అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు! | American company sacks 700 In Donation Scam | Sakshi
Sakshi News home page

అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!

Published Tue, Apr 8 2025 3:28 PM | Last Updated on Tue, Apr 8 2025 5:42 PM

American company sacks 700 In Donation Scam

ఢిల్లీ:  అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా((తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా)) పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.   విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.

దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిట‌బుల్ డొనేష‌న్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. విరాళాలిచ్చిన‌ట్లు ప‌త్రాలు సృష్టించి...దానికి స‌మాన‌మైన నిధులను కంపెనీ నుంచి కాజేశరని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

అమెరికాలో తానా కుంభకోణం  700 మంది ఉద్యోగులపై వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement