Andhra Pradesh Election 2019
-
అంత దూకుడెందుకు బాబూ?
మే 23న రాష్ట్రమంతటా ఎన్నికలు జరిగాయి. ఫలితాలు రాష్ట్ర ప్రజలందరూ కలగన్నట్లే వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగరేసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. వాడని అస్త్రాలూ లేవు. జనసేన పార్టీ కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తెలుగుదేశం విజయానికి కృషి చేయడం అందరికీ తెలిసిందే. మోదీ గారిని ఎంత ఎక్కువ తిడితే అంత పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో వస్తాయని కూడా చంద్రబాబు కలలు కని కుదేలుపడ్డాడు. మే 30న ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత సాదాసీదాగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ చిరుదరహాసంతో, మొక్కవోని విశ్వాసంతో, నవరత్నాలకు జీవం పోస్తూ జగన్ ప్రయాణం సాగిపోతూనే ఉంది. సెప్టెంబర్ 6వ తారీఖు నాటికి ఆయన పాలన 100 రోజులు పూర్తి చేసుకుంటున్నది. ఆయనకు అభినందనలు తెల్పుతూ ఆశీస్సులు, చేయూత అందిద్దాం. ఇక ఈ మూడు నెలల కాలంలో చంద్రబాబు తన విజ్ఞతను పూర్తిగా కోల్పోయారు. ఎన్నికల ముందు జగన్ గూర్చి ఎన్నెన్ని మాటలన్నాడో. అవినీతిపరుడని ఎంతగా గొంతు చించుకొన్నాడో. చివరికి పులివెందుల పేరును కూడా దూషించాడు. తన మాటలు, అబద్ధాలతో, అస హ్యం వేసే ప్రవర్తనతో రాష్ట్రంలోని ప్రజలందర్నీ జగన్వైపు తిరిగేలా చేయగలిగాడు. జగన్ విజయం చంద్రబాబు కలలో కూడా ఊహించనిది. ఏం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు ఎవరైనా తలవంచక తప్పదు. చంద్రబాబులో ఆవేశం, అసహనం, ఆగ్రహం ఎక్కువయ్యాయి. తానేం చేస్తున్నాడో తనకైనా అర్థమౌతున్నదో లేదో. అదేంటో చంద్రబాబు తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో, ప్రజలెందుకు చీదరించుకొన్నారో ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశోధన చేసుకోకుండా అప్పుడే తిరిగి ఎన్నికలొచ్చేస్తున్నట్లు జగన్పై దూకుడుగా వెళ్తున్నాడు. బాబుకు ఇంత దూకుడు అవసరం లేదని ఆ పార్టీ పెద్దలే మాట్లాడుకొంటున్నారు. చంద్రబాబు అభద్రతా భావంతో, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నాడు. ఆనాడు శృతిమించి మోదీని విమర్శించడం. ఆయనేమో అత్యధిక మెజారిటీతో గద్దెనెక్కడం. తననేం చేస్తాడో ఏమో అన్న భయం ఒకవైపు. అందుకే తన ఆంతరంగికులైన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని మోదీ ఇంటికి పంపించేశాడు. ఇది జగమెరిగిన సత్యం. మరోవైపు బీజేపీతో దోస్తీకైనా సిద్ధమే కానీ తన ఎమ్మెల్యేల్ని పోగొట్టుకోవడం మాత్రం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. ఎందుకంటే తన సంఖ్య కుదించుకుపోయి పదికి పడిపోతే తనకున్న ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవాల్సి వస్తుంది. 2014లో చంద్రబాబు అధికారానికొచ్చినా జగన్ మీలాగా విమర్శలు చేశారా? చివరికి 23 మంది వైసీపీ శాసనసభ్యుల్ని కొంటే జగన్ పల్లెత్తుమాట అన్నాడా? జగన్ పాదయాత్ర సమయంలో ఆ 23 మంది నియోజక వర్గాలకెళ్లినప్పుడు కూడా వాళ్లను పేరుపెట్టి విమర్శించలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి హుందాగా వెళ్లక, దానిని కూడా మీరు రాజకీయం చేశారు. మీ పలుకులు పయ్యావుల కేశవ్ నోటవిని ప్రజలు నవ్వుకొన్నారు. అదే విధంగా శాసనసభ స్పీకర్గా తమ్మినేని సీతారాం ప్రమాణ స్వీకారానికి కూడా తోడుగా వెళ్లక దానిని కూడా రాజకీయం చేసి నవ్వులపాలైంది మీరు కాదా? 14న గవర్నర్ ప్రసంగం నుండి అసెంబ్లీ ముగిసేవరకు చంద్రబాబు తీరు ఆక్షేపణీయం. ప్రతిరోజూ తన శాసససభ్యులతో కలిసి వైసీపీ గిల్లికజ్జాలు పెట్టుకోవడం బాధాకరం. ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్నిసార్లు మాట మార్చారు? 20వ తారీఖు నుండి టీడీపీ కార్యకర్తలపై దాడులంటూ అవాస్తవాల కొత్తరాగం అందుకొన్నారు. మళ్లీ పచ్చమీడియా మీతో గొంతుకలిపింది. చంద్రబాబు తన మకాం హైదరాబాద్ నుండి ఉన్నఫళంగా విజయవాడకు మార్చడానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. కానీ ఆయనకు విజయవాడలోని కృష్ణానది కరకట్టపై లింగమనేని అక్రమంగా నిర్మించిన గెస్ట్హౌస్ అప్పనంగా దొరికింది. కాస్త పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా అలా అక్రమంగా నిర్మించిన గెస్ట్హౌస్లో దిగరు. ఎన్నికల ముందు దేవినేని ఉమ అది అక్రమ కట్టడమని, అధికారానికి వచ్చిన వెంటనే దానిని కూలదోస్తామని ఆర్భాటం చేసి గెలుపొందారు. ఏం చేద్దాం. ఆ అక్రమ కట్టడమే తమ నాయకుడికి నెలవవుతుందని ఊహించే ఉండడు పాపం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిఉండి ఆ అక్రమ నివాసంలో ఉంటూ, తన పార్టీ కార్యకర్తల్ని, అధికారుల్ని కలిసేందుకు దానికి అనుగుణంగా ‘ప్రజావేదిక’ అంటూ మరో హాల్ను 7 కోట్ల రూపాయలతో నిర్మించుకోవడం మరో విడ్డూరం. జూన్ 26న ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై రివ్యూచేసి రూ. 2,636 కోట్లు అదనంగా చెల్లించడం జరిగిందని తేలిస్తే మీరెందుకు అంతగా బాధపడ్డారు. చంద్రబాబు వందిమాగదులైతే ఇక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాదని ఎంతగా గొంతులు చించుకొన్నారు. ఏదో కొంత ప్రభుత్వ ఖజానాకు తిరిగి రాబట్టాలని జగన్గారు ప్రయత్నిస్తే మీరు చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించ లేదు. ఆ సంస్థలతో మీకున్న అనుబంధాన్ని అజ్ఞానంతో మీరే బయటపెట్టుకున్నారు. మీరున్న లింగమనేని గెస్ట్హౌస్కు ప్రభుత్వం అక్రమ కట్టడం అని నోటీసులిస్తే మీరెందుకు అంతగా అంగలార్చారు. కన్నీళ్లు పెట్టుకొన్నారు. మాలాంటి వారికి ఇప్పటికీ అర్థం కానిది ఒక్కటే. అది నిజంగా మీ సొంతమైందా? లేక ప్రభుత్వానిదా. ఎవరికైనా సందేహం ఎందుకొస్తున్నదంటే అద్దెకున్న మీరే ప్రతిసారీ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు. జూలై 1 నుండి మీ పచ్చ పత్రికలు మరింత నగ్నంగా మారి టీడీపీ కార్యకర్తలపై హత్యలు అంటూ బ్యానర్ ఐటమ్స్ వండి వడ్డించసాగారు. ట్విట్టర్ను వేదికగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తండ్రీకొడుకులు విజృం భించారు. చంద్రబాబుకైతే ట్విట్టర్ రుచి బాగా వంటబట్టింది. జూలై 11 నుండి దాదాపు 20 రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడివేడిగా జరిగాయి. మంద తక్కువైనా, అరుపుల్లో చంద్రబాబు కనుసైగల మేర టీడీపీ శాసనసభ్యులంతా బాగానే నటించారు. 12వ తారీఖు నాటి సమావేశంలో అయితే జగన్ కూడా ఒక నిమిషం గాడితప్పేలా రెచ్చగొట్టారు. సున్నా శాతం వడ్డీ రుణాల గూర్చి మీకే పూర్తిగా అవగాహన లేనట్లు ప్రవర్తించారు. 17వ తారీఖున కరకట్టపై జరిగిన అక్రమ కట్టడాల చర్చపై మీరు అసత్యాలు మాట్లాడినారు. ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తి ఓ అద్దింటి ఓనర్ను కాపాడుతూ మాట్లాడటం చాలా విడ్డూరం అనిపించింది. అదే విధంగా ప్రైవేటు విద్యుత్ సంస్థల వ్యవహారంలో కూడా 25 సంవత్సరాల పాటు అగ్రిమెంటు చేసుకోవడం మీ పార్టీ ప్రతిష్టకు భంగం కల్గించింది. అధికారం కోల్పోయిన మీకెందుకు అంతటి కుతి. కొత్త ప్రభుత్వం ఏం చేసుకొంటే మీకెందుకు? అయినా ప్రజల పక్షాన నిలవాల్సిన మీరు లింగమనేనిపట్ల, ప్రైవేటు విద్యుత్ కొనుగోలుదారులకు, నవయుగ సంస్థకు అండగా నిలబడటం ఎంతవరకు సబబు. ఆలోచిస్తే మీకైనా ఇవి ఛీ అనిపించే క్షణాలు. చంద్రబాబూ... కాస్త దూకుడు తగ్గించి జగన్ను కొంతకాలం ప్రశాంతంగా పాలించనీయండి. ఈలోగా సైకిల్కు రిపేర్లు చేసుకోండి. -డాక్టర్ విజయ కుమార్, మాజీ సీపీఆర్వో -
‘చినరాజప్పను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుంది’
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
కరణం బలరాం భార్య, కుమార్తె వివరాలు దాచిపెట్టారు..
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఇందులో కరణంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను, రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పకపోతే ఎన్నికను రద్దు చేయొచ్చు ‘కరణం బలరాం సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదు. చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించకపోయినప్పటికీ ఆయన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కరణం బలరాం తన నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టారు. భార్య, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారు. నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు. ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. కరణం బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది. అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో, ఆధార్ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్ఎల్బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు. ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్గా పరిగణించడానికి వీల్లేదు. అందువల్ల ఆయన నామినేషన్ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనట్లు ప్రకటించండి’ అని కృష్ణమోహన్ తన పిటిషన్లో వివరించారు. -
అంత తప్పు నేనేం చేశా: చంద్రబాబు
కుప్పం : ఎన్నికల్లో ప్రజాతీర్పు చూస్తే బాధగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తున్నా అసలు కారణాలను మాత్రం గుర్తించలేకపోతున్నామన్నారు. ప్రజలను సంక్షేమ పథకాలతో మెప్పించలేకనే ఓటమి పాలైనట్లు భావిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశానే తప్ప తానెన్నడూ తప్పు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం గుడుపల్లె, కుప్పంలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ‘నేను చేసిన పనులు బహిరంగంగా కనిపిస్తున్నా ఎన్నికల్లో ప్రజలు ఎందుకిలా తీర్పు ఇచ్చారు..? నేను చేయరాని తప్పు ఏం చేశా..?’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలను నివారించేందుకు అమరావతిలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నించానన్నారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద రైతులిచ్చిన భూములను కొన్ని సంస్థలకు అప్పగిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతోపాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచవచ్చని భావించినట్లు చెప్పారు. ప్రభుత్వ డబ్బు పైసా లేకుండా రాజధానిని నిర్మించాలని ప్రయత్నం చేశానని, ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల అంతా విఫలమైందని వ్యాఖ్యానించారు. కుప్పానికి నీళ్లివ్వండి...: శ్రీశైలం నుంచి నీళ్లు కుప్పం తరలించేందుకు చేసిన ప్రయత్నం చిన్న చిన్న పనుల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసి హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీళ్లు ఇవ్వాలని కోరారు. కరువు జిల్లా అనంతపురంలో కియా కార్ల తయారీ కంపెనీని ఏర్పాటు చేయిస్తే చివరకు ఆ అసెంబ్లీ స్థానం కూడా గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా, 20 ఏళ్లు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు ఇలాంటి ఫలితాలు ఎదురవటాన్ని కార్యకర్తలు, మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసని, ఓటమికి కుంగిపోయి వారిని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. -
అవును రాజీనామా చేశాను: రఘువీరారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : తన రాజీనామాపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశాననన్నారు. తన రాజీనామా లేఖను మే 19వ తేదీనే కాంగ్రెస్ అధిష్టానానికి పంపించినట్లు చెప్పారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూనే ఉన్నానని, అయితే ఇంతవరకూ రాజీనామాపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కాగా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. -
బొండా ఉమకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను సరిగా లెక్కించలేదంటూ ఉమ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కేంద్ర ఎన్నికల కమిషన్ గత మంగళవారం తన వాదనలు వినిపించింది. టీడీపీ అభ్యర్థి దాఖలు చేసిన రిట్ పిటిషన్కు విచారణార్హత లేదని వాదించింది. కాగా, పదిహేను రోజులక్రితం దాఖలైన బొండా ఉమ రిట్ పిటిషన్కు విచారణార్హత లేదన్న ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. -
వాషింగ్టన్లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
వాషింగ్టన్ డిసి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా అమెరికాలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వర్జీనియా రాష్ట్రములోని చంటిలీ సిటీలో ఈస్ట్ గేట్ పార్క్లో తొలకరి జల్లుల మధ్యన విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఎంతో ఉత్సహంగా పెద్దఎత్తున హాజరయ్యారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, విజయ సారధి వైఎస్ జగన్కిశుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్ర వలన ప్రజల సమస్యలు పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా, ఆయన చూపించిన పరిష్కార మార్గాలు, ప్రజలలో విశ్వాసం కలిగించిందని వైఎస్సార్ కంటే ఒక అడుగు ముందుకేసి పరిపాలిస్తారని ఎన్ఆర్ఐలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషానిచ్చిందని వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్ సభ్యులు అన్నారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకోవడం ప్రజావిజయమని పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వైఎస్ జగన్కు పట్టంకట్టినందుకు ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించాలని ఆకాక్షించారు. (ఏపీలో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం) మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడానికి, పది సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారని పలువురు వక్తలు ముక్త కంఠంతో అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేస్తారని ధీమా వ్యక్తంచేశారు. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి శుభాకాంక్షలు తెలిపారు. జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలతో హోరెత్తించారు. వాషింగ్టన్ డిసి మెట్రో వైఎస్సార్సీపీ కోర్ కమిటీ మెంబెర్స్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అతిథులందరికీ రుచకరమైనా ఆహారాన్ని అందించిన తత్వా రెస్టారెంట్ సుజీత్, వినీత్, బాబీ వారి బృందానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
పవన్ కల్యాణ్పై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు
-
పవన్పై రాంగోపాల్ వర్మ సెటైర్
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ స్పందించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని వర్మ ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని, ఆయనను నిజంగా గెలిపించాలనుకునే ఓటర్లు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పవన్కే ఓటు వేసేవారంటూ వర్మ సెటైర్ వేశారు. కాగా తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా ప్రత్యర్థులు కుట్ర పన్నారంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: (నన్ను అసెంబ్లీకి అడుగుపెట్టనీకుండా కుట్ర...) -
అంతా మీ వల్లే
సాక్షి, తిరుపతి : కుప్పంలో మెజారిటీ తగ్గటానికి స్థానిక టీడీపీ నేతలే కారణమని చంద్రబాబు అ సంతృప్తి వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓటమి చెందటానికి ఆయా నియోజక వర్గాల్లో అభ్యర్థులు, జన్మభూమి కమిటీ సభ్యులే కారణమని తేల్చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నా యకులు ఇటీవల వరుసగా అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిసి వస్తున్నారు. మొన్న కుప్పం, తిరుపతి నియోజక వర్గానికి చెందిన నాయకులు చంద్రబాబును కలిశారు. అంతకు ముందు పలమనేరు, పీలేరు, మదనపల్లె, శ్రీకాళహస్తికి చెందిన మరి కొందరు నాయకులు కలిసినట్లు సమాచా రం. చంద్రబాబును కలిసిన నాయకులతో రెండు మూడు మాటలు మాట్లాడి పంపేస్తున్నట్లు తెలి సింది. అది కూడా ఎందుకు ఓటమి పాలయ్యా ము? అందుకు కారణాలు? అనే విషయాలు అడుగుతున్నారు. నియోజక వర్గంలో ఓటమికి ప్రధాన కారణాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా కుప్పం నాయకులపై మా త్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచా రం. కుప్పంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారీగా మెజారిటీ తగ్గిందని, అందుకు ‘మీరే కా రణం’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ఓ నాయకుడు వెల్లడించారు. స్థానికంగా ఉన్న భూములను ఆక్రమించుకోవటం, టెండర్లు దక్కించుకుని పనులు నాసిరకంగా చేయడం తదితర పనులు కొంప ముంచాయని గుర్తు చేసినట్లు తెలిసింది. టెలీ కాన్ఫరెన్స్లో అంతా బాగుందని చెబుతూ... మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం, చంద్రగిరి విషయంలో స్థానిక నాయకులు టీడీపీ గెలుపు ఖాయమని పలుమార్లు చెప్పారని, తీరా చంద్రగిరిలో ఘోరంగా పరాజయం పాలైన విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అవినీతి అక్రమాలు కొంప ముంచాయి నీరు–చెట్టు, హౌసింగ్, ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణ తదితర అవినీతి అక్రమాలే కొంప ముంచాయని సన్నిహితులు వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి తోడు జన్మభూమి కమిటీల ఆగడాలు అధికమయ్యాయని, లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లు చేసి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని గుర్తుచేసినట్లు తెలిసింది. ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకోవటం, అధికారులను బెదిరించడం తదితర కారణాలు దెబ్బతీసినట్లు చర్చకు వచ్చాయి. అవినీతి అక్రమాలకు పాల్పడినా... ఓటర్లను కొనుగోలు చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయడం మరిచి, స్వార్థం చూసుకున్నామని, అయితే ఇవేమీ జనం పట్టించుకోరని భావించానని, అన్నింటినీ జనం గుర్తుపెట్టుకున్న విషయం గురించి ప్రధానంగా చర్చించనట్లు తెలిసింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తప్పు చేశామని పలమనేరు నాయకులు చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి జనంలో ఉండడం, వారి సమస్యల గురించి తెలుసుకోవడం, వాటిపై పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవేమీ తనకు తెలియకుండా అంతా బాగుందని చెప్పి, ఓటమికి కారణమయ్యారని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని జిల్లాకు వచ్చి నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని స్థానిక నాయకులకు చెప్పి పంపటం గమనార్హం. -
స్వయంకృత పరాభవం
2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు ఎన్నికల వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు పేర్కొన్నప్పటికీ చాలామంది ఇంత అనూహ్యమైన విజయం వైఎస్సార్సీపీకి, తెలుగుదేశానికి పరాజయం ఊహించలేదు. హైదరాబాద్లో ఉన్న ఒక సంస్థ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఎన్నికలలో బాబు గారు ఊహించలేనంత పరాజయాన్ని చవిచూడబోతున్నారు అని నిర్ధారించింది. ఆ సంస్థ అధిపతి ఎన్నికల ముందే నాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 30 సీట్లకు మించి రాకపోవచ్చని, బాబు గారు ఊహించనంత పరాజ యాన్ని చవిచూడబోతున్నాడు అని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలకు దరిదాపులలో వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు, తెలుగుదేశానికి 23 స్థానాలు, జనసేనకు ఒక స్థానం వచ్చాయి. జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశానికి 23 స్థానాలు వచ్చాయి కానీ అదే జరగకుండా ఉంటే పది స్థానాలు మించి ఉండేవి కావు. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రథమ కారణం గత ఐదు సంవత్సరాల్లోని ప్రభుత్వ అవినీతి పాలన. బాబు గారు 2009, 2014 ఎన్నికలను అధికారంలో లేకుండా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎన్నికల ఖర్చులకు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. 2014లో అధికారానికి వచ్చినప్పటినుంచి పాలన 2019 ఎన్నికలను ధనబలంతో ఎలా గెలవాలనే ఆలోచనతోనే సాగింది. దీనితో అవినీతి విశృంఖలంగా అయింది. ఏదో ఒక స్థాయిలో కాక వివిధ స్థాయిల్లో అవినీతి పెరిగిపోయింది. ఇసుక నుంచి మట్టి దాకా కాదేది అవినీతికి అనర్హం అన్న స్థాయిలో పరిపాలన నడిచింది. ఇదే ఈనాటి తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను. మొదటినుంచీ బాబు గారికి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కమ్యూనిస్టుల సంస్థాగత విధానం అంటే చాలా అభిమానం. కార్యకర్తల సహాయంతో వారు రాష్ట్రాన్ని అప్రతిహతంగా 30 సంవత్సరాలు పాలించారు అనేది ఆయన మనసులో బాగా నాటుకున్నది. అదే విధమైన క్యాడర్ను తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేయాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన మరిచిన ఒక ముఖ్య విషయం ఏందంటే మౌలిక సిద్ధాంతాలు లేని ఏ కేడర్ అయినా లాభం కన్నా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కార్యకర్తలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక ఈ కమిటీల చేతుల్లో పెట్టారు. క్షేత్రస్థాయిలో ఈ కమిటీలు చేసిన నష్టం ఇంతా అంతా కాదు. అర్హత లేని వాళ్లకు లబ్ధి కల్పించడం ద్వారా ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పెంపొందించటంలో ఈ కమిటీలు ప్రధాన పాత్ర వహించాయి. బాబుగారి గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక వర్గానికి పెద్దపీట వేశారనేది సొంత పార్టీలోనే ఒక ప్రధాన చర్చకు దారితీసింది. ఇక సాధారణ ప్రజల విషయంలో చెప్పనవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజల వలన ప్రజల చేత కొందరి కొరకు అన్న ధోరణిలో పాలన సాగించింది. ఈ సంకుచిత ఎజెండా ప్రజలకు నచ్చలేదు. పైపెచ్చు ఈ వర్గంలో కొందరు ప్రదర్శించిన అహంభావ ధోరణులు తీవ్ర ప్రజా వ్యతి రేకతకు కారణాలయ్యాయి. 2004 ఓటమికి ప్రధాన కారణం బాబు గారి దృష్టిలో ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత. దీనిని రూపుమాపటం కోసం 2014 నుంచి ప్రయత్నం ప్రారంభించారు. కానీ ఆయన ఎన్నుకున్న విధానం లోపభూయిష్టం. ఉద్యోగ సంఘాల నేతలను వశపరచుకోవడం ద్వారా ఉద్యోగస్తులను తన వైపు తిప్పుకోవచ్చని భావించారు. సంఘ నేతలు స్థాయికి మించిన ప్రాధాన్యాన్ని ప్రభుత్వంలో పొంది తమ సొంత ఎజెండాను ముందుకు తీసుకొనిపోయినారు కానీ వారి వల్ల ఉద్యోగస్తులు ఏవిధంగానూ ప్రభావితం కాలేదు. కేవలం అభివృద్ధిని ఒక ప్రాంతాల్లో కేంద్రీకరించడం ద్వారా ఇతర ప్రాంతాలలో వ్యతిరేక భావం ప్రబలింది. రాయలసీమ మొత్తానికి రెండే రెండు సీట్లు బాబు గారికి, బాలకృష్ణ గారికి రావటమే ఇందుకు నిదర్శనం. క్షేత్రస్థాయిలో పనులకు.. చేసిన ప్రచారానికి ఎక్కడా పొంతన లేదు. దీని ప్రభావం కూడా ఎన్నికల సమయంలో ఉన్నది. విభజన అంశాలను ప్రధాన ఎజెండాగా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి మోదీ గారిని, జగన్ గారిని రాష్ట్ర వ్యతిరేకులుగా చూపెట్టడానికి బాబు గారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అన్నిటికీ మించి తాను ప్రత్యేకంగా ఏరికోరి ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం పరిపాలన అంశాలలో ఆయనకు మద్దతుగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలలో అదే విధంగా ఏర్పాటు చేసు కున్న పార్టీ కార్యదర్శి, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ సహాయం చేయటానికి ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఓటమి చెందటానికి అంతగా బయట శత్రువుల అవసరం లేకపోవచ్చు. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
వైఎస్ జగన్ సీఎం కావడంతో అభిమాని పాదయాత్ర
కొత్తకోట రూరల్: ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడంతోపాటు ముఖ్యమంత్రి కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు ఓ యువకుడు ఇడుపులపాయకు పాదయాత్రగా బయల్దేరాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమాని అయిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదళ మండలం నల్లవెళ్లి గ్రామానికి చెందిన శివలింగం గత నెల 29న ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టాడు. ఈపాదయాత్ర శనివారం రాత్రి వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంది. పాదయాత్ర చేస్తున్న శివలింగాన్ని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినయ్యానని, అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిగా మారనన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తానని తమ ఇంటి దైవమైన మేడాలమ్మ దేవాలయంలో మొక్కుకున్నానని, అనుకున్నట్లే వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తున్నట్టు శివలింగం తెలిపాడు. చెప్పులు లేకుండా రోజుకు దాదాపు 40కిలోమీటర్లు నడుస్తున్నట్టు ఈనెల 9న ఇడుపులపాయకు చేరుకోనున్నట్టు ఆయన తెలిపారు. శివలింగం పాదయాత్ర చేస్తుండగా ఆయనకు సహాయంగా గ్రామానికి చెందిన ఇద్దరు వైఎస్ఆర్ అభిమానులు మాజీ ఎంపీటీసీ సభ్యులు కిష్టగౌడ్, బి.వెంకటేష్ బైక్పై వస్తూ అవసరాలను తీర్చుతున్నారు. -
విదురుడిలా! వికర్ణుడిలా!
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది పది రోజుల క్రితం వరకు రాష్ట్రమంతా ఉత్కంఠ! ముఖ్యంగా పాత్రికేయుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న! ఎన్నికలు జరగడానికి నెలముందు హైదరాబాదు నుంచి టంకశాల అశోక్ గారు ఫోన్చేసి ‘అంధ్రప్రదేశ్లో ఎట్లుంది?’ అని అడిగారు. ‘కాస్త జగన్ వేవ్ కనిపిస్తోందండీ’ అన్నాను. హైదరాబాద్లో ఉంటున్న మరో సీనియర్ జర్నలిస్ట్ (పీకాక్ క్లాసిక్స్) గాంధీ గారు ఫోన్ చేసి ‘ఏపీలో ఎలా ఉందండి’ అన్నారు. ‘కాస్త జగన్ వేవ్ ఉందండి’ అన్నా. ‘బీజేపీపై వ్యతిరేకత జగన్పైన ఏమైనా పడుతుందా?’ అని అడిగారు. ‘బీజేపీపైన వ్యతిరేకత ఉంటే అది ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీపైనే ఉంటుంది కానీ జగన్పైన ఎలా ఉంటుంది’ అన్నాను. హైదరాబాదులోని మరో సీనియర్ జర్నలిస్ట్(80 ఏళ్లు) ఫోన్ చేసి ‘శర్మాజీ రాయలసీమలో ఎట్లా ఉంది?’ అని అడిగారు. ‘సీమ ప్రజలు టీడీపీ అంటే చాలా కోపంగా ఉన్నారు’ అన్నా. ‘ఎందుకు’ అని అడిగారు. ‘వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా నీళ్ళు రాయలసీమకు రావడానికి ముఖద్వారంలాంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచితే, దేవినేని ఉమ ప్రకాశం బ్యారేజిని దిగ్బంధం చేశారు. దాని వెనుక బాబు ఉన్నారు. గాలేరునగరి, హంద్రీనీవాలను పూర్తి చేయకుండా పట్టిసీమను పూర్తి చేశారు. టీడీపీకి అనంతపురం జిల్లాలో కొన్ని సీట్లు రావచ్చునేమో కానీ, మిగతా సీమలో రావు’ అని కరాఖండిగా చెప్పాను. ‘హంద్రీనీవాకు నీళ్లొది లారు కదా! చిత్తూరు జిల్లాలో పీలేరు వరకు నీళ్ళొచ్చాయట గదా’ అని అడిగారు. ‘నిజమే సార్.. ఎన్నికల ముందు కాలువల్లోకి కాసిని నీళ్లొదిలితే, ఆ నీళ్లను చూసి వెంటనే పంటలేసి, వేసిన పంటలన్నీ నెలరోజుల్లో పండిపోయి, ఆ వెంటనే దారిద్య్రమంతా తీరి పోయి రైతులు ఆనంద తాండవమాడతారా!?’ అని ప్రశ్నించాను. ‘సిద్దేశ్వరం అలుగు కోసం ఆందోళన చేసిన వేలాది మంది రైతులను అరెస్టులు చేస్తే అంతా మర్చిపోయి టీడీపీకి ఓట్లు గుద్దేస్తారా!? ’ అని అడిగేశాను. ‘లేదు శర్మాజీ... మహిళలంతా టీడీపీ పక్కే ఉన్నారు. డ్వాక్రా మహిళలకు డబ్బులు వేస్తున్నారు కదా!’ అని దింపుడు కళ్లం ఆశ వ్యక్తం చేశారు. ‘డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని, ఐదేళ్లూ కాలయాపన చేసి, ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో డబ్బులిస్తే ఓట్లేస్తారా సార్?’ అని ప్రశ్నించా. చివరగా ఆయన ఒక తీర్పు చెప్పారు ‘మీరన్నట్టు టీడీపీ ఓడితే అది జగన్ కోసం ఈవీఎంలను మోడీ ట్యాంపరింగ్ చేయించారని రుజువైనట్టే. ఒకవేళ టీడీపీ గెలిస్తే ట్యాంపరింగ్ జరగనట్టు భావించాలి’ అన్నారు. సామాన్యులా..సెఫాలజిస్టులా..! ఏపీలో జగన్ వేవ్ ఉందని ముగ్గురు సీనియర్ జర్నలిస్టులతో ఇంత గట్టిగా నేనెలా చెప్పగలిగాను!? నేనేమీ సెఫాలజి స్టును కాను! క్షౌరశాలలో కూర్చున్నప్పుడు ‘రంజిత్.. ఎట్లా ఉంది రాజకీయం’ అని అడిగాను. ‘అంతా జగనే అంటాండారు’ అన్నాడు. ‘ఎవరికి ఓటేస్తున్నావు రెడ్డెమ్మా’ అని మా పనిమనిషిని అడిగాను. ‘జగన్కేస్తాండాం’ అంది. ‘ఎందుకు?’ అని అడిగా. ‘ఏమో నాకు తెల్దు. మా వోళ్లంతా జగన్కే వెయ్యాలా అంటాండారు’ అన్నది. ‘ఎట్లా ఉంది రాజకీయం నారాయణా’ అని చెట్టుకింద ఉన్న స్కూటర్ మెకానిక్ను అడిగాను. ‘ఏం చెపుతాం సార్. ఎండలు మండిపోతాండాయి. టౌన్లో కెళ్లి స్పేర్పార్ట్స్ తెద్దామంటే వెళ్లలేకపోతున్నా. ఇంత ఎండల్లో జగన్ ఇన్ని నెలలు, ఇన్ని మైళ్లు ఎట్ల నడిచినాడో? టౌన్లో కెళ్లకపోతే నాకైతే గడవదు కానీ, నడవకపోతే ఆయనకేం గడవదా!’ అన్నాడు. ఎన్నికల ఫలితాలకు ముందు పాలకొల్లు వెళ్లాను. నాపక్కన కూర్చున భీమవరానికి చెందిన ఒక రైతు (కాపు)ను ‘ఎవరు గెలుస్తారు?’ అని అడిగాను. ‘మా వాళ్లంతా జగనే రావచ్చంటున్నారండి’ అన్నాడు. తిరుగు ప్రయాణంలో నాపక్కన కూర్చున్న విద్యార్థులనడిగాను. ‘జగన్కు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారండి’ అని చెప్పారు. జగన్ వేవ్ అప్పటివరకు రాయలసీమలో మాత్రమే అనుకున్నా. వీళ్ళతో మాట్లాడాక టీడీపీ కంచుకోటలు కూడా బద్దలవుతున్నాయని గ్రహించా. అయినా ఫలి తాల వరకు ఎదురుచూడక తప్పదు. మే నెల 23న మండిపోయే ఎండల్లో తెలుగు నాట కనీవినీ ఎరుగని ఒక టోర్నడో వచ్చింది. ఆ టోర్నడోలో చాలామంది టీడీపీ నేతలు కొట్టుకుపోయారు. సీమలోని 52 శాసనసభ స్థానాలకుగాను 49 స్థానాల్లో ఆపార్టీ ఓడిపోయింది. మూడే స్థానాలు దక్కించుకుంది. తొలి రౌండ్లో ఆ పార్టీ నేత బాబు కూడా వెనుకబడిపోయారు. ఎన్నికల గురించి నాతో మాట్లాడిన ఈ సామాన్యులే అసలు సిసలైన సెఫాలజిస్టులన్న విషయం అప్పుడే బోధపడింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక టంకశాల అశోక్, గాంధీగార్లతో ఫోన్లో మాట్లాడుతూ ‘జగన్ వేవ్ ఉందని పసిగట్టాను కానీ, ఇంత బలంగా ఉంటుందని ఊహించలేకపోయా’ అన్నాను. జగన్ వేవ్ ఉందని మరికొంతమంది కూడా చెప్పారని వారు నిర్ధారించారు. ‘ప్రజలు జగన్ని ప్రతిపక్ష నేతగా కూడా తిరస్కరి స్తార’ని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. కొందరు నాయకులు టీవీ కెమెరాల ముందుకొచ్చి మీసాలు మెలేశారు. మరి కొందరు తొడలు కొట్టారు. ఫలితాలతో తొడలు విరిగిన దుర్యోధనుడిలా పడిపోయారు. చాలా పత్రికలు, చానళ్లు ఫలితాలను పసిగట్టలేకపోయాయి. ఒక వేళ పసిగట్టినా, యాజమాన్యం మెప్పుకోసం చావుకోసం పాడిన జోలపాటలా విశ్లేషణలను వినిపించాయి. లగడపాటి చెప్పిన జోస్యాన్ని రాత్రీపగలు అనకుండా ప్రసారం చేశాయి. కొన్ని పత్రికలు అబద్ధాల ప్రయోగశాలలయ్యాయి. మహాభారతంలో విదురుడు, వికర్ణుడి పాత్రలు విశిష్టమైనవి. ద్రౌపదిని కౌరవ సభకు తీసుకురమ్మని ధుర్యోధనుడు ఆదేశిస్తే విదురుడు తిరస్కరిస్తాడు. ‘సభలో ద్రౌపది వేసిన ప్రశ్నలకు బుద్ధిమంతులంతా సమాధానం చెప్పాలి. ధర్మసందేహం తీర్చని రోజు సభలోని సజ్జనులందరికీ ఆ పాపం అంటుకుం టుంది’ అని హెచ్చరిస్తాడు. ద్రౌపదిని కురుసభకు తీసుకొచ్చినప్పుడు ‘భీష్ముడు, ద్రోణుడు, ధృత రాష్ట్రుడు, కృపుడువంటి పెద్దలు మౌనంగా ఉన్నారు. మిగిలిన ధర్మజ్ఞులైనా రాగద్వేషాలు మాని ఆలోచించి చెప్పండి’ అంటాడు వికర్ణుడు. కురుక్షేత్రంలో విదురుడు ఏ పక్షమూ వహించడు. సమాజంలో దారుణాలు జరుగుతున్నప్పుడు పత్రికలు, వార్తా చానళ్లు విదురుడి లాగా, వికర్ణుడిలా ప్రశ్నించాలి. రాజధాని నిర్మాణం పేరుతో పచ్చని పంటపొలాలను నాశనం చేసి, భూ కుంభకోణాలకు పాల్పడినప్పుడు, కాల్మనీ సెక్స్ రాకెట్ బైటపడినప్పుడు, మహిళా తహసీల్దార్ వనజాక్షిని ఇసుకలో పొర్లించి కొట్టినప్పుడు ఏ పత్రికలు, చానళ్లు ఎలా వ్యవహరించాయో అవి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి దారుణమైన సంఘటనలపై పాత్రికేయులు నిజాల నిప్పులపైన కాల్చి నిగ్గుతేల్చాలి. మీడియా విదురుడు, వికర్ణుడి పాత్రను పోషించి ఉంటే నాటి పాలకులకు క్షేత్రస్థాయి వాస్తవాలు ఏమిటో కనీసం అర్థమయ్యేవి. రాఘవ శర్మ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, తిరుపతి మొబైల్ : 94932 26180 -
పెడధోరణికి సమాధి–ప్రగతికి పునాది
‘వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్.’ సవ్యంగా, సలక్షణంగా ప్రారంభమైన పని సగం పూర్తయినట్టే అంటారు. గురువారంనాడు అమరావతిలో, ఢిల్లీలో పదవీ ప్రమాణ స్వీకారోత్సవాలు అద్భుతంగా జరిగాయి. ఎన్నికలలో ప్రజలు తమ నిర్ణయం నిర్ద్వంద్వంగా, ప్రస్ఫుటంగా ప్రకటించారు. ప్రజల తీర్పును అను సరించి అమరావతిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఢిల్లీలో నరేంద్రమోదీ రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జగన్ ఒంటరిగా ప్రమాణం చేయగా, మోదీ మరి 53 మంది సహచరులతో కొలువుదీరారు. వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రుల నియామకం జరుగుతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ప్రజలు అధికా రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని తిరస్కరించి ప్రతిప„ý మైన వైఎస్ ఆర్సీపీకి పట్టం కట్టారు. దేశ ప్రజలు అధికారంలో ఉన్న మోదీ సారథ్యాన్ని ఆమోదించి మరో ఐదేళ్ళు సమధికోత్సాహంతో పొడిగించారు. ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రజలు ఒకే విధమైన తీర్పు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్కు అఖండ విజయం ప్రసా దించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 90 కోట్లమంది ఓటర్లూ దాదాపుగా ఒకే తరహాలో తీర్మానించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభావం అంతగా లేకపోయినా కర్ణాటకలో అధికంగానూ, తెలంగాణలో గణనీ యంగానూ మోదీ హవా పని చేసింది. దేశం మొత్తం మీద బీజేపీది గొప్ప విజ యం. బీజేపీ ప్రచారం చేసిన ‘మోదీ హై తో ముమ్కిన్ హై’(మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే) నినాదాన్ని ఓటర్లలో అధిక సంఖ్యాకులు విశ్వసించారు. ‘ఆయేగా తో మోదీ హీ’ (మోదీయే వస్తాడు) నినాదం ముమ్మాటికీ నిజమై కూర్చున్నది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తర్వాత 2004లో జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి వేలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మీదట తొలిసంతకం వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఫైల్ పైన చేశారు. ఆయన కుమారుడు తండ్రి కంటే ఎక్కువకాలం, ఎక్కువ దూరం పాదయాత్ర చేసి, ఎన్నికలలో తండ్రికంటే ఘన మైన విజయం సాధించి తండ్రిని మించిన తనయుడని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని రూ. 2,250లకు పెంచే ఫైలుపైన తొలిసంతకం చేసి అవ్వాతాతలకు మోదం కలి గించారు. ప్రజాసంక్షేమం విషయంలో వైఎస్ ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానన్న హామీని నిలబెట్టుకుంటూ త్రికరణశుద్ధిగా ప్రస్థా నం ప్రారంభించారు. అధ్వానంగా ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లో ఉన్నది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు తోడు జగన్ ఎన్నికల ప్రచారానికి ముందే ప్రకటించిన నవరత్నాలలో భాగంగా చేపట్టవలసిన పథకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వేతనాలు ఉదారంగా పెంచుతుందనే ఆశతో ఉన్నారు. రాజధాని నగర నిర్మాణం భారీ ఖర్చుతో కూడిన పని. కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడం, ఇచ్చిన హామీలను అమలు జరపడం ప్రభుత్వం ఎదుట ఉన్న పెనుసవాళ్లు. టీడీపీ ప్రభుత్వం దాదాపు రెండు ల„ý ల కోట్ల రూపాయలు అప్పు చేసి చిరు ఆస్తి కూడా నిర్మిం చకుండా ఖజానాను ఖాళీ చేసింది. కేంద్రం బకాయిలు చెల్లించడంతో సరిపుచ్చు కోకుండా అదనపు ఆర్థిక సహాయం చేయాలి. ప్రత్యేక హోదా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలూ, వ్యాపార సంస్థలూ వెలసి ఆర్థిక వనరులు పెంపొందుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) జగన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి వచ్చి ‘కావలసింది ఖడ్గ చాలనం కాదు, కరచాలనం’ అని హితవాక్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పరస్పరం సహకరించుకుంటూ ప్రగతి పథంలో ప్రయాణం చేయాలని అనడం ఆప్తవాక్యం. నదీజలాల విషయంలో కేసీఆర్ ఇచ్చిన భరోసా స్వాగతించదగినది. తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందదాయకం. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా పరుగులెత్తిస్తూ నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని జగన్ ఎంత వేగంగా, ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా నడిపిస్తారోనని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలూ, దేశంలోని ఇతర ప్రాంతాల నేతలూ, ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన తీరు జగన్ ఎటువంటి సవాళ్ళనైనా జయప్రదంగా ఎదుర్కోగలరనే విశ్వాసం కలిగిస్తుంది. 2014లో ఓడిపోకుండా స్వల్ప మెజారిటీతో ఆ పార్టీ గెలుపొంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అప్పుడు జగన్కు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించే అవకాశం ఉండేది కాదు. పాదయాత్రలో సుమారు కోటిమందిని కలుసుకొని వారి వెతలు ఆలకించి మనస్సులో నమోదు చేసుకునే సందర్భం ఉండేది కాదు. పాదయాత్ర ఫలితంగానూ, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాల కారణంగానూ, ప్రతిపక్ష నాయకుడిగా సమర్థమైన పాత్ర పోషించడం వల్లనూ ప్రజల గురించీ, వారి సమస్యల గురించీ సంపూర్ణమైన అవగాహన ఏర్పడింది. క్షేత్రజ్ఞానం విశేషంగా పెరిగింది. ఒక రకంగా ప్రతిపక్షంలో ఉండటం వల్ల మేలు జరిగింది. అప్పుడే గెలిచి ఉంటే అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి వచ్చారనీ, విశేష అనుభవం కలిగిన చంద్రబాబుకి అధికారం అప్పగిస్తే అద్భుతాలు చేసేవారనీ ప్రచారం చేయడానికి వీలుండేది. చంద్రబాబు పాలన చూసిన తర్వాత ఆయనను ముఖ్య మంత్రిని చేసినందుకు చింతించి, వగచిన ప్రజలు కసితో టీడీపీని చిత్తుగా ఓడిం చారు. వైఎస్ఆర్సీపీ అఖండ విజయానికి రెండు కారణాలు–ఒకటి, జగన్ మాట తప్పని, మడమ తిప్పని మనిషనీ, హామీలు తు.చ. తప్పకుండా అమలు చేస్తా రనీ, ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడనీ, సమర్థంగా పరిపాలిస్తారనీ బల మైన విశ్వాసం. రెండు, చంద్రబాబుపట్ల పెరిగిన అవిశ్వాసం, అసహనం, ఆగ్రహం. ఫలితంగా చంద్రబాబుకి అవకాశం ఇవ్వకుండా తప్పు చేశామని ఓటర్లు అనుకునే అవకాశం లేదు. జీవితంలో సంభవించే పరిణామాలను ప్రశ్నిం చకుండా స్వీకరించాలని తత్త్వవేత్తలు చెప్పిన హితవు జగన్కు అక్షరాలా వర్తి స్తుంది. ‘ఫెయిల్యూర్ ఈజ్ హైరోడ్ టు సక్సెస్’ (పరాజయం విజయానికి రహ దారి) అనే నానుడిని సత్యమని నిరూపిస్తూ అద్భుత విజయం సాధించిన జగన్ ఉత్తమ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవడానికి అనువైన వాతావరణం ఈ రోజు ఆంధ్రావనిలో నెలకొన్నది. పెరిగిన మోదీ ఆత్మవిశ్వాసం రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన నరేంద్రమోదీ తనతో పాటు పాతిక మంది కేబినెట్ మంత్రులనూ, అంతకంటే ఎక్కువ మంది సహాయ మంత్రు లనూ ఒకే విడత నియమించడం పెరిగిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కొత్త మంత్రిమండలిలో విధిగా చెప్పుకోవలసిన విశేషాలు ముచ్చటగా మూడు ఉన్నాయి. ఒకటి, బీజేపీ అధ్యక్షుడుగా అనేక విజయాలు అందించిన అమిత్షాని మంత్రిమండలిలోకి తీసుకోవడం. అమిత్షా తన వారసుడని మోదీ చెప్పకనే చెప్పారు. తన కంటే 14 ఏళ్ళు చిన్నవాడైన అమిత్షాను తన తర్వాత స్థానంలో దేశీయాంగమంత్రిగా నిలపడం మోదీ చేసిన సరికొత్త ప్రయోగం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు సహాయమంత్రి హోదాలోనే అమిత్షా హోంశాఖను నిర్వహించేవారు. షా పట్ల మోదీకి ఉన్న అచంచలమైన విశ్వాసానికి తాజా నిర్ణయం నిదర్శనం. కశ్మీర్లో శాంతి స్థాపనకు ఆయన ఎటువంటి చొరవ ప్రదర్శిస్తారో చూడాలి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు కశ్మీర్లో 370వ అధిక రణను రద్దు చేస్తారా? మందిర నిర్మాణానికి ముందడుగు వేస్తారా? గోరక్షకుల పేరిట అన్యమతస్తులపై జరుగుతున్న దాడులను అరికడతారా? ఏం జరుగు తుందో చూడాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలకూ, నిఘా సంస్థలకూ ఎటువంటి స్వేచ్ఛ ఇస్తారో గమనించాలి. మంత్రిమండలిలో అగ్రస్థానం అమిత్షాకు ఒక రకంగా అగ్నిపరీక్ష. రెండు, నిర్మలా సీతారామన్ను ఆర్థికమంత్రిగా నియమిం చడం మరో సాహసోపేతమైన ప్రయోగం. ఆమెకు రక్షణశాఖ అప్పగించినప్పుడే మోదీ చరిత్ర సృష్టించారు. అంతవరకూ ఆ శాఖను పూర్తిస్థాయిలో నిర్వహించిన మహిళా మంత్రి ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆర్థికశాఖా అంతే. దీన్ని స్వతంత్రంగా నిర్వహించే బాధ్యత ఒక మహిళకు అప్పగించడం ఇదే ప్రథమం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటూ రక్షణ, ఆర్థిక శాఖలను కొంతకాలం పర్యవేక్షించారు. అంతే. పార్టీ ప్రవక్త(ప్రతినిధి)గా తన ప్రతిభాపాటవాలతో అగ్రనాయకులను మెప్పించి, మంత్రిమండలిలో సహాయ మంత్రిగా ప్రవేశించి, రాజ్యసభలో సభ్యత్వం సంపా దించిన నిర్మల అధికార సోపానంలో వేగంగా అడుగులు వేస్తూ ఎదిగారు. తమిళనాట పుట్టి, తెలుగునాట మెట్టి, కన్నడసీమ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విద్యాధికురాలు ఆమె. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేసి, ఇండో–యూరోపియన్ వాణిజ్యంపైన పీహెచ్డీ చేశారు. ప్రైస్వాటర్ కూపర్స్ అనే బహుళజాతి సంస్థలో సీనియర్ మేనేజర్గా పని చేశారు. నిర్మల రక్షణమంత్రిగా రాణించినట్టే ఆర్థికమంత్రిగా సైతం మోదీ నమ్మ కాన్ని వమ్ము చేయరని చెప్పవచ్చు. విదేశాంగమంత్రిగా మాజీ దౌత్యాధికారి మూడు, విదేశాంగమంత్రిగా నియుక్తుడైన జైశంకర్. ఆయనా జెఎన్యూలో పీహెచ్డీ చేశారు. ఇండో–అమెరికన్ అణు ఒప్పందంపైన 2005 నుంచి 2007లో మన్మోహన్సింగ్, జార్జి బుష్ల సంతకాలు జరిగే వరకూ జరిగిన చర్చలలో క్రియాశీలక పాత్ర పోషించిన దౌత్యవేత్త. 2017లో డోక్లాం వివాదం కారణంగా చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్తో కయ్యం నిత్యకృత్యమై సంబంధాలు నానాటికీ తీసికట్టుగా దిగజారుతున్నాయి. వీటితో సంబంధాలు పెంపొందిం^è గలిగితే జైశంకర్ జన్మ ధన్యమైనట్టు భావించాలి. ఆయన తండ్రి కె. సుబ్రహ్మణ్యం రక్షణ వ్యవహారాలలో అగ్రశ్రేణి విశ్లేషకుడు. చాలా మంది ప్రధానులు ఆయన సలహాలు సగౌరవంగా స్వీకరించేవారు. ఆరోగ్యం సహ కరించకపోయినా మనసున్న విదేశాంగమంత్రిగా మంచిపేరు తెచ్చుకున్న సుష్మాస్వరాజ్ స్థానంలో నియుక్తుడైన జైశంకర్ కేబినెట్ మంత్రి పదవి పొందిన ప్రథమ భారత దౌత్యాధికారి. మేనకాగాంధీకీ, కల్నల్ రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్కీ, మరికొందరు ముఖ్యులకూ ఎందుకు ఉద్వాసన చెప్పారో తెలియదు. ఎప్పటిలాగానే కేంద్ర మంత్రిమండలిలో దక్షిణాదికి తగిన ప్రాతినిధ్యం లేదు. ఉత్తరభారతం, పశ్చిమభారతం ఎన్డీఏ ప్రభుత్వంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ స్థానం ఆక్రమించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాబల్యం, పరిచయాలూ కలిగిన కిషన్రెడ్డిని హోంశాఖ సహాయమంత్రిగా తీసు కోవడం విశేషం. యువమోర్చా కార్యనిర్వాహకుడిగా, బీజేపీకి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి పనిచేశారు. ప్రధానితో సాన్నిహిత్యం ఉంది. కిషన్రెడ్డికి మంత్రిపదవి రావడం సముచితమేనంటూ అందరూ హర్షం ప్రక టిస్తున్నారు. అమిత్షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశంపైన ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర పరిశీలకుడిగా పని చేసిన జగత్ ప్రసాద్ నడ్డా లోక్సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ పర్యవేక్షకుడిగా అనూహ్యమైన విజయాలు సాధించిన నేపథ్యంలో ఆయనను పార్టీ పదవి వరించవచ్చునని సంకేతాలు వెలువ డుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేరు కూడా వినిపిస్తున్నది. కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంపూర్ణ మెజారిటీలు సాధిం చిన పాలకపక్షాలు ఉండటం, ప్రధానికీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు లకూ మధ్య స్పర్థలు లేకపోవడం సంతోషించదగిన పరిణామం. ఇది ప్రగతికీ, సుస్థిరతకూ దారితీసే సానుకూల వాతావరణం. అయిదేళ్ళపాటు కుటిల రాజకీ యాలకూ, స్వార్థప్రయోజనాలకూ, ఎత్తులకూ, జిత్తులకూ, అవినీతికీ తావు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వాలు అంకిత భావంతో, ఏకాగ్రదృష్టితో కృషి చేస్తే ఇటీవలి ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన వివేక వంతమైన తీర్పు సార్థకం అవుతుంది. ఎన్నికల ప్రచారంలో విచ్చలవిడిగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ వంటి పార్టీలు సాగించిన పెడధోరణులకు తెరపడుతుంది. సకారాత్మక, నిర్మాణాత్మక రాజకీయాలకు పాలకులందరూ శ్రీకారం చుట్టవలసిన శుభసందర్భం ఇది. కె. రామచంద్రమూర్తి -
ఎంత వ్యత్యాసం!
నవ్యాంధ్రలో తొలిపొద్దు పొడిచింది.. సంక్షేమ పాలనలో నవ శకం ఆరంభమైంది.. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారం కానుంది.. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పింఛన్ల పెంపుపై చేసిన మొదటి సంతకంతో ప్రజాపాలనలో తొలి అడుగు వేసింది.. ఈ అద్భుత ఘట్టానికి విజయవాడ నగరం సాక్షీభూతంగా నిలిచింది.. రాజకీయ విభేదాలు, కుల మతాల పట్టింపులు లేని, అవినీతి రహిత పాలనే తన అభిమతమని.. ఇందుకు శ్రద్ధతో.. అంతఃకరణ శుద్ధితో పాలన సాగిస్తానంటూ చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి జగమంతా జేజేలు పలికింది.. శతమానం భవతి అంటూ మనసారా దీవించింది. సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పక్షాన ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే.. అధికారులకు ప్రాణసంకటంగా మారేది. ముఖ్యంగా రాజధాని విజయవాడలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యత అధికారులపైనే ఉండేది. దీనికి సంబంధించిన ఖర్చు కూడా వారే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ తర్వాత బిల్లులు మంజూరు చేయకపోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించేది. దీంతో అధికారులు ఇబ్బందులు పడేవారు. ‘దీక్ష’ ఏదైనా... చంద్రబాబు ప్రభుత్వం ధర్మపోరాట దీక్ష, ఏటా జూన్ 2 నవ నిర్మాణదీక్షలను నిర్వహించింది. అలాగే రేషన్ డీలర్లతో, ఆశా వర్కర్లు, పోలీస్హోమ్ గార్డులతో సమావేశాలు నిర్వహించింది. ఆయా కార్యక్రమాలకు సంబంధించి జనసమీకరణ అధికారులు తలకు మించిన భారమయ్యేది. ఆర్టీసీ నుంచి బస్సులు అద్దెకు తీసుకుని డ్వాక్రా గ్రూపులు, పార్టీ కార్యకర్తల్ని తరలించాల్సి వచ్చేది. అలాగే పోలవరం సందర్శన పేరుతో ఆర్టీసీ నుంచి ఉచిత బస్సులు నడిపారు. ఇవన్ని కలిసి సుమారు రూ.10 కోట్లు వరకు ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి పడింది. ఇక సభలకు వచ్చే నాయకులకు, అధికారులకు కావాల్సిన కార్లు, డీజిల్, పెట్రోల్ తదితర ఏర్పాట్లు రవాణాశాఖ అధికారులు పై పడేది. దీనికి సంబంధించి బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కార్లు అద్దెకు ఇవ్వడానికి ట్రాన్స్పోర్టర్లు ఇష్టపడేవారు కాదు. దీంతో తనిఖీల్లో పట్టుకున్న కార్లు, వ్యాన్లను బలవంతంగా సమావేశాలకు వినియోగించేవారు. ఇక సభాస్థలి ఏర్పాట్ల బాధ్యతంతా రెవెన్యూశాఖ పై ఉండేది. రెవెన్యూశాఖ అధికారులు ఇప్పటికే షామియానా సప్లయిర్స్కు లక్షల రూపాయల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఇక బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, మధ్యాహ్నం భోజనం, వాటర్ సప్లయి బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉండేది. గత ఏడాది జూన్లో జరిగిన నవనిర్మాణ దీక్ష డబ్బులు కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఇలా జిల్లాలో సుమారు రూ.100 కోట్లు వరకు ఈ తరహా బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడం, మరోవైపు సప్లయిర్స్ నుంచి ఒత్తిడి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు తమ చేతి నుంచి కొంత సొమ్ము చెల్లించిన సందర్భాలు ఉన్నాయని వారు వాపోతున్నారు. ఒక్క రూపాయి భారం లేదు.. గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం అధికారులపై ఒక్క రూపాయి భారం పడలేదు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో అధికారులు సాధ్యమైనంత పొదుపుగా కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలను పార్టీ నాయకులే తమ సొంత వాహనాల్లో తీసుకొచ్చా రు. అయితే ఆయా శాఖల అధికారులు మాత్రం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. వచ్చిన అతిథులకు ఏ విధమైన ఇబ్బందీ రాకుండానే చూశారు తప్ప తమ జేబుల్లోంచి పెట్టే అవసరం రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పవన్ ఓదార్పు కోసం ఎదురు చూపులు
పశ్చిమగోదావరి ,భీమవరం : ‘పవన్ అభిమానులు కోకొల్లలు.. సినిమా చర్మిషాతో విజయం సాధిస్తాం.. 1983లో ఎన్టీ రామారావుకు ఉన్న ఫాలోయింగ్ పవర్స్టార్ పవన్ కల్యాణ్కూ ఉంది. గ్రామస్థాయిలో జనసేన పార్టీకి బలం లేకపోయినా, కమిటీలు లేకపోయినా పార్టీకి సభ్యత్వాలు లేకపోయినా జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు నల్లేరుపై నడకే’.. ఇది ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు జనసైనికుల ధీమా. అయితే ఈనెల 23న ఫలితాలు వచ్చాక జనసేనాని పవన్కల్యాణ్ బొక్కబోర్లాపడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఘోరపరాజయం పాలుకావడంతో జిల్లాలోని జనసైనికులు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. పవన్ నుంచి ఓదార్పుకోసం ఎదురుచూస్తున్నారు. అగమ్యగోచరంగా జనసేన భవిష్యత్ ప్రధానంగా భీమవరం నియోజకవర్గంలోని పార్టీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జనసేన పార్టీ తరఫున పోటీచేయడానికి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త డాక్టర్ యిర్రింకి సూర్యారావు, వేగేశ్న సూర్యనారాయణరాజు (కనకరాజుసూరి) బొమ్మదేవర శ్రీధర్ (బన్ను) బిల్డర్ మల్లినీడి తిరుమలరావు(బాబి), న్యాయవాది ఉండపల్లి రమేష్నాయుడు వంటివారు ఆశించారు. దీనికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఎన్నికలు సమీపించిన తరుణంలో అప్పటికప్పుడు జనసేనాని పవన్కల్యాణ్ భీమవరంలో పోటీకి సిద్ధపడ్డారు. భీమవరం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున కాపు ఓట్లతో పాటు పపన్ అభిమానులు పవన్ను గెలిపిస్తారనే నమ్మకంతో పోటీ చేయించారు. అయితే ఎన్నికల ప్రచారంలో పవన్ మొక్కుబడి ప్రచారం చేయడమేగాక పోలింగ్ రోజు నియోజకవర్గం ఓటర్లకు కనుచూపుమేరలో కన్పించలేదు. అయినప్పటికీ పవన్ చరిష్మాతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అనేకమంది కోట్లాది రూపాయలు పందాలు కాశారు. సామాన్యప్రజలు, చిరు వ్యాపారులు, రైతులు సైతం అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పందాలు వేశారు. అధినేత ఓటమిపై కార్యకర్తల్లో కలత ఓట్ల లెక్కింపులో టీడీపీ మెజార్టీతో ప్రారంభం కాగా తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఆధిక్యత కనబర్చగా మధ్యలో కొన్ని రౌండ్లు జనసేన ఆధిక్యత కనబర్చింది. దీంతో పవన్కల్యాణ్ విజయం ఖాయమంటూ పార్టీ శ్రేణులు అప్పటికే సంబరాలు ప్రారంభించారు. చివరకు ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ప్రధానంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత జనసేన అధినేత పవన్కల్యాణ్ భీమవరంలో తన విజయం కోసం కృషి చేసిన వారి గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడంతో వారితో అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ కోసం, పవన్ విజయం కోసం అహర్నిశలు శ్రమించాం. తీరా ఓటమి పాలవడంతో రానున్న రోజుల్లో మాకు ఎవరు అండగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. జనసేనను నమ్ముకుని తెలుగుదేశం పార్టీని, మునిసిపల్ చైర్మన్ పదవిని వదులుకున్న కొటికలపూడి గోవిందరావు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయిన పవన్ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎలా పోరాటం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పవన్ను నమ్ముకున్నవారికి జిల్లాలో పెద్దదిక్కుగా ఉండే నాథుడే కరువయ్యాడని, ప్రధానంగా భీమవరంలో మా అలనాపాలనా చూసే నాథుడు లేనందున మా పరిస్థితి ఏమిటని జనసేన నాయకులు అంతర్మథనంలో ఉన్నారు. మొత్తం మీద జనసైనికులంతా తలోదిక్కుకూ వెళ్లే ఆలోచనలో ఉన్నా తమను ఆదరించేవారెవరనే సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. -
కలసి నడుద్దాం
‘రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.కృష్ణా జలాలను ఒద్దికగా, పొదుపుగా వినియోగించుకుంటూ సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో రెండు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ అభిలషించారు. చిన్న వయసులో ముఖ్యమంత్రిగా చేపట్టిన పెద్ద బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగే శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నాయని, అది గత తొమ్మిదేళ్లుగా ప్రస్ఫుటంగా నిరూపణైందని కొనియాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. సాక్షి, అమరావతి/గన్నవరం: ‘నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు, ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇదో ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రేమతో అనురాగంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. వయసుచిన్నదైనా ఆ శక్తి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. మీ కార్యనిర్వహణలో, మీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తున్నాను.రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయవలసింది ఖడ్గ చాలనం కాదు కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి. జగన్మోహన్రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. 100 శాతం జరిగి తీరాలి. మీ ఆధ్వర్యంలో జరుగుతుందని విశ్వసిస్తున్నాను.కృష్ణా నదీ జలాల విషయంలో సమస్యలు ఉన్నాయి. అక్కడ నదిలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా ఒద్దికగా ఓపికగా ఉభయ రాష్ట్రాలు వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ కార్యనిర్వహణలో అవసరమైనటువంటి అన్ని విధాల అండదండలు, సహాయసహకారాలు తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాను. అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన పాలన అందించి నాన్నగారి పేరు నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయేలా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని.. ఒక టెర్మ్ కాదు కనీసం మూడు నాలుగు టెర్మ్ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తున్నాను.’ అంటూ ముగించారు. వైఎస్ జగన్కు శుభాకాంక్షలు: స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో విజయవంతం కావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆకాంక్షించారు. తన తండ్రి ఘన వారసత్వాన్ని నిలబెట్టేలా జగన్ మంచి పరిపాలన అందించాలని శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా స్టాలిన్ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడారు. ఎయిర్పోర్టులో కేసీఆర్, స్టాలిన్కు ఘనస్వాగతం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, డీఎంకే అధినేత స్టాలిన్కు గన్నవరం ఎయిర్పోర్టులో ఘనస్వాగతం పలికారు. తొలుత చెన్నై నుంచి 10.25 గంటలకు స్టాలిన్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమం పూర్తయ్యా సాయంత్రం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరివెళ్లారు. కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, పలువురు మంత్రులు విచ్చేశారు. సాయంత్రం ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్ అదే విమానంలో హైదరాబాద్ వెళ్లారు. -
వైఎస్ జగన్ అనే నేను
సాక్షి, అమరావతి: అశేష జనవాహిని కేరింతలు.. హర్షధ్వానాలు.. దిక్కులు పిక్కటిల్లే నినాదాల నడుమ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను..’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ నడిబొడ్డున గల ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహం, ఉద్విగ్నభరిత వాతావరణంలో మధ్యాహ్నం సరిగ్గా 12.23 గంటల ముహూర్తానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, వైఎస్ జగన్తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని కూడా ప్రమాణం చేయించారు. జగన్ ప్రమాణం చేస్తున్నప్పుడు వేదికకు ఎడమవైపున ఆశీనురాలైన ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ చలించారు.. కంటతడిపెట్టారు. ప్రమాణ స్వీకార సమయానికి ముందుగా అక్కడకు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తొలుత జగన్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన నియామక పత్రాన్ని చదవి వినిపిస్తూ కాబోయే ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆ వెంటనే గవర్నర్ లేచి లాంఛనంగా ‘..అనే నేను’ అంటూ తొలి పలుకు చెప్పగానే ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. వెను వెంటనే మళ్లీ గవర్నర్ ‘..అనే నేను’ అనగానే.. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన ఏవిషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికీ లేదా.. వ్యక్తులకు తెలియ పరచనని లేదావెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే.. వేదికపై కాస్త ఎడంగా కూర్చున్న గవర్నర్సతీమణి విమలా నరసింహన్ ఒక పుష్పగుచ్ఛాన్ని జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డికి ఇచ్చి మనసారా అభినందనలు తెలియజేశారు. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం.. 2019 మే 30.. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. ఉదయం నుంచే ఇందిరా గాంధీ స్టేడియం వద్ద సందడి నెలకొంది. స్టేడియం యావత్తు వైఎస్ జగన్ నినాదాలతో మార్మోగింది. గంటగంటకూ జనం పెరిగిపోవడంతో ఉదయం 10 గంటల తర్వాత అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. స్టేడియం బయట 14 ఎల్ఈడీ తెరల ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 11.50 గంటల సమయంలో జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సభాస్థలికి చేరుకున్నప్పుడు ప్రజలు జేజేలు పలికారు. సభాస్థలి వద్ద పార్టీ నేతలు హెలికాప్టర్ నుంచి పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్న తీరు అపురూపం. వేదిక వద్దకు రాబోయే ముందు ఓపెన్ టాప్ జీప్లో వైఎస్ జగన్ జనానికి అభివాదం చేస్తూ సభా ప్రాంగణమంతా కలియతిరిగారు. అప్పటికే వేదికపైకి వచ్చిన తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, తెలంగాణ మంత్రులు, పుదుచ్ఛేరీ మాజీ మంత్రి మాల్లాడి కృష్ణారావులకు వినమ్రంగా నమస్కరిస్తూ వేదికపైకి వచ్చిన జగన్.. ప్రజలకు అభివాదం చేసినప్పుడు కొన్ని నిమిషాల పాటు ప్రాంగణమంతా హర్షధ్వానాలతో హోరెత్తింది. వైఎస్ జగన్ ఎదురేగి గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రమణ్యం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 12.23 గంటలకు వైఎస్ జగన్తో నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ దంపతులకు జగన్ స్వయంగా కిందకు వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం స్టాలిన్, కేసీఆర్లు జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతూ నాన్నగారి (డాక్టర్ వైఎస్సార్) పేరు నిలబెట్టి కనీసం మూడు నాలుగు టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని దీవిస్తున్నానని అన్నప్పుడు సభా ప్రాంగణం జగన్ నినాదంతో మార్మోగింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుదైన రికార్డు తెలుగు రాష్ట్రాల చరిత్రలో జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఓ అరుదైన రికార్డుగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు దివంగత సీఎం వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అచ్చంగా తండ్రి బాటలోనే ఆయన తన తొలి సంతకానికి ఒక పవిత్రతను చేకూరుస్తూ అవ్వా తాతల పింఛన్ పెంపు ఫైలుపై సంతకం చేశారు. నాడు వైఎస్.. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై తొలి సంతకం చేశారు. అది నేటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అప్రతిహతంగా అమలవుతోంది.జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఆయన సతీమణి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆ పార్టీ మరో నేత వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజి, టీడీపీ నేతలు నన్నపనేని రాజకుమారి, కేఆర్ పుష్పరాజ్, సీనియర్ ఐఏఎస్, ఐపీస్ అధికారులు, సినీ ప్రముఖులు రాంగోపాల్వర్మ, దిల్ రాజు, మహివి రాఘవతో పాటు పలువురు హాజరయ్యారు. వీరితో పాటు జగన్ సతీమణి వైఎస్ భారతి, ఆయన ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తదితరులు మాతృమూర్తి విజయమ్మతో కలిసి వేదికపై ఆశీనులయ్యారు. పెద్ద సంఖ్యలో వైఎస్ కుటుంబ సభ్యులు వేదికకు కింది వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఆశీనులయ్యారు. ఆకట్టుకున్న ప్రసంగం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ’నేను మీ కష్టాలు చూశాను, మీ బాధలను విన్నాను, నేను ఉన్నాను’ అని జగన్ చెప్పినప్పుడు వివిధ గ్యాలరీలలో ఉన్న వారు తమ సీట్లలో నుంచి లేచి మరీ హర్షధ్వానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఆగస్టు 15లోగా సుమారు 4 లక్షల వాలంటీర్లను నియమిస్తామని ప్రకటించినప్పుడు యువకుల కేరింతలు మిన్నంటాయి. సభ ముగిసిన అనంతరం కూడా ఉద్యోగాల భర్తీపై యువతీ యువకులు పెద్దఎత్తున చర్చించుకోవడం గమనార్హం. అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తామని.. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడం అని జగన్ చేసిన ప్రకటనతో ’నాయకుడంటే ఇతనే.. తండ్రిని మించిన తనయుడు’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రణాళిక విలువను జగన్ చాటిచెప్పిన తీరు ఆకట్టుకుంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి గుర్తుకు వస్తారు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడిచి అవ్వాతాతల పెన్షన్ను రూ.2250కి పెంచి జగన్ చరితార్ధుడయ్యారు. పండుటాకులకు ఆసరా ఇచ్చిన ఈ పథకం ఉన్నంత కాలం జగన్ను మరచిపోవడం సాధ్యం కాదు’ అని ఓ వామపక్ష పార్టీ నాయకుడు రవీంద్ర అభిప్రాయపడ్డారు. మొత్తం మీద రాష్ట్రంలో నూతన అధ్యయనానికి నవ యువకుడు నడుం కట్టారని మేధావులు అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారోత్సవం ఇలా.. ►11.50 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరిన జగన్ ►12.04 గంటలకు స్టేడియంలోకి ప్రవేశం ►12.10 గంటలకు వేదికపైకి ►12.18 గంటలకు గవర్నర్ ప్రసంగం ►12.23 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం ►12.29 గంటలకు ప్రమాణ స్వీకారం ముంగింపు ►12.30 గంటలకు గవర్నర్కు జగన్ వీడ్కోలు ►12.41 గంటలకు జగన్ ప్రసంగం ►1.05 గంటలకు అవ్వాతాతల పెన్షన్ పెంపు ఫైలుపై జగన్ తొలి సంతకం -
ఇక స్వచ్ఛమైన పాలన
వైఎస్ జగన్ అనే నేను.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూముఖ్యమంత్రి పదవినిస్వీకరిస్తున్నాను. 3,648 కిలోమీటర్లుఈ నేల మీద నడిచినందుకు,పదేళ్లుగా మీలో ఒకడిగానిలిచినందుకు ఆకాశమంతవిజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు,ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి,ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరున హృదయపూర్వకకృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాక్షి, అమరావతి : అవినీతి రహిత పాలన అందిస్తామని నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో వినూత్న, విప్లవాత్మకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను 72 గంటల్లోనే ప్రజల ముంగిటకు చేరుస్తామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను ప్రజల ముందుకు తెస్తూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలోని అవినీతి కాంట్రాక్టులను రద్దు చేసి, దోచుకున్నదెంతో ప్రజల ఎదుట ఉంచుతామన్నారు. నవరత్నాల అమలులో భాగంగా అవ్వాతాతల పెన్షన్ను పెంచుతూ తొలి సంతకం చేశారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో 5.60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని యువతకు తీపి కబురు చెప్పారు. పాలనలో తీరు తెన్నులపై స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కబురందించేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అశేష జనవాహిని ఆనందోత్సాహాల మధ్య ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, సతీమణి వైఎస్ భారతితో పాటు అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నే విన్నాను.. నేనున్నాను.. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో, 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో పేదలు పడ్డ కష్టాలుచూశాను. మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు విన్నాను. వారి కష్టాలు చూసిన, విన్న నేను.. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేనీ రోజు మాటిస్తున్నాను. మీ కష్టాలను నేను చూశాను.. మీ బాధలు నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఇవాళ మీ అందరికీ చెబుతున్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టో తీసుకువచ్చాం. మేనిఫెస్టోను కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కన్పించే విధంగా తీసుకొచ్చాం. గత పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు.. బుక్కులు తీసుకురాలేదు. ఇందులో ప్రతి కులానికో పేజీ పెట్టి ఎలా మోసం చెయ్యాలన్న ఆలోచనతో తీసుకురాలేదు. ఎన్నికలయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్కు కింద తీసుకు రాలేదు. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఇది వైఎస్సార్ పెన్షన్ కానుక నవరత్నాల్లో మీ అందరికీ మాటిచ్చినట్టుగానే, మేనిఫెస్టోలోని ఒక అంశం గురించి మీ అందరికీ చెబుతాను. ఈ రోజు ఆ అవ్వా తాతల ఆశీస్సులు తీసుకునేందుకు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయం చెబుతున్నా. నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆ అవ్వా తాతలను పెన్షన్ ఎంత అని అడిగితే రూ.వెయ్యి అని చెప్పారు. కొంతమంది అవ్వలైతే అది కూడా రావడం లేదని చేతులూపుతూ చెబుతుండేవాళ్లు. ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే గడువున్నప్పుడు పింఛన్ను పెంచారు. అందుకే ఈ పరిస్థితి పూర్తిగా మార్చబోతున్నాను. నవరత్నాలలో ప్రతి అవ్వ, తాత, ప్రతి వితంతువుకు ఇచ్చిన మాట ప్రకారం వారి పెన్షన్ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళతాను. ఆ అవ్వా తాతల పెన్షన్ను జూన్ నెల నుంచి అక్షరాల రూ.2,250 నుంచి మొదలు పెట్టబోతున్నాను వైఎస్సార్ పెన్షన్ కానుకగా. దీనికి సంబంధించిన ఫైల్పై నేనీ రోజు మొట్ట మొదటి సంతకం పెడుతున్నాను. (సంతకం పెట్టారు.) ఈ సంవత్సరం రూ.2,250తో మొదలు పెడుతున్నాం. రేపు సంవత్సరం రూ.2,500కు తీసుకెళ్తాం. ఆ తర్వాత సంవత్సరం రూ.2,750కు.. ఆ తర్వాత ఏడాది రూ.3 వేలకు తీసుకెళ్తాం. అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నామని చెబుతూ.. ఆశీస్సులు ఇవ్వమని పేరుపేరునా ప్రతి అవ్వా తాతను మీ మనవడిగా రెండు చేతులు జోడించి కోరుతున్నా. ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశమూ ప్రతి పేదవాడికీ అందాలి. ఇందులో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. ఇది జరగాలంటే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ఇందులో భాగంగా ఆగస్టు 15 నాటికి, అంటే ఇవాల్టి నుంచి కేవలం రెండున్నర నెలల కాలంలో గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని హామీ ఇస్తున్నా. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా, లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తున్నాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, సేవ చెయ్యాలనే ఆరాటం ఉన్న పిల్లలకు రూ.5 వేలు జీతమిస్తూ గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటాం. రూ.5 వేలు ఎందుకిస్తున్నామో తెలుసా? ఈ వ్యవస్థలోకి లంచాలు రాకుండా చెయ్యాలని. ప్రజలకు చెందాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి, పక్షపాతం, లంచాలు ఉండకూడదని. సేవా దృక్పథం గల పిల్లలకు వేరే చోట మెరుగైన ఉద్యోగం దొరికే వరకు గ్రామ వాలంటీర్లుగా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నాలుగు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వస్తాయి. సర్కారీ సేవ అందకపోతే ఫోన్ కొట్టండి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటున లంచాలు కన్పించినా ఊరుకోం. అదే ఆగస్టు 15వ తేదీన ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. అది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే అనుసంధానమై ఉంటుంది. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష కన్పించినా, ఏ ఒక్కచోట లంచాలు కన్పించినా, ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా వక్రీకరణ వార్తలు రాసే మీడియాను కోర్టుకీడుస్తాం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కన్పిస్తాడు. మిగిలిన వాళ్లను ఎప్పుడెప్పుడు దించాలా అని ఆలోచన చేస్తారు. వాళ్ల రాతలు అలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇది మన ఖర్మ. వాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నా. పారదర్శకంగా, జ్యుడీషియల్ కమిషన్ ద్వారా కాంట్రాక్టులను ఖరారు చేసిన తర్వాత కూడా వక్రీకరిస్తూ, దురుద్దేశంతో వార్తలు రాస్తే ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరకు వెళ్లి, శిక్షించమని గట్టిగా అడుగుతాం. అమ్మానాన్నకు పాదాభివందనం... చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు పేరుపేరున ఇక్కడకు వచ్చిన, ఇక్కడికి రాలేకపోయిన, ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి మరోసారి పేరుపేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ, మీ గ్రామంలో అక్షరాల పది మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తున్నామని అందరికీ హామీ ఇస్తున్నా. అక్టోబర్ 2, గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమం చేపట్టి, మరో 1.60 లక్షల ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి తెస్తాం. మీ పిల్లలే పది మంది మీ గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తారు. మీకు పెన్షన్, రేషన్ కార్డు, ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నవరత్నాల్లోని ఏ పథకమైనా, ఏది కావాలన్నా.. మీరు చెయ్యాల్సిందల్లా గ్రామ సెక్రటేరియట్కు వెళ్లి అప్లికేషన్ పెట్టండి. దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే మీకు మంజూరయ్యేలా చేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరిగా లంచాలుండవు. ఇప్పటి వరకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా మరేది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలివ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచమనేదే లేకుండా, రికమండేషన్కు తావు లేకుండా ఏ ఒక్కరికైనా ఏ అవసరం ఉన్నా, 72 గంటల్లో మంజూరయ్యేలా చేస్తామని సీఎంగా హామీ ఇస్తున్నాను. గ్రామ వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై పని చేస్తారు. నవరత్నాలతో పాటు, ప్రతి ప్రభుత్వ పథకం లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా నేరుగా మీ ఇంటికొచ్చేలా డోర్ డెలివరీ చేస్తారు. ఇదొక్కటే కాదు.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటీ తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను. కాంట్రాక్టుల్లో అవినీతి నిగ్గు తేలుస్తాం ఈ రాష్ట్రంలో అవినీతి, వివక్ష లేని స్వచ్ఛమైన పాలన అందించేందుకు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాను. ఇందులో భాగంగా ఏయే కాంట్రాక్టుల్లో, ఏయే పనుల్లో అవినీతి జరిగిందో వాటిని పూర్తిగా రద్దుచేస్తాం. గతంలో చేసిన ట్రైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండీషన్స్ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేలా అవకాశమిస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొస్తాం. అంతేకాదు.. ఇంకో ఉదాహరణ. కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చేస్తూ యూనిట్ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, మీ ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యడంతోనే ఆగకుండా పారదర్శకతను తీసుకొస్తాం. ఇందులో భాగంగా రేపో మర్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి, ఓ హైకోర్టు జడ్జిని ఇవ్వమని కోరతాం. ఆయన ఆధ్వర్యంలో, ఆయన చైర్మన్గా జ్యుడీషియల్ కమిషన్ను నియమిస్తాం. టెండర్లకు పోకముందు, ప్రతి కాంట్రాక్టును జ్యుడీషియల్ కమిషన్కు పంపి, ఆ హైకోర్టు జడ్జి చేసే ఏ సూచనలు, మార్పుల మేరకు కాంట్రాక్టులకు పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా టెండర్లు పిలుస్తాం. -
శుభారంభం
అనవసర ఆడంబరాలు, ఆర్భాటాలు లేవు... గర్వాతిశయాల జాడ లేదు. వాటి స్థానంలో తొణకని ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంది. సత్సంకల్పంతో, సత్యనిష్టతో 14 నెలలపాటు తాను సాగించిన ‘ప్రజాసంకల్ప యాత్ర’లో తారసపడిన జన జీవితాల జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆ జీవితా లను మెరుగుపరిచి తీరాలన్న దృఢ సంకల్పం గుండె నిండా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుని గురువారంనాడు వేలాదిమంది సమక్షంలో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆద్యంతమూ ఆయన పరిపాలన ఎలా ఉండబోతున్నదో రేఖామాత్రంగా ఆవిష్కరిం చింది. సంక్షిప్తంగా సాగిన ఆ ప్రసంగంలో అతిశయోక్తులు, స్వోత్కర్షలు లేవు. ఎక్కడా తడబాటు లేదు. చెప్పదల్చుకున్న అంశాలను సూటిగా, స్పష్టంగా, అందరికీ అవగాహన కలిగే రీతిలో చెప్పడం ఈ ప్రసంగమంతా కనబడుతుంది. అంతేకాదు... పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విధంగానే నవరత్నాల్లో ఒకటైన అవ్వాతాతల పింఛన్ పెంచుతూ తొలి సంతకం చేశారు. 341 రోజులపాటు 3,684 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని లక్షలాదిమంది ప్రజలు నిత్యం నిశితంగా గమనించారు. తమ మధ్యే నివాసం ఉంటూ, తమతోనే సహవాసం చేస్తూ, తమ వెతలను వింటూ ‘నేనున్నా’నంటూ ఆయన ఇచ్చిన భరోసాను గుండెల్లో దాచు కున్నారు. తమను కష్టాలపాలు చేస్తున్న తెలుగుదేశం పాలన ఎప్పుడు ముగిసిపోతుందా అని నిరీక్షించారు. ఆ ముహూర్తం ఆగమించిన వేళ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం కోట్లాదిమంది ఆశ లకూ, ఆకాంక్షలకూ అద్దం పట్టింది. వారి నమ్మకాన్ని వందల రెట్లు పెంచింది. రాష్ట్రం ఎదుర్కొం టున్న సమస్యలపై ఆయనకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నదని, వాటిని పరిష్కరించడానికి అనుసరించాల్సిన వ్యూహం, దాని అమలుకు అవసరమైన పట్టుదల ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం మాత్రమే కాదు... ఖండాంతరాల్లో ఉంటూ భిన్న మాధ్యమాల ద్వారా ఆయన ప్రసంగాన్ని విన్న తెలుగువాళ్లంతా అవగాహన చేసుకున్నారు. అధికార చేలాంచలాలు అందుకున్న మరుక్షణం చేసిన వాగ్దానాలేమిటో మరిచిన పాలకుణ్ణి ప్రత్యక్షంగా చూసినవారికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. కానీ చెప్పినవి మాత్రమే కాదు... చెప్పనివీ చేసి చూపించిన అపర భగీరథుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వార సుడాయన. కనుకనే వైఎస్సార్ కాంగ్రెస్ వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రమా ణస్వీకార సభా వేదికపై చూపుతూ... దీన్ని తాను ఖురాన్లా, బైబిల్లా, భగవద్గీతలా భావించి, అందులోని వాగ్దానాలన్నిటినీ నెరవేర్చడానికి త్రికరణశుద్ధిగా పనిచేస్తానని జగన్ చెప్పగలిగారు. అంతేకాదు, అయిదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతం చేయడానికి తీసుకోబోయే చర్యలేమిటో స్థూలంగా తెలియజేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ప్రవేశపెడతామని, అక్రమాలకూ, అవినీతికీ ఆస్కారం లేనివిధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవిస్తామని తెలిపారు. ఈ నిర్ణయం ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తుందో సుస్పష్టమే. ఇది అమలైతే ఖజానాకు గండికొట్టే అక్రమార్కుల ఆటలిక సాగవు. తెలుగుదేశం పాలనలో అస్మదీయ కాంట్రాక్టర్లు ఓ వెలుగు వెలిగారు. కోటరీగా ఏర్పడి అన్యు లెవరూ టెండర్ల దరిదాపుల్లోకి రాకుండా చూశారు. ఎవరైనా సాహసించి టెండర్లలో పాల్గొంటే వారిని ‘బ్లాక్ లిస్టు’లో చేర్చారు. కొన్ని సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిన పనుల్ని సైతం ‘అయినవాళ్ల’ కోసం నిరవధికంగా ఆపారు. ముఖ్యంగా నిర్మాణ పనులకు సంబం ధించిన ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయలు కైంకర్యం చేయడం ఒక సంస్కృతిగా మారింది. నేతలకు ముడుపులు చెల్లిస్తే తప్ప పనులు ప్రారంభించడం దుర్లభమయ్యేలా చేశారు. ఈ బాధ తట్టుకోలేక కొందరు కాంట్రాక్టర్లు పరారైన సందర్భాలూ ఉన్నాయి. అసలు టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడం, కమీషన్లు దండుకోవడం ఒక కళగా అభివృద్ధి చేశారు. ఏపీలో అధికార పార్టీ కన్నుపడని, వారికి కాసులు రాల్చని కాంట్రాక్టు పనులంటూ లేవు. ఈ అవినీతి మహమ్మారిని రూపుమాపుతానని హామీ ఇవ్వడం సాధారణ విషయం కాదు. నిండైన ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడికే, సాహసోపేతంగా అడుగేయగల నాయ కుడికే అది సాధ్యం. ‘సాహసమున పనులు సమకూరు ధరలోన...’ అని వేమన ఎప్పుడో చెప్పాడు. ప్రభుత్వ పథకాలు నేరుగా జనం ముంగిట్లోకి తీసుకెళ్లేందుకు గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలం టీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4లక్షలమంది వాలంటీర్లను నియమిస్తామని చెప్పడం పేద జనానికి ఊరటనిచ్చే అంశం. తమకు రావాల్సినవాటి కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వక తప్పని దుస్థితిలో పడుతున్న లక్షలాదిమంది నిరుపేదలకు ఇదొక వరం. అలాగే ప్రభుత్వ పథకాలు, సేవలు సరిగా అందని పక్షంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించాలని, గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించడం హర్షించదగ్గ నిర్ణయాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇరు రాష్ట్రాలూ కలిసిమెలిసి ముందుకు సాగుదామని, పరస్పరం సహకరించుకుందామని పిలుపునివ్వడం శుభసూచికం. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆయనా, డీఎంకే అధినేత స్టాలిన్ ఆకాంక్షించడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న విధంగా రాబోయే రోజుల్లో సమర్థవంతమైన, నిష్కళంకమైన పాలన అందు తుందన్న భరోసాను జగన్మోహన్రెడ్డి ప్రసంగం కల్పించింది. -
మన కాలం వీరుడు వైఎస్ జగన్
ఎవరికైనా 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతి కలిగించి ఉంటే, వాళ్ళు క్షేత్రస్థాయి వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నారని నికార్సుగా చెప్పవచ్చు. ఏపీ ఎన్నికల ఫలితాలు అర్థం కావాలంటే, వాటిని 2011 నాటి కడప పార్లమెంట్ ఉపఎన్నిక నుంచి చూడాల్సి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా రాజీనామా చేసి, స్వంత పార్టీ పెట్టి పోటీ చేసి గెలిచిన ఎన్నిక అది. అప్పుడు వైఎస్సార్సీపీకి 67.5 శాతం ఓట్లు పోలైతే, కాంగ్రెస్కు 14.22 శాతం, టీడీపీకి 12.57 శాతం పోలైనాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 44.47 శాతం ఓట్లు రాగా, టీడీపీ, బీజేపీ, జనసేన మూడుపార్టీలు కలిపి 46.3 శాతం పొందాయి. రెండింటి మధ్య తేడా కేవలం 2.6 శాతం. అయితే అప్పటి నుంచి ఒకే తీరుగా నిలకడగా ఉన్ననాయకుడు జగన్ అయితే, పలు రాజకీయ విన్యాసాలతో ఉనికిని నిలబెట్టుకున్నది చంద్రబాబు. ఇద్దరూ తలపడిన ఈ ‘ఎరీనా’ మీద వీళ్ళ గత ‘ట్రాక్ రికార్డ్’ గాని, గడచిన ఐదేళ్ళ పరిపాలనగాని చూసాక, ఈ ఫలితాలు ఇలా కాకుండా ఇంకెలా వుంటాయి? ప్రయాణం, ముందుకెళ్ళాలి కానీ ముందు ఉన్నదేంటో తెలియని మంచులో ప్రయాణం. గడచిన ఐదేళ్ళలో టీడీపీలో అందరినీ అటువంటి కళ్ళకు గంతలు కట్టుకున్న స్థితిలో ఉంచడం, ఆపార్టీ అధినేత అసాధారణ ‘మేనేజ్మెంట్’ నైపుణ్య విజయం! ఇది– ‘స్మోక్ స్క్రీన్’ స్ట్రాటజీ. ఇందులో ముందుగా వాస్తవ పరిస్థితుల్ని బయటకు కనిపించకుండా వాటిని వెనక్కి నెట్టి, దాని ముందు పై నుంచి కిందికి నాలుగు వైపులా కృత్రిమంగా ఒక దట్టమైన ‘పొగ తెర’ను దించి, దాని వెనుకున్న నిజస్థితిని దాచేస్తారు. ఇక రెండవ దశలో ఆ ‘పొగ తెర’ ముందు క్షణం తీరిక లేనట్టుగా, 24/7 ఎప్పుడూ ఏదో ఒక ‘యాక్టివిటీ’ లైవ్లో నడిపిస్తారు. అది దోమలపై యుద్ధం, రెయిన్ గన్స్తో పంటలు కాపాడ్డం, తుఫానుకు ఎదురెళ్ళడం, భాగస్వామ్య సదస్సులు, అమరావతి మీద ఎయిర్ షో లేదా నది మీద ‘రెగట్టా’ పోటీలు, ఇలా ఏదైనా కావొచ్చు... ఏదీ లేదూ జనాన్ని పొలోమని పోలవరం పంపడం, ఏడాది పొడుగునా ఇలా ‘పొగ’ను మాత్రం దట్టంగా ఉంచాలి. ఈ వరసలో చివరిగా ఎన్నికల నోటిఫికేషన్ ముందు, ఈ ‘పొగతెర’ మీద దించిన మరో మాయా జలతారు ‘పసుపు–కుంకుమ’! గ్రామీణ మహిళల చేతుల్లో పచ్చనోట్లు పడితే చాలు, వాళ్ల అంతరంగాల్లో ఏముందీ మనకక్కరలేదు, ఇదీ బాబు లెక్క. ఇంత గజిబిజిని ఇక్కడ ముందునుంచి ఇంత చిక్కగా అల్లి మరీ ఉంచారు కనుకనే, నిజంగానే ఇది ‘టఫ్ ఫైట్’ అనిపించింది. అందుకే 40 రోజులు పైగా ‘విశ్లేషకులు’ ఏపీ గురించి ఇంతగా ఇక్కడ బుర్రలు బద్దలు చేసుకుంది. ఈ పొగతెరను చీల్చుకుని దాని వెనక్కి వాస్తవం వద్దకు ఒక్కొక్క పొర తొలగించుకుంటూ వెళ్లి, అస్సలు అక్కడున్నది ఏమిటో చూడ్డానికి చేసిన ప్రయత్నమే ఈ సర్వే నివేదికలు! ఇంతకీ అక్కడేముంది? అక్కడ వైఎస్సార్ ఉన్నారు! ఆయన ఆర్థిక సంస్కరణల సీఈవో చంద్రబాబు వేగానికి, ‘ఇందిరమ్మ రాజ్యం’ నినాదంతో 2004లో ‘బ్రేకులు’ వేసిన యోధుడు. ఏపీలో 2004లో జరిగిన ఈ మార్పును మరో ఎన్నికగా మాత్రమే చూస్తే, దేశ రాజకీయాల్లో ‘వైఎస్ ఫ్యాక్టర్’ అర్థం కాదు. బాబు ‘వేగం’ ఒక విపత్తుగా పరిణమించి, వ్యవస్థ మొత్తం కూలబడనున్న కాలమది. సాగుబడి, వైద్యం, విద్య వంటి కీలక రంగాలు కునారిల్లి, పేద దిగువ మధ్యతరగతి జనం మార్పు కోరుతున్న రోజులు. అటువంటి సంధి కాలానికి అవసరమైన ‘హృదయాన్ని’ పరిపాలనకు జోడించి; దానికి ‘ఇందిర’ పేరు పెట్టి, వై.ఎస్ ముందుకు తీసుకువెళ్ళాడు. సీఎం అయిన వెంటనే రైతు వెతల మీద సమగ్ర అధ్యయనానికి డిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొ. జయతీ ఘోష్ కమిటీని వేసిన దార్శనికుడు వై.ఎస్. ఇలా దేశానికి ఈ సంధి కాలంలో జరగాల్సిన కాయకల్ప చికిత్సను నాడి పట్టి మరీ గుర్తించిన నాయకుడు వైఎస్! అందుకే అప్పట్లో సోనియాగాంధీ, మన్మోహన్, తమ సభల్లో తరచూ, ‘ఏ.పి. మోడల్’ అంటూ వుండేవారు. ప్రధాని అధికారిక ప్రసంగాలలో ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ, అప్పట్లో వైఎస్సార్ ఏపీని కాంగ్రెస్ తరుపున దేశానికి ఒక ‘షో కేస్’ గా చూపించుకునేవారు! సహజంగా అటువంటి కుటుంబ అంశం ఉన్న జగన్మోహన్రెడ్డికి తన తండ్రి పేరున్న పార్టీ ద్వారా ఈరోజు చంద్రబాబు వంటి ఒక ‘పొలిటికల్ మేనేజర్’ని ఏకపక్షంగా ఓడించటం అనేది మరీ విశేషం కాకపోవచ్చు. నిజానికి ప్రస్తుతం జగన్ సాధించిన గెలుపు వైఎస్సార్ ఆధ్వర్యంలో జరిగిన 2004, 2009 ఎన్నికలకు మరో మెరుగైన పొడిగింపు మాత్రమే. అయితే, కొత్తగా ఇప్పుడు కలుపుకోవల్సినది జగన్ పాదయాత్రలో తనకోసం కట్టుకున్న– మమతల కోట! ఈ కోణంలో చూస్తే జగన్మోహన్రెడ్డి కాలం సృష్టించిన నాయకుడు. వ్యాసకర్త : జాన్సన్ చోరగుడి, అభివృద్ధి–సామాజిక విశ్లేషకులు -
మానవీయతకు మహావిజయం
అపూర్వ విజయం అంటే నిర్వచనం ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలలో కీ.శే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని గెలిపించుకున్న తీరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకబిగిన సంవత్సరం పైగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, లక్షలాదిమంది వివిధ వర్గాల, సామాజిక నేపథ్యాల ప్రజానీకాన్ని, మైనారిటీలను, మహిళలను, అణగారిన ప్రజానీకాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే వైవిధ్యభరితమైన ఆంధ్రప్రదేశ్ సర్వస్వాన్ని ఆకళింపు చేసుకున్న నేతగానే కాదు వారిలో ఒకరిగా తాము విశ్వసింపదగిన తమ ఆత్మీయుడిగా వైఎస్ జగన్ ఎదిగిన తీరు ప్రశంసనీయం. కీ.శే. వైఎస్సార్ తమ పాదయాత్ర అనంతరం – ‘నాలో కోప నరం లేదు తెగిపోయింది’ అనిచెప్పిట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఈ పాదయాత్ర అనంతరం ఒక ఉత్తమ మానవుడిగా పరిణతి చెందడం అందరూ గమనించే ఉంటారు. ఈ విజయంలో ఆయన హీరో అయినా హీరో ఒక్కడే సర్వం సాధించలేడు. అతడు దిశా నిర్దేశం చేసి ఈ ప్రజాభ్యున్నతి మహా యజ్ఞంలో తొలి రుత్వికుడుగా నిలవగలడు. జగన్ అది చేశారు కానీ ఈ మేటి విజయంలో వైఎస్సార్ సహధర్మచారిణి శ్రీమతి విజయలక్ష్మి స్ఫూర్తిదాయకమైన పాత్ర అనిర్వచనీయం. ఒక వంక తన ప్రియతముడైన భర్త, తన మనిషి లేని లోటుతో కన్నీరు చిప్పిల్లుతుం డగా, మరో కంట తన కొడుకు తన భర్త అడుగుజాడల్లో ఆ రీతిగానే ప్రజారాధన చూరగొనే విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా ధీశాలి అవుతున్నందుకు ఆనంద భాష్పాలతో ఉప్పొంగుతుండగా ఆమె అందించిన ఆశీర్వాదాలు సాటిలేనివి. కనిపాలిచ్చి పెంచి ఇంతటి వాడిని చేసిన, తన ఆశాజ్యోతి జగన్పై హత్యా ప్రయత్నం ఆమెనెంతగా కలిచివేసిందో! అయినా తనను తాను నిభాయించుకుని తెలుగుజాతి వీరవనితల సాటిగా, స్వయంగా ఎన్నికల రణప్రవేశం చేసి ప్రజల మధ్యకు వచ్చి ఆమె చేసిన ప్రసంగం ఎంతమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిందో! అలాగే ప్రజాక్షేత్రంలో తన అన్నకు తోబుట్టువుగా, తనకంటూ నెలకొల్పుకున్న ప్రత్యేక వ్యక్తిత్వంతో తన అన్న జగన్కి అండగా నిలిచిన సోదరి షర్మిల కృషి, పట్టుదలను అభినందించడానికి సాధారణ పదాలు సరిపోవు. ఆమె ‘బై బై బాబు’ అంటూ బాబుకు వీడ్కోలు నిచ్చినట్లు చేసిన నినాదం జనన్నినాదమయింది. అలాగే జగన్ సతీమణి శ్రీమతి భారతి ఎంతో బాధ్యతగల వ్యక్తి. నిండుకుండలా తెరచాటుగా ఉంటూనే సూత్రధారిగా ప్రదర్శించిన హుందాతనాన్ని కూడా మరవలేం. ఈ మొత్తం క్రమంలో సమాజంలో కుటుంబ వ్యవస్థకు కూడా వైఎస్ కుటుంబం మచ్చుతునకలా నిలిచింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్పై ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలే హత్యాప్రయత్నం చేయించి ఉంటారన్నట్లు మాట్లాడి తమ అల్పత్వాన్ని ప్రదర్శించిన తెలుగుదేశం నేతలను తల్చుకోవడం కూడా ప్రస్తుత సందర్భంలో తగని పని అయినా, వాళ్ల వ్యాఖ్యల్లోని కుసంస్కారానికి క్షోభించిన వారిలో ఒకరిగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నందుకు క్షమార్హుడను. కానీ ఒక ఔన్నత్యాన్ని కొనియాడవలసినప్పుడు తద్భిన్నమైన అధోగతిని సరిపోల్చడం ముఖ్యమే అవుతుంది. అందుకే మానవత్వం మూర్తీభవించిన కుటుంబ బాంధవ్య ప్రస్తావనలో ఈ రకమైన సరిపోల్చడాలు తప్పవు. పైగా టీడీపీ నేతలకు తమ అధినేత తన తోబుట్టువుల పట్ల వ్యవహరించిన తీరు గురించి తెలిసే ఉంటుంది.!! జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశం. తెలుగు ప్రజలపట్ల ముఖ్యంగా అణగారిన పేదల గుండెల్లో స్థిరనివాసం ఏర్పర్చుకున్న తన కన్నతండ్రి వారిపట్ల చూపిన ఆలన, పాలన! అది ఒక ఆదర్శంగా నిలుస్తుంది. మరోవంక, ఎలా అమానవీయంగా రాజకీయం చేయరాదో, ఎలా ప్రజలను దిగజార్చేలా పాలన చేయరాదో, చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో జగన్ చాలా స్పష్టంగా చూశారు. ఆవిధంగా తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టే నాటికి ప్రజానేతగా ఉంటూ వారిలో ఒకరిగా నిలుస్తూ, ‘జగన్ తమవాడు, తమకు ప్రీతిపాత్రమైన నాయకుడు, తమ కష్టసుఖాలనెరిగి తమకు వెన్నుదన్నుగా నిలిచే తమ ప్రాణస్నేహితుడు’ అనుకునే రీతిలో తనను తాను రోజురోజుకు మరింత చేరువగా మలుచుకోగల ఆదర్శమూ ఉంది. అలాగే కేవలం అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా అందుకు ఎన్ని అసత్య వాగ్దానాలు చేసినా ఎంతటి అహంకారంతో వ్యవహరించినా, ఎంత అవినీతి అక్రమాలకు ఒడిగట్టినా తప్పులేదు అన్నట్లు వ్యవహరిస్తే అది తాత్కాలిక భోగమే కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించలేని అమాయకులు కాదు. తీవ్రమైన తప్పిదాలకు తీవ్రమైన శిక్ష విధించే తీరుతారు అన్నది 2019 ఎన్నికలలో చంద్రబాబుకు ఓటమిరూపంలో సాకార ఉదాహరణగా ఉంది. జగన్కు నిరంతర విద్యార్థి లాంటి అసక్తి, ప్రజానుకూలంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరించగల శక్తీ ఉన్నాయని తాను ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్న పథకాలు ఒక్క ‘మెతుకు’లా కనబడుతుంది. కనుక ఇక 2014 నుంచి సాగిన చంద్రబాబు పీడకలవంటి పాలన తిరిగి మన ప్రజలు ఇకపై ఎన్నడూ అనుభవింపకుండా పాలనా వ్యవస్థ భ్రష్టత్వాన్ని మార్చవలసిన బాధ్యత కూడా వైఎస్ జగన్పై ఉంది. ఒక పార్టీ అధినేత ప్రవర్తనే సహజంగా తరతమ స్థాయిల్లో ఆ పార్టీ వివిధ స్థాయిల్లోని నేతల్లో ప్రతిబింబిస్తుంది. తమ దుర్భర జీవితాలను గూర్చి విన్నవించుకునేందుకు వచ్చిన వారిని వారు నిరుపేద మత్స్యకార్మికులా, మహిళలా అని కూడా చూడకుండా చూపుడు వేలు చూపించి ‘ఏం తమాషాగా ఉందా? అంతు చూస్తాను ఏమనుకుంటున్నారో’ అని బెదిరించే పాలకుడికి ‘అసలు వీళ్లను ఇక్కడి దాకా రానిచ్చిందెవరు?’ అని తన కింది స్థాయి అధికార బృందాన్ని ఆదేశించే పాలకుడికి అలాంటి అధికార అహంకారత్వం మూర్తీభవించిన అనుచరగణమే ఉంటుంది! అందుకే ఈ అయిదేళ్లలో మన రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అలాంటి పాలకపక్ష నేతలను చూశాం! అసలు శాసన సభాపతిగా ఉండిన కోడెల శివప్రసాద్ ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్లోకి మందీ మార్బలంతో వెళ్లి పోలింగ్ బూత్ను ఆక్రమించుకుని రిగ్గింగ్కు పాల్పడ ప్రయత్నిస్తే, జనం తిరగబడేసరికి తన చొక్కా తానే చింపుకుని తన వైద్యవిద్య ద్వారా నేర్చుకున్న స్పృహ కోల్పోయిన రోగిలా నటించిన కోడెల తెలుగుదేశం పార్టీ వరిష్ట నేతల్లో ఒకరే! అక్రమ ఇసుక రవాణాను తన విద్యుక్త ధర్మంగా అడ్డుకో ప్రయత్నించిన ఒక మహిళా తహసీల్దారును జుట్టుపట్టుకుని బిరబిరా ఈడ్చేసి ఆమె విలపిస్తూ ఉంటే వికటాట్టహాసం చేసిన మహానుభావుడూ తెలుగుదేశం పార్టీ నేతే! కీచక ప్రవృత్తితో వ్యవహరించిన అధికార పార్టీ అనుయాయులు, అప్పులిచ్చి అవసరానికి అప్పు తీసుకున్న కుటుంబాలకు కుటుంబాలనే అధోగతి పాల్జేసిన సెక్స్ మనీ రాకెట్ కుంభకోణాలలో చిక్కి కూడా ప్రభుత్వ అండతో తప్పించుకుతిరిగినవారూ చంద్రబాబు టీడీపీ స్థానిక నాయకులే.. ఇలా ఎన్నని చెప్పుకోగలం? వీరందరి ప్రవర్తనతో విసిగి వేసారి, అధికార దర్పం ముందు నోరెత్తలేని అమాయకులెందరో ఉన్నారు. అలాంటి దుర్మార్గాలకు పాల్పడే తన పార్టీవారిని అదుపులో ఉంచదలచని, ఉంచలేని నాయకత్వానికి చిహ్నంగా బాబు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఇకపై ఎలా ప్రవర్తించకూడదు అన్నదానికి ఇలాంటివి ప్రత్యక్ష రూపాలు! కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక మంచిమనిషి నాతో ఇలా అన్నాడు. ‘‘మా కులాన్ని ప్రజానీకాన్నుంచి వేరు చేసి మాకు అప్రతిష్ట తెచ్చింది మా చంద్రబాబేనండీ, నిజానికి అవకాశాన్ని అందుకుని నూతనత్వాన్ని స్వీకరించి, నిరంతరం కృషిచేసే వాళ్లు ఎందరో మాలో ఉన్నారు. కానీ తాను చేరదీసిన కొందరు మావాళ్ల ప్రవర్తనను అదుపులో పెట్టకపోగా అండగానిలిచి ప్రజలలో మా పట్ల వ్యతిరేకత తెచ్చింది ఈ చంద్రబాబేనండీ!’’ అని కళ్లొత్తుకుంటూ చెప్పాడాయన. అలాగే తనకు మందీమార్బలం కావాలనీ, నీరు–చెట్టు, జన్మభూమి కమిటీల వంటివాటితో చంద్రబాబు మూటగట్టుకున్న ముల్లె ఏమో కానీ, సంపాదించుకున్న అప్రతిష్ట ఎంత? పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు వరప్రదాయిని అంటూనే పోలవరాన్ని తమ పార్టీకి, తనకు, తమ నేతలకు అక్షయపాత్రలుగా అవినీతి ధనరాసులు చేకూర్చే ‘వరం’గా మార్చిందీ చంద్రబాబే. దీనికోసమే ఆయన కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం తన అధీనంలోకి ఒప్పించి, మన రైతులను నొప్పించి, తన అధీనంలోకి తెచ్చుకున్నాడన్న విషయం ఆయన అనుయాయులైన అమాత్యులు, కాంట్రాక్టర్ నేతల వల్లనే బయటపడింది. రాజధాని నిర్మాణం గురించి చెప్పటం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లే! అడుగడుగునా అవినీతే, అసమర్థతే! మూడు పంటలు పండే ఆ ప్రాంతంలో భూమాతను చెరబట్టి ఆ పేరుతో వేలాది ఎకరాలు, నాడు హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి చంకన పెట్టుకున్నట్లే తాను, తన అనుయాయులు, వ్యవహరించిన తీరు, ఆ ప్రాంత ప్రజలకు గుర్తున్నది. అందుకే సింగపూర్లా మారనుందని భ్రమింపజేసిన ఆ ప్రాంత ప్రజలే మంగళగిరిలో బాబు సుపుత్రుడు లోకేశ్ని ఓడించారు. చంద్రబాబు ఏమాత్రం అర్హత, ప్రజా ఉద్యమానుభవం లేని లోకేశ్ని మంత్రివర్గమేదో తన తాతముత్తాతల జాగీరు అన్నట్లు, దొడ్డిదారిన ఎంఎల్సీని చేసి అంతటితో ఆగకుండా, అతడికి మంత్రివర్గంలో స్థానం కూడా ఇచ్చారు. లోకేశ్ అప్రకటిత, తదుపరి ముఖ్యమంత్రి అన్నట్లుగా ఆ తండ్రీ కొడుకులు ప్రవర్తించారు. ఫలితం అందరం చూశాం. అప్రదిష్ట ఇద్దరూ మూటగట్టుకున్నారు. కోట్లు ఖర్చుపెట్టినా కొడుకు లోకేశ్ మంగళగిరిలో గెలవలేదు! ఈ సందర్భంగా నేను మా కమ్యూనిస్టు పార్టీలకు, వారి కార్యకర్తలకు ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు మించిన మార్గం లేదు. ప్రజాసేవ అంటే కష్టాలలో ఉన్న ప్రజలను వస్తురీత్యా ఆదుకోవడం మాత్రమే కాదు. సర్వ సృష్టి నిర్మాతలు, భవితవ్య నిర్ణేతలు రెక్కాడినా డొక్కాడని ఈ ప్రజలే! దళితులూ, మహిళలూ, మైనారిటీలూ తదితరులకు ఎక్కడ ఏ రూపంలో అన్యా యం జరిగినా అక్కడ కమ్యూనిస్టులు వారికి అండగా నిలవాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటే వాటికి అండగా ఉండటం, ప్రజావ్యతిరేక అంశాలు పాలనలో దొర్లితే ప్రజా ఉద్యమాలతో అవి ప్రభుత్వం దృష్టికి వచ్చేలా చేయాలి. ఇలాంటి ప్రజా ఉద్యమాలే కమ్యూనిస్టు పార్టీలకు ఊపిరి. అంతే తప్ప పాలనను మార్చే పేరుతో చంద్రబాబు, పవన్ వంటి నిబద్ధత లేని వారితో ‘ఐక్యవేదిక’లు, ‘ఐక్య సంఘటన’లు వంటి అడ్డదారులు తొక్కడం వంటివి కమ్యూనిస్టులను గమ్యాన్ని చేర్చలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీ అణగారిన ప్రజలందరి పార్టీ. అదే రీతిలో పునరంకితమై, ప్రాథమిక స్థాయి నుంచి ఆరంభించడం అత్యవసరం. ఏ విధమైన న్యూనతా భావానికి గురికాకుండా సృజనాత్మకతతో, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో కమ్యూనిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆశిద్దాం. వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్ , మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’’ అంటూ తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారాయన. ప్రస్తుతానికి వైఎస్ జగన్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటాన్ని చూడాలనే కోరికతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకునే ముందు వైఎస్ జగన్ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 11.54 నిమిషాలకు తాడేపల్లిలోని తన స్వగృహంనుంచి విజయవాడకు బయలుదేరివచ్చారు. ఆయన వెంట వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, అనిల్ సభా ప్రాంగణానికి వచ్చారు. 12.14 నిమిషాలకు పూలతో సుందరంగా అలంకరించిన ఓ ప్రత్యేక వాహనంలో వైఎస్ జగన్ అక్కడి జనాలకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. అనంతరం ఆయన స్టేజిమీదకు చేరుకుని మరోసారి ప్రజలకు అభివాదం చేయగా.. ఒక్కసారిగా ప్రజలు చేసిన కరతాళధ్వనులతో స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది. ప్రమాణం స్వీకారానికి కొద్ది క్షణాల ముందు జాతీయ గీతాలాపన జరిగింది. ప్రమాణ స్వీకార సమయంలో ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’’ అని ఆయన అనగానే స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రమాణస్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు జరిగాయి. నూతన ముఖ్యమంత్రికి మతపెద్దలు ఆశీర్వచనాలు ఇచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై వైఎస్ జగన్ మొదటి సంతకం వైఎస్ జగన్కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం వైఎస్ జగన్ సీఎం కావాలని పదేళ్లుగా.. -
ఇంతై.. ఇంతింతై.. వటుడింతై
వైఎస్ జగన్.. తెలుగు నాట ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ఇది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి యావత్ భారతదేశం దృష్టినీ ఒక్కసారిగా తన వైపునకు తిప్పుకున్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా తొలి నుంచీ సామాన్యుడిగానే మెలిగిన ఈ 46 ఏళ్ల నవయువకుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించి పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుని ఎన్నికల పోరాటంలో మట్టికరిపించి విజేతగా నిలిచిన జగన్ పడినన్ని కష్టాలు రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే మరెవరూ పడి ఉండరు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు అణగదొక్కాలని చూసిన ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్ మరణంతో తీవ్ర ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నా.. ‘ఇంతై.. ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా రోజు రోజుకూ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత బలీయమైన శక్తిగా అవతరించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయగా, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇలా తండ్రీకొడుకులు తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రజలకు ఎలాంటి వివక్షా లేని సుపరిపాలన అందించే దిశగా జగన్ తన ప్రస్థానం మొదలుపెట్టబోతున్నారు. ప్రజాసంక్షేమ పాలనను అందించి అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయుడినని నిరూపించుకోవాలనే తపనతో అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానున్న వైఎస్ జగన్ జీవిత విశేషాలివి.. – సాక్షి, అమరావతి మే 17, 2009 రాజకీయ అరంగేట్రంలోనే కాంగ్రెస్ తరఫున కడప లోక్సభా స్థానం నుంచి 1,78,846 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. (అంతకు ముందే 2004 ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాలు, కాంగ్రెస్ తరఫున తండ్రి వైఎస్కు చేదోడువాదోడుగా ప్రచారం) ఆగస్టు 31, 2009 ఫైనాన్స్ కమిటీలో సభ్యుడు జూలై 13, 2011 కడప లోక్ సభ ఉప ఎన్నికలో 5,43,053 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయదుందుభి. వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీతో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఘనవిజయం. మే 16, 2014 పులివెందుల నుంచి 75,243 ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపు మే 23, 2019 పులివెందుల నియోజకవర్గం నుంచి 90,110 ఓట్ల ఆధిక్యతతో గెలుపు ముఖ్య ఘట్టాలు ♦ సెప్టెంబర్ 2, 2009 : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూత ♦ సెప్టెంబర్ 25, 2009 : తన తండ్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను త్వరలోనే కలుస్తానని ప్రకటించిన జగన్ ♦ డిసెంబర్ 15, 2009 : రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లోక్సభలో ప్లకార్డు చేతబట్టి సమైక్యాంధ్రకు మద్దతు ♦ ఏప్రిల్ 9, 2010 : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి తొలి విడత ఓదార్పు యాత్ర ప్రారంభం ♦ జూన్ 7, 2010 : తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అనుమతినివ్వాలని కోరిన జగన్. తిరస్కరించిన సోనియా ♦ జూలై 8, 2010 : కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్రను పునఃప్రారంభం ♦ నవంబర్ 29, 2010 : తన తల్లి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్. తాను కడప ఎంపీ పదవికి తాను, పులివెందుల ఎమ్మెల్యే పదవికి విజయమ్మ రాజీనామాలు ♦ మార్చి 11, 2011 : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సభలో పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్గా ప్రకటించిన జగన్ ♦ మార్చి 12, 2011 : ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్ ♦ జూలై 8, 2011 : ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలు ♦ ఆగస్టు 10, 2011 : జగన్ ఆస్తులు, సాక్షి పెట్టుబడులపై సీబీఐతో విచారణకు ఆదేశించిన హైకోర్టు ♦ ఆగస్టు 18, 2011 : జగన్ ఆస్తులు, సాక్షి కార్యాలయాలపై సీబీఐ దాడులు, అనేక చోట్ల సోదాలు ♦ మార్చి 31, 2012 : జగన్ ఆస్తుల కేసులో సీబీఐ చార్జిషీట్ ♦ మే 8, 2012 : సాక్షి పత్రిక, సాక్షి టీవీల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిన సీబీఐ ♦ మే 27, 2012 : ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు జగన్ను విచారించిన సీబీఐ అధికారులు రాత్రి 7.20 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు. ♦ జూన్ 15, 2012 : ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 15 అసెంబ్లీ, 1 లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధించింది. ♦ సెప్టెంబర్ 23, 2013 : జగన్కు షరతులతో కూడిన బెయిలు మంజూరు ♦ సెప్టెంబర్ 24, 2013 : జైలు విడుదల ♦ అక్టోబర్ 5, 2013 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లోటస్పాండ్లో తన నివాసం వద్ద ఆమరణ దీక్ష ♦ మే 16, 2014 : శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పరాజయం. కేవలం 1.67 శాతం ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన టీడీపీ ♦ జూన్ 20, 2014 : శాసనసభలో ప్రతిపక్ష నేతగా జగన్ను గుర్తిస్తూ స్పీకర్ ప్రకటన ♦ జనవరి 31, ఫిబ్రవరి 1, 2015 : హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా తణుకులో రెండు రోజులపాటు జగన్ రైతు దీక్ష ♦ జూన్ 3, 2015 : మంగళగిరిలో రెండు రోజులు జగన్ సమర దీక్ష. ఏడాది పాలనలో చంద్రబాబు మోసాలపై, హోదా సాధించనందుకు ప్రభుత్వ వైఖరిపై నిరసన ♦ ఆగస్టు 10, 2015 : ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఒక రోజు ధర్నా చేసిన జగన్ ♦ ఏప్రిల్ 23, 26, 2016 : ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై రాష్ట్ర గవర్నర్, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్కు ఫిర్యాదు. ♦ మే 16, 2016 : కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ఏకపక్షంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ 16, 17, 18 తేదీల్లో కర్నూలులో జగన్ దీక్ష ♦ జనవరి 26, 2017 : ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన జగన్ను చంద్రబాబు ఆదేశాల మేరకు విమానాశ్రయంలోనే అడ్డుకున్న పోలీసులు ♦ మార్చి 1, 2017 : కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద ఘోర బస్సు ప్రమాదం. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్పై దురుసుగా ప్రవర్తించిన అప్పటి కలెక్టర్ అహ్మద్బాబు. జగన్పై అక్రమ కేసులు ♦ మే 1, 2, 2017 : మద్దతు ధరలు కోరుతూ గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష ♦ జూలై 8, 2017 : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా కాలినడకన పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటానని ప్రకటించిన జగన్. ♦ నవంబర్ 6, 2017 : ఇడుపులపాయ నుండి పాదయాత్ర ప్రారంభం ♦ అక్టోబర్ 25, 2018 : వైజాగ్ ఎయిర్పోర్టులో జగన్పై హత్యాయత్నం. ♦ జనవరి 9, 2019 : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు. ♦ మే 23, 2019 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం సొంతం. -
నేడే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం
-
జగన్ అనే నేను..
సాక్షి అమరావతి : అశేష ప్రజాదరణతో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యద్భుత విజయం సాధించిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. గురువారం మధ్యా హ్నం 12.23 గంటలకు విజయవాడ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు పలువురు హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డీఎంకే అధినేత స్టాలిన్ తరలివస్తున్నారు. వైఎస్ జగన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రావాల్సి ఉన్నా.. కుటుంబంలో అత్యవసర కార్యక్రమానికి ఆయన హాజరుకావాల్సి ఉండటంతో రాలేకపోతున్నారు. మరికొంత మంది ముఖ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఇక ‘జగన్ అనే నేను..’అంటూ తమ అభిమాన నేత చెబుతుంటే చెవులారా వినాలని కోట్లాది మంది ప్రజలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పాలన (వైఎస్సార్ పాలన) మళ్లీ రాష్ట్రంలో ప్రారంభం కానుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదిహేనేళ్ల క్రితం వైఎస్ జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి మే 14న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఇపుడు, ఆయన తనయుడు జగన్ వైఎస్సార్ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ ముఖ్యమంత్రి కుమారుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తన తండ్రి వేసిన సంక్షేమ బాటలో మరో అడుగు ముందుకు వేసి రాజన్న రాజ్యం తీసుకురావాలనే తలపుతో జగన్ ఉన్నారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న ఇందిరాగాంధీ స్టేడియం నవరత్నాల్లో కీలక అంశంపై తొలి సంతకం నాడు వైఎస్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. లక్షలాది మంది రైతులు ఈ పథకం వల్ల ఇప్పటికీ లాభపడుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే నవరత్నాల్లోని ఓ అంశానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే ప్రధానమైన లక్ష్యంతో జగన్ నవరత్నాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ పథకాల్లోని అన్ని అంశాలూ తప్పకుండా అమలు చేయాలనే కృత నిశ్చయంతో ఆయన ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి విజయవాడకు చేరుకున్న గవర్నర్ వైఎస్ జగన్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా బుధవారం విజయవాడకు చేరుకున్నారు. బందరు రోడ్డులోని గేట్వే హోటల్లో బస చేసిన గవర్నర్ను వైఎస్ జగన్ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడానికి ముందు రోజు జగన్ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ధార్మిక కార్యక్రమాలతో గడిపారు. ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి కడపకు చేరుకుని అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పులివెందులలోని చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. తరువాత ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రానికి విజయవాడకు చేరుకు ని కనకదుర్గమ్మవారి దర్శనం చేసుకున్నారు. లక్షలాది మంది హాజరు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది విజయవాడకు బయలుదేరారు. అఖండ విజయం సాధించిన ఆనందంలో ఎమ్మెల్యేలు, వారి అనుచరులతో సహా తరలి వస్తున్నారు. ప్రమాణ స్వీకారం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు. 30 వేల మంది స్టేడియంలో కూర్చునే ఏర్పాట్లు చేశారు. స్టేడియానికి ఆనుకొని, వెలుపల భారీగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, జడ్జిలకు ఒక గ్యాలరీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరో గ్యాలరీని కేటాయించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఇతర వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రజలను గ్యాలరీతో పాటు స్టేడియం లోపల చుట్టూ ఉండే గ్యాలరీలోను అనుమతిస్తున్నారు. ప్రమాణస్వీకారోత్స కార్యక్రమం కోసం రెండు ప్రధాన స్టేజిలను ఏర్పాటు చేశారు. ఐదు వేల మంది పోలీసులు.. కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు వేల మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. బుధవారం గేట్వే హోటల్లో వైఎస్ జగన్ను కలిసి డీజీపీ ఆర్పీ ఠాకూర్ బందోబస్తు ఏర్పాట్లు వివరించారు. ఐదు వేల మంది పోలీసుల్లో 1,200 మందిని ట్రాఫిక్ విధులకు కేటాయించారు. గురువారం ఉదయం 6 గం టల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బందరు రోడ్డులో భారీ వాహనాలను అనుమతించడంలేదు. పట్టణంలోని 14 ప్రాంతా ల్లో రద్దీ (ప్రివెన్షన్ ఆఫ్ క్రౌడ్)ను కంట్రోల్ చేసేలా ఆయా ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు వచ్చే ఇతర భారీ వాహనాలు, ట్రాఫిక్ మళ్లింపునకు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ జిల్లా ఎస్పీలకు పలు ఆదేశాలు ఇచ్చారు. బందోబస్తు ఏర్పాట్ల సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ముస్తాబైన ప్రకాశం బ్యారేజ్ ఆరు గేట్ల ద్వారా ప్రవేశం.. ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజలకు సంబంధించి పాస్లు ఇచ్చారు. ఆరు గేట్లు ఏర్పాటు చేశారు. ఎఎ 300 మందికి, ఎ1 పాస్లు 1,000 మందికి, ఎ2 పాస్లు 2,300 మందికి, బి1 పాస్లు 500, బి2 పాస్లు 500 మందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు 300 పాస్లు, ఆహ్వానితులకు 7 వేల పాస్లు మంజూరు చేశారు. సాధారణ ప్రజలకు ఎటువంటి పాస్లు లేకుండానే లోనికి అనుమతిస్తున్నారు. స్టేడియం మెయిన్ గేటు నుంచి గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, డీఎంకే అధినేత స్టాలిన్ వస్తారు. గేటు నెంబర్ 2 నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ అధికారులు, జ్యుడీషియరీ ప్రతినిధులు, 3, 6 గేట్ల నుంచి పాస్లు ఉన్న ఆహ్వానితులను అనుమతిస్తారు. 4, 5 గేట్ల నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తారు. గేటు 2 నుంచి వీఐపీలతోపాటు మీడియా ప్రతినిధులను అనుమతిస్తారు. ఫుట్బాల్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ముఖ్యమంత్రులు, ఆర్టీఏ కమిషనర్ల వాహనాలకు పార్కింగ్ ఇచ్చారు. ఆర్అండ్బి ఆఫీసు ప్రాంతంలో వీఐపీల వాహనాలకు, పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ప్రత్యేక ఆహ్వానితుల వాహనాలకు, బిషప్ అజరయ్య స్కూల్, స్టేట్ గెస్ట్హౌస్, సీఎస్ఐ చర్చి ప్రాంతాల్లో అధికారులు, మీడియా వాహనాల పార్కింగ్కు కేటాయించారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ, సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ మైదానాల్లో సాధారణ ప్రజల వాహనాలకు పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. తరలిరానున్న ప్రముఖులు.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డీఎంకే అధినేత స్టాలిన్తో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. కేసీఆర్ విమానంలో గురువారం ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి గేట్వే హోటల్కు వచ్చి 12.08 గంటలకు స్టేడియానికి వెళ్తారు. కార్యక్రమం ముగిశాక ఇక్కడి నుంచే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. స్టాలిన్ గురువారం ఉదయం విజయవాడ రానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ వస్తారని భావిస్తున్నప్పటికీ బుధవారం పొద్దుపోయే వరకూ ఆయన పర్యటన ఖరారు కాలేదు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎంపీ, దివంగత వైఎస్సార్ ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు హాజరవుతున్నారు. రాష్ట్ర బీజేపీ తరఫున ఒక ప్రతినిధి వస్తున్నారు. ఢిల్లీలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఉన్నందున ఆ పార్టీ నేతలంతా తరలి వెళుతున్నారు. ఇక స్టేడియంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని, మరో వేదికపై గవర్నర్ నరసింహన్, కేసీఆర్, స్టాలిన్, వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఆసీనులవుతారని ఏర్పాట్లు పర్యవేక్షించిన ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం మీడియాకు వెల్లడించారు. జగన్కు మమత శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ ఆమె ట్విట్టర్లో తన సందేశాన్ని బుధవారం పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ పాలన విజయవంతం కావాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వైఎస్సా ర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున శుభాకాంక్షలు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వైఎస్ జగన్ నన్ను కూడా ఆహ్వానించారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ జగన్ తన పరిపాలన కొనసాగించాలని.. రాష్ట్రంలో విజయవంతంగా ఆయన పాలన సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. – సురవరం సుధాకర్రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయవాడకు కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగనున్న జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం విజయవాడ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 7 గంటలకు జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రికి సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే బస చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. -
శుభం భూయాత్!
ఆరంభం బాగుంటే ఆసాంతం బాగుంటుందన్నది నానుడి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతటి అఖండ విజయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఆ మరుసటి రోజు పార్టీ శాసనసభ నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ఎన్నిక య్యారు. ఆ రోజు నుంచి ప్రమాణ స్వీకారంలోపు గడిచిన ఈ నాలుగైదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశమంతా ఆయ నను నిశితంగా గమనించ సాగింది. ఎందుకంటే ఆయన గత తొమ్మిది, పదేళ్లుగా సాగిస్తున్న అలుపెరుగని పోరాటం దేశం దృష్టిని అంతగా ఆక ర్షించింది గనుక. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం అధిష్టాన దేవత కనికరించకపోయినా ఆయన ఓదార్పు యాత్రకు బయల్దేరిన నాటి పరిస్థితిని చూస్తే బాల గంగాధర తిలక్ రాసిన ఒక కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తాయి. చిన్నమ్మా నేను వెళ్లొస్తాను.. చీకటి పడుతోంది చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది.. శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది.. దారంతా గోతులు.. ఇల్లేమో దూరం.. చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం.. అలా ధైర్యమే కవచంలా బయల్దేరిన బాటసారి పదేళ్ల తర్వాత చేసిన విజయ గర్జనతో దేశమంతా అతని వైపు చూసింది. పార్టీ నేతగా ఎన్నికైన వెంటనే ఆయన మాట్లాడిన తీరును, పక్క రాష్ట్రం ముఖ్య మంత్రిని ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలసిన వైనాన్ని.. ఆ తర్వాత ప్రధానమంత్రితో గంటకు పైగా భేటీ కావడం, జాతీయ మీడి యాతో మాట్లాడటం ఇవన్నీ ప్రజలంతా గమనించారు. కొన్ని వేలమంది నెటి జన్లు జగన్పై ప్రశంసలు కురిపించారు. ఇలా స్పందించిన వారిలో రచ యితలు, పాత్రికేయులు, కవులు, కళాకారులు, మేధావులూ ఉన్నారు. జగన్ మాటల్లో చిత్తశుద్ధి, నిజాయతీ స్పష్టంగా కనిపిస్తోందని, విన యంగా మాట్లాడుతున్నా ఆ మాటల్లో పదనుందనీ, శక్తిమంతమైన నేతగా ఆయన కనిపిస్తున్నాడని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా నిలబెట్టిన జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో గెలిచిన వెంటనే హోదా సాధనే తమ తొలి ప్రాధాన్యంగా ప్రకటించడమేగాక వెంటనే ప్రధానిని కలిసి హోదా అవసరాన్ని మరొక మారు గుర్తు చేయడం, రాష్ట్ర పరిస్థితిని ఆయన దృష్టికి తేవడం రాష్ట్ర ప్రజలకు బాగా నచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు తనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వెంట తీసుకుపోవడాన్ని కూడా అనేకమంది హర్షించారు. ప్రభుత్వ పాలనలో అధికార యంత్రాంగానికి ఆయన ఇవ్వబోయే గౌరవం, ప్రాముఖ్యతను ఈ సంఘటన తెలియజెప్పిందని చాలామంది సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి సమావేశం ముగిసిన కొద్దిసేపటికే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకున్నాను. అలా జరిగి ఉంటే మన ప్రత్యేక హోదా సులభంగా సాధించి ఉండేవాళ్లమని, నిర్మొహమాటంగా మాట్లాడటాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఎంజాయ్ చేశారు. హోదా సాధన అనే అంశానికి తాను ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడన్నది ఆ మాటల్లో వెల్లడైంది. ఈ నాలుగైదు రోజుల్లో జగన్ను అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధి కారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన మర్యాద, వినయం, పలకరించే తీరుకు ఫిదా అయ్యానని ఒక అధికారి బహిరంగం గానే వ్యాఖ్యానించాడు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, పాలనా విషయాల్లోనూ, ఆయనకు ఉన్న పరిజ్ఞానం ఆశ్చర్యం కలిగించిందని ఒక సీనియర్ అధికారి చెప్పారు. రాజకీయ పరిణతి, పరిపాలనా పరిజ్ఞానం ఉన్న ఈ యువకుని చేతిలో రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉంటుందని మరొక అధికారి ప్రశంసలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికే జగన్ పరిణతి, వ్యక్తిత్వం, నిబద్ధత లోకానికి వెల్లడి కావడం బహుశా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే మీడియా సంస్థలను తీవ్ర నిరాశకు గురి చేసి ఉంటుంది. ఎందుకంటే నాన్– తెలు గుదేశం ముఖ్యమంత్రిగా ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక నెల రోజుల తర్వాత ఆ మీడియా సంస్థలు ఈ ముఖ్యమంత్రికి ఇంకా అధికార యంత్రాంగంపై పట్టు చిక్కలేదంటూ ఆనవాయితీగా వ్యాఖ్యానాలు రాసేవి. ఇప్పుడు జగన్ ఏర్పరుచుకున్న ఇమేజ్ వల్ల ఆ వ్యాఖ్యానం చేస్తే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. కష్టపడేతత్వం, మరో పాతికేళ్లు కష్టపడగలిగే వయసు, ప్రజలను ప్రేమించే గుణం, మంచిని గ్రహించే నేర్పు ఉన్న జగన్మోహన్రెడ్డి లాంటి నేత ఆంధ్ర రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరం. నిర్జన ద్వీపంలో ఒంటరిగా ఉన్నా బతుకు భరోసాను కోల్పోక విశ్వాసాన్ని సడలనీ యకుండా పోరాడి విజయం సాధించిన రాబిన్సన్ క్రూసో లాంటివాడు జగన్రెడ్డి. తలపెట్టిన పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తిచేసే, భర్తృహరి సుభాషితాల్లో చెప్పిన ఉత్తమ మానవుని లక్షణాలు కలిగిన వ్యక్తి జగన్. నట్టనడి సంద్రాన నావలా నిల్చున్న ఆంధ్రప్రదేశ్ను చుక్కాని పట్టి దరిజేర్చే నేర్పు జగన్కు ఉన్నాయని రాష్ట్ర ప్రజలు నమ్ము తున్నారు. కొన్ని రాజకీయ, చారిత్రక కారణాల వల్ల సమస్యలు ఎదు ర్కొంటున్నప్పటికీ విస్తారమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రావని. స్ఫూర్తివంతమైన నాయ కత్వం లభిస్తే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఆ నాయకుడు జగనే కావచ్చు. ఆల్ ది బెస్ట్ టు ది డైనమిక్ లీడర్! - వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
బాబూ... ఇది స్వయంకృతం!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సునామీ సృష్టించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ‘‘మనం ప్రజలను ఇంత వేధించామా’’ అని వాపోయారట. సీఎం ఆఫీసు నుంచి గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల దాకా గత ఐదేళ్ళు తెలుగుదేశం వారు ప్రజలను ఎంత వేధించారో ఇప్పటికయినా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా సాక్షి మీడియా గ్రూప్ గత అయిదేళ్ళలో ఏపీలో విలయ తాండవం చేసిన అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై ఉద్యమమే నడపాల్సి వచ్చింది. బాబుకు అది రుచించలేదు. సాక్షి దినపత్రికనూ, న్యూస్ చానల్ను మూసివేయించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. యూపీఏ రెండుసార్లు అధికారంలోకి రావడానికి పూర్తి కారకుడయిన డాక్టర్ వైఎస్సార్ కుమారుడిని పార్టీ నుంచి బయటికి తరిమేసి ఆయన మరణానంతరం వైఎస్సార్ పేరు నిందితుల జాబితాలో చేర్చిన ఫలితం ఇవ్వాళ కాంగ్రెస్కి దక్కిందనాలి. భారతీయ జనతా పార్టీ లోక్సభలో తన సంఖ్యా బలాన్ని మరింత పెంచుకుని రెండవ సారి తిరిగి కేంద్రంలో అధికారం చేపడుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నూతనంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలయిన ప్రియాంక గాంధీలకు ఆత్మవిమర్శ చేసుకోడానికీ, ఓటమి కారణాలను వెతుక్కోడానికి బోలెడంత తీరిక చిక్కింది. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టండి అని లేఖలు ఇచ్చి విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలో చెప్పకుండానే ఇంకా ఎప్పుడు విడగొడతారు అని పదే పదే కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్ర బాబు నాయుడు అనీ, మీరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మేం అధి కారంలోకి వచ్చి ఆ పని చేస్తాం అని పొద్దున్న లేచింది మొదలు తమ వెంటపడి సతాయించింది, ఒత్తిడి తెచ్చింది భారతీయ జనతా పార్టీ అనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకుని వారి మద్దతు పొందలేని దీనస్థితిలో, 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మట్టి కొట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో సోదిలోకి లేకుండా పోయిన విషయంలో కూడా తల్లీ పిల్లలు కూర్చుని సమీక్షించుకుంటా రనే ఆశిద్దాం. 2014లో రాష్ట్ర విభజనకు బాధ్యులూ, భాగస్వాములూ అయిన తెలుగుదేశం, బీజేపీల కూటమినే ప్రజలు గెలిపించారు, రాష్ట్రాన్ని సమై క్యంగా ఉంచాల్సిందేనని పట్టుబట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట్రుక వాసి దూరంలో అధికారంలోకి రాకుండా పోయింది. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర విభజనకు బాధ్యులయిన మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల అడ్రెస్ గల్లంతు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 175 శాసనసభ స్థానాల్లో 151, 25 లోక్సభ స్థానాల్లో 22 వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఇచ్చి ప్రజలు ఒక చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ విజయం అనితర సాధ్యం. సమకాలీన రాజకీయ నాయకులలో దేశంలోనే అందరికంటే వయసులో బహుశా జగన్మోహన్ రెడ్డి చిన్నవాడు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే కూడా. పదేళ్ళ కఠోర శ్రమ, పట్టుదల, ప్రజా సమస్యల మీద అనునిత్యం ప్రజల్లోనే ఉండి చేసిన పోరాటం, పదహారు మాసాలు అన్యాయంగా జైలులో పెడితే కూడా కుంగిపోకుండా, పార్టీ నాయకులూ శ్రేణులూ ఎటూ వలస పోకుండా మార్గ నిర్దేశనం చేస్తూ, మొక్కవోని ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కోవడం, చివరగా 14 మాసాల పాదయాత్ర ఇవన్నీ కలిసి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి ఆయన సిద్ధం అవుతున్న సమయంలో గత అయి దేళ్ళూ చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం దివాలా తీసిన తీరే ఆయన కళ్ళలో మెదులుతూ ఉంటుంది. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక తరగతి హోదాతో బాటు ఇచ్చిన హామీలన్నిటినీ కేంద్రం నుండి సాధించుకోవడం, తాను ప్రకటించిన నవరత్నాలతో బాటు పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడంతో బాటు గత అయిదేళ్ళూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చుల వల్ల ఏర్పడిన నష్టాల నుండి రాష్ట్రాన్ని బయటికి తేవడం కోసం విరామం లేని శ్రమ జగన్మోహన్ రెడ్డికి తప్పదు. జగన్ ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలూ ఉంటే అధికా రంలోకి వస్తాం అంటుంటారు, నిజమే వాటితో బాటు ఈ ఫలితాల సునామీ మాత్రం చంద్రబాబు నాయుడు దుష్పరిపాలన కారణంగానే. ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ‘‘మనం ప్రజలను ఇంత వేధించామా’’ అని వాపోయారట. అమరావతి సాక్షిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల దాకా గత అయిదేళ్ళు తెలుగుదేశం వారు ప్రజలను ఎంత వేధించారో ఇప్పటి కయినా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ఇవ్వాళ ఫలితం వెలువడ్డాక ఆయనకు ఇవన్నీ అర్థం అవుతున్నాయంటే పొరపాటు. ఆయనకు ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఒక వర్గం మీడియా ఈ అయిదేళ్ళూ రోజూ చెపుతూనే ఉంది, ముఖ్యంగా సాక్షి మీడియా గ్రూప్ గత అయిదేళ్ళలో ఆంధ్రప్రదేశ్లో విలయ తాండవం చేసిన అవినీతి, ఆశ్రితపక్షపాతానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే నడపాల్సి వచ్చింది. చంద్రబాబుకు అది రుచించలేదు. సాక్షి దినపత్రికనూ, న్యూస్ చానల్ను మూసి వేయించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి అది సాధ్యం కాక ఆ మీడియా గ్రూప్లో పనిచేస్తున్న జర్నలిస్ట్లను తన పత్రికా గోష్టులలో, సమావేశాల్లో తూలనాడటం, విమర్శించడం సాగిం చారు. తానాతందానా అన్న మీడియాను కాకుండా ఆయన సాక్షి వంటి కొన్ని మీడియా గ్రూప్లను సీరియస్గా తీసుకుని తన ప్రభుత్వ పనితీరు మీద వస్తున్న విమర్శలను పట్టించుకుని పాలనను మెరుగు పరుచుకుని ఉంటే మరీ 23 స్థానాల దగ్గర ఆగిపోకుండా కొంత గౌరవప్రదమయిన ప్రతిపక్ష స్థానం దక్కి ఉండేదేమో. ఆయన ఆ పని చెయ్యకుండా మీడియా సంస్థలను మూసేయించాలనీ, ప్రతిపక్ష నాయకుడిని శాశ్వ తంగా జైలుకు పంపించాలనీ విఫల ప్రయత్నం చేశారు. తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో స్టేలు తెచ్చుకుని తానూ కాంగ్రెస్ పార్టీ కలిసి బనాయించిన కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని తెగ ఆరాటపడిపోయారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లి ఆయన ప్రధానమంత్రిని అడిగిన కోరికలు రెండే అని బీజేపీ నాయకులే చెపుతుంటారు. మొదటిది జగన్ను జైలుకు ఎప్పుడు పంపుతారు? రెండ వది నియోజకవర్గాల సంఖ్య ఎప్పుడు పెంచుతారు? అనే. మంచిపనులు చేసి ప్రజాదరణ పొందితే అధికారంలో ఉంటాం కానీ జగన్ను జైలులో పెట్టించి, ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తే అధికారంలోకి రాము అన్న చిన్న లాజిక్ మిస్ అయినందు వల్లనే ఇవ్వాళ చంద్రబాబుకూ ఆయన పార్టీకీ ఈ దుస్థితి ఎదురయింది. అంతేకాదు ఆయన సరఫరా చేసిన అసత్య సమాచారాన్నంతా వందిమాగధ మీడియా అందంగా రంగులద్ది పత్రికల్లో అచ్చేసి, చానళ్లలో వినిపించి అదే నిజం అని ఆయనే తిరిగి నమ్మేట్టు చేసి చంద్రబాబును 2050 సంవత్సరంలోకి తీసుకెళ్ళిపోయాయి. వర్తమానం నుండి చాలా దూరం అంటే ఒక 30 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయి ఆ భ్రమల్లో ఉండిపోయిన కారణంగానే ఈ ఫలితం. చంద్ర బాబు నాయుడు ఇప్పుడు 70వ పడిలో ఉన్నారు. సహజంగానే మును పటి జవసత్వాలు ఉండటం కష్టం. చేతికి అందివచ్చిన కొడుకు రాజ కీయాలకు అంది వస్తాడనే ఆశ లేదు. వచ్చే అయిదేళ్ళూ ప్రతిపక్షంలో ఉండాలి. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటీ అన్నది చర్చనీయాంశంగా మారింది. మోదీ మీద వ్యక్తిగత కక్ష పెంచుకుని ఆయన్ను ఓడించాల్సిందే అని దేశమంతా తిరిగి కాంగ్రెస్తో దోస్తీ చేసి చతికిలబడ్డ చంద్రబాబును మోదీ అంత సులభంగా వదిలేస్తాడా? ఆయన రోజుకు పదిసార్లు చెప్పుకున్నట్టు నిప్పు వెనక దాగిన కేసుల స్టేలు ఆయన్ని వదులుతాయా? మరో నాయకుడు ఎవరినీ ఎదగనివ్వని చంద్రబాబు పార్టీలో దాన్ని ఒడ్డెక్కించే రెండో నేత ఎవరు? దేశమంతటా 2014కు మించిన ఫలితాలు సాధించి ఉత్తర తెలంగాణలో మూడు, రాజధాని నగరంలో ఒకటి మొత్తం నాలుగు లోక్సభ స్థానాలు గెలిచిన బీజేపీ, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు స్థానాలూ పోగొట్టుకోవడానికి కారణాలను విశ్లేషించుకుంటే మంచిది. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు పూర్తి ఆర్థిక సహకారం అందించి, పట్టు విడిచి ప్రత్యేక హోదా ఇవ్వడమొక్కటే బీజేపీ ముందున్న మార్గం. ఇక సామంతులూ, బానిసల చేతుల్లో మాత్రమే రాష్ట్రాలు ఉండా లని కోరుకునే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్రెడ్డి విషయంలో చేసిన తప్పులన్నీ ఇవ్వాల్టి తమ దుస్థితికి కారణం అని ఇప్పటికయినా సోనియా గాంధీకి అర్థం అవుతుందా, ఈ ఫలితాల సమీక్షలో పార్టీ కేంద్ర కార్య వర్గంలోనో, వార్ రూమ్లోనో బహిరంగంగా కాక పోయినా సోనియా తన మనసులోనయినా జగన్మోహన్రెడ్డిని ఓదార్పు యాత్రకు అనుమ తించకపోవడం, ఆయనను జైలు పాలు చెయ్యడం వంటి పిచ్చి పను లన్నీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఈ గతి పట్టించాయని ఒప్పుకుంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి, కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ రెండుసార్లు అధికారం లోకి రావడానికి పూర్తి కారకుడయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి కుమారుడిని పార్టీ నుండి బయటికి తరిమేసి ఆయన మరణానంతరం వైఎస్ఆర్ పేరు నిందితుల జాబితాలో చేర్చిన ఫలితం ఇవ్వాళ కాంగ్రెస్కు దక్కిందనే అనుకోవాలి. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
టీడీపీ ఓటమికి కార్యకర్తలు,నేతలే బాధ్యులు
-
చంద్రబాబును టీడీపీ నేతలే మోసం చేశారు: లోకేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేపోతుంది. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనానికి టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలపై మాజీ మంత్రి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబును సొంత పార్టీ నేతలే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు పదిశాతం మోసం చేస్తే.. పార్టీ నమ్ముకున్న నేతలు 90 శాతం మోసం చేశారని లోకేష్ అన్నారు. గల్లా జయదేవ్ వంటి నేతలే గెలవంగా మిగతావారు ఎందుకు ఓడిపోయారని అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న లోకేష్ ఓటమిపై పార్టీ నేతలతో చర్చించారు. గుంటూరు ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్ విజయం సాధించగా.. ఆ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు ఓటమి చెందామని నేతల్ని ప్రశ్నించారు. నేతల మధ్య సమన్వయం, ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొలేకపోవడం మూలంగానే ఓటమి చెందామని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఏపీ ఎన్నికల్లో సీనియర్ నేతలతో సహా, మంత్రులు కూడా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. కాగా మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 23 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా టీడీపీ తురుపుముక్కగా భావించిన నారా లోకేష్ మంగళగిరిలో దారుణ ఓటమిచెందడం ఆ పార్టీ శ్రేణులను భారీ షాక్కు గురిచేసింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జనానికి దూరంగా... జనసేన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ చేతిలో ఓడిపోగా, 2019 ఎన్నికల్లో ఆ రాజన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలికి పవన్ కల్యాణ్ కొట్టుకుపోయారు. ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ నాయకులను పంచెలు ఊడదీసి కొడతామని యువరాజ్యం అధ్యక్షుడి హోదాలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో రెచ్చిపోయారు. తాజా ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడి హోదాలో ‘తాట తీస్తాను. తోలు తీస్తాను. తరిమికొడతాను. బట్టలూడదీసి కొడతా’నంటూ పిచ్చి ప్రేలాపనలకు దిగారు. అయితే నోటికొచ్చినట్టు మాట్లాడిన పవన్ కల్యాణ్కు జనం మామూలు షాకివ్వలేదు. 2009లో ఎలాగైతే బుద్ధి చెప్పారో 2019లో అంతకుమించి ఎదురుతిరిగారు. నాడు ఓట్లు, సీట్లు గౌరవ ప్రదంగానైనా వచ్చాయి. కానీ ఈసారి చాలాచోట్ల డిపాజిట్లు దక్కక, మరికొన్నిచోట్ల నామమాత్రపు పోటీతో సరిపుచ్చుకున్నారు. జిల్లాలో దుస్థితి రాజకీయాలను సమూలం గా మార్చివేస్తానని, అన్న చిరంజీవి తరహా రాజకీయాలు చేయనని, జనసేన పార్టీతో ప్రభంజనమే సృష్టిస్తానని ఎన్నికల్లో తెరమీదకు వచ్చారు. పవన్ కల్యాన్ కానీ ఓట్ల విషయంలో బొక్కబోర్లా పడ్డారు. ప్రజారాజ్యం పార్టీ గెలిచిన స్థానాల్లో కూడా జనసేన పట్టు సాధించలేకపోయింది. నాడు చిరంజీవి నేతృత్వంలోని పీఆర్పీ జిల్లాలో నాలుగు సీట్లు కైవసం చేసుకోగా నేడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకుంది. అది కూడా పవన్ కల్యాణ్ గొప్పతనమేమీ లేదు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రాపాక వరప్రసాద్ వ్యక్తిగత పలుకుబడే ఆయన్ని గెలిపించినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ జిల్లాలో గట్టి పోటీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పోలైన 26,60,568 ఓట్లలో 8,05,836 ఓట్లు సాధించింది. దాదాపు 30.4 శాతం ఓటు షేర్ పొందడమే కాకుండా పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కొత్తపేట నియోజకవర్గాల్లో గెలుపొందింది. అదే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 8,97,019 ఓట్లు సాధించి 33.8 శాతం ఓటు షేర్తో 11 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. ఇక, టీడీపీ 7,29,610 ఓట్లు సాధించి 27.5 శాతం ఓటు షేర్తో 4 స్థానాలను దక్కించుకుని మూడోస్థానంలో నిలిచింది. అంటే 2009 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా జిల్లాలో మాత్రం ఓట్ల షేర్లో రెండో స్థానంలో నిలిచింది. దీనిప్రకారం ప్రజారాజ్యం పార్టీ జిల్లాలో ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అసభ్య పదజాలంతో తిడితే ఓట్లు పడతాయే... నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరని ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్కు చేతల్లో జిల్లా ఓటర్లు చూపించారు. ఈ ఎన్నికల్లో కేవలం 5,19,264 ఓట్లు సాధించి, 15.37 శాతం ఓటు షేర్తో ఒక స్థానంతో సరిపెట్టుకుని మూడో స్థానంలో నిలిచారు. టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలు నడిపి, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చి తన పార్టనర్ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చుదామని పవన్ చేసిన యత్నాలన్నీ బెడిసికొట్టేశాయి. బలహీనమైన అభ్యర్థులను పెట్టి పరోక్షంగా టీడీపీకి మేలు చేద్దామని భావించినా ప్రజలు తిప్పికొట్టారు. కుమ్మక్కు రాజకీయాలు చేసిన నేతలను ప్రోత్సహించకూడదని గంపగుత్తగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారు. పోలైన 33,76,670 ఓట్లలో వైఎస్సార్సీపీకి 14,68,056 ఓట్లు వచ్చాయి. 43.47 శాతం ఓటు షేర్తో అగ్రస్థానంలో నిలిచి 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక జనసేన కుమ్మక్కుతో నడిచిన ఎన్నికల్లో టీడీపీ 12,40,867 ఓట్లు సాధించి 36.74 శాతం ఓటు షేర్తో కేవలం నాలుగు స్థానాలతో సరిపుచ్చుకుంది. విశేషమేమిటంటే నాడు ప్రజారాజ్యం గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో జనసేన కనీస పట్టు నిలుపుకోలేకపోవడం గమనార్హం. -
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు రెండుసార్లు దురదృష్టకరం
-
గవర్నర్ను కలిసిన ఏపీ సీఈవో ద్వివేది
-
గవర్నర్ను కలిసిన సీఈవో ద్వివేది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోపాటు అడిషనల్ సీఈఓలు వివేక్ యాదవ్, సుజాత శర్మలు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ను ఈ సందర్భంగా వారు గవర్నర్కు అందజేశారు. భేటీ అనంతరం ద్వివేది మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన 175 మంది జాబితాను గవర్నర్కు అందజేసామన్నారు. ఎన్నికల ప్రక్రియలో చివరి అంకంలో భాగంగా ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అంజేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై గవర్నర్ కితాబు ఇచ్చినట్టు తెలిపారు. -
శైలుకు ఘోర పరాభవం
అనంతపురం: ఆయన గత చరిత్ర ఘనం. రెండు పర్యాయాలు ఒకే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాం లో విప్గా పని చేశారు. వైఎస్ అకాలమరణంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్కుమార్రెడ్డి కేబినేట్లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఆ పార్టీ కర్ణాటక ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జ్గా పని చేస్తున్నారు. ఇంతటి చరిష్మా ఉన్న నాయకుడికి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర అవమానం జరిగింది. ఇంతకీ ఆయన ఎవరంటే డాక్టర్ సాకే శైలజానాథ్! శింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొన్న జరిగిన ఎన్నికల్లో బరిలో నిలిచిన శైలజానాథ్కు కేవలం 1,384 ఓట్లు (0.69 శాతం) మాత్రమే పోలయ్యాయి. ఈ ఓట్లు నన్ ఆఫ్ ద అబౌ (నోటా)తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కావడం విశేషం. ఇక్కడ ‘నోటా’కు 2,340 ఓట్లు వచ్చాయి. శైలజానాథ్కు వచ్చిన ఓట్లు చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రిగా పని చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానై రాష్ట్రమంతా హడావుడి చేసిన ఆయన తన సొంత నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు సైతం దక్కించుకోలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం రాష్ట్ర, దేశ రాజకీయాల గురించే మాట్లాడే ఆయన సొంత నియోజకవర్గంలో కనీస రాజకీయ పరువు కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికి ఎగబాకిందన్న చందంగా ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు సాధించిన శైలూ.. కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాడట!’ అంటూ జిల్లా ప్రజలు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. -
అప్పుడు అన్నపై.. ఇప్పుడు తమ్ముడిపై
భీమవరం(ప్రకాశం చౌక్): 2009లో మెగాస్టార్ చిరంజీవిపై, ఇప్పుడు పవన్కల్యాణ్పై పందేలు కాసి జిల్లాలోని యువత రూ.కోట్లలో నష్టపోయారు. అప్పట్లో చిరంజీవి పాలకొల్లు నుంచి గెలుస్తారని, రాష్ట్ర సీఎం అవుతారంటూ అభిమానులు.. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన యువత భారీగా పందేలు కాశారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అలాగే ఆ పార్టీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకుంది. దీంతో పందేలు కాసినవారంతా పెద్ద ఎత్తున నష్టపోయారు. చిరంజీవి సభలకు లక్షల్లో జనం రావడం చూసి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అభిమానులు, ఓ సామాజిక వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. దీంతో చాలామంది వ్యాపారులు, సంపన్నులే కాకుండా మధ్యతరగతికి చెందిన అనేకమంది అప్పులు చేసి మరీ పందేలు కాశారు. కొంతమంది ఆస్తులు తాకట్టుపెట్టి చిరంజీవిపై లక్షల్లో పందేలు కట్టారు. ఆ అప్పులు తీర్చడానికి వారికి సంవత్సరాలు పట్టింది. అనంతరం ఆ పందేల్లో డబ్బులు పోగొట్టుకున్నామనే బాధ కంటే.. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పదేళ్ల అనంతరం తమ్ముడు మళ్లీ పదేళ్ల అనంతరం చిరంజీవి తమ్ముడు పవర్స్టార్ పవన్కల్యాణ్ భీమవరం నుంచి గెలుస్తారని పెద్ద ఎత్తున పందేలు కాశారు. పవన్ కల్యాణ్ సభలకు జనం భారీగా రావడంతో భీమవరంలో ఆయన ఎలాగైనా గెలుస్తారని అభిమానులు, ఆయన సామాజికవర్గానికి చెందిన యువ ఓటర్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. పవన్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ లేకపోయినా.. కనీసం భీమవరంలో కొద్ది తేడాతో గెలుస్తారని చివరివరకూ ధీమాగా ఉన్నారు. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలో విజయం సాధిస్తారని, పార్టీకి 30 సీట్లు వస్తాయని జనసైనికులు లెక్కలేసుకుని లక్షల రూపాయలు పందేలు కట్టారు. ఈసారి ఆ సామాజివర్గంలోని పెద్దలు పందేల జోలికి వెళ్లలేదు. కానీ యువత మాత్రం పెద్ద ఎత్తున బరిలోకి దిగింది. భీమవరం, గాజువాకలో గెలుస్తారంటూ సీట్లు, ఓట్ల శాతంపై గుడ్డిగా డబ్బులు పెట్టేశారు. నర్సాపురం ఎంపీగా నాగబాబు గెలుస్తాడని కూడా పలువురు పందేలు కట్టారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం, ఆ పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకోవడంతో మొత్తంగా రూ. కోట్లలో పందేలు ఓడిపోయారు. భీమవరంలో రూ.కోటికిపైగా పందేలు భీమవరంలో పవన్ కల్యాణ్ గెలుస్తాడని ఆ ప్రాంతంలో సుమారు రూ.కోటికిపైగానే పందేలు జరిగాయి. ఎన్నికల అనంతరం వారం రోజుల పాటు పవన్కల్యాణ్ గెలుస్తాడని జోరుగా ప్రచారం జరగడంతో ఇతర పార్టీలకు చెందిన వారు తమ పార్టీ అభ్యర్థులపై పందేలు కట్టేందుకు భయపడ్డారు. లక్షకు లక్షన్నర ఇస్తామని జనసేన పార్టీకి చెందిన కొందరు హషారుపడ్డారు. ఆ తర్వాత సర్వే సంస్థలు, పలువురు నేతల చేసిన సర్వేల్లో భీమవరం గ్రంధి కచ్చితంగా గెలుస్తారని తెలియడంతో మిగిలిన రెండు పార్టీలకు చెందిన వారు పవన్ అభిమానులతో పందేలు వేశారు. ఇప్పుడు గ్రంధి గెలుపుతో ఆయన గెలుస్తారని పందేలు వేసిన వారు సంబరాల్లో ఉంటే.. పవన్పై వేసిన వారు మాత్రం పూర్తి నిరాశలో మునిగిపోయారు. అప్పుడు అన్నపై.. ఇప్పుడు తమ్ముడిపై పందేలు కట్టి పలువురు అభిమానులు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు. -
టీడీపీ కంచుకోటకు బీటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉంటూ వస్తున్న జిల్లాలో పార్టీ ఈ స్థాయిలో పతనం చెందడానికి కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు తెలుగుదేశం నాయకులు. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను కట్టబెట్టిన జిల్లా ఈసారి రెండు స్థానాలకు పరిమితం చేసింది. 2014 ఎన్నికల్లో వచ్చిన ఘన విజయాన్ని సద్వినియోగం చేసుకోకుండా గెలిపించిన ప్రజలపైనే పెత్తనం చేశారు టీడీపీ నాయకులు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రజాప్రతినిధులైతే ఇసుక, మట్టి, నీరు ఏదీ వదలలేదు. వందల కోట్లు దోచేశారు. ఉచిత ఇసుక పాలసీని అడ్డం పెట్టుకుని జి ల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు శతకోటీశ్వరులుగా మారారు. వీరందరికీ ప్రజలు గుణపాఠం చెప్పారు. భారీ మెజారి టీలతో ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు. పితాని.. ఇసుక దందా ఇసుక దందాకు ఆధ్యుడిగా ఉన్న పితాని సత్యనారాయణ ఆచంట నుంచి 2009, 2014లో గెలిచిన తర్వాత కూడా ఇసుక దందాను కొనసాగించారు. మంత్రిగా ఉంటూనే ఇసుక మాఫియాలో ప్రముఖపాత్ర పోషించారు. ఆయన కనుసన్నల్లోనే నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరిగింది. కులబలంతో రాజకీయం చేస్తూ వచ్చిన పితానికి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెక్ పెట్టారు. ఆయన కుల ఓట్లను గండికొట్టారు. 15 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. నిడదవోలుపై ‘శేష’ పడగ నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావు ఇసుకను అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించారు. 2009లో తనకు అప్పులు ఉన్నాయని చూపించిన శేషారావు పదేళ్లు గడిచేటప్పటికి వెయ్యికోట్లకు పైగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో కూడా ఈ సీటు కోసం పోటీ పెరిగిపోయింది. అన్నింటిని తట్టుకుని సీటు సంపాదించుకున్నా 20 వేల పైచిలుకు తేడాతో జనం ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు. కొవ్వూరు.. అవినీతి ఏరు కొవ్వూరు విషయానికి వస్తే మంత్రి కేఎస్ జవహర్ సాధారణ టీచర్ నుంచి వందల కోట్లకు ఎదిగారు. ఆయన ఇసుక నుంచి పేకాట క్లబ్ల వరకూ దేనిని వదలలేదు. వందల కోట్లు సంపాదించడంతో సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆఖరికి ఆయనను జిల్లా నుంచి తప్పించి సొంత జిల్లాలోని తిరువూరు సీటును కేటాయించారు. అక్కడ కూడా భారీ తేడాతో జవహర్ ఓటమి చవిచూశారు. కొవ్వూరుకు విశాఖ జిల్లా నుంచి స్థానికేతరురాలు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తీసుకువచ్చి నిలబెట్టినా 25 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. పోలవరం.. సిండికేట్లపరం రిజర్వుడు నియోజకవర్గం అయిన పోలవరం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మొడియం శ్రీనివాస్ కూడా ఇసుక సిండికేట్లపై కోట్ల రూపాయలు ఆర్జించారు. పోలవరం భూసేకరణ, అర్ అండ్ ఆర్ను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తారు. ఇక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పక్కన పెట్టినా అదే ఇసుక సిండికేట్లకు చెందిన బొరగం శ్రీని వాస్ను నిలబెట్టడంతో ప్రజలు 42 వేల ఓట్ల తేడాతో అతడిని చిత్తుగా ఓడించారు. దెందులూరులో రౌడీరాజ్యం తమ్మిలేరు ఇసుకతో పాటు పోలవరం కుడికాల్వ గట్టును అమ్మేసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కూడా ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై దాడికి దిగిన ప్రభాకర్ను చంద్రబాబునాయుడు వెనకేసుకురావడంతో అతని దోపిడీకి అంతులేకుండా పోయింది. పోలవరం కుడికాల్వ గట్టును పూర్తిగా కొల్లగొట్టారు. మరోవైపు కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వించి వాటిని కూడా ఆక్రమించారు. దీంతో అతడిని ప్రజలు 17 వేలకు పైగా ఓట్ల తేడాతో ఇంటిబాట పట్టించారు. ఉంగుటూరు.. గన్నిని ఓడించారు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 21 కిలోమీటర్ల మేర ఉన్న పోలవరం కుడికాల్వ గట్టును తవ్వేసి, నీరు– చెట్టు పేరుతో చెరువుల్లో మట్టిని అమ్మేసుకుని, పే కాట దందాలకు కేరాఫ్గా నిలిచిన ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును కూడా 32 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి నియోజకవర్గ ప్రజలు ఇం టికి పంపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అనడానికి ఈ ప్రజాప్రతినిధులే నిదర్శనంగా మారారు. -
ఏపీ ప్రతిపక్ష నేత ఎవరు?
-
ఐదేళ్ల తర్వాత విముక్తి లభించింది
సాక్షి, అమరావతి: ‘ఐదేళ్లపాటు నరకం అనుభవించాం.. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి లేదు, గొంతెత్తి మాట్లాడితే సస్పెన్షన్లు, ఆందోళన చేద్దామని రోడ్డు మీదకొస్తే పోలీసులు తీసే వీడియోల ఆధారంగా వేతనాలు కత్తిరించడం, లేదంటే బదిలీలు చేయడం.. ఇలా అరవై నెలలు నరకం అనుభవించాం’.. ఈ మాటలన్నది స్వయానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఏ ఉద్యోగిని పలకరించినా తమకు విముక్తి లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేశామని, అయితే టీడీపీ పాలనలో తమ జీవితంలో అత్యంత చీకటి రోజులను చూశామని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో కుంగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తామంతా కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నామని, తాము అనుకున్నట్టే జరగడం ఆనందాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. ఇష్టం లేకపోయినా బలవంతంగా.. ప్రభుత్వ కార్యక్రమాలకు కాకుండా రాజకీయ కార్యక్రమాలకు కూడా ఉద్యోగులను వాడుకుని ఉద్యోగ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మరికొంతమంది ఉద్యోగులు చెప్పారు. ‘నవ నిర్మాణ దీక్ష అంటారు.. ఉద్యోగులను విధులు మానేసి రమ్మంటారు.. ధర్మపోరాట దీక్ష అంటారు.. ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడుకుంటారు.. జ్ఞానభేరి అంటారు.. అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు.. ఎవరైనా ఇష్టం లేదని చెప్పారంటే వారిని అంతుచూస్తామని బెదిరిస్తారు’.. ఇలా టీడీపీ పాలనలో నరకం చూశామని వాపోయారు. సీఎం హోదాలో చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమాలకయితే విద్యార్థులను కూడా తీసుకొచ్చి, బలవంతంగా కూర్చోబెట్టి ఎవరూ బయటకు పోకుండా తలుపులు వేసేసిన ఘటనలూ ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్, రెవెన్యూ, కాంట్రాక్టు సిబ్బందిని, ఏఎన్ఎంలను ఇలా ఏ ఒక్క ఉద్యోగ వర్గాన్ని వదలకుండా దారుణంగా హింసించారని పలువురు ఉద్యోగులు చెప్పారు. చివరకు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అడ్డుచెబితే వారు అధికారులపై చేయి చేసుకున్న సందర్భాలూ ఉన్నాయని అన్నారు. జగన్ ప్రకటనను స్వాగతిస్తే సస్పెండ్ చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఒక ఉద్యోగిగా పేపర్ ప్రకటన ఇచ్చాను. దీన్ని చూసిన ప్రభుత్వం నన్ను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 4న ఉత్తర్వులిచ్చింది. –ఆస్కారరావు, ఉద్యోగి, ప్రజారోగ్యశాఖ ఉద్యోగులను దొంగలను చూసినట్టు చూశారు చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా అవమానించారు. ఉద్యోగుల చుట్టూ కెమెరాలు పెట్టి ఎప్పుడు ఏం చేస్తున్నారో నిఘా పెట్టి దొంగల్లాగా చూశారు. 50 ఏళ్లకు బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారన్న వార్తలు పత్రికల్లో వస్తే నన్ను అకారణంగా 15 నెలలు సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. –కె.వెంకట్రామిరెడ్డి, కన్వీనర్, ప్రభుత్వ ఉద్యోగ, టీచర్ల, పెన్షనర్ల సమాఖ్య సీపీఎస్ రద్దు చేయాలంటే సస్పెండ్ చేశారు సీపీఎస్ రద్దు చేయాలని అడిగితే ఈ ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేసింది. లక్షల మంది ఉద్యోగుల తరఫున సీపీఎస్ రద్దు కోసం పోరాడటం నేను చేసిన తప్పా? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ను రద్దు చేస్తానని చెప్పడాన్ని స్వాగతించా. ఆ మరుసటి రోజే నాకు సస్పెన్షన్ ఆర్డర్ చేతికొచ్చింది.బాబు పాలనలో ఇదీ ఉద్యోగుల పరిస్థితి. –పి.రామాంజనేయులు యాదవ్, అధ్యక్షుడు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం -
చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్సీపీ సత్తా
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబర్చింది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత చంద్రబాబు స్మార్ట్ విలేజ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానంటూ ప్రకటించారు. వరుసగా రెండేళ్లపాటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అరకులోయలోనే నిర్వహించి తాను దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీకి లెక్కలేనన్ని వరాలు ప్రకటించారు. కానీ గడిచిన ఐదేళ్లలో ఇక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అనే చందంగా ఉండడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. దత్తత పేరుతో తమను మోసగించిన చంద్రబాబుకు ఓట్ల రూపంలో గిరిజనులు బుద్ధి చెప్పారు. పరిణామాలిలా.. 2014 ఎన్నికల్లో అరకులోయతో పాటు పాడేరు నుంచి వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి తీసుకున్నారు. సర్వేశ్వరరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో పలుమార్లు హెచ్చరించిన మావోలు చివరకు గతేడాది సెప్టెంబర్లో హతమార్చారు. తర్వాత ఆయన తనయుడు శ్రావణ్కుమార్ను చట్టసభల్లో సభ్యత్వం కల్పించకుండానే మంత్రిని చేశారు. ఆరు నెలల గడువు ముగియడంతో ఎన్నికలముందే శ్రావణ్కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో కిడారి శ్రావణ్కుమార్ వైఎస్సార్సీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ చేతిలో ఘోర పరాజయంపాలయ్యారు. మిగిలిన పంచాయతీల మాటెలా ఉన్నా కనీసం చంద్రబాబు దత్తత తీసుకున్న పంచాయతీ పరిధిలో కూడా టీడీపీకి మెజార్టీ ఓట్లురాని దుస్థితి నెలకొంది. పెదలబుడు పంచాయతీలోని 22 గ్రామాల్లోనూ వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. పెదలబుడు పంచాయతీ పరిధిలోని 7 బూత్లలో పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణకు 1,176 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శ్రావణ్కుమార్కు 806 ఓట్లు దక్కాయి. 25,495 ఓట్ల మెజార్టీతో చెట్టి ఫల్గుణ ఘన విజయం సాధించారు. చంద్రబాబు దత్తత పంచాయతీ పెదలబుడులో ఉన్నవి 22 గ్రామాలు పెదలబుడు పంచాయతీలో ఓటర్లు 3,612 మంది + బూత్ల వారీగా లభించిన ఓట్లు పెదలబుడు బూత్ శ్రావణ్ ఫల్గుణ 216 71 134 217 58 89 208 88 140 209 104 113 210 109 196 211 216 343 పానిరంగిణి గ్రామం 235 160 161 -
మార్పు.. ‘తూర్పు’తోనే..
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: తూర్పున ఉదయించే సూర్యుడు లోకానికి వెలుగులు పంచడం ఎంత సహజమో.. ‘తూర్పు గోదావరి’ జిల్లాలో ఉదయించే రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కూడా అంతే సహజం అన్నట్టుగా మారిపోయింది. దీనికే రాష్ట్ర రాజకీయాల్లో ‘తూర్పు’ సెంటిమెంట్గా ఎంతో పేరు ఉంది. ఈ జిల్లాలో అత్యధిక సీట్లు సాధించే పార్టీయే రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందన్నది ఎన్నో దశాబ్దాలుగా ఏర్పడిన బలమైన నమ్మకం. ఇందుకు తగినట్టే ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తూండడం విశేషం. దీంతో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో సహితం ఇదే నమ్మకం మరోసారి నిజమైంది. జిల్లాలో అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాలను, మూడు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో తిరుగులేని ప్రభంజనం సృష్టించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘తూర్పు’ సెంటిమెంట్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘తూర్పు’ సెంటిమెంట్గా మారిపోయింది. జిల్లాలో సమర శంఖారావం నిర్వహించిన వేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ‘తూర్పు’ మార్పునకు నాంది పలుకుతుందని చాలామంది గట్టిగా నమ్ముతారు. ఇక్కడ ఉండగానే అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడం తమకు మంచి సంకేతమని, పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే వేదికగా కాకినాడ నిలవడం శుభపరిణామమని వైఎస్సార్ సీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలు భావించారు. ఇంకేముంది! కాకినాడ సమర శంఖారావం వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమరశంఖం పూరించారు. అనుకున్నట్టుగా ‘తూర్పు’ సెంటిమెంట్ మరోసారి నిజమైంది. కనీవినీ ఎరుగని రీతిలో హోరాహోరీగా సాగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలకు 36 మంది, 19 అసెంబ్లీ స్థానాలకు 223 మంది పోటీ చేశారు. ఎంతమంది బరిలో ఉన్నప్పటికీ పోరు మాత్రం వైఎస్సార్ సీపీ – టీడీపీల మధ్యే సాగింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆధిక్యతను ప్రదర్శిస్తూ 14 అసెంబ్లీ స్థానాలను, మూడు పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. ‘తూర్పు’ సెంటిమెంటును నిజం చేస్తూ రాష్ట్రంలో కూడా సునామీ సృష్టించింది. ‘తూర్పు’ సెంటిమెంటుకు ఇవిగో ఉదాహరణలు ♦ 1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో 21 స్థానాలకు 21 గెలిచింది. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ♦ 1985లో జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ గాలి వీచింది. జిల్లాలోని 21 స్థానాలకు గాను 20 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ♦ 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో అత్యధికంగా 16 స్థానాలను కైవసం చేసుకుంది. నలుగురు టీడీపీ తరఫున, ఒకరు ఇండిపెండెంట్గా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ♦ 1994 ఎన్నికల్లో టీడీపీ హవా మరోసారి సాగింది. జిల్లాలో 21కి 19 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒకటి దక్కించుకోగా మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. రాష్ట్రంలో మరోసారి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ♦ 1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో అత్యధికంగా 18 స్థానాలను కైవసం చేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ ఒక్క స్థానంలో నెగ్గింది. ♦ 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో గరిష్టంగా 16 సీట్లు గెలుచుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒకటి, టీడీపీ రెండు, స్వతంత్రులు మరో రెండుచోట్ల గెలిచారు. ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ సీఎం అయ్యారు. ♦ 2009లో కూడా వైఎస్ హవా కొనసాగింది. ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను గెలుచుకోగా ప్రజారాజ్యం పార్టీ 4, తెలుగుదేశం 4 స్థానాల్లో గెలుపొందాయి. జిల్లాలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం.. ‘తూర్పు’ సెంటిమెంట్ ప్రకారం రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు సాధించి, వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ♦ 2014లో టీడీపీ, బీజేపీ అలయన్స్ 14 స్థానాలను దక్కించుకోవడం ద్వారా చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కొత్తపేట, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, రంపచోడవరం స్థానాలను దక్కించుకుంది. జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకున్న టీడీపీ ‘తూర్పు’ సెంటిమెంట్ను కొనసాగించింది. తాజా ఎన్నికల్లోనూ అదే ఒరవడి ప్రస్తుత ఎన్నికల్లోనూ ‘తూర్పు’ సెంటిమెంట్ కొనసాగింది. జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 14 చోట్ల వైఎస్సార్ సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకటి జనసేన గెలుపొందాయి. ఈసారి కూడా అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. తద్వారా ఎంతోకాలంగా కొనసాగుతున్న ‘తూర్పు’ సెంటిమెంట్కు మరోసారి బలం చేకూరుతోంది. -
సొంతూళ్లలోనే భంగపాటు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాయకులకు సొంతూళ్లు, సొంత మండలాల్లో చుక్కలు కనిపించాయి. అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మెజార్టీ రావడంతో కంగుతిన్నారు. ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అయితే, చాలా మంది టీడీపీ అభ్యర్థులు వారి ఇంట (సొంతూళ్లు)నే గెలవలేక చతికిలపడ్డారు. పరాజయం పాలైన వా రిలో రాజకీయ ఉద్దండులు ఉండటం గమనార్హం. లద్దగిరిలో వైఎస్ఆర్సీపీదే పైచేయి ఇది కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి స్వగ్రామం. ఇక్కడ 5,500మంది ఓటర్లు ఉన్నారు. అలాగే కోడుమూరు మండలంలో మొత్తం 52 వేలమంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాంజనేయులు బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు లద్దగిరి సూర్యప్రకాష్రెడ్డికి కంచుకోట. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జె.సుధాకర్కు 994 ఓట్ల మెజార్టీ రావడం గమనార్హం. అయితే, ఎంపీ అభ్యర్థిగా మాత్రం కోట్లకే అధిక ఓట్లు పడ్డాయి. సొంత మండలమైన కోడుమూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు పది వేలకు పైగా మెజార్టీ రావడంతో ఆయన ఖంగుతిన్నాడు. మాండ్రకు హ్యాండిచ్చిన అల్లూరు టీడీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాండ్ర శివానందారెడ్డి సొంతూరు నందికొట్కూరు మండలం అల్లూరు. ఇక్కడ మొత్తం 2 వేల ఓట్లు ఉండగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థికి 200, ఎమ్మెల్యే అభ్యర్థి తొగురు అర్థర్కు 4 వందల మెజార్టీ వచ్చింది. ఈ విధంగా సొంతూరు ఓటర్లు మాండ్రకు హ్యాండిచ్చారు. ఎదురూరులో వైఎస్ఆర్సీపీకి ఓట్లు.. కర్నూలు మండల పరిధిలోని ఎదురూరులో టీడీపీ నేత విష్ణువర్ధన్రెడ్డి చెప్పిన వారికే అక్కడి ప్రజలు ఓట్లు వేస్తారు. అయితే ఈసారి మాత్రం అలా జరిగినట్లు కనిపించడంలేదు. ఇక్కడ ఏకంగా విష్ణు ఆదేశాలను కాదని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా 300 ఓట్లు పడ్డాయి. కంచుకోటకు బీటలు పాణ్యం నియోజకవర్గంలోని ఉలిందకొండ టీడీపీకి కంచుకోట. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి ఇది సొంతూరు. దీంతో ఇక్కడ ఎప్పడూ ఆ పార్టీకే మెజార్టీ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్రెడ్డికి 596 ఓట్ల మెజార్టీ రావడం విశేషం గౌరు ఇలాకాలో ఫ్యాన్ గాలి గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డిల సొంతూరు నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు. ఇక్కడ గౌరు కుటుంబానిదే ఎప్పుడూ పైచేయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం గౌరు కుటుంబం టీడీపీలోకి వెళ్లి అభ్యర్థి బండి జయరాజుకు ఓట్లు వేయమని చెప్పినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తొగురు ఆర్థర్కు 600 మెజార్టీ వచ్చింది. అలాగే నందికొట్కూరు మండలంలో వైఎస్ఆర్సీపీకి మొత్తంగా 6 వేల ఓట్ల మెజార్టీ రావడంతో వారి పట్టు సడలిందని స్పష్టమవుతోంది. వెలుగోడులోబుడ్డాకు ఎదురుగాలి శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు మండలం బుడ్డా రాజశేఖరరెడ్డి కుటుంబానికి కంచుకోట. ఇక్కడ వారు ఏ పార్టీలో ఉన్నా వారు చెప్పిన అభ్యర్థులకే మెజార్టీ ఓట్లు పడేవి. అయితే, ఈసారి ఆయన స్వయంగా రంగంలో ఉన్నా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి ఏకంగా 3,496 ఓట్ల అధిక్యం రావడం విశేషం. కృష్ణగిరిలో కేఈపట్టు జారింది... డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన మండలం కృష్ణగిరి. గతంలో ఈ మండలం డోన్లో ఉండేది. ఆ తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో కలిపారు. ఈ మండలం ఎక్కడున్నా కేఈ కుటుంబం గెలుపులో కీలకపాత్ర పోసిస్తూ వచ్చింది. ప్రతి ఎన్నికల్లో కనీసం 5 వేల నుంచి 10 వేల మధ్య టీడీపీకి మెజార్టీ వచ్చేంది. అలాంటిది ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవికి ఇక్కడ 5 వేల మెజార్టీ వచ్చింది. అలాగే కేఈ కృష్ణమూర్తి సొంతూరు కంబాలపాడులోని 187వ బూతులో వైఎస్ఆర్సీపీకి 36 మెజార్టీ రావడం గమనార్హం. గ్రామంపై వారి పట్టు సడలిందనడానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. భూమా కోటాలో గంగుల పాగా... ఎన్నికలు ఏవైనా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా, గంగుల వర్గాల మధ్య పోటా పోటీ ఉంటుంది. ఇందులో దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సొంత మండలమైన దొర్నిపాడులో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మూడు నాలుగు వేల మెజార్టీ వచ్చేది. అలాగే గంగుల కుటుంబానికి శిరువెళ్ల సొంత మండలం. ఇక్కడ వారికే మెజార్టీ ఉంటుంది. ఈ సారి ఎన్నికల్లో గంగుల కుటుంబం తమ మండలంలో పట్టు నిలుపుకోగా..భూమా కుటుంబం మాత్రం దొర్నిపాడులో పట్టు కోల్పోయింది. ఇక్కడ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 200 ఓట్ల మెజార్టీ రావడం విశేషం. -
పశ్చిమాన ఫ్యాన్ హోరు
పశ్చిమ ప్రకాశంలో ఫ్యాన్ గాలి ప్రభంజనంలా వీచింది. ఫ్యాన్ హోరుకు సైకిల్ విలవిల్లాడింది. మెజారిటీల్లోనూ వైఎస్సార్ సీపీ రికార్డులు సృష్టించింది. 2014 ఎన్నికల్లో వెనుకబడిన కనిగిరి, దర్శి నియోజవకర్గాల్లోనూ ఈ సారి విజయదుందుభి మోగించింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీ క్యాడర్ సైతం సంబరాల్లో మునిగిపోయారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి ఆదరణ చాటారు. ఆ పార్టీ అభ్యర్థులను రికార్డు మెజార్టీలతో గెలిపించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు ప్రధాన నీటి వనరైన వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ప్రాజెక్టును పూర్తి చేయక పోవడంతో ఈ ప్రాంతవాసులు సాగునీటితో పాటు తాగునీటికి అల్లాడి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 70 శాతం పనులను పూర్తి చేశారు. ఆయన మరణంతోనే ప్రాజెక్టు పనులు దాదాపు ఆగి పోయాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని జిల్లా నేతలతో పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయితే వెలిగొండ పూర్తి అవుతుందని జనం నమ్మారు. తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని భావించారు. జగన్ను సీఎం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫ్యాను గుర్తుకు జనం ప్రభంజనంలా ఓట్లేశారు జగన్ను నమ్మిన జనం.. ప్రధానంగా జగన్మోహనరెడ్డి తాను అధికారంలోకి వస్తే చేయబోయే నవరత్నాల పథకాలు, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం, స్థానిక అభివృద్ధి, యువత భవిష్యత్కు భరోసా తదితర అంశాలతో పాటు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు పశ్చిమ ప్రకాశాన్ని నిర్లక్ష్యంగా చూడటం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆశించిన రీతిలో నిధులు కేటాయించక పోవటం, వెలిగొండ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించటంతో ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో చూపించారు. జగనన్న గెలిస్తే తమ జీవితాలకు భరోసా ఉంటుందని జనం నమ్మడంతో పాటు స్థానికంగా ఆ పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో మంచి పేరు ఉండటం కలిసొచ్చింది. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దర్శి, కందుకూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ♦ యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదిమూలపు సురేష్, టీడీపీ తరుపున అజితారావులు ఈ ఎన్నికల్లో పోటీ పడగా 56.34 శాతం ఓట్లు సాధించిన సురేష్ 31632 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ♦ మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డికి, టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డికి మధ్య జరిగిన పోటీలో 52.11 శాతం ఓట్లు పొందిన నాగార్జునరెడ్డి టీడీపీ అభ్యర్థిపై 18,667 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. ♦ ఇక గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబుకు టీడీపీ అభ్యర్థి ముత్తముల అశోక్రెడ్డికి మధ్య జరిగిన పోటీలో 67.9శాతం ఓట్లు సాధించిన అన్నా 81,035 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు. ♦ కనిగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్కు టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డికి మధ్య నెలకొన్న పోటీలో 58.48 శాతం ఓట్లు తెచ్చుకున్న బుర్రాకు ఉగ్రపై 40,903 ఓట్లు ఆధిక్యం లభించింది. ♦ దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మద్ధిశెట్టి వేణుగోపాల్కు టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుకు మధ్య పోటీలో 57.29 శాతం ఓట్లు సాధించిన మద్దిశెట్టి 39,057 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హాకందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్రెడ్డి 51.69 శాతం ఓట్లు సాధించి, టీడీపీ అభ్యర్థి పోతుల రామారావుపై 14,936 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ♦ మొత్తంగా పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ లభించింది. గిద్దలూరులో అన్నా వెంకటరాంబాబుకు 80 వేల పై చిలుకు ఓట్ల రికార్డు మెజార్టీ లభించడం గమనార్హం. పశ్చిమ ప్రాంత వాసులు వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా మద్దతు పలికినట్లు స్పష్టమైంది. ఇక జిల్లాలోని మిగిలిన ప్రాంతాలోని జనం వైఎస్సార్సీపీకి వెల్లువలా ఓట్లేశారు. -
టీడీపీ నేతలందరూ కలసి వచ్చినా..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా రెండో మారు ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హవాతోపాటు రాచమల్లు సొంత ఇమేజ్ కూడా ఆయన విజయానికి కారణమైంది. టీడీపీ తరఫున నియోజకవర్గంలో నేతలు ఎక్కువగా ఉన్నారు. వారందరూ కలసి వచ్చినా వైఎస్ఆర్సీపీ తరఫున రాచమల్లు అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయనను ఓడించడానికి టీడీపీ నేతలు పన్నిన వ్యూహాలు ఫలించలేదు. ఈ కారణంగా రాచమల్లు మరో మారు పట్టు నిలుపుకొన్నారు. దీంతో ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. 2014 ఎన్నికల్లో తొలిమారు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాచమల్లు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. అనతి కాలంలోనే సొంత ఇమేజ్ను తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేసిన ఎమ్మెల్యే రాచమల్లుపై.. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆయన మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ వచ్చారు. పార్టీ మారాలని కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో రాచమల్లు ప్రకటించారు. ఈ కారణంగా ఆయన ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాచమల్లు విజయం ఎన్నికల కంటే ముందే ఖరారైనట్లు భావించవచ్చు. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులతో చర్చించిన సందర్భంలో.. ప్రజల మద్దతు రాచమల్లుకే ఉందని, ఆయన ఓటమి కోసం మనమంతా కష్టపడాలని సూచించారు. తెరపైకి వచ్చిన పలువురి పేర్లు ప్రజల మద్దతు కూడగట్టుకున్న రాచమల్లును ఓడించడానికి.. టీడీపీ అధిష్టానం చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలకు పట్టు లేదని, కొత్తగా పలువురి పేర్లను తెరపైకి తెచ్చింది. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ను తొలుత ప్రొద్దుటూరులో పోటీ చేయించాలని ప్రతిపాదించారు. మరో మారు మంత్రి ఆదినారాయణరెడ్డి కుమారుడిని పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. మరో వైపు ఆప్కో చైర్మన్ బండి హనుమంతు, సినీ హబ్ రాజేశ్వరరెడ్డి, డాక్టర్ వైవీ స్వరూప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, వీరశివారెడ్డి ఇలా అనేక మందిని తెరపైకి తెచ్చారు. చివరగా మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ విజయం సాధించే దిశలో భాగంగా వరదరాజులరెడ్డి, లింగారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇందులో భాగంగానే వరదరాజులరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ విజయం కోసం ఓ వైపు లింగారెడ్డి, మరో వైపు వరదరాజులరెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రొద్దుటూరులో అనుచర గణం కలిగి ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి రాచమల్లును ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టారు. బహిరంగ వేదికల్లో ఆయనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అయినా రాచమల్లు విజయాన్ని నిలువరించలేకపోయారంటే ఆయనకు ఉన్న ప్రజల మద్దతు ఏ పాటిదో అర్థమవుతోంది. కలిసొచ్చిన పార్టీ కార్యక్రమాలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా అదనంగా కలిసి వచ్చాయి. ఆయన ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయగా.. పార్టీ కార్యక్రమాలను కూడా వాడవాడలా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లారు. గడపగడపకు వైఎస్సార్, కావాలి జగన్– రావాలి జగన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో ప్రజలకు వివరించడంతోపాటు ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వ తీరును ఎండగట్టారు. టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి రాచమల్లు శివప్రసాదరెడ్డి విజయం సాధించారు. సింహం సింగిల్గా వస్తుందని రాచమల్లు నిరూపించారు. -
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పాలన చేస్తాం
-
అతిపిన్న వయస్కురాలైన ఎంపీగా మాధవి
విశాఖపట్నం, పాడేరు: అరకు లోక్సభ స్ధానం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి పార్లమెంట్లో అడుగుపెడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత సాధించనున్నారు. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక కావడం విశేషం. గతంలో హర్యానాకు చెందిన దుష్యంత్ చౌహన్ 28 ఏళ్ల వయస్సులో ఎన్నికై పార్లమెంట్కు వెళ్లి అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. ఇప్పుడు మాధవి 26 ఏళ్ల వయస్సులోనే ఆమె ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. వైరిచర్ల కిశోర్చంద్ర సూర్యనారాయణ దేవ్ వంటి ఉద్దండుల్ని ఓడించి మాధవి ఘనత సాధించడమే కాకుండా పిన్న వయస్కురాలిగా పార్లమెంట్కు వెళుతుండడం విశేషం. గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. గత 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి కొత్తపల్లి గీతకు 4,13,191ఓట్లు రాగా 91,398 పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన గొడ్డేటి మాధవికి 2.25 లక్షల మెజార్టీ రావడం విశేషం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్కు 3,60, 458 ఓట్లు రాగా 1,92,444 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే స్థాయిలో మాధవి కూడా భారీ ఆధిక్యత సాధించి ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీలందరి కంటే మాధవికి భారీ ఆధిక్యత లభించింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీకి మన్య ప్రాంత ప్రజలంతా బ్రహ్మరథం పట్టడంతో గొడ్డేటి మాధవికి భారీ ఆధిక్యత లభించింది. 2019 ఎన్నికల్లో అరకు లోక్సభ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు వివరాలు కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్(టీడీపీ)– 3,38,101, కేకేవీవీ సత్యనారాయణ రెడ్డి (బీజేపీ) – 17,867, గొడ్డేటి మాధవి (వైఎస్సార్సీపీ) – 5,62,190, శృతిదేవి వైరిచర్ల (కాంగ్రెస్) – 17,730, వంపూరు గంగుల మయ్య (జనసేన)–42,794, స్వాముల సుబ్రహ్మణ్యం (జనజాగృతి)– 4,710, అనుముల వంశీకృష్ణ(ఇండిపెండెంట్)– 10,240, కంగల బాలుదొర (ఇండిపెండెంట్)– 13,826, నరవ సత్యవతి( ఇండిపెండెంట్) – 11,236, బిడ్డిక రామయ్య( ఇండిపెండెంట్)– 7867 -
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ఏ కష్టమొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అండగా ఉందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఆయనను ఎనుకున్నారు. అనంతరం సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. 2014లో కేవలం ఒక్కశాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యామని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోవడంతో ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించామని అన్నారు. ఈ పరిణామం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అక్రమాలకు పాల్పడితే దేవుడు, ప్రజలు ఏరకంగా మొట్టికాయలు వేస్తారో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడు అక్రమంగా కొనుగోలు చేసిన ఎమ్మెల్యే సంఖ్య 23. చివరికు చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 23. ఫలితాలు వచ్చిన తేదీ కూడా 23. గతంలో మన పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీల సంఖ్య 3. ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఎంపీల సంఖ్య 3. ప్రజలు మనకు గొప్ప బాధ్యతను అప్పగించారు. వారి ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. 2024లో ఇంతకంటే గొప్ప విజయం సాధించాలి. మన సమర్థతకు మద్దతుగా ఓటేసే పరిస్థితి రావాలి. దేశం మొత్తం మన పాలనవైపు చూసేలా చేస్తాం. సుపరిపాలకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ విజయానికి కారణం నాతో పాటు మీ అందరి కృషి. ప్రతి గ్రామంలోని కార్యకర్త నాకు తోడుగా ఉండడంతోనే ఈ విజయం సాధించాం’’ అని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉమాశంకర్గణేష్కు సోదరులు పూరీ స్వాగతం
మాకవరపాలెం (నర్సీపట్నం) :ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గానికి వస్తున్న ఉమాశంకర్గణేష్కు తన సోదరులు పూరీ జగన్నాథ్, సాయిరాంశంకర్లు కూడా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. వీరు శుక్రవారం మండలంలోని వెంకన్నపాలెం చేరుకుని గణేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు కార్యకర్తలు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వీరితో కరచాలనం చేయడంతో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. పూరీ, జమీలు భేటీ నాతవరం: ప్రజలు రాజన్న రాజ్యం కోసమే సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఉహించని విధంగా భారీ మెజార్టీ ఇచ్చారని సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అంకంరెడ్డి జమీలు అన్నారు.వీరు శుక్రవారం నర్సీపట్నం ఎమ్మెల్యే విజేత పెట్ల ఉమా శంకర్గణేష్ నివాసంలో కలిశారు. -
పన్నెండు రెండై.. డిపాజిట్లు గల్లంతై!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఘట్టం ముగిసింది. గెలుపోటములపై అభ్యర్థులు సమీక్షల్లో మునిగిపోయారు. విజేతలు మెజార్టీపై లెక్కలు వేసుకుంటుంటే.. ఓటమిపాలైన అభ్యర్థులు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. ఉత్కంఠ రేపుతూ శుక్రవారం తెల్లవారుజాము వరకూ సాగిన కౌంటింగ్లో ఉరవకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. ఇక్కడ 2,135 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. దీంతో 2014 ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో 2 ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిస్తే.. వైఎస్సార్సీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ దఫా ఎన్నికల్లో 2 ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేయగా.. కంచుకోటగా చెప్పుకునే ‘అనంత’లో చావుతప్పి కనున్న లొట్టపోయినట్లు టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. 12 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, జనసేన 2014 వరకు జిల్లాలో 8మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2014 ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. పీసీసీ చీఫ్ రఘువీరాకు మినహా మరెవ్వరికీ ఆ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు. ఈ దఫా ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన రఘువీరాకు 15.16 శాతం అంటే 28,883 ఓట్లు పోలయ్యాయి. రఘువీరా మినహా కాంగ్రెస్ పోటీ చేసిన 12చోట్ల(రాప్తాడులో పోటీలేదు) డిపాజిట్లు కూడా దక్కలేదు. మాజీ మంత్రి శైలజనాథ్కు ఘోరంగా ఒక్కశాతం ఓట్లు కూడా పోలవ్వలేదు. కేవలం 1,384 ఓట్లతో 0.69శాతం ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. పుట్టపర్తి, కదిరి మినహా తక్కిన 10 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శైలజనాథ్ కంటే ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 2.19 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. జనసేనదీ అదే పరిస్థితి పవన్కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. శింగనమల, మడకశిరలో పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించారు. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్గుప్తా 19,878 ఓట్లతో 10.39శాతం ఓట్లు సాధించారు. ఇందులో జనసేనపార్టీ కంటే మధుసూదన్గుప్తా సామాజికవర్గం, వ్యక్తిగతంగా పోలైన ఓట్లే అధికం. అనంతపురంలో టీసీ వరుణ్ 10,920 ఓట్లతో 6.71శాతంతో అతికష్టం మీద డిపాజిట్ దక్కించుకున్నారు. ఇక్కడ కూడా పోలైన ఓట్లలో ఓ సామాజిక వర్గానికిచెందిన ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. వీరిద్దరు మినహా ఎక్కడా డిపాజిట్లు రాని పరిస్థితి. రాజధానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన 12మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజధాని అమరావతికి చేరుకున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నేడు జరగనున్న వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి జిల్లాకు చేరుకోనున్నారు. అయితే మంత్రి పదవి ఆశించే ఆశావహుల సంఖ్య వైఎస్సార్సీపీలో ఎక్కువగా ఉంది. వీరంతా రాజధానిలో మకాం వేసే అవకాశం ఉంది. సీనియారిటీ, మెజార్టీ, సామాజికవర్గ సమీకరణాలు, వారు గెలిచిన ప్రత్యర్థులు తదితర అంశాలను తమ అధినేతకు వివరించి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విన్నవించే అవకాశం కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానని వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు. ఈక్రమంలో భవిష్యత్తు పాలన దృష్ట్యా పార్లమెంట్కు ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. రెండు పార్లమెంట్లలో ఆరుగురు చొప్పున గెలిచారు. ఒక్కరు చొప్పున రెండు పార్లమెంట్లలో ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. తమ్ముళ్ల పుట్టి మునిగి.. అస్మదీయులు నిండా మునిగి సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ భారీగా సాగింది. జిల్లాలో అధికారికంగా ‘సాక్షి’కి వచ్చిన సమాచారం మేరకు దాదాపు రూ.170 కోట్ల బెట్టింగ్ జరిగింది. ఇది కాకుండా మరో రూ.50కోట్లకు పైగా బెట్టింగ్ జరిగి ఉంటుందని అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.220కోట్లు పందెం జరిగినట్లే. ఇందులో టీడీపీ వైపు పందెం కాసిన అభ్యర్థులు పూర్తిగా డీలాపడ్డారు. ముఖ్యంగా సర్వేలన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటిస్తే, లగడపాటి మాత్రమే టీడీపీ వస్తుందని చెప్పారు. టీడీపీకి వంతపాడే కొన్ని పత్రికలు కూడా పేరు తెలియని సర్వే సంస్థల పేరిట టీడీపీ వస్తుందని ప్రకటించారు. ఇవి నమ్మి పందేలు కాసిన వారు రూ.కోట్లు నష్టపోయారు. జిల్లా కేంద్రంలోని ఓ ఎమ్మెల్యే తాను గెలుస్తానని రూ.కోటి పందెం కాశారు. ఓ బట్టలవ్యాపారి మధ్యవర్తిగా పెట్టిన ఈ డబ్బును ఆయన కోల్పోయారు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తుందని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన స్నేహితులతో కలిసి రూ.7కోట్లు పందెం కాశారు. ఇదీ కోల్పోయారు. అనంత వెంకట్రామిరెడ్డికి 25వేల మెజార్టీ వస్తుందని ఓ నాయకుడు పందెం కాసి విజయం సాధించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా టీడీపీపై పందెం కాసి నిండా మునిగిపోయారు. రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరంపై భారీగా బెట్టింగ్ సాగింది. ఒక్క రాప్తాడు నియోజకవర్గంపైనే రూ.50కోట్లకు పైగా పందెం నడిచింది. అలాగే తాడిపత్రి, ధర్మవరం అసెంబ్లీతో పాటు అనంతపురం పార్లమెంట్పై కూడా భారీగా బెట్టింగ్ జరిగింది. నాలుగు దశాబ్దాలుగా ఓటమి ఎరుగుని నేతగా ఉన్న జేసీ దివాకర్రెడ్డి తనయుడు పవన్ ఈ విడత బరిలోకి దిగారు. దీంతో పవన్ గెలుస్తాడని తాడిపత్రి టీడీపీ నేతలతో పాటు ఇతరులు సుమారురూ.30కోట్ల వరకు భారీగా బెట్టింగ్ పెట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, పవన్ గెలుస్తారని ఏకంగా జేసీ దివాకర్రెడ్డే రూ.4కోట్ల వరకూ బెట్టింగ్ కాసి ఓడిపోయినట్లు తెలుస్తోంది. -
ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం
శింగనమల: ఎన్నికల్లో శింగనమల ఫలితంకోసం జిల్లా వాసులంతా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే 1978 నుంచి ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే...ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ ఈ సెంటిమెంట్ పండింది. శింగనమల నియోజకవర్గం 1978లో ఎస్సీకి రిజర్వ్ కాగా అప్పుడు జనతా పార్టీ నుంచి బి.రుక్మిణీదేవి ఇక్కడి నుంచి గెలవగా... రాష్ట్రంలో జనత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983లో టీడీపీ తరఫున పి.గురుమూర్తి ఎమ్మెల్యేగా ఎన్నికాగా, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 1985లో టీడీపీ తరఫున కె.జయరాం ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పి.శమంతకమణి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కె.జయరాం ఎన్నిక కాగా, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 1999లోనూ టీడీపీ తరఫున మళ్లీ కె.జయరాం ఎమ్మెలేగా గెలవగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా సాకే శైలజానాథ్ ఎన్నికకాగా...రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో కాంగ్రెస్ తరఫున సాకే శైలజానాథ్ విజయం సాధించగా.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. 2014లో టీడీపీ తరఫున యామినీబాల గెలువగా, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా 2019లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇలా శింగనమల సెంటిమెంట్ మరోసారి నిజమైంది. -
ఎంపీ స్థానాలు క్లీన్ స్వీప్!
చిత్తూరు అర్బన్: జిల్లాలో వెలువడ్డ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కనివినీ ఎరుగనిరీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించా రు. రాజంపేట పార్లమెంటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రెండోమారు అదే స్థానం నుంచి గెలుపొందారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న చిత్తూరులో ఫ్యాన్ గాలి వీచింది. తిరుపతి స్థానం వైఎస్సార్సీపీదేనంటూ ప్రజలు దుర్గాప్రసాద్ను ఆదరించి గెలిపించారు. మిథున్కే పట్టం రాజంపేట ఎంపీ స్థానానికి 2014లో పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తొలిసారిగా పోటీలో దిగారు. రాజకీయం ద్వారా ప్రజాసేవకు దగ్గరకావొచ్చనే అభిప్రాయంతో పోటీచేసిన తొలిసారే మిథున్రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుని రాజంపేటలో మిత్రపక్షానికి సీటును వదిలిచ్చింది. ఇక్కడ బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేసిన దగ్గుబాటి పురందేశ్వరి.. మిథున్రెడ్డి చేతిలో ఓడిపోయారు. వైఎస్సార్సీపీకి 6.01 లక్షల ఓట్లు పోలవగా.. బీజేపీకి 4.26 లక్షల ఓట్లు పడ్డాయి. ప్రత్యేక హోదా నినాదంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామాచేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లిన మిథున్పై బలమైన ప్రత్యర్థిని దింపడానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నించారు. అయితే ఇక్కడ నిలబడడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభను పోటీలోకి దించారు. తనవల్ల కాదన్నా.. మిథున్రెడ్డిని ఆర్థికంగా ఢీకొట్టి ఓట్లకు రూ.కోట్లు వెదజల్లే అభ్యర్థి సత్యప్రభేనంటూ బాబు చేసిన వ్యూహాలు తిప్పికొట్టాయి. ఎమ్మెల్యేగానే చిత్తూరు వాసులకు అందుబాటులో ఉండని సత్యప్రభను రాజంపేట ప్రజలు సైతం అంగీకరించలేకపోయారు. మిథున్రెడ్డికే రెండోమారు పట్టం కడుతూ తీర్పునిచ్చారు. ఈయనకు 7,02,211 ఓట్లు పడగా.. సత్యప్రభకు 4,33,927 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా పెద్దిరెడ్డి మిథున్రెడ్డి 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మిథున్కు వచ్చిన మెజారిటీ (1.75 లక్షల ఓట్లు)తో పోలిస్తే ఇది అత్యంత భారీ మెజారిటీ కావడం విశేషం. తిరుపతిలోనూ హవా తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బల్లి దుర్గాప్రసాద్ను ఇక్కడి ప్రజలు ఆదరించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం.. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈమె ఓటమికి కారణంగా నిలుస్తున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి వరప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దిగ్గా.. టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థికి సీటునిచ్చింది. వరప్రసాద్కు 5.80 లక్షల ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి జయరామ్కు 5.42 ఓట్లు పడ్డాయి. అయితే ఇప్పుడు వెలువడ్డ ఫలితాల్లో ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడి భారీ మెజారిటీ అందించారు. దుర్గాప్రసాద్కు 7,22,877 ఓట్లు పోలవగా.. పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ లెక్కన వైఎస్సార్సీపీ తిరుపతిలో 2,28,376 భారీ మెజారిటీ నమోదు చేసింది. వేషాలు పండలేదు టీడీపీకి కంచుకోటగా ఉన్న చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ బద్దలు కొట్టింది. 1996 నుంచి 2014 వరకు వరుసగా ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. రెండుసార్లు చిత్తూరు ఎంపీగా గెలిచిన శివప్రసాద్ మూడోసారి ఓటమి చవిచూశారు. తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో శివప్రసాద్ ఘోర పరాజయం పొందారు. పదేళ్లపాటు ఎంపీగా ఉన్న శివప్రసాద్ జిల్లా కేంద్రంలో ఎప్పుడూ అందుబాటులో ఉండలేదు. మెజారిటీ తెచ్చిపెట్టిన కుప్పంలో సైతం ఈయన కనిపించరు. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు అక్కడ నాలుగు వేషాలు వేయడం.. ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ జనాలకు కనిపిం చేవారు. దీంతో ఈయన్ను ప్రజలు ఆదరించలేదు. ఇదే సమయంలో వైఎస్ జగన్ చరీష్మా.. రెడ్డెప్ప చంద్రగిరి నుంచి కుప్పం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఉంటానని చెప్పడం గెలుపునకు కారణమయ్యింది. గత ఎన్నికల్లో శివప్రసాద్కు 44,139 ఓట్ల స్వల్ప మెజారిటీతో శివప్రసాద్ బయటపడ్డారు. కానీ ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డెప్పకు 6,86,792 ఓట్లు, శివప్రసాద్కు 5,49,521 ఓట్లు పడ్డాయి. 1,37,271 భారీ మెజారిటీతో వీచిన ఫ్యాన్ గాలికి సైకిల్ ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. -
ఫ్యామిలీ ఫ్యాక్స్ ఔట్
-
అహంకారమే అణచివేసింది!!
సాక్షిప్రతినిధి, అనంతపురం : జేసీ దివాకర్రెడ్డి.. ‘అనంత’తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణ నేత. 1985కు ముందు రాజకీయ ఆరంగేట్రం చేసిన దివాకర్రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఆపై 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఓటమి ఎరుగకుండా తాడిపత్రిలో ఏకఛత్రాధిపత్యం నడిపారు. 2014లో టీడీపీలో చేరారు. అప్పటి వరకు తాడిపత్రి వరకే పరిమితమైన జేసీ రాజకీయం మొదటిసారి అనంతపురం పార్లమెంట్ వరకు విస్తరించింది. ఎంపీగా గెలిచారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా దివాకర్ సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డి గెలుపొందారు. 2004–2014 వరకు కాంగ్రెస్, 2014–2019 వరకు టీడీపీలో వరుసగా 15ఏళ్లపాటు అధికారంలో ఉన్న జేసీ బ్రదర్స్ ఏది తప్పు? ఏది ఒప్పు? అనే విచక్షణ మరిచి ప్రవర్తించారు. చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న బాధ్యతాయుతమైన ఎంపీ, ఎమ్మెల్యేలమనే సంగతిని విస్మరించి ప్రవర్తించారు. ఈ ఐదేళ్లలో వీరు నోటి నుంచి వెలువడిన మాటలు...వాటికి ఉపయోగించిన భాష చూసి అంతా చీదరించుకున్నవారే! ఈ భాషేంటి అని అడిగితే..‘మేం పల్లెటూరోళ్లం...మా భాష ఇంతే!’ అహంకారపూరితంగా సమాధానం చెప్తారు. స్థాయి మరచి మాట్లాడారు.. దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు నందిగామ సమీపంలో ప్రమాదానికి గురై ప్రయాణికులు చనిపోతే.. ఈ వార్త రాసిన ‘సాక్షి’ పత్రిక ముందు ధర్నాకు జేసీ ప్రభాకర్రెడ్డి దిగారు. ప్రతిపక్షనాయకుడు కనీసం మర్యాద కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది...పత్రికలో రాయలేని భాషతో అరగంట పాటు ఇష్టానుసారం మాట్లాడారు. దీనిపై జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమ్ముడి కంటే తానేం తక్కువ కాదన్నట్లు జేసీ దివాకర్రెడ్డి ముఖ్యమంత్రి నుంచి మెప్పు కోసం ప్రతీ వేదికపై మైకు తీసుకుని సందర్భం కాకపోయినా, లేకపోయినా జగన్ ప్రస్తావన తీసుకొచ్చి ‘వాడు...వీడు!’ అనే సంబోధించారు. ఇదేంటని అడిగితే వయసులో నా కొడుకులాంటి వారు అని బుకాయిస్తారు. ప్రతిపక్షనేత అనే ఇంగితం కూడా మరిచారు. అంతకంటే లోకేశ్ చిన్నవాడు. దివాకర్రెడ్డి ఏ రోజైనా లోకేశ్ను అలా మాట్లాడారా? అలా మాట్లాడి టీడీపీలో ఒక్కరోజైనా నిలవగలడా? అన్నదమ్ములు ఇద్దరూ ఐదేళ్లుగా వ్యక్తిగతంగా ఇష్టానుసారం మాట్లాడిన ఏ ఒక్కరోజు కూడా జగన్ వారిని పల్లెత్తు మాట అనలేదు. అదీ జేసీబ్రదర్స్కు...జగన్రెడ్డికి ఉన్న తేడా! అరాచక పాలన.. తాడిపత్రి కేంద్రంగా జేసీ సోదరులు ఓ అరాచక పాలన సాగించారు. గ్రానైట్, ట్రాన్స్పోర్టు, మట్కా, పేకాట, కాంట్రాక్టులు, గెర్డావ్, సిమెంట్ ఫ్యాక్టరీలు....ఒకటేంటి...తాడిపత్రిలో ప్రతీ అంశాన్ని ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ప్రతీ ఒక్కరూ వీరికి కప్పం కట్టాల్సిందే!! కాకపోతే అధికారంలో చేతిలో ఉండటంతో ఎదురుతిరిగితే ఇబ్బంది పెడతారని మౌనంగా భరించారు. వారికి ఎదురుచెబితే వారి ఇంటికి కరెంటు కట్ చేస్తారు! నీళ్ల సరఫరా చేయరు. మునిసిపాలిటీ చెత్త వారి ఇంటి ముందే ఉంటుంది. అద్దెకు నివాసం ఉన్నవారైతే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని నుంచి ఒత్తిడి వస్తుంది! ఇలాంటి అరాచకాలతో తాడిపత్రి ప్రజలు నలిగిపోయారు. అయితే ఈ ఆవేశాన్ని పంటిబిగువన పెట్టుకుని అవకాశం కోసం ఎదురు చూశారు. అరాచకాలపై పెద్దారెడ్డి అలుపెరుగని పోరు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జేసీ సోదరుల అరాచకాలపై పోరాడారు. దీంతో పెద్దారెడ్డిని ఇబ్బందిపెట్టాలని వారు చూశారు. కేసులు మోపి, జైలుకు పంపి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయినా పెద్దారెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు. ఇదే క్రమంలో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో దివాకర్రెడ్డి పోరు పెట్టుకున్నారు. సిట్టింగ్లను మార్చాలని చంద్రబాబుతో పట్టుబట్టారు. దీంతో పార్లమెంట్లోని ఎమ్మెల్యేలంతా దివాకర్రెడ్డిపై తిరుగుబాటు చేశారు. ఇలా తాడిపత్రి, పార్లమెంట్ స్థానాల్లో ఇంటా, బయటా అటు ప్రజలతో ఇటు సొంతపార్టీ ఎమ్మెల్యేలతో దూరం పెంచుకున్నారు. ఓటమే.. వారసత్వం జేసీ సోదరులు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో తమ కుమారులను రాజకీయ వారసులుగా బరిలోకి దింపారు. ‘హైఫై లైఫ్’ గడిపే జేసీ పవన్రెడ్డిని ఎంపీగా, ప్రభాకర్రెడ్డి కుమారుడు అస్మిత్ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు. వీరి గెలుపుపై మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తే....ఎప్పుడు, ఏ ఎన్నికల్లో అయినా మేమే గెలుస్తామని సమాధానం చెప్పేవారు! ఈ మాటల్లో ధన, అధికార బల అహంకారం కన్పించేది! కానీ ఎన్నికల్లో ఘోరంగా వారసులు ఓడిపోయారు. నిజానికి పవన్, అస్మిత్లు రాజకీయనాయకులు కాదు. కేవలం వారసులుగా బరిలోకి దిగారు. అయితే వీరి ఓటమి మాత్రం వీరి తండ్రుల ఓటమే! ఒక్కమాటలో చెప్పాలంటే జేసీ బ్రదర్స్...వారి జూనియర్ బ్రదర్స్కు ఓటమిని వారసత్వంగా ఇచ్చారు. కనీసం 10–15 ఏళ్లపాటు వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయే పరిస్థితి కన్పించలేదు. ఇప్పటికే వయస్సు మీద పడిన జేసీ బ్రదర్స్ 15 ఏళ్లకు మరింత వృద్ధులవుతారు. ‘సరదా జీవితం’ గడిపే పవన్ ఇన్నేళపాటు పదవి లేకుండా రాజకీయం చేయడం కష్టమే! అస్మిత్దీ అదే పరిస్థితి! టీడీపీ ఓటమికి జేసీ దివాకర్రెడ్డే ప్రధాన కారణమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మండిపడుతున్నారు. చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో చంద్రబాబు కూడా వీరిని దూరం పెట్టే పరిస్థితి! ఈ మొత్తం అంశాలను నిశితంగా పరిశీలిస్తే ఇక జేసీ బ్రదర్స్ రాజకీయం అనేది గతమే! అనంతపురం రాజకీయాల్లో ‘జేసీ’ అనే మాట బహుశా ఇక విన్పించకపోవచ్చు!! -
రాష్ట్రంలో రామరాజ్యం ప్రారంభమైంది
-
జగన్ సీఎం కావడం సంతోషంగా ఉంది: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికకావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. పదేళ్లు అలుపెరగని పోరాటం చేసి ప్రజల మనస్సును గెలుచుకున్న నాయకుడు వైఎస్ జగన్అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కుటుంబం వైఎస్సార్ది అని, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను కోమటిరెడ్డి గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్కు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలైన కోమటిరెడ్డి.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆయన ఈ విధంగా మాట్లాడారు. -
సర్వేతో ప్రాణం తీశారు!
-
పార్టీల వారీగా ఓటింగ్ శాతం
-
ఆ ఆరు స్థానాల్లో టీడీపీ విజయం
సాక్షి నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెల్లడైన మూడు లోక్సభ, మూడు శాసనసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం ఎంపీ ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో ఈవీఎంల కంటే.. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల లెక్కింపు పెద్ద సవాల్గా మారింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి పోçస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా పోలయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంటుకు సర్వీసు ఓట్లు, పోస్టల్ ఓట్లు కలిసి మొత్తం 21,276 ఓట్లు పోల్ కాగా.. వీటిలో 14,626 మాత్రమే లెక్కించారు. ఇందులో టీడీపీకి 5,324 ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీకి 6,948 ఓట్లు వచ్చాయి. మిగిలిన 6,980 ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటిలో ఎక్కువ ఓట్లు వైఎస్సార్సీపీకి చెందినవి కావడంతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై గెలుపొందారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నిమ్మాడ పరిసరప్రాంతాల్లోని 259, 287, 288, 290, 291 పోలింగ్ బూత్లలో టీడీపీ మినహా ఇతర పార్టీలకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ఈ ఐదు బూత్లు నిమ్మాడ పరిధిలో ఉన్నందున అక్కడ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుల ప్రోద్బలంతో ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్కి పాల్పడ్డారని పోలింగ్ సరళి స్పష్టంచేస్తోంది. ఈ విషయాలపై వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం పార్లమెంటు రిటర్నింగ్ అధికారి, పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. చెల్లని ఓట్లను మళ్లీ లెక్కించాలని కోరినా ఆర్వో అనుమతివ్వలేదు. దీనిపై దువ్వాడ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుంటూరు, విజయవాడ లోక్సభ పరిధిలో.. గుంటూరు ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల క్రాస్ ఓటింగ్ కారణంతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ గుంటూరు వెస్ట్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరు చోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4,205 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి మోదుగులపై గెలుపొందారు. విజయవాడ ఎంపీ నియోజకవర్గంలో 8,726 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కేశనేని నాని వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్లూరి వీర ప్రసాద్పై నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. విశాఖ నార్తులో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ విశాఖ నార్తు నియోజకవర్గంలో వివాదాస్పద ఈవీఎంలో పడిన ఓట్లతో సంబంధం లేకుండా సీఈసీ ఆదేశాల మేరకు 1,944 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు గంటాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. వివాదాస్పదమైన ఐదు ఈవీఎంలకు చెందిన బూత్ల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకే రాజు సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వివాదాస్పదమైన ఈవీఎంలో ఓట్ల వల్ల ఫలితంలో పెద్దగా మార్పు లేని కారణంగా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాన్ని ప్రకటించవచ్చని సీఈసీ సూచించడంతో ఆర్వో ఫలితాన్ని ప్రకటించారు. ఉరవకొండలో స్వల్ప మెజార్టీతో నెగ్గిన కేశవ్ అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం ఇరు పార్టీలతోనూ దోబూచులాడింది. మొదటి 14 రౌండ్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరచగా, ఆ తర్వాత టీడీపీ పుంజుకుంది. కౌంటింగ్ సమయంలో ఐదు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని లెక్కించకుండా పక్కన పెట్టారు. ఇతర ఈవీఎంల కౌంటింగ్ ముగిసిన తరువాత పక్కనపెట్టిన ఈవీఎంల లెక్కింపుపై ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఎన్నికల అధికారి వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ పక్రియ శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ముగియగా.. 2,138 ఓట్ల మోజార్టీతో కేశవ్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వెలువడింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 1,503 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు 96,077 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరావుకు 94,574 ఓట్లు వచ్చాయి. -
టీడీపీకి అచ్చిరాని ‘23’!
రాయవరం (మండపేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తు‘ఫాన్’తో అడ్రస్ లేకుండాపోయిన తెలుగుదేశం పార్టీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ సెటైర్లు పేలుతున్నాయి. అందులో ప్రధానంగా ‘23’ సంఖ్య ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆ అంకె చంద్రబాబునాయుడుకు అస్సలు అచ్చిరాకపోవడమే. ‘23’ సంఖ్య చంద్రబాబుకు తీవ్ర పరాభవాన్ని మిగల్చడమే కాక.. టీడీపీ పుట్టి ముంచిందనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో 23 మందిని సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ తరఫున గెలిచిందీ 23మంది ఎమ్మెల్యేలే. అది కూడా 23వ తేదీనే కావడం విశేషం. దీంతో ఈ 23వ సంఖ్యే చంద్రబాబు కొంప ముంచిందని నెటిజెన్లు చేస్తున్న కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
‘అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి’
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు చేసిన పొరపాట్లు పోటీ చేసిన అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి. కీలక స్థానాల్లో నిబంధనలు పాటించకపోవడంతో ఫలితాలు తారుమారై ఓటమి పాలయ్యారు. ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పోస్టల్, సర్వీస్ ఓట్లు చెల్లకుండా పోవడం అభ్యర్ధుల్ని ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో ఓటమి అంచుల వరకూ వెళ్లిన కొందరు అధికార పార్టీ సిట్టింగులు... ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి బయటపడ్డారు. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించడంలో పోస్టల్, సర్వీస్ ఓట్లు కీలకంగా మారాయి. మూడు లక్షల అయిదువేల పోస్టల్ బ్యాలెట్లు, అరవైవేల సర్వీస్ ఓట్లను జారీ చేశారు. వీటిలో 2లక్షల 20వేల ఓట్లు... పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం12 పూర్తి చేయడంలో చేసిన పొరపాట్లుతో చెల్లకుండాపోయాయి. కొన్ని చోట్ల నిబంధనల మేరకు వాటిని సంరక్షించకపోవడం కూడా వివాదాస్పదమైంది. అలాగే కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు ఆ బ్యాలెట్ పేపర్ మీద వరుస నంబర్ నమోదు చేయకపోవడం, అదే నంబర్ను పోస్టల్ బ్యాలెట్ పంపే కవర్ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు ఓటమి బారి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. 6,653 ఓట్ల తేడాతో కింజారపు గెలిచారు. అలాగే గుంటూరు నుంచి గల్లా జయదేవ్ కూడా ఇలాగే సేఫ్ అయ్యారు. గుంటూరు పార్లమెంటు నియోజక వర్గంలోనూ భారీగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై 4205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్ గెలిచారు. పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. -
వైఎస్సార్సీపీ అసాధారణ విజయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణమైన విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. 2014 ఎన్నికల్లో కేవలం రెండు శాతం కన్నా తక్కువ ఓట్ల వ్యత్యాసంతో ఓటమి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఫలితాల్లో మాత్రం చరిత్ర రికార్డును బ్రేక్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 50 (49.95) శాతం ఓట్లను సాధించుకుంది. టీడీపీకి 39.18 శాతం ఓట్లు నమోదయ్యాయి. రెండు పార్టీల మధ్య 10.7 శాతం (దాదాపు 11 శాతం) ఓట్ల వ్యత్యాసం ఉంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం (1,56,86,511 ఓట్లు) ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో రికార్డు విజయం సాధించింది. 39 శాతం (1,23,03,620) ఓట్లతో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం రెండు శాతం లోపే ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలకు కలిపి 46.6 శాతం ఓట్లు రాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ రికార్డు సంఖ్యలో 151 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గతంలో 102 స్థానాలు గెలిచిన టీడీపీ ఈసారి 79 స్థానాలు కోల్పోయి 23 సీట్లు గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయగా, జనసేన మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈసారి సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేసింది. జనసేనకు 6 శాతం లోపు ఓట్లు పోలయ్యాయి. జనసేన మిత్రపక్షాలైన సీపీఐ (0.11 శాతం), సీపీఎం (0.32 శాతం), బీఎస్పీ (0.28 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈ పార్టీలన్నింటకీ కలిపి నోటాకు పోలైనన్ని ఓట్లు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో నోటాకు 1.28 శాతం (4,01,968 ఓట్లు) పోలయ్యాయి. లోక్సభ ఫలితాల్లోనూ రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ లో ఇదే సరళి కొనసాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.15 శాతం ఓట్లు నమోదు కాగా టీడీపీకి 39.6 శాతం ఓట్లు వచ్చాయి. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మధ్య పది శాతం ఓట్ల తేడా ఉంది. ఇంతటి భారీ తేడాతో ఓట్లు సాధించి అధికారం చేపట్టడం చరిత్రలో జరగలేదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్ (1.29 శాతం) బీజేపీ (0.96 శాతం) ఓట్లు రాగా నోటాకు 1.49 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన, సీపీఐ, సీపీఎంలతో పాటు మిగిలిన స్వతంత్రులందరికీ కలిపి 7.3 శాతం మేరకు ఓట్లు లభించాయి. జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 1.17 శాతం, బీజేపీ 0.84 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. ఈ పార్టీలు పోటీ చేసిన దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయాయి. జనసేన దాని మిత్రపక్షాల అభ్యర్థులు సైతం అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన అసెంబ్లీలో అధికార తెలుగుదేశం మిత్రపక్ష బీజేపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సభలో ఉండగా, అప్పట్లో నవోదయ పార్టీ తరఫున గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా సభలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ తప్ప మరోపార్టీ ప్రాతినిథ్యం లేదు. జనసేన తరఫున గెలిచిన ఒక సభ్యుడు (స్వతంత్ర) సభలో ఉండనున్నారు. -
కంచుకోటలో సీదిరి విజయభేరి
సాక్షి, పలాస (శ్రీకాకుళం): టీడీపీ కంచుకోట బద్దలైంది. వారసత్వ రాజకీయాలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం తర్వాత అత్యంత రాజకీయ చైతన్యం గల పలాస నియోజకవర్గం ప్రజలు ఈ ఎన్నికల్లో తమ చైతన్యాన్ని సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి రుచిచూపించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజును 16001 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. గురువారం వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో పలాసతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ఫ్యాన్’ గాలి జోరుగా వీయడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పూండి, పలాస, మందస, ఎమ్మెల్యే స్వగ్రామం దేవునల్తాడల్లో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. లాభించిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. పలాస ఎమ్మెల్యేగా గౌతు శివాజీ ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదు. దీనిని కూడా నిశితంగా ఇక్కడి ప్రజలు గమనించారు. ఆరు నెలల క్రితం వచ్చిన తిత్లీ తుపానులో నష్టపోయిన రైతులకు సరైన న్యాయం జరగలేదు. పరిహారం అర్హులకు అందలేదు. గ్రామాల్లో రాజ్యాంగేతర శక్తులుగా చంద్రబాబు పెంచి పోషించిన జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే అరకొర నష్టపరిహారం పంపిణీ జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులకే ముట్టజెప్పారు. పలాస నియోజకవర్గంలోనే ఉద్దానం ప్రాంతంగా చెప్పుకున్న వజ్రపుకొత్తూరు, మందస, పలాస, మండలాల్లోని రైతులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నది ఓట్ల లెక్కింపు సరళి తెలియజేస్తుంది. ఇదిలా ఉండగా, గౌతు శ్యామసుందరశివాజీ తన కుమార్తె శిరీషను తన రాజకీయ వారసురాలిగా నిలబెట్టడాన్ని కూడా ఇక్కడ ఓటర్లు సమ్మతించలేదు. దీనికి తోడు శిరీష భర్త వెంకన్న చౌదరి తన మామ శివాజీని అడ్డంపెట్టుకుని చేసిన ఆర్థిక అరాచకాలను ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ఏకపక్షంగా ఓట్లు.. ఎన్నికలకు కొద్ది నెలల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఈ ప్రాంతంలో జరగడం, ఆయన ఇచ్చిన హామీలు ప్రజల హృదయాలను తాకాయి. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్రకు ఎంత ఆదరణ లభించిందో జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు అంతే స్థాయిలో ఆదరణ వచ్చింది. వైఎస్సార్ సంక్షేమ పథకాలను మరువలేని ప్రజలు మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే లభిస్తాయన్న గంపెడు ఆశలతో ప్రజలు భావోద్వేగానికి లోనై ఏకపక్షంగా ఓటు వేసినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బోసిపోయిన టీడీపీ కార్యాలయం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఓ పక్క ఓట్లు లెక్కింపు కార్యక్రమం జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకుంది. ఒకప్పుడు పలాసలోని టీడీపీ కార్యాలయం కళకళలాడుతుండేది. ఎన్నికల లెక్కింపు వేళ గురువారం కార్యాలయం బోసిపోయింది. పైగా ఇటీవలే ఆ కార్యాలయానికి ఏసీ అమర్చిన నేతలు ప్రస్తుతం ఓటమి పాలవడంతో కార్యాలయం ముఖం చూడని పిరిస్థతి ఎదురైంది. ఎమ్మెల్యేగా డిక్లరేషన్ పొందిన సీదిరి పలాస వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా డాక్టర్ సీదిరి అప్పలరాజుకు అత్యధిక ఓటు మెజారిటీ రావడంతో పలాస ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.అనితాదేవి గురువారం సాయంత్రం డిక్లరేషన్ పత్రం అందజేశారు. అప్పలరాజు, సతీమణి శ్రీదేవిలు రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధ్రువపత్రం అందుకున్నారు. -
చరిత్ర సృష్టించిన సింహాద్రి
సాక్షి, అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే అయిన సింహాద్రి రమేష్బాబు రికార్డు మెజారిటీ సా«ధించారు. మొత్తం 19 రౌండ్లకుగానూ 17 రౌండ్లలో వైఎస్సార్సీపీ అత్యధిక మెజారిటీ సాధించగా, టీడీపీ రెండు రౌండ్లలో స్వల్ప ఆధిక్యత మాత్రమే కనబరచింది. దివిసీమలో తొలిసారి వైఎస్సార్సీపీ విజయ బావుటా ఎగురవేయడంతో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రికార్డు మెజారిటీ... అవనిగడ్డ నియోజకవర్గంలో మొత్తం 2,07,240 మంది ఓటర్లు ఉండగా, గత నెల 11న జరిగిన ఎన్నికల్లో 1,82,603 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీ తరఫున సింహాద్రి రమేష్బాబు, టీడీపీ తరఫున మండలి బుద్ధప్రసాద్, జనసేన తరఫున ముత్తంశెట్టి కృష్ణారావు పోటీచేయగా త్రిముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్బాబు రికార్డు స్థాయిలో 20,725 మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీగా నమోదైంది. 1962లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన తొలి ఎన్నికల మెజారిటీ 10,668 ఇప్పటి వరకూ అత్యధిక మెజారిటీగా నమోదైంది. అంతకంటే రెట్టింపు మెజారిటీ సాధించిన సింహాద్రి దివిసీమ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేశారు. ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణంతో 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు అంబటి శ్రీహరి ప్రసాద్ పోటీచేయగా, ఇంటిపెండెంట్ అభ్యర్థిపై 61,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నిక కావడం, ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో సింహాద్రికి పోస్టల్ బ్యాలెట్స్తో కలుపుకుని 78,434 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి మండలి బుద్ధప్రసాద్కు 57,701 ఓట్లు వచ్చాయి. 20,725 ఓట్ల బంపర్ మెజారిటీతో సింహాద్రి విజయ దుందుభి మ్రోగించారు. -
పేర్ని నాని ‘హ్యాట్రిక్’ విజయం
సాక్షి, చిలకలపూడి : బందరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) ముచ్చటగా మూడోసారి ఘన విజయం సాధించారు. ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. నియోజకవర్గంలో 1,84,506 ఓట్లు ఉండగా వీరిలో 1,46,476 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా 14 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ నుంచి పేర్ని నాని ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. రెండో రౌండ్లో 18వ నెంబరు బూత్కు సంబంధించి ఈవీఎం మొరాయించడంతో లెక్కింపు ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం రౌండ్ల ప్రక్రియ కొనసాగుతుండగా 148వ నెంబరు బూత్కు సంబంధించిన ఈవీఎం కూడా మొరాయించింది. దీంతో రౌండ్ల సంఖ్య పూర్తైన అనంతరం ఆయా బూత్లకు సంబంధించిన వీవీప్యాట్ల స్లిప్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లలో పేర్ని నానికి ఆదిక్యత లభించింది. నియోజకవర్గవ్యాప్తంగా 2,161 పోస్టల్ బ్యాలెట్లు, 37 సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో 1121 పోస్టల్ బ్యాలెట్లు, 12 సర్వీస్ ఓట్లు ౖవైఎస్సార్ సీపీ అభ్యర్థి పేర్ని నానికి లభించాయి. 511 పోస్టల్ బ్యాలెట్లు, 9 సర్వీస్ ఓట్లు టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు లభించాయి. వీటిలో 613 ఓట్లు పేర్ని నానికి ఆధికంగా వచ్చాయి. అనంతరం 15 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వీటిలో 65,008 వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు 59,770 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓటర్లు ఈవీఎంల ద్వారా వచ్చిన ఓట్లను మొత్తం లెక్కిస్తే టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కంటే పేర్ని నానికి 5,852 ఓట్లు ఆధిక్యత లభించింది. ఆయా రౌండ్ల వారీగా ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. -
ప్రజా విజయ 'కిరణం'
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్ట నష్టాలు చూసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఉన్న ఆధరాభిమానాలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్కు ఎమ్మెల్యేగా ప్రజలు భారీ మెజార్టీతో పట్టంకట్టారు.గురువారం విడుదలైన 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో భారీ గెలుపుతో ఫ్యాన్ స్పీడ్ విజయకేతం ఎగురవేసింది. టీడీపీ అరాచక, అవినీతి పాలనను అనుభవిస్తూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందక, మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించే జననేత వచ్చారని, ఐదేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు ఉండవని, జగన్మోహన్రెడ్డి సుపరిపాలనతో పాటు నవరత్నాల పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురుచూశారు. టీడీపీ అరాచక పాలనతో విసుగెత్తిన ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గొర్లె కిరణ్కుమార్, టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ప్రజలతో మమైకమై ప్రజా కష్టాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరి ఓటేశారు. వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. వైఎస్సార్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్కుమార్ను ఎన్నుకున్నారు. గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అనుహ్య మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ను గెలిపించారు. మండలంలోని 115 పంచాయతీల్లో అన్ని గ్రామాలు వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చి ప్రజలు వైఎస్సార్సీపీపై ఉన్న ఆదరాభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్సీపీదే ఆధిక్యత ఎచ్చెర్ల నియోజకవర్గంలో జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో అన్ని రౌండ్ల్లోనూ వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఏ దశలోనూ కనీసం టీడీపీ పోటీ ఇవ్వలేకపోయింది.కళా వెంకట్రావుపై గొర్లె కిరణ్కుమార్ అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. గొర్లె కిరణ్కుమార్ 18,813 ఓట్ల ఆధిక్యతతో టీడీపీకి చెందిన కళా వెంకట్రావుపై గెలిచారు. పనిచేయని ఈవీఎంలు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఓట్ల కౌంటింగ్లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. 45వ పోలింగ్ కేంద్రం నిద్దాం ప్రాంతానికి చెందిన ఈవీఎం, 172 కొవ్వాడకు చెందిన ఈవీఎంలు పనిచేయలేదు. ఓట్లు డిస్ప్లే కాకపోవడంతో ఆయా ఈవీఎంలను కౌంటింగ్ సూపర్వైజర్లు సరెండర్ చేశారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్లను లెక్కించి పరిగణనలోకి తీసుకున్నారు. స్పష్టమైన మెజార్టీ ఉండడంతో రాజకీయ పార్టీ ఏజెంట్లు సైతం ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు. మొరాయించిన 168వ నంబర్ పోలింగ్ ఈవీఎం విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఓటింగ్ కౌంటింగ్కు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో మెంటాడకు చెందిన 168వ పోలింగ్ కేంద్రం పనిచేయలేదు. ఈవీఎం స్థానంలో వీవీప్యాట్ను అధికారులు లెక్కించారు. ఈ కౌంటింగ్లో వైఎస్సార్సీపీకి– 335. టీడీపీకి–229 ఓట్లు, జనసేన–4 నమోదయ్యాయి. మిగిలిన ఓట్లు ఇతరకు నమోదయ్యాయి. ఎంపీకి స్పష్టమైన ఆధిక్యత వైఎస్సార్సీపీకి ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. 14,476 ఓట్లు ఆధిక్యత వచ్చింది. సుమారు 23 రౌండ్లో 22 ఆధిక్యం కొనసాగింది. బెల్లాన చంద్రశేఖర్ 96112 ఓట్లు, ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఎంపీ అశోక్కు 81636 ఓట్లు, జనసేన అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావుకు 4530, కాంగ్రెస్ అభ్యర్థి ఆదిరాజుకు 2134 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. కౌంటింగ్ను పరిశీలించిన కిరణ్కుమార్ శివానీ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన కౌంటింగ ప్రక్రియను గొర్లె కిరణ్కుమార్ పరిశీలించారు. తనకు మెజార్టీ వచ్చిన రౌండ్లు, గ్రామాలు పరిశీలించారు. జనరల్ ఏజెంట్లు పిన్నింటి సాయికుమార్, ఎం.మురళీధర్ బాబా పోలింగ్ సరళిని ఆయనకు వివరించారు. మెజార్టీ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల వివరాలు ఎచ్చెర్ల క్యాంపస్: విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించిన పోస్టల్ బ్యాలెట్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సగానికి పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో 1394 ఓట్లు వినియోగించుకోగా 726 ఓట్లు చెల్లలేదు. 668 ఓట్లు నమోదయ్యాయి. మూడు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 326 ఓట్లు వైఎస్సార్సీపీకి మెజార్టీ లభించింది. పోస్టల్ బ్యాలెట్లో నమోదైన ఓట్ల వివరాలు వైఎస్సార్సీపీ– 479, టీడీపీ– 153, జనసేన–42, కాంగ్రెస్–3, నోటా–5 తిరస్కరణ–3 మొత్తం– 685 422 సర్వీసులు ఓట్ల వినియోగం ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల జోన్లో 422 సర్వీసు ఓటర్ల నమోదయ్యాయి. ఇందులో 333 ఓట్లు చెల్లిన ఓట్లు 123,. టీడీపీకి–118, బీజీపే–34, జనసేన–51, కాంగ్రెస్–6, ఒక ఓటు తిరస్కరణకు గురైంది. -
మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం!
సాక్షి, విశాఖసిటీ: అనుభవం పనిచేయలేదు.. రాజ కుటుంబమనే గౌరవమూ దక్కలేదు. మూడు దశాబ్దాలుగా అధికారాన్ని కట్టబెడితే.. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన గిరిపుత్రులు రాజుని ఇంటికి సాగనంపారు. మట్టి మనిషి చేతిలో ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు. స్వచ్ఛమైన గిరి పుత్రికకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కల్మషం లేని మనుషులంతా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని జగనన్నకు కానుకగా అందించారు. తండ్రీ కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసిన గొడ్డేటి మాధవి తెగువ.. తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా.. బినామీ కొండను ఢీకొట్టి.. అమాయక గిరిజనుల్లో కొత్త శకానికి నాంది పలికారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి.. 30 ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న కిశోర్చంద్రదేవ్ని ఇంటికి సాగనంపారు. మొదటి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్కు అవకాశం ఇవ్వకుండా.. మాధవి ముందంజలో దూసుకుపోయారు. మొత్తంగా.. మాధవికి 5,51,560 ఓట్లు పోలవ్వగా.. కిశోర్చంద్రదేవ్కు 3,34,214 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వైరిచర్ల కుమార్తె శృతిదేవి 17,479 ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోయారు. ఈమె కంటే నోటాకు (47,376) రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు పోలవ్వడం గమనార్హం. తొలి రౌండ్లో మొదలైన వైఎస్సార్సీపీ ఆధిక్యం.. ఎక్కడా తగ్గకుండా.. దూసుకుపోయింది. మొత్తంగా.. 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఓటుతో గుణపాఠం చెప్పిన గిరిజనం సుదీర్ఘ రాజకీయ అనుభవం.. రాజరిక వారసత్వం.. 30 సంవత్సరాలు పార్లమెంట్లో గడిపారన్న ఘన చరిత్ర.. ఇవన్నీ చెప్పుకోడానికే తప్ప.. ఓటు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కనీసం కృషి చేయలేదన్న అపవాదుని కిశోర్ చంద్రదేవ్ మూటకట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. నియోజకవర్గాన్ని పట్టించుకున్న సందర్భం లేదు. ఈ వ్యతిరేకతే.. అనుభవానికి గుణపాఠం చెప్పింది. అసలేం చేశారని ఓటెయ్యాలంటూ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కిశోర్చంద్రదేవ్ కుమార్తె శృతి దేవిని సైతం సాగనంపారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ఘోర పరాజయం చవిచూశారు. తండ్రీ కుమార్తెలను గిరి పుత్రులు ఓటుతో గుణపాఠం చెప్పారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్
సాక్షి, విశాఖసిటీ: పార్టీపై నమ్మకంతో గెలిపిస్తే ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గారు. ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతూ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన నేతల తలరాతల్ని ఓటర్లు మార్చారు. విశ్వాసఘాతుకానికి పాల్పడితే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఓటర్లు బుద్ధి చెప్పారు. ఫిరాయింపుదారులు మళ్లీ తలెత్తుకోనివ్వకుండా గుర్తుండిపోయే ఓటమిని రుచిచూపించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించి అధికార టీడీపీకి అమ్ముడు పోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని ఘెర పరాజయాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. 2014లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గిడ్డిని ఓడించి బుద్ధి చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన భాగ్యలక్ష్మి చేతిలో 40,900 ఓట్ల తేడాతో గిడ్డి ఈశ్వరి ఓటమి పాలైంది. అదే విధంగా అరకులో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014లో విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సర్వేశ్వరరావు స్థానంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్కుమార్కు మంత్రి పదవి కట్టబెట్టి.. 2019 అరకు ఎమ్మెల్యే టికెట్ను టీడీపీ అప్పగించింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శెట్టి ఫాల్గుణ ఫిరాయింపు ఎమ్మెల్యే కుమారుడు, తాజా మాజీ మంత్రి శ్రావణ్కుమార్ని 33,172 ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. ఎలాంటి సానుభూతి చూపకుండా అరకు ప్రజలు కిడారిని ఇంటికి సాగనంపారు. ఇక అరకు ఎంపీగా వైఎస్సార్సీపీ విజయం సాధించిన కొత్తపల్లి గీత.. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచింది. టీడీపీ, బీజేపీ వైపు చూసిన గీత.. చివరికి జనజాగృతి పార్టీని స్థాపించి విశాఖ ఎంపీగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీకి గీత చేసిన అన్యాయాన్ని గుర్తించుకున్న ప్రజలు.. డిపాజిట్ రాకుండా చేశారు. 12 లక్షల పై చిలుకు ఓట్లు పోలైన విశాఖ ఎంపీ స్థానంలో ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీతకు కేవలం 1,127 ఓట్లు మాత్రమే పోలవ్వడం హాస్యాస్పదం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. -
రవిపై.. సీతారామ బాణం
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్గాలి స్పీడ్కు సైకిల్ అడ్రస్ లేకుండా పోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి వైఎస్సార్సీసీ విజయం ఏకపక్షంగా సాగింది. తొలి రౌండ్ నుంచి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధిపత్యం కొనసాగించారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించగా 1, 8 రౌండ్లలో తప్ప మిగిలిన అన్ని రౌండ్లతో తమ్మినేని సీతారాం స్పష్టమైన మెజార్టీ సాధించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయినప్పటికి తమ్మినేని 77,233 ఓట్లు సాధించగా, కూన రవికుమార్ 63,377 ఓట్లతో సరిపెట్టుకున్నారు. జనసేనకు 3186 ఓట్లురాగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్, బీజేపీలు నాలుగంకెల స్థానాన్ని చేరుకోలేకపోయాయి. నోటాకు 2637 ఓట్లు రావడం విశేషం. ఏకపక్షంగా సాగిన ప్రజాతీర్పులో సిటింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్పై తమ్మినేని సీతారాం 13,856 ఓట్లు మెజార్టీతో విజయం సాగించారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం, నవరత్నాలు సీతారాంను విజయ తీరాలకు చేర్చాయి. ఐదేళ్లుగా తమ్మినేని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి తరఫున పోరాటం చేశారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ప్రజల హృదయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. దీనికి తోడు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్ వైఎస్సార్సీపీ విజయానికి దోహదం చేశాయి. కాగా గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. నియోజకవర్గంలో కూన ఇసుక దందాలు, భూదందా, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు బుద్ధిచెప్పారు. -
తీరంలో ఫ్యాన్ గాలికి సైకిల్ విలవిల..
సాక్షి, విశాఖపట్నం : ఐదేళ్ల నాటి హుద్హుద్.. ఇటీవలి ఫొని తుపాన్లను మించిన ప్రచండ తుపాను గురువారం రాష్ట్రాన్ని తాకింది. అవి వాతావరణం సృష్టించిన తుపాన్లయితే.. ఇప్పుడు రాష్ట్రాన్ని తాకింది వైఎస్సార్సీపీ తుపాను.. ఫ్యాను గాలి ప్రచండమై.. ఝంఝామారుతంలా ప్రజా ఓట్ల రూపంలో వెల్లువెత్తి తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో కూల్చేసింది. ఇద్దరు మంత్రులను మట్టికరిపించింది. మరో మంత్రిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. జనసేన అధినేత పవన్ను.. ఆయన పార్టీ తరఫున రాత్రికి రాత్రి విశాఖ లోక్సభ అభ్యర్థిగా దిగుమతై.. క్రాస్ ఓటింగ్తో గెలిచేస్తామన్నంత హడావుడి చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణలకు ప్రజాబలం జెల్లకొట్టింది. నడమంత్రపు తాయిలాలు చెల్లవని తేల్చి చెప్పింది. వెరసి.. విశాఖ తీరంలో వైఎస్సార్సీపీ ఓట్ల తుఫాను ధాటికి టీడీపీ కోటలు కూలిపోయాయి. గ్రామీణ జిల్లాలో ఫ్యాన్ ప్రచండ వేగానికి ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అర్బన్ జిల్లా పరిధిలో మూడు స్థానాల్లో మాత్రమే అతికష్టం మీద నిలదొక్కుకోగలిగింది. ఓట్ల వర్షంలో తడిసి ముద్దయిన వైఎస్సార్సీపీ మొత్తం 11 అసెంబ్లీ.. 3 లోక్సభ స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చివరి రెండు రౌండ్లకు చెందిన నాలుగు ఈవీఎంలు మొరాయించడంతోపాటు ఒక వీవీప్యాట్ మిస్ కావడంతో లెక్కింపు నిలిచిపోయింది. అర్ధరాత్రి సమయానికి తుది సమాచారం ప్రకారం.. మంత్రి గంటా శ్రీనివాసరావు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా 1500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా రెండు రౌండ్ల ఫలితాలు, పోస్టల్ బ్యాలెట్ల వివరాలు అందాల్సి ఉన్నందున ఆయన గెలుపు గాలిలో ఉన్నట్లే.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఈ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు తెలుగుదేశం మంత్రులను ముప్పుతిప్పలు పెట్టి మట్టికరిపించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడును సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం ప్రజలు ఈసారి పక్కన పెట్టారు. ఓటమి రుచి చూపించారు. ఇక తండ్రి మరణం నేపథ్యంలో.. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి వెలగబెట్టిన కిడారి శ్రావణ్కుమార్పై అరకు ప్రజలు ఏమాత్రం కరుణ చూపలేదు. వైఎస్సార్సీపీపై వారికి ఉన్న ఆదరణ ముందు తండ్రి మరణించారన్న సెంటిమెంట్ కూడా పని చేయలేదు. ఏకంగా నోటా కంటే తక్కువ ఓట్లు వేసి అట్టడుగుకు నెట్టేశారు. విశాఖ ఉత్తర నుంచి పోటీ చేసిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావును సైతం చివరి రౌండ్ల వరకు ఓటర్లు చుక్కలు చూపించారు. తుది సమాచారం అందేసరికి ఆయన అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. -
చింతమనేనికి చుక్కెదురు..
సాక్షి, ఏలూరు (టూటౌన్) : అసెంబ్లీ ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ సుడిగాలికి ప్రభుత్వ విప్ చింతమేని ప్రభాకర్ కొట్టుకుపోయారు. ఇంతకాలం ఒక నియంతలా తనకు ఎదురులేదని విర్రవీగిన చింతమనేనికి నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుథంతో గట్టిగా బుద్ధి చెప్పారు. రాజకీయాలకు కొత్త అయిన సాఫ్ట్వేర్ ఇంజినీరు అయిన కొఠారు అబ్బయ్య చౌదరిని ఆదరించారు. రాజకీయాలకు కొత్త అయినా విద్యావంతుడు కావడం, ఆయన మాట తీరు, వ్యవహార శైలి నచ్చడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పట్ల ప్రజలు చూపిన ఆదరణ వెరసి ఈ ఎన్నికల్లో విప్ చింతమనేని ప్రభాకర్కు తగిన గుణపాఠం చెప్పాయంటూ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో పాటు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తిట్ల దండకం అందుకోవడం, చేయి చేసుకోవడం, అధికారులను వేధింపులకు గురిచేయడం వంటి అనేక కారణాలతో చింతమనేనిని ప్రజలు వ్యతిరేకించారు. గత పదేళ్లుగా చింతమనేని వ్యవహార శైలితో విసుగు చెందిన నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గంలోని ఓట్లను 18 రౌండ్లలో లెక్కించగా 9, 18వ రౌండ్లలో మినహా మిగిలిన 16 రౌండ్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి స్పష్టమైన మెజార్టీ సాధించారు. 9వ రౌండులో టీడీపీకి 5,834, వైసీపీకి 4,779 ఓట్లు రావడంతో ఈ రౌండులో టీడీపీ 1,055 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. చివరి రౌండు అయిన 18వ రౌండ్లో టీడీపీ 2,140 ఓట్లు సాధించగా వైసీపీ 1,928 ఓట్లు సాధించింది. దీంతో ఆఖరి రౌండులో టీడీపీకి 212 ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. ఈ రెండు రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఓట్ల వరకూ మెజార్టీ సాధిస్తూ వచ్చింది. చివరకు మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ౖవైసీపీ అభ్యర్థి కొఠారు అబ్యయ్య చౌదరి 17,559 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో దెందులూరులో చింతమనేని అడ్డాలో కొఠారు అబ్బయ్య చౌదరి పాగా వేశారు. -
ఫ్యాన్ హోరుకు కొట్టుకుపోయిన ‘సైకిల్’
ఆయన ధైర్యమే ఒక సైన్యమయ్యింది.. ఒదిగి ఉన్న ఓర్పే అగ్ని కణమై మండింది.. పెను నిశ్శబ్దమే.. దిక్కులు పిక్కటిల్లేలా విజయనాదం మోగించింది.. అణచివేసే అన్యాయాన్ని అంతం చేసేలా.. బడుగు జీవుల ఆశా దీపమై.. కన్నీళ్లు తుడిచే నాయకుడిగా నిలబెట్టింది..ఆ జన నాయకుడికి కృష్ణా తీరం సాహో అంటూ జై కొట్టింది. కనీవినీ ఎరుగని రీతిలో ఓట్ల తు‘ఫ్యాన్’ను సృష్టించింది. ఉద్దండులను సైతం మట్టికరిపిస్తూ గెలుపు పతాక ఎగరవేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ సత్తా చాటింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకంగా 14 కైవసం చేసుకుంది. సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ సత్తా చాటింది. ఫ్యాన్ సునామీకి సైకిల్ ముక్కచెక్కలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం దక్కింది. బెజవాడ ఇక అభివృద్ధి పథంలో పయనించనుంది. ఓట్లతోనే మాట్లాడారు.. పల్లె, పట్టణ ఓటర్లు ఏకమయ్యారు. ఫ్యాన్పై అభిమానం చూపారు. ఓట్ల వర్షం కురిపించారు. రూ. కోట్లు కుమ్మరించిన వారిని ఓట్లతో తిప్పి కొట్టారు. తిరుగులేని రీతిలో జవాబిచ్చారు. రైతు వర్గాల్లో, పల్లె జనాల్లో తమకే పట్టు ఉందని బీరాలు పలికిన టీడీపీ సైకిల్కు పంచరు చేశారు. మచిలీపట్నం, ఏలూరు ఎంపీ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారు. బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి.. కేవలం రెండు నియోజకవర్గాలతో సరిపెట్టుకున్న టీడీపీ.. గన్నవరం నియోజకవర్గంలో కొద్దిపాటి మెజార్టీతో బయటపడింది. ఆది నుంచి మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత కనబర్చిన వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్య నాయకులుగా చెలామణి అయిన కొల్లురవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, బొడె ప్రసాద్ లాంటి వారికి ఓటమి తప్పలేదు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి. 16 నియోజకవర్గాల నుంచి 205 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లోనూ 27 మంది పోటీలో నిలిచారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జిల్లాలో స్తబ్దుగా ఉన్న వాతావరణం నిన్నటి నుంచి వేడిగా మారింది. ఎన్నికలు ముగిశాక కౌంటింగ్కు 43 రోజులు వేచి చూసిన అభ్యర్థులు గురువారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠగా ఫలితాల సరళిని గమనించారు. కంచుకోటకు బీటలు.. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లా ఆ పార్టీకి అండగానే నిలుస్తూ వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలతోపాటు 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరో స్థానంలోనూ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీని గెలిపించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వాణిజ్య నగరమైన విజయవాడ భాగమవడం.. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడంతో జిల్లా అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఊహించుకున్నారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజాహిత కార్యక్రమాలు ఏమీ చేపట్టకపోవడంతో ప్రజలు ఆపార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతకు ఓట్లతో హారతి పట్టారు. ఎగ్జిట్పోల్స్ ఫలితాలు మాదిరిగానే 13 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన మెజార్టీ రావడంతో దేశం కోట ముక్కచెక్కలైంది. ఆధిక్యం దోబూచులాట.. గన్నవరం అసెంబ్లీ స్థానం లెక్కింపు కేంద్రంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వైఎస్సార్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ల మధ్య ఆధిక్యం దోబూచులాడగా.. వెంకట్రావ్ మొదటి నుంచి ఫలితాల సరళిని గమనించారు. అయితే కౌంటింగ్ కేంద్రానికి రాని వంశీ చివరలో మొరాయించిన ఈవీఎంలు లెక్కింపు విషయంలో కలెక్టర్ ఇంతియాజ్తో మాట్లేందుకు సాయంత్రం కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. చివరకు ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్లలోని స్లిప్లను లెక్కిం చగా 820 ఓట్లతో వంశీ బయటపడ్డారు. హోరాహోరీ.. సెంట్రల్ అసెంబ్లీ స్థానం లెక్కింపు కేంద్రంలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా, వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్టుల నడుమ నువ్వా నేనా అన్నట్లు హోరాహోరి పోరు జరిగింది. మొదట కొన్ని రౌండ్లపాటు ఆధిక్యంలో ఉన్న వైఎస్సార్సీపీ 15 రౌండ్ ముగిసే సరికి 64 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బొండా ముందంజలోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి రౌండు రౌండ్కూ ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు 17వ రౌండ్ వచ్చే సరికి 1659 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. చివరి మూడు రౌండ్లలో మెజార్టీ నీదా నాదా అన్నట్లు సాగి.. చివరకు మల్లాది విష్ణు 19 ఓట్లతో గెలుపొందారు. -
ఈ గెలుపు జగన్దే
సాక్షా, ఒంగోలు సిటీ : జగన్ పడిన కష్టం ఫలించింది. ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమాన్ని చేయాలనుకొనే మంచి మనస్సుకున్న ఆశయం నెరవేరింది. తన విజయం జగన్దే. ఈ గెలుపు ఆయన ఇచ్చిందేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉద్వేగంగా అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నుంచి అభిమానుల కోరిక మేరకు వారి వద్దకు విచ్చేశారు. ఆయనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. నవరత్నాలే జగన్ను గెలిపించాయన్నారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి ముందు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల కార్యక్రమాలను అమలు చేస్తారన్నారు. మంచి ముఖ్యమంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకుంటారన్నారు. రానున్న పాతికేళ్లు ఆయనే సీఎం అన్నారు. ఆయన జనం మనిషి. సీఎం పదవిలో ఉన్నా నిత్యం జనం సమస్యలనే ఆలోచిస్తుంటారన్నారు. జనం బాధలు, కష్టాలు వారి నష్టాలను తెలుసుకొనేందుకే పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రలో జనం పడ్తున్న బాధలను స్వయంగా చూశారన్నారు. ఎవరో చెబితే విని ప్రజలు ఇలా ఉన్నారని అనుకొనే నాయకుడు కాదని చెప్పారు. నేరుగా జనంతో కలిసి వారితో నడిచి వారితోనే నిత్యం జీవించిన జగన్ ఇక తన పాలనలో ఒక్కరంటే ఒక్కరైనా ఇబ్బంది పడకుండా జనరంజకంగా పాలన అందిస్తారన్నారు. జగన్ రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజల వద్దకు వచ్చే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అభిమాన నీరాజనం బాలినేని శ్రీనివాసరెడ్డికి అభిమానులు నీరాజనం పలికారు. గురువారం సాయంత్రం అబిమానులను పలుకరించేందుకు ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆయనను అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కలిశారు. బాలినేనిని అభిమానులు తమ భుజాలకెత్తుకున్నారు. కేకలు వేశారు. కేరింతలు కొట్టారు. బాలినేనిని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నుంచి బయటకు భుజాలపైనే తెచ్చారు. అక్కడి నుంచి వీఐపీ రోడ్డులోని బాలినేని ఇంటికి వచ్చారు. అక్కడ మహిళా ప్రతినిధులు, నాయకులు గులాము కొట్టారు. బాలినేనికి రంగు చల్లి రంగులో ముంచెత్తారు. మహిళా నాయకులు గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, కావూరి సుశీల తదితరుల ఆధ్వర్యంలో బాలినేనికి హారతులిచ్చారు. బాలినేని సతీమణి బాలినేని శచీదేవి, బాలినేని సోదరి రమణమ్మలు ఎర్రనీళ్లతో దిష్ఠి తీశారు. అభిమానుల నడుమ విజయోత్సవాన్ని పంచుకున్నారు. తిరిగి వీవీఫ్యాట్స్ లెక్కింపు కోసం గురువారం సాయంత్రం తిరిగి ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా బాలినేని అభిమానులు నగరంలో మతాబులు కాల్చారు. అభిమానులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
పశ్చిమలో గ్లాస్కు పగుళ్లు..
సాక్షి, ఏలూరు (మెట్రో): జిల్లా నుంచి గెలుస్తాను అనే ధీమాతో ఎన్నికల బరిలో దిగిన జనసేన అధినేత పవన్కళ్యాణ్కు పరాభవం ఎదురైంది. భీమవరం అసెంబ్లీ పరిధిలో పోటీ చేసిన జనసేనాని ఓటమి చవిచూశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాలకు 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన జనసేన ఏ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులు కొన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చినా అది వృథా అయింది. గోపాలపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనసేన తరఫున అభ్యర్థులను నిలపలేదు. జిల్లావ్యాప్తంగా జనసేనకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే.. చింతలపూడిలో 11,739, దెందులూరులో 6,116, ఏలూరులో 16,681, నిడదవోలులో 22647, ఆచంటలో 13,856, పోలవరంలో 13,378, ఉంగుటూరులో 10,721, పాలకొల్లులో 32,984, నరసాపురంలో 48,701, భీమవరంలో 62285, ఉండిలో జనసేన మిత్రపక్షమైన సీపీఎంకు 24737, తణుకులో 31,502, తాడేపల్లిగూడెంలో 35,325 ఓట్లు ఆ పార్టీ సాధించింది. అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో 76,481, నరసాపురం పార్లమెంటు పరిధిలో 2,45,867 ఓట్లను జనసేన సాధించింది. -
జై..జై జగనన్న
సాక్షి, ఒంగోలు సిటీ : జై జగనన్న..జైజై జగనన్న నినాదం మార్మోగింది. ఒంగోలులో అభిమానుల కేరింతలు.. కార్యకర్తల ఉత్సాహంతో పండువ వాతావరణం నెలకుంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి విడతలో వైఎస్సార్ సీపీకి ఆధిక్యం రావడంతో జోష్ నిండింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒంగోలు నగరం బోసి పోయింది. కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరిచారు. టీవీలకు అతుక్కుపోయారు. ఉదయం నుంచి ఫలితాలపై దృష్ఠి సారించారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ఓట్ల లెక్కింపు మొదలయిన దగ్గర నుంచి క్షణక్షణం వస్తున్న ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జై జగన్ అంటూ కేరింతలు, రెట్టించిన ఉత్సాహంతో వీదుల వెంట యువకులు కన్పించారు. నగరంలో మోటారు బైక్లతో యువకులు సందడి చేశారు. యువకులు బుల్లెట్ వాహనాలతో వీధుల్లో సందడి చేశారు. జై జగన్..వాసన్నకు జిందాబాద్ అంటూ యువకులు సందడి చేశారు. స్థానిక మంగమూరు డొంకలోని వైఎస్సార్ విగ్రహం వద్ద యువకులు వైఎస్సార్ సీపీ విజయోత్సాహంతో గులాములు చల్లుకున్నారు. రోడ్లన్నీ గులాబి రంగు మయమైంది. ఎండలో యువకులు వసంతమాడినట్లుగా ఉంది. మతాబులతో మోతెక్కించారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా సందడి చేశారు. ఫ్యాన్తో విశ్రాంత ఉద్యోగులు సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఫ్యాన్ గాలి సునామి నేపథ్యంలో విశ్రాంత ఉద్యోగులు పట్టరాని సంతోషంతో ఫ్యాన్ చేపట్టుకొని జగన్నినాదాలు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి జిందాబాద్లు పలికారు. స్ధానిక అభిలాష్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ ఎంప్లాయిస్ విభాగం ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. షేక్ అబ్దుల్ బషీర్, వరద వెంకట కృష్ణారావు, కె.ఎల్.నరసింహారావు, శెట్టి గోపి, ఎస్.కె.జిలాని, ఎస్.వెంకటస్వామి, ఇ.వెంకటేశ్వర్లు, వెంకారెడ్డి, సుందరం, మొహిద్దీన్, బి.గిరి, కె.జేసురత్నం, ఎస్.కె.జిలాని తదితరులు వైఎస్సార్ సీపీ ఘన విజయం వేడుకల్లో పాలుపంచుకున్నారు. శచీదేవిని కలిసిన మహిళలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఘన విజయంతో పాటు విశేష మెజారిటీ సాధించినందుకు ఆయన సతీమణి బాలినేని శచీదేవిని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా «అధ్యక్షురాలు గంగాడ సుజాత, ఒంగోలు నియోజకవర్గం అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ ఆధ్వర్యంలో మహిళా ప్రతినిధులు కలిసి అభినందించారు. శచీదేవి వీరికి సాంప్రదాయబద్దంగా కుంకుమబొట్టుతో గౌరవించారు. కావూరి సుశీలతో మహిళా నాయకుల పాల్గొన్నారు. -
తూర్పు గోదావరి పార్లమెంట్ విజేతలు వీరే..
రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆయన ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గరగా చూశారు. ఆ సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం జరుగుతుంది. నాలాంటి యువకులనెందరినో జగన్ ప్రోత్సహించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం ఇచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తాను. ప్రస్తుతం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడింది. – మార్గాని భరత్ రామ్, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం ఎంపీ కాకినాడ నాయకత్వ పటిమ–జనాదరణ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాయి. నిత్యం ప్రజలతో మమేకమై కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని భరోసానిచ్చిన జగన్ వంటి నేతకు ప్రజలు బ్రహ్మరథం పడతారనడానికి ప్రస్తుత ఎన్నికల ఫలితాలే నిదర్శనం. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో పేదవర్గాల ప్రజల కోసం శ్రమిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలపడింది. అందువల్లే ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. నవరత్న పథకాలు, ఇతర హామీలు కూడా ప్రభావాన్ని చూపించాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. – వంగా గీతావిశ్వనాథ్, వైఎస్సార్ సీపీ కాకినాడ ఎంపీ అమలాపురం నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతతో ఉంటాను. తనపై నమ్మకం ఉంచి పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తాను. ముఖ్యమంత్రి కానున్న జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమ పథకాల అమలుతోపాటు, అన్నిరంగాల్లోను అభివృద్ధి సాధించగలదన్న ఆకాంక్షిస్తున్నాను. నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకూ రుణపడి ఉంటాను. నియోజకవర్గంలో నేను పరిశీలించిన స్థానిక సమస్యలన్నింటిని పరిష్కరించి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తాను. – చింతా అనూరాధ, వైఎస్సార్ సీపీ అమలాపురం ఎంపీ -
పశ్చిమలో ఫ్యాన్‘టాస్టిక్’
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అద్భుతం.. మైండ్ బ్లోయింగ్.. ఫ్యాంటాస్టిక్.. ఇది ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్. గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసి ప్రజలూ ఇదే ఉద్వేగానికి లోనయ్యారు. జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనం ఉవ్వెత్తున వీచింది. వైఎస్సార్ సీపీ అత్యధికంగా 13 స్థానాల్లో జయభేరి మోగించింది. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలనూ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీని 2 స్థానాలకు పరిమితం చేసి అద్భుతాన్ని ఆవిష్కరించింది. మూడు లోక్సభ స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది. పశ్చిమలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. జనసేన అధ్యక్షుడు కూడా ఘోరపరాజయం పాలయ్యారు. ఇది కచ్చితంగా సామాన్యుడి విజయం.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తప్పు చేసినందుకు జిల్లా ప్రజలు ఈసారి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. తాము గతంలో చేసిన తప్పు పునరావృతం కాకుండా చూసుకున్నారు. తొమ్మిదేళ్లుగా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేసిన పాదయాత్రికుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజలు పట్టం కట్టారు. ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న ఆకాంక్షతో ఘన విజయం కట్టబెట్టారు. ఈసారి ఏకంగా వైఎస్సార్ సీపీకి 13 స్థానాలను ఇవ్వగా, తెలుగుదేశం పార్టీ చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా రెండుస్థానాలకు పరిమితమైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్ధులకు కూడా భారీ మెజారిటీలు వచ్చాయి. భీమవరం, తణుకు సీట్లలో గెలుపు తీవ్ర ఉత్కంఠకు దారితీసినా ఆ రెండుస్థానాలను కూడా వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. మార్పు కోసం అంటూ వచ్చిన జనసేనాని పవన్కల్యాణ్కు కూడా ఈ జిల్లా ఓటమి రుచి చూపించింది. ఓడిన ఉద్దండులు గతంలో పవన్కల్యాణ్ సోదరుడు చిరంజీవి పాలకొల్లు నుంచి ఓటమిపాలు కాగా, ఈసారి పవన్ కళ్యాణ్, నరసాపురం ఎంపీగా పోటీ చేసిన మరో సోదరుడు నాగబాబు కూడా ఓటమిపాలయ్యారు. సొంత జిల్లాలో ముగ్గురు అన్నదమ్ములు ఓటమి పొందిన చరిత్ర మెగా కుటుంబానికే దక్కింది. మంత్రి పితాని సత్యనారాయణకు ఘోరపరాజ యమే మిగిలింది. గత ఎన్నికల్లో గెలిచిన వారిలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మినహా మిగిలిన వారందరూ మాజీలుగా మారిపోయారు. భీమవరం, నరసాపురం సీట్లలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బండారు మాధవనాయుడు మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ తరఫున గెలిచి మంత్రి పదవిని చేపట్టిన మాణిక్యాలరావు నరసాపురం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓటమి చవిచూశారు. చిం తమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందేలు, జూదం అంటే చెవి కోసుకునే చింతమనేని.. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయనకు ఓటర్లు గట్టిగానే సమాధానం చెప్పారు. 17వేలపైచిలుకు తేడాతో యువకుడైన అబ్బయ్యచౌదరి చేతిలో ఓటమి చవిచూశారు. ఉత్కంఠ రేపిన భీమవరం భీమవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ జనసేనపార్టీ అధినేత పవన్కల్యాణ్పై 8,691 ఓట్లు తేడాతో ఘనవిజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మూడో స్ధానంతో సరిపెట్టుకోవల్సివచ్చింది. మొదటి రౌండ్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్థి అంజిబాబు 259 ఓట్లు మెజార్టీ సాధించినా తరువాత వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ ఆదిక్యత కనబర్చారు. తరువాత కొన్ని రౌండ్లలో జనసేన పార్టీ అభ్యర్థి పవన్కల్యాణ్ ముందంజలో ఉండడంతో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. చివరకు శ్రీనివాస్ విజయం సాధించినట్లు వెల్లడికావడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జిల్లాలో అత్యధిక మెజార్టీ బాలరాజుదే పోలవరం నుంచి తెల్లం బాలరాజు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం అభ్యర్థిపై 42,405 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏలూరులో ఎమ్మెల్సీ ఆళ్ల నానీ మూడోసారి ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేశారు. ఈ లెక్కింపులో అభ్యర్థుల మెజార్టీ రౌండ్ రౌండ్కీ దోబూచులాడింది. చివరికి నాని 3,235 ఓట్ల మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో నానికి మొత్తం 828 ఓట్లు పోలవడంతో నాని సాధించిన మెజార్టీ 4,063కు చేరుకుంది. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యతను ఇచ్చారు. త్రిముఖ పోటీలో కొట్టు సత్యనారాయణ 15,877 మెజారిటీతో గెలుపొందారు. ఆచంటలో వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతిలో మంత్రి పితాని సత్యనారాయణ ఘోరపరాజయం పాలయ్యారు. 14 వేల పైచిలుకు మెజారిటీతో పితానిని చెరుకువాడ ఇంటిదారి పట్టించారు. కొవ్వూరులో తెలుగుదేశం కంచుకోటను 25 వేలకు పైగా మెజార్టీ ఓట్లతో వైఎస్సార్సీపీ బద్దలు కొట్టింది. ఐదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలిచిన తానేటి వనిత 25,241 ఓట్ల భారీ మెజారిటీతో కొవ్వూరు నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోపాలపురంలో 37 వేలకు పైగా రికార్డు మెజారిటీతో వైఎస్సార్ సీపీ అభ్యర్ధి తలారి వెంకట్రావు గెలిచారు. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ పార్టీ అభ్యర్ధి వీఆర్ ఎలీజా 35,264 ఓట్ల ఆధిక్యతో విజయం సాధించారు. నిడదవోలులో రెండుసార్లు గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి బూరుగుపల్లి శేషరావుపై జి.శ్రీనివాసనాయుడు 20వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. గంట గంటకూ ఉత్కంఠకు గురిచేసిన తణుకు నియోజకవర్గ ఫలితం చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వరించింది. తణుకు నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరోసారి విజయం సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ముదునూరు ప్రసాదరాజు 7,221 ఓట్ల తేడాతో జనసేన అభ్యర్థిపై గెలుపొందారు. ఇక్కడ సిట్టింగ్ తెలుగుదేశం అభ్యర్ధి మాధవనాయుడు మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుపై 11,300 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాలకొల్లు ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు 18వేల ఓట్ల తేడాతో రెండోసారి గెలిచారు. లోక్సభా స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ జయకేతనం ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా కోటగిరి శ్రీధర్ సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుపై లక్షా 32 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. నరసాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కనుమూరి రఘురామకృష్ణంరాజు 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మార్గాని భరత్రామ్కు కూడా జిల్లాలో మంచి మెజారిటీ వచ్చింది. -
ఏపీ లోక్సభ ఎన్నికల్లో ‘సిత్రాలు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 25 స్థానాలగానూ 22 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలిచారు. ఆరుగురు అభ్యర్థులు 2 లక్షలకు పైగా మెజారిటీతో విజయాలు దక్కించుకున్నారు. ఎనిమిది మంది లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అత్యల్ప మెజారిటీతో గట్టెక్కారు. (అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు వీరివే..) అత్యధిక మెజారిటీ.. ♦ కడపలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డి 380976 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై విజయం సాధించారు. ♦ రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్రెడ్డి 268284 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ నంద్యాలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మనందరెడ్డి 250119 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మంద్రా శివానందరెడ్డిపై గెలుపొందారు. ♦ తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లిదుర్గాప్రసాద్ 228376 ఓట్ల ఆధిక్యం సాధించారు. ♦ అరకులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి 224089 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్పై విజయం దక్కించుకున్నారు. ♦ ఒంగోలులో టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 214851 ఓట్ల తేడాతో గెలిచారు. అత్యల్ప మెజారిటీ.. ⇔గుంటూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ⇔విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి మాత్కుమిల్లి భరత్పై వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ 4414 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ⇔శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై కె. రామ్మోహన్ నాయుడు 6653 ఓట్ల తేడాతో గెలిచారు. ⇔విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని 8726 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్పై విజయాన్ని దక్కించుకున్నారు. -
మాగుంట సంచలనం
సాక్షి, ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంచలనం సృష్టించారు. ఒంగోలు పార్లమెంట్లో 48 ఏళ్ల క్రితం నమోదైన భారీ మెజార్టీ రికార్డును బ్రేక్ చేశారు. 1952లో ఒంగోలు పార్లమెంట్ ఏర్పడగా, 1971లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన అంకినీడు ప్రసాదరావు తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి గోగినేని భారతీదేవిపై రికార్డు స్థాయిలో 1,79,894 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రికార్డును బ్రేక్ చేసిన వారు లేరు. అనంతరం 1980లో పులివెంకటరెడ్డి 1,51,175 ఓట్ల మెజార్టీ వద్ద ఆగిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం 2019 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో రాత్రి 11.47 గంటల సమయానికి తన సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కంటే 2,12,522 ఓట్ల ఆధిక్యంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి ముందంజలో ఉన్నారు. 1971లో అంకినీడు ప్రసాదరావు నెలకొల్పిన రికార్డును మాగుంట బ్రేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి 1998లో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కరణం బలరాం చేతిలో ఓటమిపాలైనప్పటికీ 2004 ఎన్నికల్లో 1,06,021 ఓట్ల మెజార్టీతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009 ఎన్నికల్లోనూ 78,523 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారి ఎంపీగా పోటీచేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డిపై 15,658 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తాజాగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేసి ఒంగోలు పార్లమెంట్ చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నారు. -
టీడీపీ కోటలో వైఎస్సార్ సీపీ పాగా
సాక్షి, పెదకూరపాడు: తెలుగు దేశం పార్టీ కంచుకోట అయిన పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ తొలిసారి జెండా ఎగురువేసింది. తెలుగుదేశం పార్టీ పట్టున్న గ్రామాల్లో సైతం వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. తొలి రౌండ్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు సమీప టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్పై ఆధిక్యతను సాధించారు. మొత్తం 19 రౌండ్లు జరిగిన కౌంటింగ్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు 14,104 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. టీడీపీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జనసేన పార్టీ మూడో స్థానంలో నిలిచింది. రౌండ్ రౌండ్కు పెరిగిన మోజార్టీ పెదకూరపాడు నియోజకవర్గంలో మొత్తం 2,22,675 ఓట్లు ఉండగా, వాటిలో 1,96,466 ఓట్లు పోలైయ్యాయి. అందులో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 99,577 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్కు 85,473 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ అభ్యర్థి పుట్టి లక్ష్మీసాంమ్రాజ్యంకు 7,156 ఓట్లు వచ్చాయి. మొత్తం 265 పోలింగ్ కేంద్రాలు ఉండగా కౌంటింగ్కు మొత్తం 19 రౌండ్లు నిర్వహించారు. పోస్టల్లోనే భారీ మెజార్టీ పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో పోస్టల్లోనై వెఎస్సార్ సీపీ విజయబావుట ఎగురవేసింది. మొత్తం 1239 ఓట్లుకు గాను వైఎస్సార్సీపీ 706 టీడీపీకి 352, జనసేనకు 42 ఓట్లు వచ్చాయి. ఉద్యోగులు కూడ వైఎస్సార్సీïల వైపు మొగ్గు చూపారు. తొలిసారి పోటీ.. తొలిసారి ఎమ్మేల్యే నంబూరు.. ప్రత్యేక్ష ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మేల్యేఅ భ్యర్థిగా పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు ఎమ్మేల్యేగా గెలుపొందారు. తొలిసారి పోటీలో నిలిచి విజేతగా నిలిచారు. -
విజయనగరం: రాజులకు శృంగభంగం
సీనియర్లమని గొప్పగా చెప్పుకున్నవారికి... రాజులం మాకు ఇక ఎదురు లేదనుకున్నవారికి... మా మాటే వేదం... మేం చెప్పిందే శాసనం అనుకున్నవారికి... జనాన్ని పట్టించుకోకపోయినా... మా విజయానికి తిరుగులేదని విర్రవీగిన వారికి తాజా ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయి. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని... పదవికోసం గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి తగిన శాస్తి జరుగుతుందని ఈ ఫలితాలు తెలియజేశాయి. జిల్లాలో రాజులు అనుకున్నవారెవ్వరూ విజయాన్ని అందుకోలేకపోవడం గమనార్హం. సాక్షి, విజయనగరం: మహారాజుకి ఎదురు మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితుల్లో అనాదిగా నిరాదరణకు గురవుతున్న ప్రజానీకంలో వచ్చిన చైతన్య దీప్తి ఈ తీర్పు. జిల్లా టీడీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవకపోగా, కనీసం మహారాజులైనా విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడం జిల్లా చరిత్ర తిరగరాసినట్టయింది. జిల్లాలో రాజులందరినీ ఏకం చేశానని... ఇక తమ పార్టీకి ఎదురే లేదని ఆశపడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తీరని నిరాశే ఎదురయింది. తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతిరాజు తన స్థానాన్ని పదిలపర్చుకోలేకపోగా... కనీసం విజయనగరం శాసనసభ్యురాలిగా ఆయన కుమార్తె అదితి గజపతిని కూడా గెలిపించుకోలేక చతికిల బడ్డారు. ఇక్కడ అశోక్పై వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన బెల్లాన చంద్రశేఖర్, అదితి గజపతిపై పోటీచేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిలు విజయం సొంతం చేసుకున్నారు. బొబ్బిలిరాజుల చరిత్రకు చరమగీతం బొబ్బిలి రాజుల హవాకు మరోసారి చెక్ పడిం ది. ఇక్కడ తాము ఏం చెబితే అలా... తాము ఏ పార్టీలో ఉంటే అదే విజయం సాధిస్తుందని మొదటినుంచీ ధీమాగా ఉండేవారు. అదే ఇప్పుడు వారి కొంప ముంచింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికై... స్వప్రయోజనాలకోసం పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి అధిష్టించిన సుజయ్ కృష్ణ రంగారావుకు తగిన శాస్తి జరిగింది. బొబ్బిలిలో సమీప ప్రత్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేని శత్రుచర్ల చినమేరంగి రాజుగా రెండు జిల్లాలకు చిరపరిచితుడై... ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీగా... కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న శత్రుచర్ల విజయరామరాజు తన సత్తా నిరూపించుకోలేకపోయారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన సోదరి నరసింహప్రియా థాట్రాజ్ కూడా సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి వారికి సమీప బంధువైన పాముల పుష్పశ్రీవాణి చేతిలో ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్చంద్రదేవ్ సైతం అరకు పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓ సామాన్య గిరిజన మహిళ, వైఎస్సార్సీపీ అభ్యర్థి గొట్టేటి మాధవి చేతిలో ఓటమిపాలయ్యారు. సాలూరులో భంజ్దేవ్కు భంగపాటు సాలూరు రాజుగా గుర్తింపు పొందిన ఆర్.పి. భంజ్దేవ్ ఈసారి మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఒకసారి విజయం సాధించిన ఈయన కుల వివాదంలో చిక్కుకుని ఓటమిపాలయ్యారు. తరువాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి గిరిజనుడిగా ధ్రువపత్రం పొంది పోటీకి దిగినా ఓటమి తప్పలేదు. ఈయన కూడా ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేశారని... దేవుని మాన్యాలు సొంతం చేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అవే తన ఓటమికి ఒక విధంగా కారణాలయ్యాయి. దోచుకోవడంలో వారు దిట్ట అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్దేవ్ తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్చంద్రదేవ్ ఈ ఎన్నికల్లో సడన్గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరారు. ఇలాంటి వారి వల్ల జిల్లా ప్రజలకు వరిగేదేమీలేదని గుర్తించిన ప్రజలు తమ ఓటుతో వీరి తరతరాల పెత్తనానికి చరమగీతం పాడారు. -
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా : నంబూరు శంకర్రావు
సాక్షి, అచ్చంపేట : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అత్యధిక మెజార్టీ సాధించి ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, తన విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం రాత్రి ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. ప్రశ్న: మీరు ఈ విజయాన్ని ఎలా భావిస్తున్నారు.? జవాబు: ఈ విజయం జగన్మోహనరెడ్డి విజయంగా భావిస్తున్నా.. ప్రజా విజయంగా భావిస్తున్నాను. జగన్ అలుపెరగకుండా 14 నెలలపాటు పాదయాత్ర చేయడం, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, ప్రతి సమస్యను జగన్ అయితేనే పరిష్కరించగలడని ప్రజలు నమ్మడం వల్లే నాకు ఈ గెలుపు సాధ్యపడింది. ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గమనించిన సమస్యలేంటి, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు? జవాబు: నియోజకవర్గంలో ముఖ్యంగా సాగునీరు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల మండల కేంద్రాలకు వెళ్లే రహదారులన్నీ చిన్నాభిన్నమై నడిచేందుకు కూడా వీలు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిన్నింటినీ వచ్చే ఆరు నెలల కాలంలో పరిష్కరించేందుకు కృషిచేస్తా. ప్రతి చివరి భూమికీ సాగునీరు అందేల చూస్తా. పూర్తికాని మరమ్మతుల్లో ఉన్న ఇరిగేషన్ స్కీములను క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తా. ప్రశ్న: మీ విజయానికి ముఖ్యమైన కారణాలేవి. జవాబు: జగన్ కష్టమే నా విజయం. గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. జన్మభూమి కమిటీలతో అక్రమాలు, మట్టి, ఇసుక దోపిడీలు జరిగాయి. ప్రజలు టీడీపీ పాలనపై విరక్తి చెందారు. మార్పు కోరుకున్నారు. జగన్మోహనరెడ్డిని సీఎంగా చూడాలనుకున్నారు. అందువల్లనే విజయం సాధించగలిగాను. ప్రశ్న: నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? జవాబు: రాజధాని పరిధిలో ఉన్నదనేగాని, పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ లేదు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమని నిర్మించి నిరుద్యోగులందరికి ఉపాధి అవకాశాలను కల్పించాలనుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలన్నదే నా ఆశయం. ప్రశ్న: రైతులకోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా? జవాబు: ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్నదే నా ఆశయం. రైతులు పండించిన పంటను నిల్వ ఉంచుకునేందుకు నియోజకవర్గంలో ఒక్క కోల్డు స్టోరేజీ కుడా లేదు. వెంటనే కోల్డు స్టోరేజ్ ఏర్పాటుకు కృషి చేయాలనుకుంటున్నా. ప్రశ్న: ఆధ్యాత్మికంగా ఏం చేయాలనుకుంటున్నారు? జవాబు: అమరావతిలో అమరలింగేశ్వరస్వామి దేవాలయం ఉంది. అందువల్ల అమరావతి ఆధ్యాత్మిక నగరంగా మరింత తీర్చి దిద్దాలనుకుంటున్నాను. అదే విధంగా అచ్చంపేట మండలం, మాదిపాడును పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలనుకుంటున్నా. ప్రశ్న: నియోజకవర్గంలో ఏఏ సదుపాయాలు కల్పించుకుంటున్నారు? జవాబు: నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి మండలాలు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. కృష్ణానది దాటాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో సంప్రదించి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై బ్రడ్జి నిర్మించేందుకు ప్రయత్నం చేస్తా. ప్రశ్న: చివరగా ప్రజలకు మీరు ఏమి చెప్పదలచారు? జవాబు: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాను. ఇంకా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. వైఎస్సార్ సీపీ, జగన్మోహనరెడ్డి, నాపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. -
టీడీపీ ప్రముఖులకు పరాభవం
2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అధికార పార్టీకి చుక్కెదురైంది. 19 నియోజకవర్గాలకూ 14 వైఎస్సార్ సీపీ గెలవగా, నాలుగు మాత్రమే టీడీపీ దక్కించుకుంది. ఒకేఒక సీటుతో జనసేన సరిపెట్టుకుంది. కీలక నేతల ఓటమి పాలవ్వడమే కాకుండా జిల్లాల్లో పెద్దన్నల పాత్ర పోషిస్తున్న ప్రముఖులకు సైతం కన్నులొట్టపోయింది. జిల్లాకు చెందిన ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు ఘోరంగా ఓడిపోయారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంకు చెందిన కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు కూడా ఓటమి పాలయ్యారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా పోటీ చేసిన పెద్దాపురం నియోజకవర్గంలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అతి కష్టంమీద గెలవగలిగారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో అధికార పార్టీ దుర్నీతిని ప్రజలు తీవ్రంగా ఎండగట్టారు. ఐదేళ్ల దుష్ట పాలనకు చరమగీతం పాడారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కొత్తపేట, తుని నియోజకవర్గాల్లో అధికార పార్టీని ఓడించినది వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం విశేషం. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్టుడు తుని నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఇసుక, కొండలను సైతం మింగిన నేతలుగా యనమల సోదరులు పలు విమర్శనలను ఎదుర్కొన్నారు. అదే అభిప్రాయం నియోజకవర్గ ప్రజలు తమ ఓట్ల ద్వారా స్పష్టం చేశారు. యనమల రామకృష్ణుడు తన పంటి వైద్యానికి ప్రభుత్వ సొమ్ముని బిల్లుగా చెల్లించిన ఘటనతో పలు విమర్శలను ఎదుర్కొన్నారు. త్రిముఖ పోరు నెలకొన్న తుని నియోజకవర్గంలో సిట్టి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తన సమీప ప్రత్యర్థి, మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు సోదరుడిపై 24 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆర్ఎస్ నియోజకవర్గంలో... శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి(ఆర్ఎస్) చెందిన కొత్తపేట నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి బండారు సత్యానందరావు ఓటమి పాలయ్యారు. ఇసుక అక్రమాల్లో ఆరితేరిన నేతలుగా నియోకవర్గంలోని అధికార పార్టీ నేతలు పేరు గడించారు. వారిని నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఓడించారు. త్రిముఖ పోటీ నెలకొన్న నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుపై గెలిచారు. పరువు నిలుపుకున్న రాజప్ప ఇక డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంలో అతికష్టంపై గెలిచారు. ఆయన గెలుపు కోసం అన్ని ఆయుధాలను వినియోగించారు. సామర్లకోట మండలం నవర గ్రామంలో స్టీల్ గిన్నెలను పంపిణీ చేయడం, డబ్బు పంపిణీ తదితర ప్రలోభాలతో ఆయన గెలుపు సాధ్యమైందని విశ్వేషకులు భావిస్తున్నారు. తోటకు బ్రేక్ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేగా, ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి, గెలవగల సత్తా ఉందని చెప్పుకునే రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను ఆ నియోజకవర్గ ప్రజలు ఓడించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆయనపై విజయం సాధించారు. మరో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు కూడా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచిన వర్మ వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. -
చరిత్ర సృష్టించిన ఆర్కే
సాక్షి, మంగళగిరి : నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్పై ఘన విజయం సాధించిన వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చరిత్ర సృష్టించారు. 2014 ఎన్నికలలో కేవలం 12 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే ఆర్కే 2019లో లోకేష్పై భారీ మెజార్టీతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. లోకేష్పై ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పిన ఆర్కేను నియోజకవర్గ ప్రజలు మరో సారి ఆదరించి విజయం అందించారు. గురువారం ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్కు బయలుదేరిన ఆర్కే తొలుత శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీలోని కౌంటింగ్ హాలుకు చేరుకుని కౌంటింగ్ను పర్యవేక్షించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్కేకు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. లోకేష్ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోవడం విశేషం. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు మాత్రం ఆర్కే నీతి నిజాయతీతో ముఖ్యమంత్రి అవినీతిపై పోరాటం, రాజధాని రైతులకు అండగా నిలవడంతో మద్దతుగా నిలిచారు. రాజన్న క్యాంటీన్ పేరుతో రూ.4లకే పేదల ఆకలి తీర్చడంతో పాటు రాజన్న రైతుబజార్ పేరుతో రూ.10లకు ఏడురకాల కూరగాయలు అందజేయడం వంటివి ఆర్కే విజయానికి కారణమయ్యాయి. మంత్రి లోకేష్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోవడం, ఐదేళ్ల కాలంలో టీడీపీ నాయకులు చేసిన అవినీతి వారి ఓటమికి కారణమైందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నామినేషన్ రోజు నుంచే ప్రచారంలోనే లోకేష్పై ఆర్కే విజయం సాధించారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడం, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వై.ఎస్. షర్మిల బహిరంగ సభలు విజయవంతం చేయడంతోనే ఆర్కే విజయం ఖరారైంది. వై.ఎస్.జగన్ సైతం ఆర్కేను గెలిపిస్తే తన క్యాబినెట్లో మంత్రి అవుతారని చెప్పడం, ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేయడం వంటివాటితో ప్రజలు అండగా నిలిచి గెలిపించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) 5,769 ఓట్లతో విజయం సాధించారు. ఎమ్మెల్యే ఆర్కేకు 1,05,083 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్కు 99,314 ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 25,042 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1600పైగా పోల్కాగా, ఉద్యోగులకు అవగాహన లేకపోవడంతో 100 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. వీటిలో ఎమ్మెల్యే ఆర్కేకు 70 ఓట్లు మెజార్టీ లభించింది. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయడంలో పొరపాటుగా వ్యవహరించారా! లేక అధికారులే కావాలని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రిజక్ట్ చేశారనే విషయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 145వ బూత్ ఈవీఎం మొరా యించడంతో అధికారులు వీవీ ప్యాట్లను లెక్కపెడుతుండడంతో రాత్రి పదిన్నర గంటలకు సైతం అధికారులు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఓటమిని ముందే గ్రహించిన టీడీపీ అభ్యర్థి లోకేష్తో పాటు టీడీపీ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు మినహా మిగిలిన నాయకులు ఎవరు కౌంటింగ్ కేంద్రం వైపు రాలేదు. విజయంపై విశ్వాసంతో ఉన్న ఎమ్మెల్యే ఆర్కే ఉదయం నుంచి కౌంటింగ్ హాలులోనే ఉండి కౌంటింగ్ను పర్యవేక్షించారు. -
విజయనగరం: కొత్త చరిత్ర
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ జిల్లాలో సునామీ సృష్టించింది. అన్ని స్థానాలనూ క్లీన్స్వీప్ చేసి చరిత్రను తిరగరాసింది. జిల్లా అవిర్భావం తర్వాత ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలవడం ఇది రెండోసారి. 1994 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అప్పటికి ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం, పార్వతీపురం పార్లమెంట్ స్థానాలను ఎన్టీఆర్ కైవసం చేసుకున్నారు. ఆ రికార్డును ఇప్పుడు బద్దలుకొట్టి జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసింది. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లే అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. 2014 తర్వాత ఆయనపై జిల్లా వాసులు నమ్మకం పెంచుకున్నారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం.. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తానని పదేపదే చెప్పడం.. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేయడంతో జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను నమ్మారు. దీనికితోడు గతేడాది ఆగస్టు నుంచి నవంబరు నెల వరకు జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో సాలూరు నియోజకవర్గం నుంచి విశాఖ వెళ్లిన జగన్పై హత్యాయత్నం జరిగింది. ఆ కుట్ర నుంచి బయటపడి తిరిగి జిల్లాలో అదే చిరునవ్వుతో పాదయాత్ర చేసిన జగన్ మోహన్రెడ్డితో ప్రజలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు మహిళా సంఘాలకు పసుపు కుంకుమ, వృద్ధ్యాప్య, వికలాంగు, వితంతు పింఛన్లు పెంపు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేశారు. అంతకుముందు నిరుద్యోగ భృతితో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాని ఇవేవీ జగన్ మోహన్రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆయన విశ్వసనీయతను అర్థం చేసుకున్న ఓటర్లు ‘జగన్కు ఒక్క అవకాశం ఇద్దాం’ అన్న భావనతో పోలింగ కేంద్రానికి వెళ్లడం ఇంతటి భారీ విజయం ఆ పార్టీని వరించేందుకు కారణమైందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్తో మంచి ఫలితాలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మేనియాతో పాటు ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం ఆ పార్టీకి అద్భుత ఫలితాలు తెచ్చి పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో ఆద్యంతం జాగ్రత్తలు తీసుకుని గెలుపు గుర్రాలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. రెండు, మూడు చోట్ల పార్టీ సమన్వయకర్తలను మార్పు చేసి కూడా విజయతీరాలకు చేరే వారిని ఎంపిక చేసుకున్నారు. వారికే టికెట్లు కేటాయించి ఎన్నికల బరిలో దించడంతో సఫలీకృతులయ్యారు. మరోవైపు పోలింగ్కు రెండు రోజుల ముందు ప్రత్య«ర్థి తెలుగుదేశంపార్టీ నాయకులకు కూడా ఊహకందని విధంగా పోల్మేనేజ్మెంట్ చేశారు. అవతల పక్షం అభ్యర్థులకు సైతం గాలం వేసి ఓట్లు సంపాదించారు. వీటితో పాటు ఎన్నికలకు రెండేళ్లు ముందు బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకుడు వైఎస్సార్సీపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారింది. బొత్స సత్యనారాయణ తనకు మాత్రమే సాధ్యమైన రాజకీయ ఎత్తుగడలతో తన మేనల్లుడు, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సమన్వయ పటిమతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించారంటే అతిశయోక్తి కాదు. -
కళ తప్పిన మంత్రి!
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట రావు ఘోర ఓటమి చవిచూశారు. వైఎస్సా ర్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ చేతిలో 18813 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీయేతర పార్టీలు మూడుసార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించా యి. 2004, 2009ల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో గొర్లె కిరణ్కుమార్ విజయం సాధించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కళా వెంకటరావు పోటీ చేయగా రెండు సార్లు ఓటమి చెందారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన ఆయన మూడో స్థానంలో నిలిచారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్పై 4741 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటి నుంచి కిరణ్కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నిరంతరం ప్రజల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్ను టీడీపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నా కొత్త క్యాడర్ తయారు చేస్తూ ముందుకుసాగారు. నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, జన్మభూమి కమిటీల వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లటం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం విజయానికి దోహదపడ్డాయి. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించటం, పార్టీ నవరత్నాలు పథకాల సాయంతో కళావెంకటరావును ఓడించగలిగారు. -
గుంటూరూలో ఫ్యాన్ ప్రభంజనం
సాక్షి,గుంటూరు : జన హృదయం మురిసింది.. జననేతకు ఘన విజయం కట్టబెట్టింది. టీడీపీ కంచుకోటలను సైతం బద్దలుకొట్టి 15 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించింది. గత ఎన్నికల్లో 12 స్థానాలు సాధించిన టీడీపీని రెండు స్థానాలకే పరిమితం చేసింది. జిల్లా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులను ఇంటిదారి పట్టించింది. డబుల్ హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న ధూళిపాళ్ల నరేంద్రకు ఓటమి రుచిచూపింది. స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్, మైనింగ్ మాఫియా కింగ్ యరపతినేని, ఇసుక, మట్టి దోపిడీలతో చెలరేగిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటమి బాట పట్టించింది. మరోవైపు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీని విజయ బాటలో నిలిపింది. జననేత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందించే నవరత్నాల సంక్షేమ పాలనకు పూలబాట పరిచింది. జిల్లా ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జై కొట్టారు.. అవినీతి, అరాచక పాలనకు ఓటుతో బుద్ధి చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు 2004లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు 18 స్థానాలతో జిల్లా ప్రజలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల తరువాత రాజన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ స్థానాలకు 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి మరోసారి రాజన్న కుటుంబంపై తమ అభిమానం చాటుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. రాజధాని నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఓటమి చెందిందంటే ప్రజల్లో టీడీపీపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయకేతనాలు ఎగురవేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు, స్పీకర్తోపాటు మాజీ మంత్రులు, ముఖ్యనేతలను ప్రజలు మట్టి కరిపించారు. 2014 ఎన్నికల్లో 12 సీట్లు సాధించిన టీడీపీ 2019 ఎన్నికల్లో పది సీట్లు కోల్పోయి రెండు సీట్లకు పరిమితం అయింది. రాజధానిలో ఏదో జరిగిపోతుందంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రను ప్రజలు తిప్పికొట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఓటమి చెందడం చూస్తుంటే టీడీపీ పై ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ జనసేన ప్రభావం కనిపించలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా విజయం సాధించారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో క్లీన్ స్వీప్ నరసరావుపేట పార్లమెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘన విజయం సాధించారు. ఈ పార్లమెంట్ పరిధిలో చిలకలూరిపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వినుకొండ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, గురజాల నుంచి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ ఘోర పరాజయం చెందారు. నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 20 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 32 వేల భారీ మెజార్టీ సాధించి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీతో గెలు పొందిన విషయం తెలిసిందే. వినుకొండ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 19,582 మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులుపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 28,700 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం చూస్తుంటే ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీపై ప్రజలు ఏ స్థాయిలో తమ అభిమానాన్ని చాటుకున్నారో తెలుస్తోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీయేతర పార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 8 వేలకు పైచిలుకు మెజార్టీతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై బీసీ మహిళ విడదల రజిని విజయం సాధించడం గమనార్హం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, సీనియర్ మంత్రిగా, స్పీకర్గా పదవులు చేపట్టిన కోడెల శివప్రసాదరావుపై అంబటి రాంబాబు 21,200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు 14 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. మాచర్లలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 23 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది నాల్గోసారి వరుసగా విజయం సాధించి తన పట్టు నిలుపుకొన్నారు. గుంటూరు పార్లమెంట్లో ఆరు స్థానాల్లో ఘన విజయం గుంటూరు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ సీపీ ఆరు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం చెందారు. పొన్నూరులో వరుసగా ఐదు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య విజయం సాధించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత 7,221 మెజార్టీతో గెలిపారు. మాజీ మంత్రి, తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ 17 వేలకు పైగా చిలు మెజార్టీ గెలుపొందారు. గత ఎన్నికల్లో 19,759 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆలపాటి రాజా ఈ ఎన్నికల్లో ఓటమి పాలవడం గమనార్హం. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా 24 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి 4,500 మెజార్టీతో విజయం సాధించారు. మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి.. జిల్లాలో వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేసిన ఎనిమిది మంది మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. పొన్నూరు నుంచి కిలారి వెంకటరోశయ్య, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి, పెదకూరపాడు నుంచి నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల నుంచి కాసు మహేష్రెడ్డి, వేమూరు నుంచి మేరుగ నాగార్జున, చిలకలూరిపేట నుంచి విడదల రజని తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. టీడీపీ తరఫున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన మద్దాళి గిరి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. కౌంటింగ్ మధ్యలోనే బయటకు జారుకున్న టీడీపీ అభ్యర్థులు జిల్లాలో 17 నియోజకవర్గాలకు 15 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో టీడీపీ సీనియర్ నేతలు కంగుతిన్నారు. టీడీపీకి బలమైన మండలాలు, గ్రామాల్లో సైతం వైఎస్సార్ సీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించడంతో టీడీపీ సీనియర్లు సైతం మూడు నాలుగు రౌండ్ల తరువాత కౌంటింగ్ కేంద్రాలను వదిలి వెళ్లిపోయారు. గురజాల మండలంలో వైఎస్సార్ సీపీకి 4,500 లకు పైగా మెజార్టీ రావడంతో ఐదో రౌండ్కే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, మాచర్ల, నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థులు అంజిరెడ్డి, అరవిందబాబు సైతం మధ్యలోనే కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటి దారిపట్టారు. రౌండ్ రౌండ్కూ ఉత్కంఠ జిల్లాలోని చిలకలూరిపేట, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రతి రౌండ్కూ మెజార్టీ మారుతుండటంతో అభ్యర్థులతోపాటు కౌంటింగ్ ఏజెంట్లు, ప్రజలు సైతం టెన్షన్కు గురయ్యారు. మొదటి నుంచి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకు పోయిన వైఎస్సార్ సీపీ మంగళగిరి పట్టణంలో వెనుకంజ పడింది. అక్కడి నుంచి ప్రతి రౌండ్కు నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగినప్పటికీ ఎట్టకేలకు 5,217 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. పొన్నూరు నియోజకవర్గంలో సైతం మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబర్చినప్పటికీ ఎనిమిదో రౌండ్ నుంచి అక్కడ సైతం పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఎట్టకేలకు 1,043 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. చిలకలూరిపేట నియోజకవర్గం అయితే మొదటి నుంచి టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి విడదల రజనికి స్పష్టమైన మెజార్టీ రావడంతో 8 వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. తాడికొండ నియోజకవర్గంలో సైతం మొదటి నుంచి టీడీపీ అధిక్యం చూపుతూ వచ్చినప్పటికీ ఫిరంగిపురం మండలంలో వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం రావడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి విజయ బావుటా ఎగురవేశారు. మూడో రౌండ్లోనే వెనుతిరిగిన యరపతినేని పిడుగురాళ్ల: సార్వత్రిక ఎన్నికల్లో గురజాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాసు మహేష్రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుపై ఘనవిజయం సాధించారు. గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లపాడులోని లయోలా హైస్కూల్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. మొదటి రౌండ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్రెడ్డికి మెజార్టీ వస్తుండటంతో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అవాక్కయ్యారు. గురజాల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ డలంలోనే ఎక్కువ పట్టు ఉందని ఆశించిన యరపతినేనికి గురజాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాసుకే పట్టం కట్టడంతో ఓటమి తప్పదని భావించిన యరపతినేని మూడో రౌండ్లోనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగారు. కౌంటింగ్ ప్రారంభించే ముందు ఎంతో హుందాగా ఉన్న యరపతినేని మొదటి రెండు మూడు రౌండ్లకే పరాజయం పాలవుతానని భావించి ఈ ప్రాంతంలో ఉండటానికి ముఖం చెల్లక వెనుతిరిగారు. ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యం : నందిగం సురేష్ బాపట్ల: ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తానని బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటామని, మాటలు చెప్పటంకాదు, ప్రజలకు మంచిచేసి చూపిస్తామని అన్నారు. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటంతోపాటు నిరుద్యోగ సమస్యను పరిష్కారించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఢిల్లీలో కాకుండా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ గల్లీలోనే తిరుగుతానని చెప్పారు. బాపట్ల అసెంబ్లీ నుంచి 19,509 ఓట్లు మెజార్టీ బాపట్ల అసెంబ్లీ నుంచి బాపట్ల పార్లమెంటు అభ్యర్థి నందిగం సురేష్కు 19,509 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 15 రౌండ్లులో లెక్కింపు నిర్వహించారు. మొత్తం నందిగం సురేష్కు 79,708 ఓట్లు, టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రికి 60,199 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్లోనూ నందిగం సురేష్ అధిక్యతను ప్రదర్శించారు. నందిగం సురేష్ను ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి అభినందించారు. వైఎస్సార్ సీపీ నుంచి ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ ముగ్గురు మహిళలను అసెంబ్లీ స్థానాల నుంచి పోటీలో నిలపగా తెలుగుదేశం పార్టీ ఒక్క మహిళకు కూడా టిక్కెట్టు ఇవ్వకపోవడం గమనార్హం. వైఎస్సార్ సీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్పై విజయం సాధించగా, తాడికొండ నుంచి పోటీచేసిన ఉండవల్లి శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్పై విజయం సాధిం చారు. తొలి రౌండ్ నుంచి ఉత్కంఠ భరితంగా సాగిన చిలకలూరిపేట నుంచి బీసీ మహిళ విడదల రజిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించారు. -
జిల్లా ప్రజలకు బాలినేని కృతజ్ఞతలు
సాక్షి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతు పలికిన జిల్లా ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గురువారం రాత్రి సాక్షితో మాట్లాడారు. తనతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వారికి ఎన్నికల్లో ఓట్లు వేసి అత్యధిక మెజారీటి రావటానికి కారణమైన ఓటరు దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు జన రంజక పాలన అందిస్తారన్నారు. ప్రకాశం జిల్లాకు అంతా మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నెలకున్న సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. ప్రతి ఒక్కరికీ ఎలాంటి కష్టం రాకుండా సేవ చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని అన్నారు. ఓటర్లు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా బాలినేని తెలిపారు. -
గౌతు కంచుకోటకు బీటలు
సాక్షి, పలాస (శ్రీకాకుళం): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సోంపేట నియోజకవర్గ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన గౌతు కంచుకోటకు ఎట్టకేలకు బీటలు తప్పలేదు. గౌతు లచ్చన్న ఆరు పర్యాయాలు, ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వివిధ పదవీ బాధ్యతలు చేపట్టినా ఈసారి మాత్రం వారసత్వ రాజకీయాలు చెల్లవని గౌతు కుటుంబానికి పలాస నియోజకవర్గం ప్రజలు తేల్చిచెప్పారు. స్థానికుడైన మత్స్యకార కులానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజుకు పట్టం కట్టారు. పలాస కేంద్రంగా శివాజీ తన కుమార్తె గౌతు శిరీషను రాజకీయ అరంగేట్రం చేయించి మూడో తరం వారసత్వ రాజకీయాలు నడపాలని భావించారు. ఐతే ఇక్కడ ప్రజలు మాత్రం స్థానిక నేతలుగా వారిని గుర్తించలేకపోయారు. వలస రాజకీయాలు ఇక ఏమాత్రం ఇక్కడ చెల్లవని తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న పలాస నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో పలాస నియోజకవర్గంగా ఏర్పడింది. ఒకప్పుడు కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు, టెక్కలి నియోజకవర్గంలో ఉండేవి. కొత్తగా ఏర్పడిన పలాస నియోజకవర్గంలోకి పలాసతో పాటు వజ్రపుకొత్తూరు మందస మండలాలు చేరాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ఈ నియోజకవర్గంలో అనూహ్య మార్పులు వచ్చాయి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన జుత్తు జగన్నాయకులు మొదటిసారిగా ఎమ్మెల్యే శివాజీపై పోటీ చేసి విజయం సాధించారు. గౌతు కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం అప్పుడే బీటలు వారింది. 2014 ఎన్నికల్లో మళ్లీ శివాజీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల తర్వాత శివాజీ తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. దీంతో అల్లుడు వెంకటన్న చౌదరి అధికార దాహంతో రాజ్యంగేతర శక్తిగా మారి ఆర్ధిక అరాచకాలకు పాల్పడడంతో ప్రజలు ఛీత్కరించుకున్నారు. గౌతు కుటుంబానికి గతమంతా ఘన కీర్తి అయితే నేడు అపకీర్తి మూట గట్టుకోవడానికి వారి కుటుంబం స్వయం కృతాపరాధం కూడా లేకపోలేదు. వర్గాల సృష్టికర్త శివాజీ.. పార్టీలో వర్గాలను, ముఠాలను ఏర్పాటు చేసి తనకు నచ్చిన వర్గానికి కొమ్ముకాయడం, వెంటేసుకురావడం, నచ్చని వర్గాన్ని నట్టేట ముంచడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అదే పలాస నియోజకవర్గంలో ఆయనకు కొంపముంచింది. రాజకీయంగా ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనీకుండా తొక్కేయడం వల్ల చాలా మంది ఈ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా మారారు. అందులో భాగంగానే మందస మండల ఎంపీపీ కొర్ల కవితా కన్నారావు, వజ్రపుకొత్తూరు జెడ్పీటీసీ ఉప్పరపల్లి నీలవేణి ఉదయ్కుమార్, పలాస– కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, పలాస మాజీ జెడ్పీటీసీ వడిశ హరిప్రసాద్ తదితరుల రాజకీయ భవిష్యత్కు చరమ గీతం పాడాలని గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఈ విధంగా ఆయన కంచుకోటకు బీటలు వారడానికి గల అనేక కారణాల్లో వారి స్వయంకృతాపరాధమే ఎక్కువ శాతం ఉంది. -
ఫ్యాన్గాలికి కొట్టుకుపోయిన సైకిల్
సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి నియోజకవర్గంలో ఫ్యాన్గాలికి సైకిల్ కనిపించనంత దూరంలోకి కొట్టుకుపోయింది. ప్రతిరౌండ్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తన ఆధిక్యతను చాటుకుని విజయం వైపు దూసుకుపోయారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇద్దామన్న నినాదం పల్లెల్లోని ఓటర్లలో బలంగా నాటుకుపోవడంతో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పోలింగ్లో ఫ్యాన్ గిరాగిరా తిరిగేసింది. ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రామనారాయణరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ సాధించలేని రికార్డు మెజార్టీని సాధించి వెంకటగిరి రాజకీయ చరిత్ర పుటల్లో తనదైన పేజీని దక్కించుకోగలిగారు. నెల్లూరులోని ప్రిదయదర్శిని ఇంజినీరింగ్ కళాశాల్లో గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి 1,09,204 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణకు 70,484 ఓట్లు వచ్చాయి. 22 రౌండ్ల పాటు జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపులో ప్రతిరౌండ్లోనూ రామనారాయణరెడ్డికి మెజార్టీ వచ్చింది. కలువాయి మండలం తెలుగురాయిపురం పోలింగ్ కేంద్రం ఈవీఎం నుంచి ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైయింది. రాపూరు మండలంలో పోలింగ్ వన్సైడ్గా జరిగినట్లు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తొంది. కలువాయిలో 6,400, రాపూరులో 9,000 పైచిలుకు, సైదాపురం మండలంలో 5,600, డక్కిలిలో 4,320, బాలాయపల్లిలో 4,519 , వెంకటగిరి పట్టణ, రూరల్ ప్రాంతాల్లో 7వేల మెజార్టీ ఆనం రామనారాయణరెడ్డి సాధించారు. గతంలో వెంకటగిరి పట్టణ, రూరల్ ప్రాంతాల్లో టీడీపీకి 10వేలకు పైగా మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని తగ్గించి ఈ ఎన్నికల్లో ఏడు వేలు ఓట్లు రావడం విశేషమన్న భావన వైఎస్సార్సీపీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. రికార్డు మెజార్టీ వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందిన ఆనం రామనారాయణరెడ్డి రికార్డు మెజార్టీ సాధించారు. ఆయన ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణపై 38,720 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. 1956 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 1985లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన సాయికష్ణ యాచేంద్రకు 25వేలు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో ఆయనది ఓ రికార్డుగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ రికార్డును రామనారాయణరెడ్డి బద్దలు కొట్టి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. వైఎస్సార్సీపీ నాయకుల్లో జోష్ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతోపాటు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిచడంతో వెంకటగిరి నియోజకవర్గ వైస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిప్తోంది. గెలుపు ఇలా వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ గురువారం నెల్లూరులోని ప్రియదర్శని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. ఆనం రామనారాయణరెడ్డికి ప్రతి రౌండ్లోనూ మెజార్టీ లభించిది. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 2074 కాగా వీటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామనారాయణరెడ్డికి 1,046 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కె రామకృష్ణకు 903 ఓట్లు వచ్చాయి. రామనారాయణరెడ్డికి పోస్టల్ బ్యాలెట్లలో143 ఓట్ల ఆధిక్యత లభించింది. పోస్టల్ బ్యాలెట్లో 98 ఓట్లు ఇన్వ్యాలీడ్ అయ్యాయి. ఐదుగురు ఉద్యోగులు నోటాకు ఓటు వేశారు. -
‘పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నందుకు..’
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించింది. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన పుప్పాల వాసుబాబు 33 వేల ఓట్ల మెజర్టీతో గెలుపొందారు. ఈ క్రమంలో వాసుబాబును అభినందించడానికి అభిమానులు ఆయన నివాసానికి పోటేత్తారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. అందుకే ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పంష్టం చేశారు. -
జయహో జగన్
సాక్షి , ఒంగోలు : అంతటా జయజయ ధ్వానాలు..జన హృదయ విజేత రాష్ట్రాధినేత కావాలన్న సంకల్పం ప్రభంజనమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనం పట్టం కట్టారు. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమ గీతం పాడుతూ సంక్షేమ రాజ్యాన్ని కాంక్షిస్తూ విజయ ఢంకాలు మోగించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించగా..మిగిలిన నాలుగు చోట్ల టీడీపీ గెలుపొందింది. ఒంగోలు ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. బాపట్ల, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులే జయ కేతనం ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో విజయోత్సాహం మిన్నంటింది. స్వీట్లు పంచుతూ, రంగులు చల్లుకుంటూ, బాణసంచాలు కాల్చుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నేను ఉన్నాను..నేను విన్నాను..అని జగన్ అన్న మాటకు ప్రతిగా జిల్లా ప్రజలు నీకు మేమున్నాము అంటూ ఫ్యాను గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్ సీపీకి చారిత్రాత్మక విజయం అందించారు. జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ గాలితో హోరెత్తింది. అన్ని వర్గాల ప్రజలు సైకిల్కు పంచరేసి వైఎస్ జగన్ సీఎం కావాలన్న లక్ష్యంతో ప్రభంజనంలా ఫ్యాను గుర్తుకు ఓట్లేశారు. దీంతో జిల్లాలోని ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గెలిచిన అందరు అభ్యర్థులకు 20 వేల నుంచి 80 వేల వరకు భారీ మెజార్టీ దక్కడం గమనార్హం. టీడీపీ జిల్లాలో కుప్ప కూలింది. అద్దంకి, చీరాల, కొండపి, పర్చూరు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్పై 22,245 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గిద్దలూరు నుంచి పోటీ చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు జిల్లాలో అత్యధికంగా 80,142 ఓట్లకుపైగా మెజార్టీతో ముత్తముల అశోక్రెడ్డిపై ఘన విజయం సాధించారు. యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ టీడీపీ అభ్యర్థి అజితారావుపై 31,096 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై 40,668 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మార్కాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై 18,667 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దర్శి వైఎస్సార్ సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుపై 39,057 ఓట్ల ఆ«ధిక్యంతో ఘన విజయం సాధించారు. సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్బాబు తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్కుమార్ పై 9080 ఓట్లతో గెలుపొందారు. కందుకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్రెడ్డి టీడీపీ అభ్యర్థి పోతుల రామారావుపై 14,637 ఓట్లకుపైగా ఆధిక్యంతో విజయం సాధించారు. పర్చూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కన్నా 1295 ఓట్లు వెనుకబడి ఉన్నారు. కొండపి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ వెంకయ్యపై టీడీపీ అభ్యర్థి బాలవీరాంజనేయస్వామి 1095 స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు అందరూ 20 నుంచి 80 వేల భారీ మెజార్టీలతో భారీ విజయం సాధించారు. అన్ని వర్గాల ప్రజలు ఫ్యాను గుర్తుకే ఏకపక్షంగా ఓట్లు వేశారు. ఇక జిల్లాలో గత ఎన్నికల్లో అయిదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో అదనంగా ఒక స్థానాన్ని కోల్పోయి కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై 17,801 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాచిన చెంచుగరటయ్యపై 12,747 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో పరాభవం పొందారు. మాగుంట శిద్దా రాఘవరావుపై 2,12,522 పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు స్థా«నాన్ని గెలుచుకున్న టీడీపీకీ ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. బాపట్ల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరాం మాల్యాద్రిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి నందిగం సురేష్ 15,881 ఓట్ల ఆధిక్యత సాధించారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు: వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారని సమాచారం అందుకున్న పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు కౌంటింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణ సంచా పేల్చడంతో పాటు రంగులు చల్లుకొని, కేక్లు కట్చేసి పంచిపెట్టారు. అభ్యర్థుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. -
సర్వేపల్లిలో మళ్లీ కాకాణికే పట్టం
సాక్షి, వెంకటాచలం: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మరోసారి వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డికే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో ఓటమి చెంది, దొడ్డిదారిన మంత్రి పదవి పొంది నియోజకవర్గంలో అభివృద్ధి మాటున అవినీతికి పాల్పడిన సోమిరెడ్డికి మరోసారి ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్పారు. 2014 ఎన్నికల్లో 5,744 ఓట్ల ఆధిక్యంతో కాకాణి గెలుపొందారు. ప్రస్తుతం గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో 13,866 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో 282 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,30,417మంది ఓటర్లుండగా 1,89,916 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీపడగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి, టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. నెల్లూరు గ్రామీణ మండలం కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో తిరుపతి పార్లమెంటరీతోపాటుగా ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్ బ్యాలట్ ఓట్లు లెక్కిస్తారని భావించగా అధికారులు ఈవీఎంలలో రౌండ్లవారిగా లెక్కింపును చేపట్టారు. తొలి రౌండ్ పొదలకూరు మండలం సూరాయపాళెం నుంచి ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందే సోమిరెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తొలి రౌండ్లో వైఎస్సార్సీపీకి 1,758 ఓట్ల ఆధిక్యం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన రౌండ్ల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఫలితాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఐదు మండలాల్లోనే కాకాణిదే హవా ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచి చివరిదైన 21వ రౌండ్ వరకు కాకాణి గోవర్ధన్రెడ్డిదే హవా కొనసాగింది. తొలి ఐదు రౌండ్లు పొదలకూరు మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కించారు. ఈ లెక్కింపులో కాకాణి గోవర్ధన్రెడ్డికి 4,223 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో వరుసగా అన్ని రౌండ్లలోనూ కాకాణి ఆ««ధిక్యతను సాధించారు. వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీ పరిధిలోని 215పోలింగ్ బూత్తోపాటుగా ముత్తుకూరు మండలంలోని 150వ పోలింగ్ బూత్ ఓట్ల లెక్కింపు ఈవీఎంల సమస్య కారణంగా మధ్యలో నిలిపివేశారు. 21 రౌండ్లు పూర్తయిన తరువాత ఆ ఓట్లు లెక్కింపును చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్సీపీకి 541, టీడీపీకి 435 పోలైంది. అప్పటికే కాకాణి గోవర్ధన్రెడ్డి విజయం ఖరారు కావడంతో ఆరు గంటలు దాటిన తరువాత ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు, సర్వేపల్లి నియోజకవర్గ ఎన్నికల అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని కాకాణి గోవర్ధన్రెడ్డి అందుకున్నారు. ఆ తరువాత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కాకాణి గోవర్ధన్రెడ్డికే మెజారిటీ లభించింది. ఆరంభం నుంచి ఎక్కడా వైఎస్సార్సీపీ ఆధిక్యత తగ్గకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గం అంతటా ఉదయం నుంచే సంబరాల్లో మునిగితేలారు. అన్ని రౌండ్లలో కాకాణిదే ఆధిక్యం వెంకటాచలం: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్వరకు తన ఆధిక్యతను చాటుకున్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా అందులో 12 రౌండ్లలో కాకాణి ఆధిక్యతను సాధించారు. మిగిలిన ఐదు రౌండ్లలో మాత్రమే తన సమీప టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆధిక్యత సాధించినా చివరకు ఓటమి చెందారు. ప్రస్తుతం 2019 ఎన్నికలకుసంబంధించి ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్లో తన సమీప టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై 1,758 ఓట్ల ఆధిక్యతను సాధించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం పోలింగ్ బూత్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండో రౌండ్లో 105, మూడవ రౌండ్లో 914, నాల్గో రౌండ్లో 111, ఐదో రౌండ్లో 1443, ఆరవ రౌండ్లో 421, ఏడో రౌండ్లో 951, ఎనిమిదో రౌండ్లో 874 ఓట్ల ఆధిక్యాన్ని సాధంచారు. అలాగే తొమ్మిదో రౌండ్లో 1154, పదో రౌండ్లో 1588, 11రౌండ్లో 354, 12రౌండ్లో 71 ఓట్లు ఆధిక్యత లభించింది. 13రౌండ్లో 201, 14రౌండ్లో 228, 15 రౌండ్లో 628, 16రౌండ్లో 751, 17రౌండ్లో 857, 18రౌండ్లో 206, 19రౌండ్లో701, 20వ రౌండ్లో 210, 21వ రౌండ్లో 340 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. వెంకటాచలం మండలం తిక్కవరప్పాడులోని 215 పోలింగ్ బూత్తో పాటుగా ముత్తుకూరు మండలంలలో మరొక పోలింగ్బూత్కు సంబంధించి ఈవీఎంల సమస్య కారణంగా ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. వీటి లెక్కింపును చివరగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం లెక్కించారు. మొత్తంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి తన సమీప అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై 13,886 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. -
‘విజయ’తీరాన తు‘ఫ్యాన్’
జిల్లాలో ఫ్యాన్ సృష్టించిన సునామీలో ప్రత్యర్థులు తుడిచిపెట్టుకుపోయారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు అటు శాసనసభ, ఇటు పార్లమెంటు స్థానాల్లో ప్రభంజనం సృష్టించారు. ఒక్కస్థానాన్నీ తెలుగుదేశం పార్టీకి దక్కనీయకుండా క్లీన్ స్వీప్ చేశారు. రౌండ్ రౌండ్కూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. వరుసగా వెలువరించిన ఫలితాలతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో గుబులు రేకెత్తించా రు. అసలు అభ్యర్థుల ఎంపికతోనే టీడీపీ తప్పటడుగులు వేస్తూ వైఎస్సార్సీపీ విజయానికి పరోక్షంగా దోహదపడగా... పార్టీ అధినేత జగన్ చరిష్మా వారికి అదనపు బలాన్ని అందించినట్టయింది. మొత్తమ్మీద ప్రజలు వైఎస్సార్సీపీవైపే ఉన్నారనీ... జగన్పై ఎనలేని అభిమానం చూపారనీ... ఈ ఫలితాలు రుజువు చేశాయి. సాక్షిప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. జిల్లా ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున విజయతిలకం దిద్దారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. నిన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి అడ్రస్ లేకుండా చేశారు. గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్ల వారీగా అధికారులు ఫలితాలు వెల్లడించారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి ఓటర్లు ఏకపక్షంగా పట్టంగట్టి తొమ్మిది అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలను అందించారు. ఎన్నిక ఏకపక్షం జిల్లాలో ఉన్న విజయనగరం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ విజయం సాధించింది. అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే చాలా మెరుగైన ఫలితాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని విజయనగరం లోక్సభతోపాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయగా కురుపాం, సాలూరు, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిపొందింది. పార్వతీపురం, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు విజయనగరం పార్లమెంటు స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. తర్వాత బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు పార్టీ ఫిరాయించడంతో వైఎస్సార్సీపీ బలం కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకు పరిమితమైంది. కానీ అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు విజయనగరం పార్లమెంటు స్థానంతో పాటు జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో విజయబావుటా ఎగిరేసి సత్తా చూపింది. ఒకేసారి జిల్లాలో వైభవాన్ని కోల్పోయిన తెలుగుదేశంపార్టీ ఒక్కసీటులో కూడా గెలవలేక చతికిలపడిపోయింది. వైఎస్సార్సీపీకి భారీ మెజారిటీ ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో గెలు పొందడం ఒక విశేషమైతే పోటీ చేసిన అన్నిచోట్లా భారీ మెజార్టీ రావడం మరో విశేషం. విజయనగరం లోక్సభ నియోజకవర్గం ఫలితాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పూసపాటి ఆశోక్గజపతిరాజుపై అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు, రాజవంశీకులైన పూసపాటి ఆశోక్గజపతిరాజుపై బెల్లాన గెలపొందడంతో తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడినట్టయ్యింది. ⇔ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పాముల శ్రీపుష్పవాణి టీడీపీ అభ్యర్థి నరసింహప్రియా థాట్రాజ్పై 27,394 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ పుష్పశ్రీవాణికి 69484ఓట్లు రాగా ఆమె సమీప ప్రత్యర్థికి 44090 ఓట్లు లభించాయి. ⇔ పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అలజంగి జోగారావు 23,814ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 70,626 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చీరంజీవులుకు 49,812 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న నమ్మకం మొదట్నుంచీ ఉన్నా భారీ స్థాయిలో మెజార్టీ రావడం విశేషం. ⇔ బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి మంత్రి సుజయ్కృష్ణ రంగారావుకు 75,332ఓట్లు రాగా వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడుకు 83,678ఓట్లు రావడంతో 8346 మెజార్టీ లభించింది. ఇక్కడ మంత్రిపై పోటీ చేసి గెలుపొందడం గ్రాండ్ విక్టరీగా చెప్పుకోవాలి. ఆరంభంలో విజయావకాశాలు టీడీపీకి ఉన్నట్లు కనిపించినా పక్కా ప్రణాళికతో వైఎస్సార్సీపీ ఈ సీటును సొంతం చేసుకుంది. ⇔ నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మొత్తం 29,051ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు 94,258 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, కాకలు తీరిన రాజకీయయోధుడు, సీనియర్ నాయకుడు పతివాడ నారాయణస్వామినాయుడుకు 66,207 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ విజయంపై మొదటి నుంచి ధీమాగా ఉంది. ⇔ విజయనగరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి 78,849ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆదితిగజపతిరాజుకు 72,432 ఓట్లు వచ్చాయి. కోలగట్ల 6417ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొదటి నుంచి పోటీ తీవ్రంగా ఉంటుందన్న చర్చ జరిగింది. అనుకున్నట్లే ఉత్కంఠ నడుమ అంతిమంగా వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ⇔ సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అభ్యర్ధి పీడక రాజన్నదొర 19,500ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 73,291ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఆర్.పి.భంజ్దేవ్కు 53,791 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గెలుస్తామని టీడీపీ గట్టి నమ్మకంతో ఉండగా భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ విజయం సాధించడం విశేషం. రాజన్నదొర నాలుగోసారి గెలిచి తనకు ఎదురులేదని మరోసారి నిరూపించారు. ⇔ శృంగవరపుకోట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 89,653 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారికి 78,097ఓట్లు లభించాయి. కడుబండి 11,556 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గెలుపుపై ఎటువంటి అం చనాలు లేకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థి బరిలో దిగినా పోలింగు రోజు నాటికి అనూహ్యంగా పుం జుకుని తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ⇔ చీపురుపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు 87,508 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు 61,671 ఓట్లు లభించాయి. బొత్స సత్యనారాయణ 26,498 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అందరూ ఉహించినట్లే బొత్సకు భారీ మెజార్టీ లభించింది. ⇔ గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యకు 26,910 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈయనకు 92,863 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి కె.ఎ.నాయుడుకు 65,953ఓట్లు లభించాయి. ఇక్కడ భారీ మెజార్టీ వస్తుందని, గెలుపు లాంఛనమే అని ముందే ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. -
క్షణక్షణం టెన్షన్..టెన్షన్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగర కౌంటింగ్ ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రౌండ్ వరకూ ఇరువురి మధ్య విజయం దోబూచులాడింది. రౌండ్ .. రౌండ్కూ ఇరు పార్టీలకు స్వల్ప మెజార్టీలు రావడంతో విజయం ఎవర్ని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 16 రౌండ్ల లెక్కింపునకు గానూ చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే విజయం మొగ్గు చూపింది. తొలి రౌండ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్కుమార్యాదవ్కు స్వల్ప మెజార్టీ వచ్చింది. పది రౌండ్లకు గానూ మూడు నుంచి నాలుగు వేల మధ్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది. ఆపై రెండు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి నారాయణకు కొంత మెజార్టీ రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గుతూ వచ్చింది. 14వ రౌండ్ పూర్తయ్యే సరికి పదుల సంఖ్యలో ఓట్లు మాత్రమే మెజార్టీ ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. 15వ రౌండ్లో దాదాపు వెయ్యి మెజార్టీ రావడంతో ఇక గెలుపు ఖాయమని తేలింది. 16వ రౌండ్లో పెద్దగా తేడా లేకపోవడంతో పాటు పోస్టట్ బ్యాలెట్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఉండటంతో చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ను విజయం వరించింది. ధనం ప్రవహించినా.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా అపర కుబేరుడైన మంత్రి నారాయణ సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. గతేడాది నుంచి నెల్లూరు నగరాన్ని టార్గెట్ చేసి ఎన్నికల నిర్వహణ చేసుకున్నారు. వివిధ ప్రార్థన మందిరాల నిర్మాణాలకు రూ.లక్షల్లో విరాళాలిచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళిక చేసుకున్నారు. విద్యాసంస్థల అధినేతగా నెల్లూరు నగరానికి ఏమీ చేయని నారాయణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నిధులను అభివృద్ధి పేరుతో అస్మదీయులకు కట్టబెట్టి దోచుకుతినేలా చేశారు. ఎన్నికల సమయంలో విద్యాసంస్థల ఉద్యోగులతో ఓటుకు రూ.రెండు వేలను పంపిణీ చేయించారు. నేతలకు ప్యాకేజీలను ప్రకటించి ప్రలోభాలకు గురిచేశారు. ఇంతా చేసినా కూడా నెల్లూరు నగర ఓటర్లు మాత్రం ఎలాంటి అవినీతి మచ్చలేని నేతగా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్కే మళ్లీ పట్టం కట్టారు. -
జాతీయ పార్టీలకు డిపాజిట్ల గల్లంతు
సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాలో జాతీయ కాంగ్రెస్తోపాటు బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజ యాలను ఎదుర్కొన్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులు దాదా పుగా అన్ని నియోజకవర్గాల్లోను డిపాజిట్ల(ధరావతును)ను కోల్పోయారు. విశేషం ఏంటంటే ఈ రెండు పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులకు నోటాకు నమోదైన ఓట్లు కూడా సాధించకపోవడం విశేషం. చాలా చోట్ల నోటాలో కనీసం మూడోవంతు ఓట్లను కూడా దక్కించుకోలేకపోయారు. కేంద్రంలో బీజేపీ పూర్తి హవా కనబర్చినప్పటికీ రాష్ట్రంలో, శ్రీకాకుళం జిల్లాలో ఘోర పరాభవం ఎదురైంది. జిల్లాలో జాతీయ పార్టీలు సాధించిన ఓట్ల వివరాలు.. నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పోలైన ఓట్లు బీజేపీ అభ్యర్థి పోలైన ఓట్లు పలాస మజ్జి శారద 1731 కొర్రాయి బాలకృష్ణ 1337 ఇచ్ఛాపురం కొల్లి ఈశ్వరరావు 2044 జెఎస్ ప్రసాదరావు 1651 నరసన్నపేట డోల ఉదయ్భాస్కరరావు 5235 రెడ్డి భాగ్యలక్ష్మి 758 ఆమదాలవలస బొడ్డేపల్లి సత్యవతి 961 పాతిన గడ్డెయ్య 850 పాతపట్నం రాము 1206 ఎస్.రాఘవరావు 1011 ఎచ్చెర్ల కె.సింహాద్రినాయుడు 2113 ఆర్. సూర్యప్రకాశరావు 984 టెక్కలి చింతాడ దిలీప్కుమార్ 1948 హెచ్ ఉదయ్భాస్కర్ 773 శ్రీకాకుళం చౌదరి సతీష్ 2223 చల్లా వెంకటేశ్వరరావు 1319 రాజాం కంబాల రాజవర్దన 2195 ఎం.చైతన్యకుమార్ 924 పాలకొండ హిమరక ప్రసాద్ 994 తాడంగి సునీత 1121 -
ఇక రాజన్న రాజ్యం
-
‘జనాలు చింతమనేని పాలనపై విసిగిపోయారు’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై రికార్డు విజయం సాధించిన కొఠారు అబ్బయ్య చౌదరిని అభినందించేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. తన గెలపుకు కారణమైన దెందులూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చింతమనేని పదేళ్ల పాలనపై విసుగెత్తి పోయిన దెందులూరు ప్రజలు ఓటు రూపంలో తీర్పునిచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తానని పేర్కొన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటానన్నారు. దెందులూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్కు బిజెపీ తరపున అభినందనలు
-
వైఎస్ జగన్కు యూఎస్ కాన్సులేట్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధానితో సహా పలువురు జాతీయ నేతలు కూడా వైఎస్ జగన్ను అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా కాన్సులేట్ జనరల్ కాథరీన్ హడ్డా వైఎస్ జగన్కు అభినందనలు తెలిపారు. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. గతంలో వైఎస్ జగన్తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా నిన్న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Congratulations on your victory, @ysjagan! We at @USAndHyderabad look forward to working with you to further build U.S.-AP ties. pic.twitter.com/AjX5PfJACc — Katherine Hadda (@USCGHyderabad) 23 May 2019 -
ఖాకీవనంలో ‘కుల’చిచ్చుపై పేలిన ఓటు తూట..
సాక్షి, అమరావతి : మనమంతా ఖాకీ కులం అని సగర్వంగా కాలరెగరేసి చెప్పుకునే పోలీసుల్లో చంద్రబాబు ‘కుల’చిచ్చు రగిల్చడంపై ఆ శాఖ ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహం తెప్పించింది. వారంతా ఓటుతో బుద్ధిచెప్పారని ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగుల్లో ఫలితాలపై హర్షం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు సొంత మనుషులుగా చెలామణి అయిన కొందరు ఐపీఎస్ల కుల పోకడలతో పోలీస్ ఐక్యత దెబ్బతినే పరిస్థితి నెలకొంది. పలువురు పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా పనిచేయడం ఆ శాఖలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. చంద్రబాబు సొంత సామాజికవర్గంతో పాటు ఆయన సొంత మనుషులకే కీలక పోస్టులు కట్టబెట్టారు. చివరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు, ఓఎస్డీలుగా యోగానంద్, మాధవరావు తదితర అధికారులు చంద్రబాబు డైరెక్షన్లో ఎన్నడులేని విధంగా పోలీసు శాఖలోను కులాల వారీ లెక్కలు తీయడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. అలాగే కొన్ని సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుని అణచివేత ధోరణి అవలంభించారంటూ బాధితులు వాపోతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఐదేళ్లుగా పోలీసు శాఖలో జరిగింది ఇదే. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో దాదాపు 300 మందికి పైగా పోలీసు అధికారులను బలవంతంగా వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లోకి పంపారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. ఇది చాలదన్నట్టు అవినీతి నిర్మూలనకు దోహద పడాల్సిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని సైతం రాజకీయ, సామాజికవర్గాలను టార్గెట్ చేసేలా మార్చారు. ఖాకీ వనంలో చోటు చేసుకున్న పరిణామాలను దగ్గరగా గమనించిన పోలీసు కుటుంబాలు చంద్రబాబు పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో పోలీసులకు చెందిన దాదాపు లక్ష కుటుంబాలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. హోంగార్డులకు మెరుగైన వేతనాలు, పోలీసులకు వీక్లీఆఫ్లు ఇస్తామన్న జగన్మోహన్రెడ్డి హామీ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన పోలీసు కుంటుంబాలు ఫ్యాన్ గుర్తుకు ‘ఫ్యాన్’గా మారిపోయాయి. -
కడప జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్
సాక్షి, కడప: వైఎస్సార్సీపీ జిల్లాలో క్లీన్స్వీప్ చేసింది. పదికి పది అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలను చేజిక్కించుకుంది. ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు. ఈ పార్టీకి చెందిన అభ్యర్థులందరికీ బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రభంజనాన్ని మరిపించేలా వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు. నడిమంత్రపు హోదాతో వచ్చిన నియంతృత్వం, అహంకారానికి జమ్మలమడుగు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వెరశి కౌంటింగ్లో రౌండు రౌండులో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ప్రజలు తీర్పు ప్రకటించారు. అభివృద్ధిని గాలికొదిలి మాటల గారడీతో నెట్టుకొచ్చిన అధికార టీడీపీకి ఈఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. అహంకారపు మాటలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యహక్కులను కాలరాస్తూ వచ్చిన టీడీపీ నేతలకు బుద్ధి చెప్పారు. నడిమంత్రపు హోదాతో వైఎస్ కుటుంబాన్ని తూలనాడుతూ వచ్చిన తాజా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని తిరస్కరించారు. ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’ అన్నట్లుగా సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో ఘోర పరాభవం అప్పగించారు. గ్రామాల్లో స్వేచ్ఛగా ఇతర పార్టీల నాయకులు తిరిగేందుకు కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులను తోసిపుచ్చారు. తాము ఏకమైతే తట్టుకోగలరా...ఎదురొడ్డి నిలిచే మొనగాడు ఎవ్వరంటూ తూలనాడిన నాయకునికి సిసలైన తీర్పునిచ్చారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి రాజకీయ జీవితంలో ఏనాడు చూడని, ఊహించని మెజార్టీని వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్రెడ్డి సాధించారు. వర్గరాజకీయాలు కోసం ఫ్యాక్షన్ను పెంచి పోషించిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల స్వార్థ దృక్పథాలను ప్రజలు ఏమాత్రం సమ్మతించలేదు. అదే విషయాన్ని పోలింగ్ ద్వారా స్పష్టం చేశారు. జమ్మలమడుగు పరిధిలోని అన్నీ మండలాలల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. కనివిని ఎరుగని మెజార్టీ సొంతం.... జిల్లాలో పదికి పది సీట్లు ఏకపక్షంగా మొగ్గిన పరిస్థితి ఇప్పటి వరకూ లేదు. వైఎస్సార్ హవాలో కూడా ఒక్కసీటు కోల్పోయారు. కాగా వైఎస్సార్సీపీ అన్నీ సీట్లును దక్కించుకోగా, ఆ పార్టీ అభ్యర్థులకు పరిశీలకులు ఊహించని స్థాయిలో మెజార్టీ స్వంతం దక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో 90,110 ఓట్లు మెజార్టీ దక్కించుకున్నారు. కడప ఎమ్మెల్యేగా ఎస్బి అంజాద్భాషా 52,539 ఓట్లు ఆధిక్యత చేజేక్కించుకున్నారు. జమ్మలమడుగు నుంచి డాక్టర్ సుధీర్రెడ్డి 51,345 ఓట్లు మెజార్టీ పొంది జిల్లాలో మూడోస్థానంలో నిలిచారు. బద్వేల్ నుంచి పోటీచేసిన డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్లు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి 43,148 ఓట్లు మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి29,990, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు 34,510వేల పైచిలుకు మెజార్టీ దక్కించుకోగా, రాయచోటిలో 32,679 మెజార్టీని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి దక్కించుకున్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి 26168, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి 29,674వేటు ఓట్లు ఆధిక్యత సాధించుకున్నారు. ప్రజల మధ్యలో ఉన్న నేతలకే పట్టం.... నిత్యం ప్రజల మధ్య నేతలకే ప్రజలు ఎన్నికలల్లో పట్టం కట్టారు. అదే విషయం ఫలితాలల్లో స్పష్టమైంది. గడిచిన ఐదేళ్లుగా ప్రజాసమస్యలపై ఉద్యమాలు ఓవైపు, పార్టీ కార్యక్రమాలతో మరోవైపు ప్రజల మధ్యనే ఉండిపోయిన నాయకులకు విజయాన్ని అప్పగించారు. మూడేళ్లుగా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టి గడపగడపను చుట్టేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించారు. జిల్లా ప్రజలంతా వైఎస్ కుటుంబం వెన్నంటే ఉంటూ వైఎస్సార్సీపీని బలపరుస్తున్నామని ఎన్నికల ద్వారా తీర్పు చెప్పారు. ఆమేరకు జిల్లాను క్లీన్స్వీప్ చేస్తూ ఫలితాలు అప్పగించడం విశేషం. ఇది ప్రజాతీర్పు చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా భారీ మెజార్టీతో తనను మైదుకూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఇది ప్రజల తీర్పుగా భావిస్తున్నా. ఎన్నో బాధలు పెట్టినా భరించాము. అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లాలంటే వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తారు. గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి కరువుతో రైతులు బాగా దెబ్బతిన్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంది. చంద్రబాబు లక్షల కోట్లను దోచుకుని ఖజానాను ఖాళీ చేశారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక వనరులను సమకూర్చి అభివృద్ధి పథంలో ప్రజలను నడిపిస్తారనే భరోసా ప్రతి ఒక్కరిలో ఉంది. – శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రాజన్న రాజ్యం కోసమే ప్రజలు గెలిపించారు రాజన్న రాజ్యం మరలా రావాలని ప్రజలు వైఎస్సార్సీపీని అత్యధిక సీట్లతో గెలిపించారు. ప్రజలందరూ 2014లో 40 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబును అమరావతి రాజధాని అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. కానీ హామీలనుగానీ, అభివృద్ధినిగానీ చేయని చంద్రబాబు కొన్ని లక్షల కోట్లను బినామీ ఆస్తులుగా మార్చుకుని రాజధాని చుట్టూ కోటరీని ఏర్పరుచుకుని దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువై వారి కష్టాలను దగ్గరగా చూశారు. లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పారు. – పి.రవీంద్రనాథ్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే నియోజకవర్గం: జమ్మలమడుగు జమ్మలమడుగు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎం. సుధీర్రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డిపై విజయం సాధించారు. ఎం. సుధీర్రెడ్డికి వచ్చిన ఓట్లు: 1,24,201 రామసుబ్బారెడ్డికి వచ్చిన ఓట్లు: 72,856 మెజారిటీ: 51,345 మొత్తం ఓటర్లు: 2,37,551 పోలైన ఓట్లు: 2,02,890 పురుషుల ఓట్లు: 116382 స్త్రీల ఓట్లు: 121169 నియోజకవర్గం: కమలాపురం కమలాపురం నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పి. రవీంద్రనాథ్రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై విజయం సాధించారు. రవీంద్రనాథ్రెడ్డికి వచ్చిన ఓట్లు: 85,118 పుత్తా నరసింహారెడ్డికి వచ్చిన ఓట్లు: 58,958 మెజారిటీ: 26,168 మొత్తం ఓటర్లు: 1,92,909 పోలైన ఓట్లు: 1,59,335 పురుషుల ఓట్లు: 95,237 స్త్రీల ఓట్లు: 97672 నియోజకవర్గం: రాయచోటి రాయచోటి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. గడికోట శ్రీకాంత్రెడ్డికి వచ్చిన ఓట్లు: 98,248 రమేష్రెడ్డికి వచ్చిన ఓట్లు: 65,569 మెజార్టీ: 32,679 మొత్తం ఓటర్లు : 2,31,610 పోలైన ఓట్లు : 1,75,943 పురుషుల ఓట్లు : 1,15,365 స్త్రీల ఓట్లు : 1,16,245 నియోజకవర్గం: రాజంపేట రాజంపేట నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి బత్యాల చంగల్రాయుడుపై విజయం సాధించారు. మేడా మల్లికార్జునరెడ్డికి వచ్చిన ఓట్లు: 81,646 బత్యాల చంగల్రాయుడుకు వచ్చిన ఓట్లు: 51,656 మెజారిటీ: 29,990 మొత్తం ఓటర్లు: 2,22,251 పోలైన ఓట్లు: 1,69,077 పురుషుల ఓట్లు: 10,8849 స్త్రీల ఓట్లు: 113402 నియోజకవర్గం: రైల్వేకోడూరు రైల్వేకోడూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు సమీప టీడీపీ అభ్యర్థి పంతగాని నరసింహప్రసాద్పై విజయం సాధించారు. కొరముట్ల శ్రీనివాసులుకు వచ్చిన ఓట్లు: 77,516 నరసింహప్రసాద్కు వచ్చిన ఓట్లు: 43,006 మెజారిటీ: 34,510 మొత్తం ఓటర్లు: 1,82,649 పోలైన ఓట్లు: 1,37,534 పురుషుల ఓట్లు: 90,218 స్త్రీల ఓట్లు: 92,431 నియోజకవర్గం: పులివెందుల పులివెందుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి సతీష్రెడ్డిపై విజయం సాధించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చిన ఓట్లు: 1,32,178 సతీష్రెడ్డికి వచ్చిన ఓట్లు: 42,068 మెజారిటీ: 90,110 మొత్తం ఓటర్లు: 2, 23,395 పోలైన ఓట్లు: 1,80,663 పురుషుల ఓట్లు: 1,09,590 స్త్రీల ఓట్లు: 1,13,805 నియోజకవర్గం: మైదుకూరు మైదుకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్పై విజయం సాధించారు. రఘురామిరెడ్డికి వచ్చిన ఓట్లు: 94,854 సుధాకర్యాదవ్కు వచ్చిన ఓట్లు: 65,180 మెజారిటీ: 29,674 మొత్తం ఓటర్లు: 2,07,946 పోలైన ఓట్లు: 1,71,779 పురుషుల ఓట్లు: 1,03,070 స్త్రీల ఓట్లు: 1,04,876 నియోజకవర్గం: కడప కడప నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్బీ అంజద్బాషాసమీప టీడీపీ అభ్యర్థి అమీర్బాబుపై విజయం సాధించారు. అంజద్బాషాకు వచ్చిన ఓట్లు:1,00,737 అమీర్బాబుకు వచ్చిన ఓట్లు: 48,198 మెజారిటీ: 52,539 మొత్తం ఓటర్లు: 2,65,067 పోలైన ఓట్లు: 1,64,772 పురుషుల ఓట్లు: 1,30,063 స్త్రీల ఓట్లు: 1,35,004 నియోజకవర్గం: బద్వేలు బద్వేలు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జి. వెంకటసుబ్బయ్య సమీప టీడీపీ అభ్యర్థి రాజశేఖర్పై విజయం సాధించారు. జి. వెంకటసుబ్బయ్యకు వచ్చిన ఓట్లు: 95,482 రాజశేఖర్కు వచ్చిన ఓట్లు: 50,748 మెజారిటీ: 44,734 మొత్తం ఓటర్లు: 2,04,597 పోలైన ఓట్లు: 1,58,863 పురుషుల ఓట్లు: 102811 స్త్రీల ఓట్లు: 101786 నియోజకవర్గం: ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి లింగారెడ్డిపై విజయం సాధించారు. రాచమల్లు శివప్రసాద్రెడ్డికి వచ్చిన ఓట్లు: 1,07,941 లింగారెడ్డికి వచ్చిన ఓట్లు: 64,793 మెజారిటీ: 43,148 మొత్తం ఓటర్లు: 2,36,689 పోలైన ఓట్లు: 1,82,125 పురుషుల ఓట్లు: 115532 స్త్రీల ఓట్లు: 121157 -
చిత్తూరు: ఫ్యాను ప్రభంజనం
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ సృష్టించిన సునామీకి జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్ స్పీడ్కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యాయి. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైఎస్సార్సీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 13స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. గురువారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్ల లెక్కింపుతో వైఎస్సార్సీపీ జైత్రయాత్ర ప్రారంభమైంది. ఈవీఎంల లెక్కింపు మొదలు కాగానే రౌండ్ రౌండ్కు వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యత దిశగా దూసుకెళ్లింది. మూడు, నాలుగో రౌండ్లు పూర్తయ్యే సరికి ఆ పార్టీ అభ్యర్థులు సమీప టీడీపీ అభ్యర్థులకు అందనంత దూరంలోకి మెజారిటీ వెళ్లిపోయింది. బాబుకు భంగపాటు చంద్రబాబు దుర్మార్గ పాలనలో ఐదేళ్లు ప్రత్యక్ష నరకం అనుభవించిన జిల్లా ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. రాష్ట్ర మంత్రి అమరనాథరెడ్డి పలమనేరు నియోజకవర్గంలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఆయన మరదలు అనీషా రెడ్డి పుంగనూరులో, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి సోదరుడు కిశోర్కుమార్రెడ్డి పరాజయం పాలయ్యారు. దొమ్మలపాటి రమేష్ మదనపల్లిలో, శంకర్ తంబళ్లపల్లిలో, పూతలపట్టులో లలితాథామస్, చంద్రగిరిలో పులివర్తి నాని, నగరిలో గాలి భానుప్రకాష్, గంగాధర నెల్లూరులో హరికృష్ణ, సత్యవేడులో జేడీ రాజశేఖర్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్రెడ్డి, తిరుపతిలో సుగుణమ్మ, చిత్తూరులో ఏఎస్ మనోహర్ పరాభవాన్ని చవిచూశారు. సొంత జిల్లాలో చంద్రబాబునాయుడుకు భంగపాటు ఎదురైంది. చంద్రబాబుకు చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన కుప్పం లో గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ విజయదరహాసం జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైఎస్సార్ సీపీ పట్టు నిలుపుకుంది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధర నెల్లూరులో కళత్తూరు నారాయణస్వామి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నగరిలో ఆర్కే రోజా వాళ్ల స్థానాలను నిలబెట్టుకున్నారు. మదనపల్లె నుంచి నవాబ్ బాషా, పలమనేరు నుంచి వెంకటేగౌడ, పూతలపట్టు నుంచి బాబు గెలిచి గత ఎన్నికల్లో గెలిచిన 8 స్థానాలు పదిలం చేశారు. తిరుపతి నుంచి కరుణాకరరెడ్డి విజయం సాధించారు. తొలిసారి విజేతలు సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్రెడ్డి, తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పలమనేరు నుంచి వెంకటే గౌడ, చిత్తూరు నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు, పూతలపట్టు నుంచి ఎం.ఎస్. బాబు, మదనపల్లె నుంచి నవాజ్ బాషా తొలిసారి గెలిచి అసెంబ్లీ మెట్లెక్కనున్నారు. జగన్ వెంటే జనం జిల్లాలో జనం జగన్ వెంటే అని మరోసారి నిరూపితమైంది. ఏకంగా 13 సెగ్మెంట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించడంపై సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పదేళ్ల నిరీక్షణ, అడుగడుగునా అవమానాలు, వేధింపులు తట్టుకుని సాధించిన విజయంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. 1994లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ 15 స్థానాలకు గాను 14 సాధించి విజయదుందుభి మోగించింది. ఆ తర్వాత ఎవరికీ సాధ్యం కాదనుకున్న ఫలితాలు ఈ ఎన్నికల్లో ప్రస్పుటమయ్యాయి. వైఎస్.జగన్మోహన్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ అపూర్వ విజయాన్ని నమోదు చేసి చరిత్రలో నిలిచిపోయింది. -
మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం
సాక్షి, శ్రీకాకుళం: అనుభవం పనిచెయ్యలేదు.. రాజ కుటుంబమనే గౌరవమూ దక్కలేదు. మూడు దశాబ్దాలుగా అధికారాన్ని కట్టబెడితే.. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన గిరిపుత్రులు రాజుని ఇంటికి సాగనంపారు. మట్టి మనిషి చేతిలో ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు. స్వచ్ఛమైన గిరి పుత్రికకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కల్మషం లేని మనుషులంతా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని జగనన్నకు కానుకగా అందించారు. తండ్రీ కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసిన గొడ్డేటి మాధవి తెగువ.. తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా.. బినామీ కొండను ఢీకొట్టి.. అమాయక గిరిజనుల్లో కొత్త శకానికి నాంది పలికారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి.. ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న కిశోర్చంద్రదేవ్ని ఇంటికి సాగనంపారు. మొదటి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్కు అవకాశం ఇవ్వకుండా.. మాధవి ముందంజలో దూసుకుపోయారు. మొత్తంగా మాధవికి 5,51,560 ఓట్లు పోలవ్వగా.. కిశోర్చంద్రదేవ్కు 3,34,214 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వైరిచర్ల కుమార్తె శృతిదేవి 17,479 ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోయారు. ఈమె కంటే నోటాకు (47,376) రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు పోలవ్వడం గమనార్హం. తొలి రౌండ్లో మొదలైన వైఎస్సార్సీపీ ఆధిక్యం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. మొత్తంగా 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాగా, పాలకొండ నియోజకవర్గం నుంచి గొడ్డేటి మాధవికి 68241 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్థి కిశోర్చంద్రదేవ్కు 53202 ఓట్లు పోలయ్యాయి. జనసేన అభ్యర్థి వి.గంగులయ్యకు 2933 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వై.శృతీదేవికి 1305 ఓట్లు పోలయ్యాయి. -
ఆత్మకూరు గౌతమ్రెడ్డిదే..
సాక్షి, ఆత్మకూరు: మేకపాటి గౌతమ్రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఆ పార్టీ సిటింగ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌతమ్రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 22,963 మెజార్టీతో గెలుపొందారు. గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలవడ్డాయి. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో కౌంటింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి వైఎస్సార్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తూనే వచ్చింది. ప్రతి రౌండ్కు పెరుగుతున్న మెజార్టీని చూసి తెలుగు తమ్ముళ్లు బెంబేలెత్తారు. మొదటి నాలుగు రౌండ్లు పూర్తయ్యాక టీడీపీ నాయకులు ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చారు. టీడీపీ వర్గాలు తాము తప్పనిసరిగా గెలుస్తామని చెప్పిన మండలాల్లోనూ వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. తొలి నుంచి ఊహించినట్లుగానే మర్రిపాడు, అనంతసాగరం మండలాలు, ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్సీపీకి మంచి మెజార్టీ లభించింది. టీడీపీ అభ్యర్థికి చెందిన సొంత మండలమైన చేజర్లలోనూ వారు ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడం గమనార్హం. ఆత్మకూరు రూరల్ మండలంలో టీడీపీ వర్గీయులు మెజార్టీ వస్తుందని ఆర్భాటంగా ప్రకటన చేసినా వైఎస్సార్సీపీకే 700 ఓట్లకు పైగా మెజార్టీ రావడం విశేషం. ఇదే క్రమంలో ఏఎస్పేట, సంగం మండలాల్లోనూ తెలుగుదేశాన్ని తోసిరాజని ఓటర్లు వైఎస్సార్సీపీకే మద్దతుగా నిలిచారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఓటర్లు పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తే ఆత్మకూరు నియోజకవర్గంలోని 277 బూత్ల్లో జరిగిన అన్ని రౌండ్లలో వైఎస్సార్సీపీ మెజార్టీ సాధించగా కేవలం మూడు రౌండ్లలో మాత్రమే టీడీపీ స్వల్ప ఆధిక్యత కనబరిచింది. గౌతమ్రెడ్డి ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మేధరవీధి గిరిజన కాలనీలో పార్టీ నాయకురాలు గంధళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో 25 కేజీల కేక్ను కట్ చేశారు. 2014 ఎన్నికల్లో గౌతమ్రెడ్డి 31,412 ఓట్ల విజయం సాధించారు. -
తొలి గెలుపు అదుర్స్
సాక్షి, శ్రీకాకుళం: ఫ్యాన్ గెలుపు సునామీలో సైకిల్ కొట్టుకుపోయింది. తలపండిన టీడీపీ నేతలకు దిమ్మతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతిపరుల పాలనను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న నవ నాయకత్వానికి పట్టం కట్టారు. జిల్లాలో ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తొలిసారి గెలుపు రుచేంటో చూపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలిసారి అడుగిడునున్న రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, సీదిరి అప్పలరాజుల గెలుపునకు దోహదపడిన కొన్ని అంశాలు చదివిద్దేమిలా.. డాక్టర్ దెబ్బకు టీడీపీ కోట బద్దలు మందస: ఓ వైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం.. సామ, దాన, భేద, దండోపాయాలు తెలిసిన నాయకత్వం గౌతు శ్యామసుందర శివాజీ సొంతం. మరోవైపు పిన్న వయస్కుడు, అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు భారతంలోని అభిమన్యుడు లాంటి వాడే. ఈయన కురువృద్ధుడు లాంటి శివాజీ రాజకీయ బాణాలను, పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్రాలతో ఎదుర్కొని జయకేతనం ఎగురవేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఓమారుమూల గ్రామమైన దేవునల్తాడలో ఓ సామాన్య మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి దాలయ్య, నీలమ్మ దంపతులకు అప్పలరాజు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను రుజువు చేస్తూ, విద్యలో మంచి ప్రతిభ చూపారు. ఎంబీబీఎస్ చదివి పలాస–కాశీబుగ్గలో ప్రాక్టీసు చేస్తూ ఎంతో మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ అప్పలరాజు ప్రతిభ, నిపుణత చూసి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయాల్లో దూసుకుపోయారు. ప్రజల మనసులో మంచిస్థానం సంపాదించగలిగారు. ఈయన్ను ఎదుర్కొనలేక టీడీపీ కుటిల యత్నాలకు దిగింది. ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే గౌతు శివాజీ, అభ్యర్థిగా శిరీష, ఆమె భర్త వెంకన్నచౌదరి, గౌతు విజయలక్ష్మి, జీకే నాయుడు, పీరికట్ల విఠల్రావు, వజ్జ బాబురావు ఇలా ఒకరేమిటి ఎంతోమంది రాజకీయ అనుభవం గల నాయకులు ఒక వైపు.. తానొక్కడే ఒంటిచేత్తో మరో వైపు పోరాడిన అప్పలరాజు సునాయాస విజయాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శివాజీ కుమార్తె శిరీషను ఓడించి, పలాసలో వైఎస్సార్సీపీకి స్థానం కల్పించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయ వ్యూహానికి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రెడ్డి శాంతి ప్రభంజనం ఎల్.ఎన్.పేట: పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గెలుపు జన ప్రభంజనంగా నిలిచింది. ఈమెను ఓడించాలని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నిన కుయుక్తులు ఓటర్ల సునామీలో కొట్టుకుపోయాయి. స్థానికేతరాలని, ఈమెను కలవాలంటే ఢిల్లీ వెళ్లాలా అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. వంశధార నిర్వాసితులను బలవంతంగా గ్రామాల నుంచి బయటకు పంపించిన తెలుగుదేశం పార్టీకి వారి ఉసురే తగిలిందని నిర్వాసిత గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు నిర్వాసితుల అండగా నిలుస్తారని భావించినప్పటికీ గట్టి గుణపాఠమే చెప్పారు. మెళియాపుట్టి మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్లో నష్టపోయిన బాధితుల సమస్యలతోపాటు వంశధార నిర్వాసితుల సమస్యలపైన పోరాటం చేస్తూ అండగా నిలిచిన ఈమె తన విజయానికి బాటలు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు చేసిన అక్రమాలు ప్రజలకు వివరించడంతోపాటు ప్రజలకు అండగా ఉంటానని నియోజకవర్గం మొత్తంగా పర్యటించినందుకు ప్రజలంతా అక్కున చేర్చుకున్నారు. కిరణ్కే పట్టం ఎచ్చెర్ల క్యాంపస్: రాజకీయ కురువృద్ధుడు, మంత్రి కళా వెంకటరావును ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టి కరిపించారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ ఉనికి లేకుండా చేసిన కళాకు ఓటర్లు సైతం గట్టి సమాధానమిచ్చారు. ఈ మేరకు స్థానిక నేత గొర్లె కిరణ్కుమార్కు బ్రహ్మరథం కట్టారు. 2014 ఎన్నికల్లో కళా వెంకటరావు చేతిలో కిరణ్ ఓటమి చవిచూశారు. అయినప్పటికీ నిరాశ చెందకుండానే వైఎస్సార్సీపీ శ్రేణులతో కలసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం మీసాల నీలకంఠంనాయుడు కూడా పోటీపడినప్పటికీ కొన్ని నెలల క్రితం ఈయన మంత్రి కళా లాబీయింగ్తో టీడీపీలో చేరిపోయారు. దీంతో కిరణ్కుమార్కు టిక్కెట్టు ఖాయమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావటంవ వల్ల కళా విజయం తథ్యంగా టీడీపీ వర్గాలు భావించాయి. అయితే కిరణ్కుమార్ స్థానికుడు కావటం, ఎన్నికల్లో ఓడినా నిరంతరం ప్రజల్లో ఉండటంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు. -
సంజీవయ్య సూపర్ విక్టరీ
సాక్షి, నాయుడుపేట/సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సూపర్ విక్టరీని నమోదుచేసుకుంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య భారీ ఆధిక్యత సాధించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన ఓట్లు లెక్కింపులో ప్రారంభం నఉచి అత్యధిక మెజార్టీ కొనసాగింది. తొలి రౌండ్ నుండి మూడో రౌండ్ వరకు 3వేలు చొప్పున ఆధిక్యత సాధించారు. నాల్గొ రౌండ్లో కొంత మెజార్టీ తగ్గినా, ఐదవ రౌండ్ నుంచి 3వేలకు తగ్గకుండా మోజార్టీ జోరును పెంచింది. చివరి 21వ రౌండ్ వరకు మెజార్టీ ఆధిక్యతకు అడ్డేలేకుండా పోయింది. ఏదశలోనూ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పోటీ ఇవ్వలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ కిలివేటి హవా కొనసాగింది. టీడీపీ నియోజకవర్గంగా పేరున్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో 1985లో టీడీపీ తరఫున పోటీచేసిన ఎం. మనెయ్య 28368 ఓట్లు మెజార్టీ సాధించారు., 1994లో 21001 ఓట్లు ఆధిక్యతలో పరసా వెంకటరత్నం విజయం సాధించారు. సూళ్లూరుపేటలో కిలివేటి విజయదుందుభీ మోగించడంతో పార్టీ క్యాడర్ ఆనందానికి హద్దేలేకుండా పోయింది. 1985 ఎం. మణెయ్య మెజార్టీ 28,368 ఓట్లు 1994 పరసా వెంకటరత్నం మెజార్టీ 21.001 ఓట్లు ఈ విజయం చారిత్రాత్మకం : కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేట నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి ఇంతటి ఘన విజయం ఇప్పటివరకు చరిత్రలో లేదు. ఇది చారిత్రాత్మక విజయం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి, కష్టం ఫలితమే ఈ అపూర్వ విజయం. నియోజకవర్గంలో నాయకులు, యువత, కార్యకర్తలు పార్టీ కోసం చాలా కష్టపడి చేశారు. ఓటర్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. -
చట్ట సభలకు.. తొలిసారి
అమలాపురం: సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విదంగా తూర్పు ప్రజలు తీర్పునిచ్చారు. సంచలన రాజకీయాలకు కేంద్రబిందువైన తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయధుందుబి మోగించింది. అలాగే సంప్రదాయంగా వినూత్న తీర్పులతో ఆకట్టుకునే తూర్పు ఈసారి కూడా కొత్తవారికి అవకాశం కల్పించింది. తొలిసారి పోటీ పడినవారు, గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారు ఈసారి విజయం సాధించి తొలిసారిగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే పార్లమెంట్ సభ్యులుగా లోక్సభకు ఎన్నికైన నలుగురికి కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. జిల్లా నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనవారిలో రాజానగరం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఒకరు. రాజా తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. రంపచోడవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన నాగులాపల్లి ధనలక్ష్మి సైతం టీడీపీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై భారీ అధిక్యంతో విజేతగా నిలిచారు. అనపర్తి నుంచి పోటీ చేసిన డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఘన విజయం సాధించారు. జగ్గంపేట నియోజకవర్గానికి టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై జ్యోతుల చంటిబాబు సంచలన విజయం సాధించారు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన పర్వత పూర్ణచంద్రప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేసిన డీసీసీబీ చైర్మన్ వరపుల రాజాపై విజయం సాధించారు. అలాగే రామచంద్రపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు టీడీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై సంచలన విజయం సాధించారు. కోనసీమ పరిధిలో పి.గన్నవరం నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా, తిరిగి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పోటీ చేసిన కొండేటి చిట్టిబాబు తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై భారీ మెజార్టీలో విజయం సాధించారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ సమీప వైఎస్సార్ సీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై విజయం సాధించి, తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. లోక్సభకూ కొత్తవారే జిల్లాలో నాలుగు పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసి ఎన్నికైన వారు లోక్సభలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ నలుగురు వైఎస్సార్సీపీ వారే కావడం గమనార్హం. వీరిలో కాకినాడ నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వంగా గీతా విశ్వనాథ్ గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఒకసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా పని చేశారు. రాజమహేంద్రవరం నుంచి పోటీ చేసిన మారాని భరత్, అమలాపురం నుంచి పోటీ చేసిన చింతా అనూరాధ, అరకు (రంపచోడవరం భాగంగా ఉంది) వైఎస్సార్ సీపీ తరఫున జి.మాధవికి ఇవే తొలి ఎన్నికలు. వీరిని గెలిపించడం ద్వారా తూర్పు ఓటర్లు మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. -
నెల్లూరు: క్లీన్ స్వీప్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో వైఎస్ జగన్ హవాతో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. గతంలో అనేక ప్రభంజనాలు ఉన్న సమయంలో ప్రతిపక్షం ఒక స్థానం గెలుచుకొని ఉనికి చాటుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ మొదటిసారిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిన్నటి వరకు అధికారపార్టీగా ఉన్న తెలుగుదేశం కనీసం ప్రతిపక్ష ఉనికి లేకుండా జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు సమష్టి కృషి కూడా నూరు శాతం ఫలించి అభ్యర్థులను భారీ మెజార్టీతో విజయతీరాలకు చేర్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా పనిచేయడం దానికి వైఎస్ జగన్ మానియా బలంగా తోడవడంతో గెలుపు సునాయాసమైంది. నెల్లూరు నగరంతో సహా అన్ని నియోజకవర్గాల్లో మొదటి రౌండ్ నుంచి మొదలైన ఆధిక్యం చివరి వరకు కొనసాగింది. నెల్లూరు సిటీలో మాత్రం చివరి వరకు పూర్తి ఉత్కంఠగా నువ్వా.. నేనా.. అనే రీతిలో సాగినా చివరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి పి.అనిల్కుమార్యాదవ్ 1287 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల్లోనూ మంచి మెజార్టీలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉదయగిరి, కోవూరులలో రికార్డు స్థాయిలో మెజార్టీలు రావడం విశేషం అలాగే ఆత్మకూరు, కావలిలోనూ మంచి మెజార్టీలు లభించాయి. 17వ రౌండ్ ముగిసే నాటికి నెల్లూరు వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆదాల ప్రభాకర్రెడ్డి 1,24,680 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అలాగే తిరుపతి పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి 2.24 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జిల్లాలో సూళ్లూరుపేటే టాప్. . జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య రికార్డు స్థాయిలో 61,417 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే వైఎస్సార్సీపీ అభ్యర్థులు గూడూరు నియోజకవర్గం నుంచి వెలగపల్లి వరప్రసాద్రావు 45,416 ఓట్ల మెజార్టీతో, కోవూరు నియోజకవర్గం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి 39,769 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి 38,720 ఓట్ల మెజార్టీతో, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి 19,510 మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి 36,081 మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి 21,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే కావలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి 13 817 ఓట్ల మెజార్టీతో, నెల్లూరు సిటీ నుంచి పి.అనిల్కుమార్యాదవ్ 1,287 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జనసేనకు డిపాజిట్ నిల్ మరోవైపు జిల్లాలో అధికారపార్టీ నుంచి బరిలో నిలిచిన మంత్రులు, హేమాహేమీలు పూర్తిగా మట్టికరిచారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పి.నారాయణ, బడా నేతలుగా ఉన్న బొల్లినేని కృష్ణయ్య, బీద మస్తానరావు ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ నుంచి 2014లో గెలుపొందిన సిటింగ్ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని వెంకటరామారావు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతుల్లో ఘోరంగా ఓడిపోయారు. అలాగే పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన సునిల్ను కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి రికార్డు స్థాయిలో ఓడించారు. ఇక జిల్లాలో జనసేన ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కించుకోని పరిస్థితి నెలకొంది. -
‘రాజన్న బిడ్డ’కే గోదారి గడ్డ పట్టం
రాజన్న బిడ్డకే గోదారి గడ్డ పట్టం కట్టింది. కళ్లారా తమ కష్టాలు చూసి ఎద కదిలిపోయిన వాడికే; కాళ్లు పుళ్లయినా సడలని సంకల్పంతో.. తన అడుగులకు ఆత్మీయతను జోడించి.. తమ బతుకుల గతుకులను అధ్యయనం చేసిన బాటసారికే; మమతతో కన్నీళ్లు తుడిచిన మనసున్న మారాజుకే జేజేలు పలికింది. అయిదేళ్లుగా అలముకున్న అంధకారంలో నవోదయం లాంటి నవరత్న పథకాల రూపకర్త సారథ్యానికే సమ్మతిని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 3 లోక్సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీకి విజయం చేకూర్చి.. జననేత జగన్పై తిరుగులేని ఆదరణను చాటింది. అర్ధ దశాబ్ది భ్రష్ట, దుష్టపాలన నుంచి; నమ్మి అధికారమిచ్చిన ప్రజలను తృణప్రాయులుగా పరిగణించి, పరాభవించిన ‘చంద్రుని’ గ్రహణం నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడంలో తూరుపు సీమ కీలక భూమిక పోషించింది. మండుటెండల వేళ ఊరడించిన మలయ పవనంలా.. జనకంటక అధ్యాయానికి తెరపడి, పదవిని ప్రజాసేవకు దక్కిన పవిత్రమైన అవకాశంగా భావించే జనరంజక పాలన ప్రారంభం కానున్న వేళ.. వనసీమ నుంచి కోనసీమ వరకూ ఆనందంతో పులకాంకితమైంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఫ్యాన్ సృష్టించిన ప్రభంజనానికి సైకిల్ గడ్డిపోచలా ఎగిరిపోయి.. తునాతునకలైపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సునామీలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. ‘నవ’వసంతంలో నడుస్తున్న వైఎస్సార్ సీపీపై వెల్లువెత్తిన ప్రజాభిమానం ముందు.. మూడున్నర దశాబ్దాలకు పైబడిన టీడీపీ.. దిక్కుతోచని స్థితిలో తల వంచేసింది. కోలుకోలేని ఓటమిని చవిచూసింది. ప్రజాగ్రహానికి ఎంతటి వారైనా తల వంచక తప్పదని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోసారి తేటతెల్లం చేశాయి. అవినీతి, అక్రమాలు, ప్రజావ్యతిరేక పాలనతో అష్టకష్టాలకు గురి చేసిన టీడీపీ ప్రభుత్వానికి జిల్లా ప్రజలు కసి తీరా బుద్ధి చెప్పారు. ఫలితంగా జిల్లాలో టీడీపీ కంచుకోటలను వైఎస్సార్ సీపీ బద్దలుగొట్టింది. మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాల్లో విజయదుందుభి మోగించింది. తద్వారా జిల్లా రాజకీయ ముఖచిత్రంలో కొత్త అధ్యాయాన్ని వైఎస్సార్ సీపీ లిఖించింది. కాకినాడలోని జేఎన్టీయూ, రంగరాయ వైద్య కళాశాల, ఐడియల్ ఇంజినీరింగ్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్, జేఎన్టీయూ క్రీడా మైదాన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యతను సాధించింది. జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉండగా 14 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, అనపర్తి, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, కొత్తపేట, రంపచోడవరం, రాజానగరం నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, పెద్దాపురం, మండపేటలో మాత్రమే గెలిచింది. జనసేన పార్టీ రాజోలులో తొలిసారి అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించింది. అనపర్తి నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన సత్తి సూర్యనారాయణరెడ్డి జిల్లాలోనే 55,207 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత నాగులాపల్లి ధనలక్ష్మి రంపచోడవరం నుంచి 39,106 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ తరువాతి స్థానంలో రాజానగరం నుంచి జక్కంపూడి రాజా 31,772 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. రాజమహేంద్రవరం సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని 30,436 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ తరువాత అమలాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ 27,200 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనసేన తరఫున రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు 810 ఓట్ల అత్యల్ప ఆధిక్యతతో గెలుపొందారు. మెట్టలో మరోసారి వైఎస్సార్ సీపీ ఆధిక్యత 2014 ఎన్నికల్లో జిల్లాలోని మెట్ట ప్రాంతమైన జగ్గంపేట, తుని, ప్రత్తిపాడుతో పాటు ఏజెన్సీలోని రంపచోడవరంలో గెలిచిన వైఎస్సార్ సీపీ.. ఈసారి ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో మరింత బలం పెంచుకుంది. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. తుని నుంచి దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు నుంచి పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, పిఠాపురం నుంచి పెండెం దొరబాబు, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, రాజానగరం నుంచి జక్కంపూడి రాజా, కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు విజయం సాధించారు. మెట్ట పరిధిలోకి వచ్చే అనపర్తి నుంచి సత్తి సూర్యనారాయణరెడ్డి గెలిచారు. జిల్లాలోని ఏకైక ఏజెన్సీ నియోజకవర్గమైన రంపచోడవరంలో కూడా మరోసారి వైఎస్సార్ సీపీ పతాక రెపరెపలాడింది. ఆ పార్టీ తరఫున నాగులాపల్లి ధనలక్ష్మి విజయం సాధించారు. కోనసీమలో పట్టు సాధించిన వైఎస్సార్ సీపీ కోనసీమలో వైఎస్సార్ సీపీ పట్టు సాధించింది. అంచనాలకు మించి బలం పెంచుకుంది. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్, పి.గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు, ముమ్మిడివరం నుంచి పొన్నాడ వెంకట సతీష్కుమార్, రామచంద్రపురం నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొత్తపేట నుంచి చిర్ల జగ్గిరెడ్డి విజయం సాధించారు. జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు : 19 వైఎస్సార్ సీపీ : 14, టీడీపీ : 4, జనసేన : 1 జిల్లాలోని ఎంపీ స్థానాలు మూడూ వైఎస్సార్ సీపీ కైవసం. అత్యధిక మెజార్టీ : 55,207 : డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ, అనపర్తి రెండో అత్యధిక మెజార్టీ : 39,106 : నాగులాపల్లి ధనలక్ష్మి, వైఎస్సార్ సీపీ, రంపచోడవరం మూడో అత్యధిక మెజార్టీ : 31,772 : జక్కంపూడి రాజా ఇంద్రవందిత్, వైఎస్సార్ సీపీ, రాజానగరం అత్యల్ప మెజార్టీ : 810 : రాపాక వరప్రసాదరావు, జనసేన, రాజోలు -
వైఎస్ జగన్కు ప్రణబ్ ముఖర్జీ అభినందనలు
-
నారి.. విజయ విహారి
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 15 మందికి, టీడీపీ 19 మంది మహిళలకు టికెట్లు కేటాయించాయి. వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన 15 మందిలో 13 మంది విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన 19 మందిలో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని ఒక్కరే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 187 మంది పోటీ చేయగా 14 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. పాతపట్నం నుంచి రెడ్డిశాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి, కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి, పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ, నగరి నుంచి ఆర్.కె. రోజా, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. విశాఖపట్నం తూర్పు నుంచి ఎ.విజయనిర్మల, పెద్దాపురం నుంచి తోట వాణి ఓడిపోయారు. అలాగే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి సత్యవతి, కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి వంగా గీత, అరకు లోక్సభ స్థానం నుంచి గొడ్డేటి మాధవి విజయం సాధించారు. -
రాజధాని అమరావతిలో టీడీపీకి చుక్కెదురు
-
కృష్ణా జిల్లాలో టీడీపీకి చుక్కెదురు
-
బాబు భ్రమలకు మహిళలు బ్రేక్
ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మహిళలు బ్రహ్మరథం పట్టారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో పాటు.. ప్రాంతాలకతీతంగా మహిళలంతా ముక్తకంఠంతో జననేతకు జై కొట్టారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసి.. తీరా ఎన్నికల వేళ పసుపు–కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెడదామనుకున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పారు.. సాక్షి, అమరావతి : తమను గెలిపిస్తుందని చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న పసుపు – కుంకుమ పథకం టీడీపీని చావు దెబ్బే తీసింది. ఐదేళ్లుగా అనేక రకాలుగా మోసం చేసినా రాష్ట్రంలో 95 లక్షల మంది దాకా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఏదో ఒక తాయిలం ఇస్తే వాళ్ల ఓట్లన్నీ తనకే పడతాయని భ్రమల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు మహిళలను విశేషంగా ఆకట్టుకోవడంతో వైఎస్సార్సీపీకి వారంతా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,13,33,631 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 1,98,79,421 మంది మహిళా ఓటర్లే. కాగా 1,57,87,759 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహిళలు అత్యధికంగా ఓట్లు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. మొత్తం సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మాఫీ పేరుతో మాయ మొత్తం 1.98 కోట్ల మంది మహిళా ఓటర్లలో దాదాపు కోటి మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికల వాగ్దానంలో భాగంగా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జీరో వడ్డీ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల తాయిలం ప్రకటించారు. సరిగ్గా పోలింగ్కు రెండురోజుల ముందు ప్రభుత్వ ఖజానా నుంచి డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చారు. దీంతో మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయని, గెలుపు తమదేనని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తీరా టీడీపీకి మహిళలు దిమ్మ తిరిగిపోయే ఫలితాన్నివ్వడంతో డీలాపడిపోయారు. -
భీమవరంలో పవన్ కల్యాణ్ ఘోరపరాజయం
-
జగన్ వెంటే నిలిచిన తూర్పుగోదావరి జిల్లా ప్రజలు
-
ఫ్యాన్ గాలి సునామీకి టీడీపీ చిరునామా గల్లంతు
-
ఘోర ఓటమిని చవిచూసిన చంద్రబాబు
-
పార్టీ ఫిరాయింపుదారులకు గట్టి షాక్
-
ఎన్నికల్లో బెడిసికొట్టిన చంద్రబాబు వ్యూహాలు
-
ఓటమితో తెగబడిన పచ్చమూకలు
అనంతపురం సెంట్రల్/పిడుగురాళ్ల/బొల్లాపల్లి (గుంటూరు) : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగడంతో టీడీపీ శ్రేణుల్లో అసహనం పెల్లుబికింది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై వేటకొడవలితో దాడిచేయగా.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న వారిపై మహిళలు కారం చల్లగా.. టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడిచేశారు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, ఇదే జిల్లా బొల్లాపల్లి మండలంలోనూ టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గొల్ల వెంకటేశ్ యాదవ్ తమ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఉత్సాహంతో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టీడీపీ నాయకుడు, మార్కెట్ యార్డు చైర్మన్ దొడగట్ట నారాయణ తన కుటుంబ సభ్యులు మధు, అశోక్లను ఉసిగొల్పి వెంకటేశ్పై దాడికి తెగబడ్డాడు. మధు, అశోక్లు వేట కొడవలితో దాడిచేయగా వెంకటేశ్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే బాధితుడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు పట్టణ పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇదే జిల్లా పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు చంద్రశేఖర్రెడ్డి, సోమశేఖర్రెడ్డిలపై టీడీపీ నేత.. ఎంపీపీ భర్త కేశవయ్య, వడ్డే శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుష్పనాథ్, శ్రీనాథ్, శంకరయ్య, రాజప్ప, శ్రీనివాసులు, లక్ష్మయ్య, గజేంద్రలు రాళ్లతో దాడిచేశారు. దాడిలో చంద్రశేఖర్రెడ్డి, సోమశేఖర్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు వేరే వాహనాలలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికీ గాయాలయ్యాయి. బాధితులను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక పెనుకొండలో వైఎస్సార్సీపీ గెలవడంతో గోరంట్లలోని బీసీ కాలనీకి చెందిన పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటుండగా.. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను స్టేషన్ పిలిపించి మందలించారు. అనంతరం పోలీసుస్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు నాగరాజు, శివప్ప, రవి తదితరులు.. ఇంటివద్ద ఉన్న అక్కమ్మ, రగప్ప దంపతులతో పాటు ప్రసాద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడిచేశారు. దాడిలో అక్కమ్మ తీవ్రంగా గాయపడింది. ఇక అనంతపురంలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్త ద్విచక్రవాహనంపై తన అభిమానాన్ని తెలియజేసేందుకు జెండా కట్టుకుని మంత్రి పరిటాల సునీత నివాసం ముందు నుంచి వస్తుండగా.. అక్కడే ఉన్న టీడీపీ రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనుచరులు అతడిని పట్టుకుని కొట్టారు. ఒంటరిగా వస్తున్న యువకుణ్ణి పదుల సంఖ్యలో టీడీపీ అనుచరులు కలిసి చితకబాదారు. అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీలో రౌడీషీటర్ మనోహర్నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. స్థానికంగా నివాసముంటున్న చంద్రశేఖర్రెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై కట్టెలతో దాడిచేశారు. రౌడీషీటర్తో పాటు మరో పదిమంది ఈ దాడిలో పాల్గొన్నారు. పిడుగురాళ్లలో మాటువేసి దాడి ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ విజయోత్సవ ర్యాలీపై గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో టీడీపీ నేతలు ఊహించని విధంగా దాడిచేశారు. వైఎస్సార్సీపీ విజయం ఖాయం కావడంతో గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ముదిరాజ్ బజార్కు ర్యాలీ ప్రవేశిస్తుండగా అప్పటికే పక్కా ప్రణాళికతో కాపు కాసిన మహిళలు డాబాల మీద నుంచి ర్యాలీపై కారంపొడి చల్లారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే టీడీపీ నాయకులు.. చల్లా కోటిరెడ్డి, సుంకు పవన్రెడ్డి, ఎంపీటీసీ భర్త గున్నంరెడ్డి శెవిరిరెడ్డిలపై వేటకొడవళ్లు, గొడ్డళ్లతో దాడిచేశారు. దీంతో చల్లా కోటిరెడ్డి తల వెనుక భాగంపై, మెడపై నరం తెగడంతో తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమంగా మారింది. చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ నుంచి నరసరావుపేటకు తరలించారు. సుంకు పవన్రెడ్డికి తలపై, ఎడమ కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీటీసీ భర్త శెవిరిరెడ్డికి నుదురు భాగంలో గాయమైంది. కాగా, ఇదే సమయంలో పొలం నుంచి ద్విచక్ర వాహనంపై గ్రామంలోకి వస్తున్న ముడేల శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి అక్కడినుంచి పరారయ్యారు. అనంతరం.. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనతో ఎలాంటి సంబంధంలేని గున్నంరెడ్డి రంగారెడ్డిని పోలీసులు చితకబాదడంతో అతని కంటి భాగంలో తీవ్రగాయమైంది. గ్రామంలో పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. రాళ్లు, కర్రలతో దాడి కాగా, ఇదే జిల్లా బొల్లాపల్లి మండలం గండిగనుమల పంచాయతీ శివారు షోలాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో మహిళలని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు. దీంతో జవిశెట్టి రాములమ్మ, బత్తి ముసలయ్యలకు గాయాలయ్యాయి. వీరితో పాటు చిన్నారులు లక్ష్మీ, గురవయ్య కూడా గాయపడినట్లు బాధితులు తెలిపారు. తనను కాళ్లతో ఛాతీపై తన్నినట్లు రాములమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. బాధితులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ విజయదుంధుబి
-
అన్నొచ్చాడు..
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ విప్లవాన్ని సృష్టించింది. రికార్డు స్థాయి విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవ శకానికి నాంది పలికింది. నిజాయితీ, నిబద్ధతతో పదేళ్లుగా ప్రజల పక్షాన నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పట్టాభిషేకం చేసింది. నిండు మనసుతో దీవిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చింది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమే చేసింది. మొ త్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 151 స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో విజయ దుందుభి మోగించి సరికొత్త చరిత్రను లిఖిం చింది. ఏపీ ప్రజలు వైఎస్సార్సీపీకి మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ పా ర్టీ చరిత్రలో ఇదే దారుణ ఓటమి అని చెబుతున్నారు. టీడీపీ దిగ్గజాల ఓటమి మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్ నాయకత్వానికి ఏపీ ప్రజలు ముక్తకంఠంతో జేజేలు పలికారు. కుట్రలు, కుతంత్రాలను ఎదురొడ్డుతూ ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పాదయాత్రికునికి పట్టం కట్టారు. దేవుడి ఆశీస్సులు కోరుతూ... రాజన్న రాజ్యం స్థాపన కోసం అలుపెరుగక శ్రమిస్తున్న జగన్ను మనసారా దీవించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 2014లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఐదేళ్లపాటు ప్రజావ్యతిరేక పాలన సాగించిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రజల ఓటుదెబ్బకు కుదేలైపోయింది. ఆవిర్భావం అనంతరం ఎన్నడూ లేని రీతిలో కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. 19 మంది మంత్రులు, స్పీకర్, చీఫ్ విప్, విప్లతోసహా ఆ పార్టీ అతిరథ మహారథులు ఓటమి పాలయ్యారు. ఇక తృతీయ ప్రత్యామ్నాయంగా అవతరిస్తామని చెప్పుకున్న పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. వెరసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. రాష్ట్ర చరిత్రలో అరుదైన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రమంతటా జగన్కు జేజేలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఏపీ ప్రజలంతా తాము వైఎస్ జగన్ వెన్నంటే ఉన్నామని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును గురువారం చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఇక ఈవీఎంలు తెరిచినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభంజనం మొదలైంది. మొదటి రౌండ్ నుంచే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా–గుంటూరు, నెల్లూరు– ప్రకాశం, రాయలసీమ... ఇలా ప్రాంతం ఏదైనా ఫలితం ఒక్కటే. అసెంబ్లీ నియోజకవర్గమైనా, లోక్సభ నియోజకవర్గమైనా ఫలితంలో తేడా లేదు. రాష్ట్ర మంతటా జగన్ నాయకత్వానికే ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారు. గురువారం ఉదయం 9 గంటలకల్లా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రానుందని తేటతెల్లమైంది. వైఎస్సార్సీపీ ఏపీలో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా.. ఎన్నికల ఫలితాల్లో ఏపీ అంతటా జగన్ ప్రభంజనం విస్పష్టంగా కనిపించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ వైఎస్సార్సీపీ జైత్రయా త్ర కొనసాగించింది. ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా యావత్ రాష్ట్రం జగన్కు నీరాజనాలు పలికింది. ఏ జిల్లాలో చూసినా వైఎస్సార్సీపీ తిరుగులేని రీతిలో విజయం సాధిస్తూ వచ్చింది. అన్ని జిల్లాల్లోనూ 2014 ఎన్నికల్లో గెలిచిన దాని కంటే రెండు రెట్లకు పైగా స్థానాల్లో ఘన విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాల్లో గెలిచి వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసి పెను సంచలనం సృష్టించింది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 28 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఉభయగోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాలకు గాను 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కృష్ణా, గుం టూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాల్లో 29 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 22 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. రాయలసీమలో వైఎస్సార్సీపీ జైత్రయాత్ర కొనసాగించింది. సీమ పరిధిలోని నాలుగు జిల్లాల్లోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 49 సీట్లలో అఖండ విజయం సాధించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ తోపాటు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని స్థానాలను స్వీప్ చేసింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ఒక్క కుప్పం మినహా మిగిలిన 13 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ బలంగా ఉందని భావించే అనంతపురం జిల్లా లోని 14 స్థానాలకు గాను 12 సీట్ల ను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. జగన్ సునామీలో కొట్టుకుపోయిన టీడీపీ వైఎస్ జగన్ సునామీలో అధికార టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. చంద్రబా బు ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి అవమానకర రీతిలో అధికార పీఠం నుంచి వైదొలగింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీ పీ కేవలం 20 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు టీడీ పీనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. జగన్ ప్రభం జనంలో టీడీపీలోని అతిరథ మహారథులు కూడా కొట్టుకుపోయారు. టీడీపీ కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాలు కూడా జగన్ ప్రభంజనం ధాటికి తునాతునకలైపోయాయి. చంద్రబాబు మంత్రివర్గంలోని 24 మంది మంత్రుల్లో 21 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఘోరపరాజయం పాలయ్యారు. మంత్రులు కళా వెంకట్రావు, సుజయ్కృష్ణ రంగారావు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్బాబు, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు చిత్తుగా ఓడిపోయారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మంత్రి శిద్ధా రాఘవరావు ఘోర పరాజయం పాలయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరాజయం చవిచూశారు. 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి, తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన 23 మందికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వాళ్లలో ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో గొట్టిపాటి రవికుమార్(అద్దంకి) తప్ప మిగిలిన వారంతా ఘోరంగా ఓడిపోయారు. చంద్రబాబు తాను పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో మొదటి రెండు రౌండ్లలో వెనుకబడటంతో టీడీపీ షాక్కు గురై కొంతసేపు బెంబేలెత్తిపోవడం ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది. పత్తాలేని జనసేన పార్టీ ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్గా వ్యవహరించిన పవన్ కల్యాణ్ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. జగన్ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ అతి కష్టంపై విజయం సాధించారు. దాదాపు 40 శాతం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఓటర్లు ఆ పార్టీని ఎంతగా తిరస్కరించారన్నది దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇక జనసేనతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలు అడ్రస్ లేకుండా పోయాయి. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించిన బీజేపీ ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. 22 లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ గాలి ఏపీలో లోక్సభ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ రికార్డు విజయంతో చరిత్రను తిరగ రాసింది. కడపటి వార్తలు అందే సమయానికి మొత్తం 22 ఎంపీ సీట్లల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఇంకా శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఫలితాలు ప్రకటించిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, మచిలీపట్నం, నరసారావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, అనంతపురం, హిందూపూర్, కర్నూలు, నంద్యాల లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించడం వైఎస్సార్సీపీ పట్ల ప్రజల ఆదరణకు ప్రతీకగా నిలిచింది. ఆ స్థానాల్లో ఫలితంపై ఉత్కంఠ శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు లోక్సభ స్థానాల ఫలితం ఇంకా తేలలేదు. అలాగే విశాఖ నార్తు, పర్చూరు, ఉరవకొండ అసెంబ్లీ స్థానాల్లోనూ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో ఎవరు నెగ్గుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అధికార టీడీపీని ప్రజలు ఎంత చిత్తు చిత్తుగా ఓడించారంటే ఏకంగా నాలుగు జిల్లాల్లో ఆ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ ధాటికి కడప, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ కనుమరుగైపోయింది. కనీసం ఒక్క సీటులో కూడా బోణీ కొట్టలేక చతికిలపడింది. -
జగన్ ప్రభంజనం, చతికిలపడ్డ టీడీపీ
సాక్షి, అమరావతి : యావత్ దేశాన్ని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఏప్రిల్ 11 న జరిగిన పోలింగ్ అనంతరం దాదాపు 42 రోజుల తీవ్ర ఉత్కంఠ నడుమ గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఇటు శాసనసభ అటు లోక్ సభ ఎన్నికలు రెండింటిలోనూ ఘోర పరాజయం మూటకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తోపాటు కీలకమైన నేతలు,మంత్రులు ఓటమిపాలయ్యారు. మరోవైపు తొలినుంచి దూకుడు ప్రదర్శించిన జనసేన అధినేత ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా కుప్పకూలింది. కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మట్టికరిచింది. అందుతున్న సమాచారం మేరకు 160కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలను (85 శాతానికి పైగా నియోజకవర్గాల్లో) కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 24 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. జనసేన ఒక నియోజకవర్గానికి పరిమితమైంది. జిల్లాల వారిగా ఫలితాలను గమనిస్తే గతంలో ఎంతో అండగా నిలిచిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా టీడీపీకి ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ప్రతి ఎన్నికలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఈసారి మెజారిటీ కూడా తగ్గింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలవగా అనేక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై జాతి యావత్తు దృష్టి నిలిపించింది. యూపీఏకు దేశం పట్టం కడుతారని, అన్ని పక్షాలను ఏకం చేసి చక్రం తిప్పుతానిని చంద్రబాబు గత కొద్ది రోజులుగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఆయా పార్టీల నేతలను కలిసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో టీడీపీ ఓటమి తప్పదని తేల్చినప్పటికీ కొట్టిపారేస్తూ చంద్రబాబు పైకి బింకం ప్రదర్శించారు. జాతీయ స్థాయి సంస్థల ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధం తనకు సన్నిహితంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ తో పోస్ట్ పోల్ సర్వే పేరుతో ఫలితాలను వెల్లడించి చివరి ఎత్తుగడలకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తిని ప్రదర్శించారు. పార్టీ నేతల చుట్టూ తిరిగిన చంద్రబాబుకు ప్రజల మధ్యన నిలిచిన జగన్ కు మధ్య జరిగిన ఈ పోటీలో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. చంద్రబాబు చేసిన హడావిడి చూసి ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ స్థాయి చక్రం తిప్పుతారని కొన్ని రాజకీయ పక్షాలు భ్రమల్లో మునిగితేలాయి. చంద్రబాబు అంచనాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రజలు ఆయనకు గట్టి షాకిచ్చారు. అనేక జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించిన టీడీపీ ఈసారి పూర్తిగా చతికిలపడింది. ఫలితాల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదిపత్యం ప్రదర్శించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై గడిచిన ఐదేళ్లుగా సాగించిన అనేక ఆందోళనలు, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండటం, గడిచిన ఏడాది కాలం పాటు ప్రజల మధ్యన సాగించిన పాదయాత్ర ఈ ఫలితాలకు కారణమైనట్టు ఆపార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం రాత్రి 10 గంటల తర్వాత కూడా కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ వీవీప్యాట్ ల లెక్కింపు కారణంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించడంలో జాప్యం జరిగింది. గురువారం రాత్రి పది గంటల వరకు అందుతున్న సమాచారం మేరకు శ్రీకాకుళం (10) 8, విజయనగరం (9) 9, విశాఖ (15) 11, తూర్పు గోదావరి (19) 14, పశ్చిమ గోదావరి (15) 12, కృష్ణా (16) 13, గుంటూరు (17) 14, నెల్లూరు (10) 10, ప్రకాశం (12) 8, అనంతపురం (14) 12, వైఎస్సార్ (10) 10, కర్నూలు (14) 14, చిత్తూరు (14) 13 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయనున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఏ జిల్లాలోనూ అధికార టీడీపీ పట్టు నిలుపుకోలేకపోయింది. 25న శాసనసభా పక్ష సమావేశం ఎన్నికల్లో ఘనవిజయంతో ఉండవల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఫలితాల చివరి దశలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పుతో తన విశ్వాసాన్ని బాధ్యతను పెంచుతుందని పేర్కొంటూ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశమైన అనంతరం ఈ నెల 25 వ తేదీన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ ఒక ప్రకటనతో తెలియజేసింది. ఆ సమావేశంలో పార్టీ శాసనసభా పక్షం నాయకుడి ఎన్నుకుంటారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి ఆ మేరకు సమాచారం ఇవ్వనున్నారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ఈ నెల 30 న మంత్రివర్గం పదవీ స్వీకార ప్రమాణం చేస్తుంది. -
ఆర్కేకు నారా లోకేష్ అభినందనలు
సాక్షి, అమరావతి : మంగళగిరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్బాబు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి ఆయన నమస్కారాలు తెలిపారు. నామినేషన్ వేసిన నాటినుంచి కౌంటింగ్ వరకు అహర్నిశలు తన కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిసారి ఎన్నికలలో పోటీచేసిన తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మీడియా మిత్రుల సహకారం మరువలేనిదన్నారు. ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు సహకరించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అందరూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. నియోజకవర్గ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. మంగళగిరి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతానని అన్నారు. -
మన్యం మదిలో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏడు గిరిజన నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలను గిరిజనులు నమ్మలేదు. ఈ ఐదు సంవత్సరాలుగా వారు పడుతున్న భాదలకు ఓటు రూపంలో బాబుకు గట్టి సమాధానం చెప్పారు. వైఎస్సార్సీపీ గెలిచిన ఈ స్థానాల్లో పార్టీ ఫిరాయించిన మూడు నియోజకవర్గాలు ఉండడం విశేషం. ప్రలోభాలకు లొంగి ఎమ్మెల్యేలు పార్టీ మారినా గిరిపుత్రులు మాత్రం వైఎస్సార్సీపీకి అండగా నిలిచారు. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ తమ ఓటును ప్యాన్ గుర్తుకు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించే వేదికగా ఉండాల్సిన గిరిజన సలహా మండలిని సైతం ఏర్పాటు చేయకపోవడం టీడీపీ ఓటమికి ప్రధాన కారణమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల లాగానే ఈ సారి కూడా గిరిజనులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే నమ్మారు. -
ముందే ఊహించాను: వైఎస్ విజయమ్మ
సాక్షి, తాడేపల్లి: తన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని తాను ముందే ఊహించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. దేవుడితో పాటు ప్రజల ఆశీస్సులు, భగవంతుడి కృప వల్లే విజయం దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ మోహన్రెడ్డి తప్పకుండా అమలుపరుస్తారని తాను ఆశీస్తున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఇక టీడీపీ బీ టీమ్గా బరిలో దిగిన జనసేన గ్లాస్ పగిలిపోయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుండి వైఎస్సార్ జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గిర్రున తిరిగింది. ఫ్యాన్ గాలికి సైకిల్ ఎగిరిపోయింది. నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలుస్తుందని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడి పార్టీ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్తో పాటు టీడీపీ కేబినెట్లోని మెజార్టీ మంత్రులు పరాజయం పాలయ్యారు. అటు లోక్సభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. మొత్తం 25 లోక్ సభ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. -
వైఎస్సార్ సీపీ మహిళా అభ్యర్థుల ఘన విజయం
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. వైఎస్సార్ సీపీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. నగరి నుంచి ఆర్.కె. రోజా, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి, కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి, పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ్ ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు. కాగా సీట్ల కేటాయింపులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 15 మంది మహిళలకు అసెంబ్లీ సీట్లు కేటాయించిన ఆయన... నలుగురికి లోక్సభ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ 18 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా.. ఇందులో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. టీడీపీ 19 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా ఒకరు మాత్రమే గెలుపొందారు. -
అఖిల ప్రియకు షాక్..
సాక్షి, కర్నూలు: మంత్రి అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించారు. అఖిలప్రియ పోటీ చేసిన ఆళ్లగడ్డ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బీజేంద్రరెడ్డి గెలుపొందారు. అయితే ఈ ఓటమికి ఆమె వ్యవహార శైలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె ప్రవర్తన తీరు నచ్చక పలువురు నేతలు కూడా టీడీపీని వీడారు. ఇవన్నీ కూడా ఆమె ఓటమిలో కీలక భూమిక పోషించాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అఖిలప్రియ.. టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భూమ బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాలలో ఓటమి పాలయ్యారు. -
మామని గెలిపించి అల్లుళ్లని మడతెట్టేశారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ విజయం సాధించగా ఆయన ఇద్దరు అల్లుళ్లు మాత్రం ఓటమిపాలయ్యారు. చంద్రబాబు నాయుడుతో సహా.. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మంగా భావించిన మంగళగిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్ ఓటమి పాలవ్వడం సంచలనం రేపింది. ఆయనపై వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డి 5 వేల పైచీలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలన విజయాన్ని నమోదు చేశారు. అలాగే విశాఖపట్నం లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ వైస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమిచెందారు. ఈ పరిణామంతో ఏపీ ఎన్నికల్లో మామ గెలిచి ఇద్దరు అల్లుడు ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఉత్కంఠ భరితంగా సాగిన మంగళగిరి అసెంబ్లీ పోటీలో ఆర్కే విజయం సాధించి చరిత్ర సృష్టించారు. నారా లోకేష్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా మంగళగిరి ఫలితం కోసం ఉత్కంఠంగా ఎదురుచూశారు. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన పోరులో లోకేష్ ఓటమి పాలయ్యారు. దీంతో చంద్రబాబుతో టీడీపీ శ్రేణులంతా తీవ్రంగా నిరాశ చెందారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న లోకేష్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో రాజధాని ప్రాంతమైన అమరావతి నుంచి లోకేష్ను బరిలో నిలిపారు. టీడీపీ తురుపుముక్కగా భావిస్తున్న లోకేష్ ప్రత్యక్షంగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమిపాలవ్వడం ఆపార్టీ జీర్ణించుకోలేని పరిణామం. చంద్రబాబు తరువాత పార్టీ బాధ్యతలు లోకేషే చేపడతారని ఆ పార్టీలో చర్చకూడా జరిగింది. చంద్రబాబుకు వయసు మీదపడడం, లోకేష్ ఓడిపోవడం.. పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాగా లోకేష్ విజయం కోసం ఆయన భార్య బ్రాహ్మిణి, భరత్ గెలుపు కోసం ఆయన భార్య తేజస్విని తీవ్రంగా శ్రమించిన విషయం తెలిసిందే. -
సీమలో మీసం తిప్పిన వైఎస్సార్ సీపీ
సాక్షి, రాయలసీమ/అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో ప్రభంజనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ సునామికి అధికార పార్టీకి చెందిన పలువురు సిట్టింగులు సైతం తుడిచిపెట్టుకుపోయారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికార టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కుప్పంనుంచి గెలవగా ఆయన బావమరిది, సినీనటుడు బాలక్రిష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గెలుపొందారు. ఈ రెండు సీట్లు గెలవటం మినహా రాయలసీమలో ఏ స్థానంలోనూ టీడీపీ ముందజలో లేకపోవటం గమనార్హం. రాయలసీమలో మెత్తం 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో 30 చోట్ల విజయం సాధించిన వైఎస్సార్సీపీ ఈ సారి 19 స్థానాలు అత్యధికంగా గెలిచింది. గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచిన తెలుగుదేశం ఈ సారి రెండు స్ధానాలకు మాత్రమే పరిమితమయ్యింది. గత ఎన్నికల్లో కడపలో 9స్థానాల్లో గెలిచిన వైఎస్సార్ సీపీ ఈ సారి క్లీన్ స్వీప్చేసింది. మంత్రులుగా ఉన్న వారు సైతం ఈ ఎన్నికల్లో ఓటమిపాలవ్వటం గమనార్హం. -
వైఎస్ జగన్కు శుభాకాంక్షలు : లోకేశ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు... ‘గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ నరేంద్ర మోదీ, వైఎస్ జగన్లకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. కాగా ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఇటు శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకూ అన్ని జిల్లాల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఫ్యాన్గాలికి సైకిల్ కకావికలమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ హవా జోరుగా వీస్తోంది. -
పాలనలో చరిత్ర సృష్టిస్తాం : వైఎస్ జగన్
-
ఇప్పుడేమీ మాట్లాడను: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఫలితాలు ఎలా ఉన్నా... ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓటర్లకు చంద్రబాబు ధన్యవాదులు తెలుపుతూ, శ్రేయోభిలాషులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుంటామని, వాటిని విశ్లేషించుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఈవీఎంలపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని, తర్వాత విశ్లేషిస్తామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఫలితాలను గౌరవించడం అందరి బాధ్యత అంటూ... ప్రెస్మీట్ను మూడు ముక్కల్లో ముగించేశారు చంద్రబాబు. -
కలిసొచ్చిన గురువారం!
సాక్షి, అమరావతి: ఆంధప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన వేళ గురువారానికి ఓ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో భారీ మోజారిటీ కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఆంధప్రదేశ్లో ఎన్నికలు జరిగిన ‘ఏప్రిల్ 11’, ఫలితాలు వెలువడిన ‘మే 23’ రెండు తేదీలు గురువారం కావడం, అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నా మే 30 వ తేదీ కూడా గురువారం కావడంతో.. ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక ఎలాంటి సెంటిమెంట్ లేకపోయినప్పటికీ ప్రసుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్గా మారింది. యాదృచ్ఛికంగా చోటుచేసుకున్న దీనిపై వైఎస్ జగన్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా, తను నమ్మిన సిద్థాంతంకోసం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకుసాగిన రాజన్న తనయుడికి ప్రజలు ఈ ఎన్నికల్లో బ్రహ్మారథం పట్టారు. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి నేనున్నాంటూ భరోసానిస్తూ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర సాగించిన జననేతను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. చర్రితలో నిలిచిపోయేలా విజయాన్ని అందించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అంటూ నిస్పష్టమైన తీర్పు ఇచ్చారు. -
ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు గురువారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్కు పంపారు. చంద్రబాబు రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకూ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. అలాగే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. -
రాత్రి 7గంటలకు చంద్రబాబు ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి 7 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇవాళ సాయంత్రం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. -
ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది
-
మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా..
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘గొప్ప విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. దేవుడి దయ, ప్రజల దీవెనలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది. ప్రజలంతా విశ్వసనీయతకు ఓటు వేశారు. ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటాం. తొలి సంతకం కాదు...నవరత్నాల హామీలును అమలు చేస్తాం. పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరి కష్టాలను నేను చూశా.... నేను విన్నా ..నేను ఉన్నా. ఈ నెల 30 విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా’ అని తెలిపారు. -
ప్రజలకు రుణపడి ఉంటాం : బొత్స
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మాటని ప్రజలు విశ్వసించారని అన్నారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాబు దుర్వినియోగం చేశారన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్కు లభించిన ఆదరణ ఓటు ద్వారా ఇలా చూపించారని తెలిపారు. ఊహించని విజయాన్ని చూడబోతున్నామని వైఎస్ జగన్ గత కొద్ది రోజులుగా చెపుతూ వచ్చారన్నారు. వైఎస్ జగన్ ఈ అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తారని, ఆయన వెంట తామంతా అభివృద్ధికోసం పాటుపడతామని చెప్పారు. ఈ విజయం ప్రజా విజయమని, ప్రజలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. చంద్రబాబుకు చెప్పింది చేసే అలవాటులేదని మండిపడ్డారు. -
ఇది రాజకీయ విజయం మాత్రమే కాదు: సజ్జల
సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం.. రాజకీయ విజయం మాత్రమే కాదని, ఒక నిబద్దత కలిగి.. ప్రజలకు అంకితమై.. ప్రజా జీవితంలో నైతిక విలువలను పాటిస్తూ.. ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ.. విలువలు కలిగిన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుని, నిర్ణయించిన విజయమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా సాధించటానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా తనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకున్నారని, ఎక్కడా హోదాను డిమాండ్ చేసిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో పలుసార్లు ఒత్తిడి తెచ్చినా స్పందించలేదన్నారు. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను వెనక్కి తీసుకోవాలని, కలిసి పోరాడదామని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత, వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన తర్వాత.. తప్పని పరిస్థితుల్లో టీడీపీ మంత్రులను కేంద్రంనుంచి వెనక్కు రప్పించారని చెప్పారు. వైఎస్ జగన్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అన్ని సీజన్లలో 14నెలల పాటు చేసిన పాదయాత్ర హిస్టరీలో నిలిచిపోయే విధంగా జరిగిందని తెలిపారు. కోట్లాదిమంది ప్రజలను వైఎస్ జగన్ కలవటం ద్వారా ప్రజలకు ఆయనపై బరోసా కలిగిందని చెప్పారు. జనమే జగన్.. జగనే జనం అన్నట్లుగా మారిపోయిందని, దాని ఫలితంగానే ఈ ప్రభంజనంలాంటి విజయం దక్కిందని అన్నారు. చంద్రబాబులాంటి నాయకుడు అవసరంలేదనే ఆయన్ని పక్కకు నెట్టారని తెలిపారు. ఎలాంటి నేతనైతే ప్రజలు కోరుకున్నారో అలాంటి నేత వైఎస్ జగన్కు పట్టంకట్టారని పేర్కొన్నారు. -
ఇది రాజకీయ విజయం మాత్రమే కాదు: సజ్జల
-
చంద్రబాబు ఓటమిపై మోత్కుపల్లి హర్షం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మోత్కుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘దుర్మార్గుడి పీడ వదిలినందుకు రేపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తా’ అని అన్నారు. -
సోమిరెడ్డికి కోలుకోలేని షాక్....
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి భంగపాటు ఎదురైంది. మంత్రి సోమిరెడ్డికి ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. వరుసగా అయిదోసారి ఆయన ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా మూడు ఎన్నికల్లో ఓటమి వచ్చినా, సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలోనే అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. 1999 తరువాత ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయాన్ని నమోదు చేయలేకపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఐదోసారి కూడా సోమిరెడ్డికి నిరాశే మిగిలింది. సర్వేపల్లి నుంచి 2004, 2009, 2014లో పోటీ చేసి ఓడిన సోమిరెడ్డి, 2012 ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఓటమి చెందినప్పటికి సోమిరెడ్డి... బాబు వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని ఎమ్మెల్సీ తీసుకొని కేబినెట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి మరీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న సోమిరెడ్డికి ఈసారి కూడా ఓటర్లు తమదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో ఇక సోమిరెడ్డి రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
చాలా సంతోషంగా ఉంది
-
చిత్తు చిత్తుగా ఓడిన చింతమనేని
సాక్షి, ఏలూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టిన నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కు ద్వారా చింతమనేనికి తగిన బుద్ధి చెప్పారు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. మహిళలను తూలనాడుతూ.. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపించిన చింతమనేని ప్రభాకర్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి బరిలోకి చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, పందాలంటే చెవి కోసుకునే చింతమనేని.... ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయనకు ఓటర్లు గట్టిగానే సమాధానం చెప్పారు. ఎంపీపీగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం అధికారవర్గాలలో కలకలం రేపింది. ఇక అక్కడ నుంచి చింతమనేని అక్రమాలకు దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ ఎదురు లేకుండా పోయింది. తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురువచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనా చేయిచేసుకోవడం ,పలుసార్లు తీవ్ర వివాదాస్పదమై తిరుగుబాటుకు కూడా దారితీసింది. 2014కు ముందు అప్పటి మంత్రి వసంత్ కుమార్ పై చేయిచేసుకున్న వైనంపై భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. 40 కి పైగా కేసులున్నా కూడా చింతమనేనిని ఒక్క కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే పోలీసు శాఖపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు కౌంటింగ్కు ముందే స్పష్టమైంది. -
వైసీపీ విజయ దుందుభి : నా పగ తీరింది
వివాదాస్పద నటి శ్రీరెడ్డి వైఎస్సార్సీపీ ఘనవిజయంపై స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళిపై అంతే వేగంగా స్పందించారు. వైసీపీ గెలుపుపై ఫేస్బుక్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్’ అంటూ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. కాగా ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సర్కార్కు లైన్ క్లియర్ అయింది. టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోనుంది. అటు ప్రశ్నిస్తాను అంటూ ఊగిపోయిన నటుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పార్టీ సోదిలో కూడా లేకుండా తోక ముడిచింది. ఈ నేపథ్యంలోనే తన పగతీరిందంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి పోస్ట్పై విరుచుకు పడుతున్నారు. -
ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చరిత్రాత్మకం
-
చరిత్రలో మిగిలిపోయే విధంగా పాలన చేస్తాం
-
25న వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శానససభా పక్ష సమావేశం ఎల్లుండి(శనివారం) జరగనుంది. 25వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించే దిశగా దూసుకుపోతోంది. 150 పైగా స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించనుంది. కాగా, విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతికి వైఎస్ జగన్ ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల వివరాలను స్వామికి తెలిపారు.