Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Alliance Govt By Vardhelli Murali1
గ్రేట్‌ ఆంధ్రా మ్యాజిక్‌ షో!

పీసీ సర్కార్‌ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్‌ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్‌ మ్యాజిక్‌ ట్రిక్స్‌ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్‌ ట్రిక్స్‌ మాత్రం ప్రజలను షాక్‌ మీద షాక్‌కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్‌ షో. అంతా మ్యాజిక్‌ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్‌ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్‌ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్‌ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తనను తాను ప్రమోట్‌ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్‌ బిల్లుల భారంతో వేలాది ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్‌ మ్యాజిక్‌ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్‌ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్‌ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్‌ చేస్తున్నది. ఈ ప్రమోషన్‌కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్‌ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్‌బుక్‌’ గైడ్‌లైన్స్‌ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్‌ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్‌ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్‌ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్‌ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్‌ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్‌లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్‌ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్‌లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్‌ క్యాపి టల్‌ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్‌ మోస్ట్‌ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్‌లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్‌ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్‌’ ఈజ్‌ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్‌ ఎస్టేట్‌ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్‌ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్‌ కోసం ఆయన ‘పీ–ఫోర్‌’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్‌’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్‌ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్‌ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్‌ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్‌ మేకోవర్‌ ఎక్సర్‌సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్‌ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్‌ చానల్‌లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్‌ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Chandrababu Naidu Another Grand Palace At Capital Amaravati2
చంద్రబాబు మరో మహా ప్యాలెస్‌

సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరా­బాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్‌మ­నేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున కొండాపూర్‌లో హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్‌..! వీటికి­తోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజ­ధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కా­లిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్‌ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్‌ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పు­న ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్‌లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్‌ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకు­ముందే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్‌ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ప్రాంతం హైటెక్‌ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూ­డలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్‌ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్న­మాట. మరోవైపు హైదరాబాద్‌లో సంపన్న ప్రాంత­మైన జూబ్లీహిల్స్‌లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్‌ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్‌లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్‌ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్‌ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్ర­బాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్‌ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్‌లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్‌ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్‌ రాజభవనం నిర్మా­ణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగ­పూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్‌లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్‌ జగన్‌ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో, మదీనాగూ­డలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణా­నికి పూను­కున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజ­లను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటి­కప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు.

Weekly Horoscope Telugu 13-04-2025 To 19-04-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం....వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నీలం, లేత గులాబీరంగులు. శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.వృషభం..పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.మిథునం.... గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. శ్రీ భువనేశ్వరీదేవి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.సింహం...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. శ్రీవారాహీ స్తోత్రం పఠించండి..కన్య...ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, తెలుపు రంగులు. శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.తుల...ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శ్రీ దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.వృశ్చికం...అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక ఆందోళన. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. .శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సు..కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థికంగా బలం చే కూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విహారాదియాత్రలు చేస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం చివరిలో ధనవ్యయం. విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యసమస్యలు. లేత ఎరుపు, పసుపు రంగులు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.మకరం...చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు చాలావరకూ తీరతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. బంధువుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. భూవివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. నీలం, నేరేడు రంగులు. శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.కుంభం..ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. ఆప్తుల నుండి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.. తెలుపు, నేరేడురంగులు. శ్రీవిష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మీనం...మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. గణేశ్‌ను పూజించండి.

