ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిన నేపథ్యంలో గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులపై టీడీపీ యధేచ్ఛగా దాడులకు పాల్పడితే బాధితులపైనే కేసులు బనాయిస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 40 మందికి డీఎస్పీలుగా ఇష్టానుసారం ప్రమోషన్లు ఇవ్వడంతో వారంతా అధికార పార్టీ కనుసన్నల్లో నడుచుకున్నారన్నారు.