కుంభకోణంలో పాత్రతో సహా ఆయనపై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఆయన గతంలో దోషిగా తేలారు. ఆ తీర్పును ఎగువ కోర్టు కొట్టేసినా దానిపై ప్రాసిక్యూటర్లు మళ్లీ అప్పీల్ చేశారు. ఈ ఆరోపణలన్నీ రాజకీయపరమైనవని ఆయన అభిమానులు అంటున్నారు. 2024 జనవరిలో ఓ కార్యక్రమంలో లీపై హత్యాయత్నం కూడా జరిగింది. కత్తిపోట్లకు గురైనా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అభ్యర్థిని ప్రకటించని పీపీపీ అధికార పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) ఇంకా న అభ్యరి్థని ఎంపిక చేయలేదు. యూన్ పతనం పార్టీని ఇరకాటంలో పడేసింది. పీపీపీ నుంచి సుమారు 10 మంది నామినేషన్ వేస్తారని భావిస్తున్నారు, ఇప్పటికీ పార్టీని నియంత్రిస్తున్న యూన్ విధేయులకు, సంస్కరణవాదుల మధ్య విభేదాలకు ఇది నిదర్శనమంటున్నారు. మాజీ న్యాయ మంత్రి హాన్ డాంగ్ హూన్, సియోల్ మేయర్ ఓహ్ సె హూన్, టెక్ దిగ్గజం అహ్న్ చియోల్ సో సహా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో ఎవరూ ఇప్పటిదాకా ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టలేదు.
జాతీయం

వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ, సాక్షి: సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య(85) మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన సేవలను కొనియాడారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపం తెలియజేశారు. ఈ మేరకు తెలుగులో ఓ పోస్ట్ ఉంచారాయన.‘‘దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ.. నలుగురితో మొక్కలు నాటిస్తూ.. వైవిధ్యమైన రీతిలో ప్రచారంతో హరిత ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో కోటి మొక్కలకు పైనే నాటి అరుదైన ఘనత సాధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…— Narendra Modi (@narendramodi) April 12, 2025
ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు
ముంబై: ముంబై ఉగ్రదాడులలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను అమెరికా నుంచి భారత్కు రప్పించాక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అతనిని విచారిస్తోంది. ఈ అత్యంత సున్నితమైన విచారణను కొనసాగిస్తున్న బృందానికి ఇద్దరు సీనియర్ అధికారులు నాయకత్వం వహిస్తున్నారు వారే.. అశిష్ బాత్రా(ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ జనరల్, జార్ఖండ్ మాజీ జాగ్వార్ ఫోర్స్ హెడ్) జయ రాయ్(ఎన్ఐఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్) వీరిద్దరూ రాణా ఎక్స్ట్రాడిషన్ (ఒక దేశం వేరొక దేశానికి ఒక వ్యక్తిని బదిలీ చేయమని అభ్యర్థించే చట్టపరమైన ప్రక్రియ)నడిపించారు. ఇప్పుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా విచారణ సారధ్య బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దాడులలో పాకిస్తాన్ ఐఎస్ఐ పాత్ర, రాణాకు గల అంతర్జాతీయ నెట్వర్క్ మొదలైనవాటిని వెలికితీసే లక్ష్యంతో ఈ విచారణ కొనసాగుతోంది.తహవ్వూర్ రాణా 26/11 ముంబై ఉగ్రదాడులలో కీలక సహకారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2009లో అమెరికాలో అరెస్టయిన రాణా 2013లో లష్కర్-ఎ-తొయిబా(Lashkar-e-Taiba) (ఎల్ఈటీ)కి మద్దతు ఇచ్చినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. 2025, ఏప్రిల్ 10న అమెరికా నుంచి భారత్కు వచ్చాడు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. రాణా విచారణకు సారధ్యం వహిస్తున్న ఇద్దరు అధికారులో ఒకరైన అశిష్ బాత్రా 1997 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. జార్ఖండ్ క్యాడర్కు చెందినవారు. ప్రస్తుతం ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు.ఈయన జార్ఖండ్ పోలీస్ విభాగానికి చెందిన ఎలైట్ యాంటీ-మావోయిస్ట్ యూనిట్ ‘జాగ్వార్ ఫోర్స్’కు మాజీ హెడ్. ఈ యూనిట్ మావోయిస్టుల తిరుగుబాటును అణచివేయడంలో కీలక పాత్ర పోషించింది. రాణా విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న జయ రాయ్ 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జార్ఖండ్ క్యాడర్(Jharkhand Cadre)కు చెందినవారు. ప్రస్తుతం ఎన్ఐఏలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు. జయ రాయ్ జార్ఖండ్లోని జామ్తారాలో సైబర్క్రైమ్లను అరికట్టడంలో కీలకపాత్ర పోషించారు. 2019లో ఎన్ఐఏలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా చేరిన రాయ్.. రాణా కేసులో ఛీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. రాణాకు సంబంధించి ఈ మెయిల్లు, ఆర్థిక లావాదేవీలు మొదలైనవాటిని విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించారు. రాణాని విచారించి, ముంబై దాడులలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రమేయాన్ని వెలికితీసేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది.ఇది కూడా చదవండి: 26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్ఐఏ ఆరా

Intelligence alert: అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై 26/11 మారహోమానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి, లష్కరే ఉగ్రవాది తహవూర్ రాణా విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించాయి. దీంతో హోం శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. మరోవైపు.. నిఘా సంస్థలు రైల్వే శాఖను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడం గమనార్హం.

ముంబై టూ దుబాయ్.. రెండు గంటల్లో ప్రయాణం!
ముంబై నుంచి దుబాయ్ వెళ్లాలంటే ఎలా వెళ్తారు అంటే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు. విమానం ఎక్కి వెళ్లాల్సిందేనని అంటారు. సరే.. విమానంలో వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది. అంతర్జాతీయ విమానాలకు దాదాపు 3-4 గంట సమయం పడుతుంది. అయితే, మరింత తక్కువ సమయంలో ముంబై నుంచి 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే చేరుకును ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండర్ వాటర్ హై స్పీడ్ రైలు కోసం ఓ ప్రాజెక్ట్ సిద్ధం అవుతోంది.వివరాల ప్రకారం.. మన దేశం నుంచి దుబాయ్ వెళ్లే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందరూ విమానంలోనే వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో సమయాన్ని ఆదా చేసేందుకు ముంబై-దుబాయ్ మధ్య నడిచే హై స్పీడ్ ట్రైన్ కోసం ఓ ప్రాజెక్ట్ సిద్ధం అవుతోంది. UAE నేషనల్ అడ్వైజర్ బ్యూరో ప్రణాళిక ప్రకారం.. దుబాయ్-ముంబై మధ్య నీటి అడుగున రైలు మార్గం అనుసంధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గిస్తుంది.గంటకు 1000 కిలోమీటర్ల ప్రయాణం!ఈ హైస్పీడ్ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లైతే.. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్ను రెండు గంటల్లో చేరుతుంది. ఇక, ఈ రైలు నీటి అడుగున, అంటే అరేబియా సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తుంది. అండర్ వాటర్ రైల్ నెట్వర్క్ ద్వారా ప్రయాణీకులు మొత్తం ప్రయాణంలో నీటి అడుగున ప్రపంచంలోని ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు.ദുബായിൽ ഇന്ത്യയിൽ നിന്നും 2 മണിക്കൂർ കൊണ്ട് എത്താൻ വരുന്നു അണ്ടർവാട്ടർ ട്രെയിൻ പദ്ധതി#underwatertrain #dubai #ZeeMalayalamNews pic.twitter.com/UT5K13axxu— Zee Malayalam News (@ZeeMalayalam) April 12, 2025అయితే, వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కొత్తదేమీ కాదు, ముంబై నుంచి దుబాయ్ వరకు అండర్ వాటర్ రైలు ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు. దానికి అవసరమైన ఆమోదాలు పొందలేదు. ప్రస్తుతం, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వివిధ ఆమోదాలు, ఆర్థిక పెట్టుబడులపై ఈ ప్రాజెక్టు వేగం ఆధారపడి ఉంటుంది. అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, ఈ రైలు 2030 నాటికి పరుగులు తీయవచ్చు. మరోవైపు, ఇది భారత్- యూఏఈ మధ్య ముడి చమురు, వస్తువుల రవాణాను మరింత సులభంగా మారుస్తుంది. ఈ ప్రతిపాదిత రైలు నెట్వర్క్ విమాన ప్రయాణికులకు మరొక ఆప్షన్ను అందిస్తుంది. విమాన ప్రయాణాల్లో రద్దీని కూడా తగ్గించే అవకాశం ఉంది.#UnderwaterTrain is being mulled by 2030Between #Mumbai and #Dubai Distance 2000 kmphSpeed will be 600-1000 kmph Time 2 hours Will boost trade between #India and #UAE pic.twitter.com/645yviCP2J— Mathew Thomas (@OMRcat) April 8, 2025
ఎన్ఆర్ఐ