Green Card Holders and H-1B workers must carry ID at all times in US4
భారతీయులే లక్ష్యంగా ట్రంప్‌ మరో బాంబు 

అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. గ్రీన్‌కార్డు, హెచ్‌1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్‌ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్‌ఆర్‌) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్‌ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్‌ 325ఆర్‌ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్‌ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్‌ లక్ష్యమని హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్‌ అప్‌డేట్‌ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్‌కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్‌కార్డు, హెచ్‌–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్‌కార్డ్, హెచ్‌1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Sunrisers Hyderabad beat Punjab Kings by 8 wickets5
సిక్సర్ల అభి ‘ షేక్‌ ’

తొలి ఐదు మ్యాచ్‌లలో కలిపి 51 పరుగులు...ఈ సీజన్‌లో అభిషేక్‌ శర్మ ప్రదర్శన ఇది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అతను తన గత ఏడాది ఆటను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న ట్లున్నాడు. పంజాబ్‌పై మ్యాచ్‌లో ఒక్కసారిగా తన కసినంతా ప్రదర్శిస్తూ వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం బౌండరీలతోనే 116 పరుగులు బాది శతకనాదం చేశాడు. ఇది ఆరెంజ్‌ ఆర్మీ కోసం అంటూ రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ ఈ ఇన్నింగ్స్‌ విలువేమిటో చెప్పాడు. అభిషేక్‌కు హెడ్‌ మెరుపులు తోడవడంతో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సన్‌రైజర్స్‌ సంచలనం సృష్టించింది. మరో వైపు సమష్టి ప్రదర్శనతో 245 పరుగులు చేసి కూడా ఓటమిపాలైన పంజాబ్‌ కింగ్స్‌ తీవ్ర నిరాశకు లోనైంది. ఓవరాల్‌గా 492 పరుగులతో అభిమానులకు ఫుల్‌ జోష్‌ దక్కింది. సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌ నాలుగు వరుస పరాజయాల తర్వాత నిస్తేజంగా కనిపించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘనమైన రీతిలో కోలుకుంది. తమ అసలు ఆటను ప్రదర్శిస్తూ లీగ్‌లో తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాన్ని ఇచ్చింది. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రియాన్‌‡్ష ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అభిషేక్‌ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని నమోదు చేయగా, ట్రవిస్‌ హెడ్‌ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 75 బంతుల్లో 171 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్‌...పవర్‌ప్లేలో 89 పరుగులు...10 ఓవర్లు ముగిసే సరికి 120. తర్వాతి 5 ఓవర్లలో 57 పరుగులు...ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు... పంజాబ్‌ కింగ్స్‌ ఇలా దాదాపు అన్ని దశల్లోనూ ఒకే తరహాలో దూకుడుగా సాగింది. టాప్‌–7లో ఇద్దరు మినహా మిగతావారంతా చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. షమీ వేసిన తొలి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా 3 ఫోర్లతో మొదలు పెట్టగా, షమీ తర్వాతి ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 బాదాడు. కమిన్స్‌ తొలి ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్‌తో పంజాబ్‌ 16 పరుగులు రాబట్టింది. అయితే తన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులిచ్చిన హర్షల్‌...ప్రియాన్‌‡్షను అవుట్‌ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మలింగ తన తొలి వికెట్‌గా ప్రభ్‌సిమ్రన్‌ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత శ్రేయస్, నేహల్‌ వధేరా (22 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) భాగస్వామ్యం కూడా జోరుగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. అన్సారీ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదిన శ్రేయస్‌ 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. శశాంక్‌ సింగ్‌ (2) విఫలం కాగా, మలింగ ఓవర్లో శ్రేయస్‌ 4 ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండు బంతుల వ్యవధిలో మ్యాక్స్‌వెల్‌ (3), శ్రేయస్‌లను హర్షల్‌ అవుట్‌ చేయడంతో 18, 19 ఓవర్లలో కలిపి 13 పరుగులే వచ్చాయి. ఒకే ఓవర్లో 27 పరుగులు...షమీ వేసిన ఆఖరి ఓవర్లో కింగ్స్‌ పండగ చేసుకుంది. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న స్టొయినిస్‌ ఈ ఓవర్లో చెలరేగిపోయాడు. చివరి 4 బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6 బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. బౌండరీల వర్షం...అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో హెడ్‌ 2 ఫోర్లు కొట్టడంతో రైజర్స్‌ విధ్వంసం మొదలైంది. యాన్సెన్‌ ఓవర్లో అభిషేక్‌ నాలుగు ఫోర్లు కొట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో హెడ్‌ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత యశ్‌ ఠాకూర్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగిపోయాడు. పవర్‌ప్లేలో జట్టు 83 పరుగులు సాధించింది. 19 బంతుల్లోనే అభిషేక్‌ హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. మరో వైపు మ్యాక్స్‌వెల్‌ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు బాదిన హెడ్‌ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాన్సెన్‌ వేసిన ఓవర్లో మళ్లీ శివమెత్తిన అభిషేక్‌ 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. చహల్‌ ఓవర్లో ఎట్టకేలకు హెడ్‌ వెనుదిరిగిన తర్వాత అదే ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి 40 బంతుల్లో అభిషేక్‌ సెంచరీ మార్క్‌ను చేరుకొని గర్జించాడు. ఆ తర్వాత చెలరేగి బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్‌ జట్టును అలవోకగా విజయం దిశగా నడిపించాడు. సాహసవంతులకే అదృష్టం కలిసి వస్తుందన్నట్లు అభిషేక్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. 28 వద్ద ఠాకూర్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇవ్వగా అది నోబాల్‌గా తేలింది. ఆ తర్వాత 56 వద్ద చహల్‌ తన బౌలింగ్‌లోనే సునాయాస క్యాచ్‌ను వదిలేశాడు. దీనిని అతను బ్రహ్మండంగా వాడుకున్నాడు. స్కోరు వివరాలుపంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) నితీశ్‌ రెడ్డి (బి) హర్షల్‌ 36; ప్రభ్‌సిమ్రన్‌ (సి) కమిన్స్‌ (బి) మలింగ 42; శ్రేయస్‌ (సి) హెడ్‌ (బి) హర్షల్‌ 82; వధేరా (ఎల్బీ) (బి) మలింగ 27; శశాంక్‌ (ఎల్బీ) (బి) హర్షల్‌ 2; మ్యాక్స్‌వెల్‌ (బి) హర్షల్‌ 3; స్టొయినిస్‌ (నాటౌట్‌) 34; యాన్సెన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–66, 2–91, 3–164, 4–168, 5–205, 6–206. బౌలింగ్‌: మొహమ్మద్‌ షమీ 4–0–75–0, కమిన్స్‌ 4–0–40–0, హర్షల్‌ 4–0–42–4, ఇషాన్‌ మలింగ 4–0–45–2, అన్సారీ 4–0–41–0. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) చహల్‌ 66; అభిషేక్‌ (సి) (సబ్‌) దూబే (బి) అర్‌‡్షదీప్‌ 141; క్లాసెన్‌ (నాటౌట్‌) 21; ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–171, 2–222. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–37–1, యాన్సెన్‌ 2–0–39–0, యశ్‌ ఠాకూర్‌ 2.3–0–40–0, మ్యాక్స్‌వెల్‌ 3–0–40–0, ఫెర్గూసన్‌ 0.2–0–1–0, స్టొయినిస్‌ 0.4–0–6–0, చహల్‌ 4–0–56–1, శశాంక్‌ 2–0–27–0.75 ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. అతను 75 పరుగులివ్వగా, ఇదే సీజన్‌లో రాజస్తాన్‌ బౌలర్‌ ఆర్చర్‌ 76 పరుగులు ఇచ్చాడు.1 ఐపీఎల్‌లో భారత బ్యాటర్‌ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కేఎల్‌ రాహుల్‌ (132) పేరిట ఉన్న రికార్డును అభిషేక్‌ శర్మ సవరించాడు.ఐపీఎల్‌లో నేడురాజస్తాన్‌ X బెంగళూరు వేదిక: జైపూర్‌మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X ముంబై వేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Electronic voting systems vulnerable to hackers: US intelligence chief Tulsi Gabbard6
ఈవీఎంలను సులువుగా హ్యాక్‌ చేయొచ్చు

సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ వ్యవ­స్థను సులువుగా హ్యాక్‌ చేయొచ్చని అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసి గబ్బార్డ్‌ పేర్కొన్నారు. అందువల్ల దేశ (అమెరికా) వ్యాప్తంగా అన్ని ఎన్ని­కల్లో పేపర్‌ బ్యాలెట్‌లకు మారాలని పిలుపునిచ్చారు. దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరైన క్యాబినెట్‌ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎల­క్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలను సమావేశం ముందుంచారు. 2020 ఎన్నికల సమ­యంలో మాజీ సైబర్‌ సెక్యూరిటీ చీఫ్‌ క్రిస్‌ క్రెబ్స్‌ చర్యలపై దర్యాప్తు చేయాలని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ (డీవోజే)ని ఆదేశిస్తూ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వు­లపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది. తద్వారా ఎలాంటి పరిణామాలు చోటుచేసు­కుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ఈ విధానంలో ఫలితాలను తారుమారు చేయడా­నికి, దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని చెప్పేందుకు మా వద్ద పలు ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేపర్‌ బ్యాలెట్‌లను తీసుకురావాలనే మీ (ట్రంప్‌) ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే ఓటర్లు ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారు’ అని గబ్బార్డ్‌ స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్‌ స్మిత ప్రకాశ్‌ తెలిపారు. కాగా, గబ్బార్డ్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడి­యాలో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. యునైటెడ్‌ స్టేట్స్‌లో ఎన్నికల భద్రతపై ఈ వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి.ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల గురించి ఇటీవల టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కూడా హెచ్చరించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఆధార పడటం సరి­కాదని చెప్పారు. అవి హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమా­దం ఉందన్నారు. ‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తొలగించాలి. ‘సాంకేతికత, ఏఐ ద్వారా హ్యాక్‌ అవ్వ­డా­నికి ఉన్న అవకాశం చిన్నదైనా, అది ఎంతో పెద్ద సమస్యకు దారితీస్తుంది’ అని మస్క్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ఎక్స్‌ (మునుపటి ట్విట్టర్‌)­లో పోస్ట్‌ చేశారు. కాగా, తులసి గబ్బార్డ్‌ వ్యాఖ్యలపై మన దేశంలో కూడా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీ­ఎంలపై పలు అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.

These Tollywood stars went missing 2025 on silver screen7
బ్రేక్‌ పడింది బాసు!

ఎప్పటి కప్పుడు తమ ఫ్యాన్స్‌ కోసం సరికొత్త సినిమాలు చేయాలని, స్క్రీన్‌పై సరికొత్తగా కనిపించాలని హీరోలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు సమయం పట్టొచ్చు. ఇలా ఓ ఏడాది, రెండు మూడేళ్లు కొందరు హీరోలు సిల్వర్‌ స్క్రీన్‌ను మిస్‌ కావొచ్చు. అలా ఈ ఏడాది ఇప్పటికే కొంతమంది సిల్వర్‌ స్క్రీన్‌ను మిస్‌ కానున్నారు. అలా సోలో హీరోగా ఈ ఏడాది థియేటర్స్‌కు రాని కొందరు హీరోల గురించి ఓ లుక్‌ వేద్దాం.కథలు వింటున్నారు... ‘నా సామిరంగ’ సినిమాతో గత ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌కు వచ్చి సూపర్‌డూపర్‌ హిట్‌ అందుకున్నారు నాగార్జున. అయితే ఈ మూవీ తర్వాత నాగార్జున సోలో హీరోగా మరో మూవీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. యువ దర్శకులు నవీన్, కార్తీక్‌ చెప్పిన కథలను నాగార్జున విన్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల మరో యువ దర్శకుడు చెప్పిన కథను కూడా నాగార్జున విన్నారన్న వార్తలు ఫిల్మ్‌ నగర్‌ సర్కిల్స్‌లో వినిపించాయి. కానీ ఇప్పటివరకైతే నాగార్జున సోలో హీరో మూవీ అనౌన్స్‌మెంట్‌ రాలేదు. ఇలా ఈ ఏడాది నాగార్జున సోలో హీరోగా నటించే మూవీ థియేటర్స్‌కు రాకపోవచ్చని ఊహించవచ్చు. అయితే నాగార్జున అభిమానులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాగార్జున ఓ లీడ్‌ రోల్‌లో నటించిన ‘కుబేర’ (ఇందులో ధనుష్‌ హీరో), ‘కూలీ’ (రజనీకాంత్‌ హీరో) చిత్రాలు ఈ ఏడాదే స్క్రీన్‌పైకి వస్తాయి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలోని ‘కుబేర’ సినిమా జూన్‌ 20న విడుదల కానుంది. అలాగే లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలోని ‘కూలీ’ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.రెండేళ్లు ఆగాల్సిందే... గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమాతో సందడి చేశారు మహేశ్‌బాబు. ఆ తర్వాత వెంటనే రాజమౌళితో మూవీ ప్రకటించారు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది. క్వాలిటీ, కంటెంట్‌ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహేశ్‌బాబు, రాజమౌళి. దీంతో సహజంగానే ఈ మూవీ థియేటర్స్‌లోకి రావడానికి సమయం పడుతుంది. పైగా రాజమౌళితో మూవీ అంటే కనీసం రెండేళ్లైనా పడుతుంది.ఇలా ఈ ఏడాది, వచ్చే ఏడాది మహేశ్‌బాబు స్క్రీన్‌పై కనిపించే అవకాశాలు లేనట్లే. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. రెండు కీలక షెడ్యూల్స్‌ చిత్రీకరణ జరిగింది. వేసవి సమయం కావడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు మహేశ్‌బాబు. ఇటు ‘ఆర్‌ఆర్‌ ఆర్‌’ (ఎన్టీఆర్‌–రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించిన మూవీ) మూవీపై తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి జపాన్‌లో ఉన్నారు. రాజమౌళి, మహేశ్‌బాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌ మూవీ షూట్‌ మళ్లీ ప్రారంభం అవుతుందని ఊహించవచ్చు.కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ఒకటే మూవీగానే విడుదలవుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అంతేకాదు... 2027 మార్చి 25న ఈ సినిమాని రిలీజ్‌ చేసే ఆలోచనల్లో రాజమౌళి అండ్‌ టీమ్‌ ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ప్రకారం మహేశ్‌బాబు సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించేందుకు రెండేళ్లు ఆయన అభిమానులు ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. రాజాసాబ్‌ రానట్లే... ప్రస్తుతం ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్‌ చాలా బిజీగా ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘ది రాజా సాబ్‌’ సినిమాతో ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలోని ఈ హారర్‌ కామెడీ ఫిల్మ్‌ ఏప్రిల్‌ 10న విడుదల కావాల్సింది. కానీ రిలీజ్‌ కాలేదు. ఈ సినిమాకి సంబంధించి కొద్దిగా షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉందని, ఇంకా సాంగ్స్‌ చిత్రీకరించాల్సి ఉందని ఈ చిత్రదర్శకుడు మారుతి ఇటీవల పేర్కొన్నారు.పైగా ‘ది రాజా సాబ్‌’ మూవీ కోసం ముందుగా అనుకున్న పాటలను క్యాన్సిల్‌ చేసి, ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా కొత్త పాటలను కంపోజ్‌ చేస్తున్నట్లుగా ఈ చిత్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ఇంకా షూటింగ్‌ పూర్తి కాకపోవడం, సాంగ్స్‌ బ్యాలెన్స్‌ ఉండటం, పైగా భారీగా వీఎఫ్‌ఎక్స్‌ చేయాల్సి ఉండటం వల్ల ‘ది రాజా సాబ్‌’ సినిమా ఈ ఏడాది థియేటర్స్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభాస్‌ చేస్తున్న మరో మూవీ ‘ఫౌజి’ చిత్రీకరణ ఇంకా చాలా బ్యాలెన్స్‌ ఉంది.సో... ఈ మూవీ 2026లో రిలీజయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ పీరియాడికల్‌ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... విష్ణు మంచు హీరోగా చేసిన ‘కన్నప్ప’ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్‌ నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్‌ 27న రిలీజ్‌ కానుంది. ఈ విషయం ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పవచ్చు.డ్రాగన్‌ వచ్చేది వచ్చే ఏడాదే... గత ఏడాది ‘దేవర’ మూవీ తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’తో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత హిందీ మూవీ ‘వార్‌ 2’తో ఎన్టీఆర్‌ ఫుల్‌ బిజీ అయిపోయారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా, ఎన్టీఆర్‌ మరో మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ హిందీ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాత. ఈ ‘వార్‌ 2’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్‌ సోలోగా ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ‘ఎన్టీఆర్‌నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) మూవీ అనౌన్స్‌మెంట్‌ రెండేళ్ల క్రితమే వచ్చింది.కానీ ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 20న మొదలైంది. ఈ నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు ఎన్టీఆర్‌. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఈ మూవీ రిలీజ్‌ ఏప్రిల్‌కి వాయిదా పడిందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా మూవీకి ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ నటి రుక్ష్మిణీ వసంత్, మరో లీడ్‌ రోల్‌లో టొవినో థామస్‌ నటించనున్నారని తెలిసింది. మళ్లీ గ్యాప్‌... ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్‌’ సినిమాల సక్సెస్‌తో అల్లు అర్జున్‌ మంచి జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా ‘పుష్ప: ది రూల్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడం, సరికొత్త బాక్సాఫీస్‌ రికార్డులను క్రియేట్‌ చేసినట్లుగా మేకర్స్‌ వెల్లడించడం అనేవి అల్లు అర్జున్‌ కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచినట్లున్నాయి. అయితే ‘పుష్ప: ది రైజ్‌’ మూవీ విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత కానీ... ‘పుష్ప: ది రూల్‌’ సినిమా థియేటర్స్‌లోకి రాలేదు.ఇలా అల్లు అర్జున్‌ను స్క్రీన్‌పై చూసుకునేందుకు ఆయన అభిమానులు మూడు సంవత్సరాలు వెయిట్‌ చేశారు. కాగా మళ్లీ అల్లు అర్జున్‌ను స్క్రీన్‌పై చూసేందుకు మరో రెండు సంవత్సరాలు వెయిట్‌ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేయనున్నారట అట్లీ. భారీగా వీఎఫ్‌ఎక్స్‌ చేయాల్సి ఉంటుందట.పైగా ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీ మరో రెండు సంవత్సరాలు థియేటర్స్‌లోకి రాదని ఊహించవచ్చు. అలాగే 2018లో ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా నటించిన మరో మూవీ ‘అల... వైకుంఠపురములో..’ 2020లో విడుదలైంది. ఈ గ్యాప్‌ గురించి, ‘గ్యాప్‌... ఇవ్వలా వచ్చింది’ అన్నట్లుగా అల్లు అర్జున్‌ అప్పట్లో పేర్కొన్నారు. ఇలా మరోసారి అల్లు అర్జున్‌ కెరీర్‌లో మళ్లీ గ్యాప్‌ క్రియేట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ ఏడాది సోలో హీరోగా సిల్వర్‌ స్క్రీన్‌ని మిస్‌ చేసుకోనున్న హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

Bhu Bharati will replace Dharani on April 14: Telangana8
పైలెట్‌గా 3 మండలాల్లో భూ భారతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తీసుకొస్తున్న భూ భారతి పోర్టల్‌ను తొలుత పైలెట్‌ పద్ధతిలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ పోర్టల్‌ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కాగా దీనిని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని మూడు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మండలాల్లో అమలు సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్‌ను మరింత బలోపేతం చేసి, ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భూ భారతి, హౌసింగ్‌ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు. ప్రజలు, రైతులకు అవగాహన సదస్సులు భూ భారతి ప్రారంబోత్సవం అనంతరం రాష్ట్రంలోని 3 మండలాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని, ఆయా మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సదస్సుల్లో వ్యక్తమయ్యే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని సూచించారు.ఈ మండలాల్లో నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ సదస్సులు నిర్వహించాలని, ప్రజల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్‌ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, రెవెన్యూ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇళ్లు కేటాయించాలి అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని, అర్హులనే ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్‌) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని, ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లైతే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పారు.ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుకు మంజూరైన ఇంటిని అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. సిమెంట్, స్టీల్‌ తక్కువ ధరలకు అందేలా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

45percent of employers plan new permanent hires in FY269
హైరింగ్‌ ప్రణాళికల్లో కంపెనీలు...

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కంపెనీలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్‌ ఉద్యోగులను తీసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్, హెచ్‌ఆర్‌ సేవల సంస్థ జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నిర్వహించిన ’హైరింగ్, కాంపన్సేషన్, అట్రిషన్‌ మేనేజ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే 2025–26’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా 1,520 మంది సీఎక్స్‌వోలు, సీనియర్‌ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదిక ప్రకారం 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్‌ ఉద్యోగులను తీసుకువాలని భావిస్తుండగా 13 శాతం కంపెనీలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు లేక ఖాళీ కాబోతున్న పోస్టులను భర్తీ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ మరికొన్ని సంస్థలు హైరింగ్‌ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్‌ ప్రణాళికలేమీ లేవని 16 శాతం సంస్థలు తెలిపాయి. తాత్కాలిక స్టాఫింగ్‌ వైపు మొగ్గు.. తాత్కాలిక కొలువులకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. 26 శాతం కంపెనీలు టెంపొరరీ, కాంట్రాక్ట్‌ లేదా ప్రాజెక్ట్‌ ఆధారిత పనుల కోసం ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. గిగ్‌ వర్కర్లు, కాంట్రాక్ట్‌ అధారిత ఉద్యోగులు, అడ్వైజరీ సేవలందించే వారిని హైరింగ్‌ చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పర్మనెంట్‌ ఉద్యోగులకు బదులుగా తాత్కాలిక సిబ్బందిని తీసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 37 శాతం కంపెనీలు మిడ్‌–లెవెల్‌ నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపాయి. మరోవైపు, 19 శాతం కంపెనీలు ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తుండగా, 18 శాతం సంస్థలు సీనియర్‌ లీడర్‌షిప్‌ స్థానాల్లోకి సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నాయి. ‘ఆర్థిక అనిశ్చితులను దాటుకుంటూ కంపెనీలు ముందుకెళ్తున్న క్రమంలో ప్రతిభావంతులైన నిపుణులకు డిమాండ్‌ నెలకొంది. మిడ్‌–సీనియర్‌ ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్‌ ఉండటంతో అట్రిషన్‌ (ఉద్యోగుల వలసలు) రిసు్కలను అధిగమించి, సిబ్బందిని అట్టే పెట్టుకోవడంపై కంపెనీలు ఫోకస్‌ చేయాల్సి ఉంటుంది. 2025–26లో కంపెనీలు సమర్ధవంతమైన విధంగా హైరింగ్‌ ప్రణాళికలను వేసుకునేందుకు ఈ విశేషాలు ఉపయోగపడతాయి‘ అని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ ఆర్‌పీ యాదవ్‌ చెప్పారు. మరిన్ని విశేషాలు.. → 53 శాతం కంపెనీలు హైరింగ్‌ వృద్ధి ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు 33 శాతం కంపెనీలు 10–15 శాతం అధికంగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయి. → పరిశ్రమలవారీగా చూస్తే రిటైల్, క్యూ–కామర్స్‌లో అత్యధికంగా 21 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ విభాగాల్లోనూ సుమారు 9 శాతం సంస్థలు సిబ్బందిని తీసుకోనున్నాయి. → ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగాల్లో రిక్రూట్‌మెంట్‌ అధికంగా ఉంటుందని 15 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. రెన్యూవబుల్స్, ఎనర్జీ, ఇంజినీరింగ్‌ ప్రాజెక్టుల విభాగాల్లో 11 శాతం కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నాయి. → ఐటీ సర్వీసులు, టెలికం, టెక్నాలజీ విభాగాల్లో 13 శాతం, తయారీ, ఇంజినీరింగ్‌లో 11 శాతం, ఇన్‌ఫ్రా, రవాణా, రియల్‌ ఎస్టేట్‌లో 10 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా)లో 9 శాతం సంస్థలు హైరింగ్‌ యోచనలో ఉన్నాయి. → ఇక, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, మీడియా..ఎంటర్‌టైన్‌మెంట్, విద్య తదితర రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హైరింగ్‌ ఒక మోస్తరుగానే ఉండవచ్చని అంచనా.

Supreme Court sets 3-month deadline for President to decide on Bills10
రాష్ట్రపతికీ మూడు నెలలే

న్యూఢిల్లీ: గవర్నర్ల నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిపై రాష్ట్రపతి మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. తమిళనాడు గవర్నర్‌కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మూణ్నెల్లు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో సంబంధిత రా ష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల విషయంలో 201 ఆర్టికల్‌ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతమేమీ కాదు. వాటిని కోర్టులు సమీక్షించవచ్చు’’అని కూడా పేర్కొనడం విశేషం! బిల్లులపై నిర్ణయం విషయంలో గవర్నర్లకు స్పష్టమైన గడువు నిర్దేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పార్థీవాలా, జస్టిస్‌ ఎం.మహదేవన్‌ ధర్మాసనం ఏప్రిల్‌ 8న చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్‌ మూడు నెలల్లోపు నిర్ణ యం తీసుకోవాలి. రెండోసారీ పంపితే నెలలోపు వి« దిగా ఆమోదించాల్సిందే తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధం’’అని స్పష్టం చేసింది. అలా ఈ విషయమై గవర్నర్‌కు తొలిసారిగా గడువు విధించింది. బిల్లుల విషయమై మూడు నెలల గడువును రాష్ట్రపతికి కూడా వర్తింపజేయడం విశేషం. ఆ తీర్పు తాలూకు 415 పేజీల పూర్తి ప్రతిని సుప్రీంకోర్టు శుక్రవారం వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడాలి ఆర్టికల్‌ 201 ప్రకారం గవర్నర్‌ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదా పెండింగ్‌లో పెట్టవచ్చు. అది ఎంతకాలమన్న విషయమై అందులో రాజ్యాంగం గడువూ నిర్దేశించలేదు. అంతమాత్రాన బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రపతికి ‘పాకెట్‌ వీటో’అధికారాలేమీ ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రాష్ట్రపతి తన వద్దకొచి్చన బిల్లుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే (షల్‌ డిక్లేర్‌) అని ఆర్టికల్‌ 201లో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి ఆమోదం తెలపడమో, పెండింగ్‌లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరన్నదే దాని ఉద్దేశం. అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలూకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చని కాదు. అదీగాక ఏ అధికారన్నైనా వాడుకునే విషయంలోనైనా సముచిత కాలావధి తప్పనిసరి. చట్టపరంగా కూడా అదే సరైనది. ఈ సాధారణ న్యాయసూత్రానికి 201 ఆర్టికల్‌ కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు’’అని పేర్కొంది. ‘‘ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో అందుకు తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి. రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు, సమాధానాలివ్వడం ద్వారా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలి’’అని స్పష్టం చేసింది.కోర్టుల పాత్ర పోషించొద్దు చట్టసభలు రూపొందించే బిల్లుల రాజ్యాంగబద్ధత విషయంలో కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆ కారణంగా బిల్లులను పెండింగ్‌లో పెట్టే పక్షంలో వాటి రాజ్యాంగబద్ధతను తేల్చాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే. కనుక ఆర్టికల్‌ 143 ప్రకారం ఈ అంశాన్ని విధిగా సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది’’అని స్పష్టం చేసింది. అంతే తప్ప వాటిపై ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుని కోర్టుల పాత్ర పోషించడానికి వీల్లేదని పేర్కొంది. ‘‘ఫక్తు న్యాయపరమైన అంశాలివి. ఇలాంటి వాటిలో కార్యనిర్వాహక విభాగం వేలు పెట్టడానికి వీల్లేదని చెప్పడానికి మేం ఎంతమాత్రమూ సంశయించడం లేదు. ఎందుకంటే బిల్లుల రాజ్యాంగబద్ధతపై లోతుగా పరిశీలన జరిపి తగిన చర్యలను సిఫార్సు చేసే అధికారం కేవలం రాజ్యాంగ ధర్మాసనాలది మాత్రమే’’అని వివరించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement