secure
-
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్ఫామ్లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్ఏఐ, ప్లేగ్రౌండ్ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్లతో ఈ తరహా ఎఫెక్ట్లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన. -
పేటెంట్కు లేటెందుకు!
అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సీరియస్గా ఇలా అంటాడు... ‘పేటెంట్ అనేది టెక్నాలజీకి కీ లాంటిది. టెక్నాలజీ అనేది ప్రొడక్షన్కు కీ లాంటిది’ ‘మోస్ట్ సీరియస్ మెన్’గా పేరున్న, మూడువందల పేటెంట్లకు సొంతదారైన సెర్బియన్–అమెరికన్ ఇన్వెంటర్ నికొల టెస్లా చాలా తేలికగా ఇలా అంటాడు... ‘నా ఐడియాను ఎవరో దొంగిలించారు అనే బాధ కంటే, వారికంటూ ఒక ఐడియా ఎందుకు లేదు అనే బాధ నాలో ఎక్కువగా ఉంటుంది’ ... ఎవరు ఎలా అన్నా, ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు పేటెంట్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మెరికల్లాంటి యూత్తో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ సౌత్ కొరియన్ సాంకేతిక దిగ్గజం శాంసంగ్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 7,500 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 50 శాతం మన దేశం నుంచే ఉన్నాయి. ఈ పేటెంట్ ఫైలర్స్ ఫస్ట్ టైమ్ ఇన్వెంటర్స్. మిలీనియల్స్, జెన్ జెడ్ను సాంకేతికంగా తీర్చిదిద్దడంలో బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన శ్రీ–బి (శాంసంగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్–బెంగళూరు) బాగా ఉపయోగపడుతుంది. శ్రీ–బికి ప్రత్యేకమైన ఐపీ(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) బృందం ఉంది. ఇది యువతరానికి ఇన్వెన్షన్–క్రియేషన్ ట్రైనింగ్, ఇన్వెన్షన్ ప్రాసెస్కు ఉపకరించే అడ్వాన్స్డ్ ఇన్వెంటివ్ స్టెప్ ట్రైనింగ్ ఇస్తుంది. పేటెంట్ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నల్ పోర్టల్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎమర్జింగ్ ఏరియాలుగా చెప్పుకునే 5జీ, ఏఐ, ఐవోటి, కెమెరా అండ్ విజన్ టెక్నాలజీస్కు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయి. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునే వాటిలో ఎక్కువ భాగం అంకుర సంస్థలుగా మొదలుకావడం విశేషం. ‘యువతరం ఆవిష్కర్తలను చూసి గర్వపడుతున్నాం. ఎదుగుతున్న దశలోనే అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. వారికి శాంసంగ్ అన్ని విధాల అండగా ఉంటుంది’ అంటున్నారు శ్రీ–బి సీటీవో అలోక్నాథ్. ‘కొత్త ఆవిష్కరణల కోసం జరుగుతున్న ఈ ప్రయాణం యువతరం మనస్తత్వానికి తగినట్లుగానే ఆటపాటలతో హుషారుగా సాగుతుంది’ అంటున్నారు శ్రీ–బి డిజైన్ మెనేజర్ స్వాధా జైశ్వాల్. సాంకేతిక జ్ఞానం మాత్రమే కాకుండా ఇన్స్పైరింగ్ స్టోరీలు వినిపించడం ద్వారా యువతరంలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి సంస్థలు. మచ్చుకు ఒకటి... పదిహేనేళ్ల వయసులోనే వైద్యరంగం ముక్కున వేలేసుకునేలా చేశాడు జాక్ అండ్రాక (యూఎస్). ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను ముందుగా, తక్కువ ఖర్చుతో గుర్తించే సాధనానికి రూపలకల్పన చేసి ‘ఐకానిక్ ఇన్వెంటర్ ఆఫ్ జెనరేషన్ జెడ్’గా కీర్తి అందుకున్నాడు జాక్. అయితే జాక్ చదువులో అద్భుతాలు సాధిస్తున్న విద్యార్థి ఏమీకాదు. సాధారణ విద్యార్థే. తన ఆవిష్కరణకు మూలం గూగుల్ అనేది ఆశ్చర్యకరమైన వాస్తవం! తన దగ్గరి బంధువు ఒకరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో చనిపోయాడు. దీంతో ఆ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ క్యాన్సర్కు కారణం ఏమిటి? ఏ దశలో గుర్తిస్తున్నారు? పరీక్షలు ఏమిటి? సర్వైవర్ల శాతం ఎంత... మొదలైన విషయాలను గూగుల్ ద్వారా తెలుసుకోగలిగాడు. ‘ఈజీ, చీప్, సింపుల్, సెన్సెటివ్ అండ్ సెలెక్టివ్’ అనే మూలసూత్రంతో రిసెర్చ్ ప్రపోజల్ తయారు చేసుకొని, క్యాన్సర్పై పరిశోధిస్తున్న 200 మందికి పంపించాడు. 199 మంది తిరస్కరించారు. ఒక్కరు మాత్రం ‘బహుశా వీలవుతుందేమో!’ అన్నారు. ఇక జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ(మేరిలాండ్)లో ప్రయోగాలు చేయడానికి అనుమతి అనేది చా...లా కష్టంగా దొరికింది. ఎన్నో అవాంతరాలను తట్టుకొని తన కలను సాకారం చేసుకున్న జాక్ ఇప్పుడు మరికొన్ని కలలు కంటున్నాడు. వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే జాక్ ది ఒంటరిపోరు. అయితే శ్రీ–బిలాంటి సంస్థల వల్ల కలలు కనే యువతరానికి ఒంటరిపోరు తప్పుతుంది. శక్తిమంతమైన మద్దతు దొరుకుతుంది. -
అతని రాకతో నాకు మరింత ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్
Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు టచ్లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్ఫేర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ గురించి చెప్పుకొచ్చింది. 'అమ్మ మరణం తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము (జాన్వీ, ఖుషీ కపూర్) మరింత ధైర్యంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగింది. మాకు మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇలా ఎవరైనా చెబుతారో లేదో తెలియదు కానీ, మేము చాలా అదృష్టవంతులం. ఇంతకన్న గొప్పగా మాకు ఏం లభించదు.' అని చెప్పుకొచ్చింది జాన్వీ. తర్వాత వాళ్ల నాన్న బోనీ కపూర్ గురించి చెబుతూ 'నిజాయితీగా చెప్పాలంటే నాన్నతో ఇలా కొత్తగా ఉంది. ఆయన మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు.' అని జాన్వీ కపూర్ తెలిపింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. చదవండి: తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెవెన్యూ రికార్డులను భద్రపరచాలి
మఠంపల్లి : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను పునర్విభజన చేపట్టినందున రెవెన్యూ రికార్డులను భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని బక్కమంతులగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నామని.. అదే సందర్భంలో ప్రభుత్వం వీఆర్వోలకు పాత సర్వీస్ నిబంధలు పరిగణనలోకి తీసు కోవాలన్నారు. అలాగే మీ సేవా కేంద్రాల్లో ఇస్తున్న పాస్ పుస్తకాలను అమల్లోకి తీసుకోవాలని కోరారు. రెవెన్యూ రికార్డులను భద్రపరచాలని రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలకు సూచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అ«ధ్యక్ష, కార్యదర్శులు కొప్పోలు సుధాకర్రావు, ఠాకూర్సింగ్, మండల అధ్యక్షులు నారపు రాజు రామారావు, వీరారెడ్డి, వాసుదేవరావు తదితరులున్నారు.