Ugadi 2025 సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
తమిళనాడు: విడదీస్తారనే భయంతో పెళ్లి చేసుకున్న ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబాక్కం గ్రామానికి చెందిన మణికంఠన్(27) ఇళ్లకు టైల్స్ వేసే పనిచేస్తుంటాడు. ఇదివరకే వివాహం జరిగిన ఇతను భార్యను వదిలి ఒంటరిగా జీవిస్తున్నాడు.ఈక్రమంలో కడలూరు జిల్లా నెల్లికుప్పం గ్రామానికి చెందిన కోకిల(19) కడలూరులోని ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసి కోకిల కుటుంబసభ్యులు కడలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న ఇద్దరూ విచారణకు రావాలని పోలీసులు తరచూ ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గురువారం ఉదయం బైకులో ఇద్దరూ కలిసి కడలూరుకు బయలుదేరారు. పోలీసులు ఇద్దరిని విడదీస్తారని భయంతో ఇద్దరూ లత్తేరి సమీపంలోని పట్టివూరు రైలు పట్టాల వద్దకు వెళ్లి ఇద్దరూ కౌగిలించుకొని పట్టాలపై తలపెట్టి పడుకున్నారు. ఆ సమయంలో రైలు వారిపై వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన ప్రయాణికులు జోలార్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.

సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
సేలం : తంజావూరులో అరెస్టు చేసిన అన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు చెల్లెల్లలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వ్యవహారంగా నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షర్మిలను అధికారులు వెయిటింగ్ లిస్ట్కు బదిలీ చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా నడుక్కవేరిలోని అరసమర వీధికి చెందిన వ్యక్తి దినేష్ (32). అతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇదిలా ఉండగా దినేష్ బంధువు ఏప్రిల్ 8వ తేదీన మరణించాడు. దినేష్ తన బంధువులతో కలిసి నడుక్కావేరి బస్స్టాప్ వద్ద సంతాప కార్యక్రమానికి హాజరు కావడానికి నిలబడి ఉండగా, నడుక్కవేరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక సబ్–ఇన్స్పెక్టర్ సంఘటనా అక్కడికి చేరుకుని, దినేష్పై కేసు నమోదు చేసినట్లు, విచారణకు రావాలని చెప్పి, దినేష్ను మోటార్ సైకిల్ పై నడుక్కావేరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. దినేష్ చెల్లెల్లు కూడా వారిని అనుసరించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ తమ సోదరుడిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. దినేష్ సోదరీమణులలో ఒకరికి పెళ్లి చూపులకు వరుడి తరపు వారు వస్తున్నారని తెలిపినప్పటికీ స్టేషన్లో ఉన్న పోలీసులు వినిపించుకోకుండా బహిరంగ ప్రదేశంలో కత్తితో బెదిరించాడంటూ దినేష్పై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. అదే విధంగా అక్కడ ఉన్న పోలీసులు దినేష్ సోదరీమణులను ఏకవచనంతో మాట్లాడి దూషించి బయటకు పంపించారని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు ఇంటికి వెళ్లి పురుగుమందు తెచ్చి నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ముందు ఉంచి, తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వారిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో బుధవారం ఓ చెల్లెలు మరణించింది. మరో చెల్లెలికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.బంధువుల ఆందోళనఈ విషయం తెలుసుకున్న దినేష్ బంధువులు తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రి అత్యవసర విభాగం ముందు గుమిగూడి నిరసన తెలిపారు. అప్పుడు దినేష్ సోదరి మరణానికి న్యాయం జరగాలని, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, పుదుక్కోట జైలు నుంచి దినేష్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈతంజావూరు నగర డీఎస్పీ సోమసుందరం, ఇన్స్పెక్టర్లు చంద్ర, జగతీశ్వరన్ ఆసుపత్రి ముందు నిరసనకారులతో చర్చించారు. ఈ స్థితిలో నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షర్మిలను వీఆర్కు బదిలీ చేస్తూ తంజావూరు జిల్లా సూపరింటెండెంట్ రాజారాం గురువారం ఆదేశాలు జారీ చేశారు.

యువతీ యువకుడిపై దౌర్జన్యం.. వీడియో వైరల్
బెంగళూరు: బెంగళూరులో యువతీ యువకుడిపై దౌర్జన్యం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. హిందూ యువకుడి జతలో బైకుపై మాట్లాడుతూ కూర్చొన్న యువతిని ఐదు మంది నిందించి దాడికి యత్నించారు. ఘటనపై మైనర్ యువకుడితో పాటు మహిం, అఫ్రిది, వాసిం, అంజుంలను పోలీసులు అరెస్ట్ చేశారు.మూడు రోజుల క్రితం తన స్నేహితుడి జతలో బుర్కా ధరించిన యువతి బైకుపై కూర్చొని మాట్లాడుతుండగా ఐదు మంది వెళ్లి దాడికి యత్నించారు. యువకుడితో అసభ్యంగా మాట్లాడారు. ఎందుకు కూర్చున్నావు, మానం, మర్యాద లేదా అంటూ ఇద్దరిని నోటికొచ్చినట్లు నిందించారు. యువతిని తల్లిదండ్రుల నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తరగతి స్నేహితుడితో మాట్లాడుతున్నా తమ తల్లిదండ్రుల నంబర్ మీకెందుకని ప్రశ్నించిన ఇద్దరిపై దాడికి యత్నించారు. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. The #BengalauruPolice arrested four individuals, including a minor, on Friday in connection with a case of moral policing reported under the Chandra Layout police station limits in #Bengaluru.The accused allegedly confronted a #Muslim woman for speaking with a youth from #Hindu… pic.twitter.com/uoyPgU6jv8— Hate Detector 🔍 (@HateDetectors) April 11, 2025

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
వీడియోలు


KTR: సీఎం రేవంతే ఒక ఫేక్


రాజధాని బీజింగ్ లో భారీ వర్షం, చరిత్రలో చూడని రేంజ్ లో ఈదురు గాలులు


బీఆర్ఎస్ నేతలు కక్షగట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు : శ్రీధర్ బాబు


రెడ్ బుక్ రాజ్యాంగానికి గురజాల DSP జగదీష్ బలి


నేనే పోస్టులు పెడతా.. నీకు చేతనైనది చేసుకో జగదీశ్వరికి పుష్పశ్రీవాణి స్వీట్ వార్నింగ్


తిరుమల గోశాల ఘటనపై సుబ్రమణ్య స్వామి సీరియస్


వక్ఫ్ చట్టాన్ని బెంగాల్ లో అమలు చేయం: దీదీ


దేశ చరిత్రలో ఇదే తొలిసారి... సీఎం స్టాలిన్ సంచలనం


మీడియాను తీసుకురండి వెళ్దాం.. టీడీపీకి భూమన సవాల్


తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన