-
జయలలితపై అన్నామలై వ్యాఖ్యలు... ఖండించిన శశికళ
చెన్నై: దివంగత అన్నాడీఎంకే అధినేత జయలలిత గొప్ప హిందుత్వ నాయకురాలని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్యలో రామజన్మభూమిని నిర్మించాలని కోరుకున్న తొలి బీజేపీయేతర నేత జయలలిత అని అన్నామలై చెప్పారు. 2014కు ముందు తమిళనాడులో హిందూ ఓటర్లంతా జయలలితవైపే మొగ్గు చూపేవారని గుర్తు చేశారు. అయితే జయలలితపై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ కీలక నేత శశికళ ఖండించారు. జయలలితను ఏ ఒక్కవర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు.ఎంజీఆర్, అన్నాదురై బాటలో అన్ని వర్గాల కోసం జయలలిత కృషి చేశారని కొనియాడారు. అన్నామలై వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని శశికళ కొట్టిపారేశారు. -
ఓటు బ్యాంకు కోసం డ్యాన్సులు కూడా చేస్తారు: ప్రధాని మోదీ
పాట్నా: ఓటుబ్యాంకు ముందు ఇండియా కూటమి నేతలు అవసరమైతే డ్యాన్సులు వేస్తారని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు లాక్కుంటానంటే తాను మాత్రం చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. శనివారం(మే25) బిహార్లోని పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు వారి ఓటు బ్యాంకు కోసమే పనిచేస్తారని, తనకు మాత్రం రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టం చేశారు. ‘బిహార్ ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు నేను హామీ ఇస్తున్నా. మోదీ బతికున్నంతవరకు మీ హక్కులు ఎక్కడికి పోనివ్వను.ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తామంటే ఇండియా కూటమి నేతలను చేయనివ్వండి. నాకు మాత్రం రాజ్యాంగమే ముఖ్యం. ఆర్జేడీ,కాంగ్రెస్ కూటమి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు. -
ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లైంగిక దాడుల వీడియోల వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను హెచ్చరిస్తూ ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ చేసిన ప్రకటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. దేవెగౌడే దగ్గరుండి ప్రజ్వల్ను విదేశాలకు పంపించారని ఆరోపించారు. దేవెగౌడ సూచనలతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లారని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే దేవెగౌడ ఇలాంటి ప్రకటన చేశారని విమర్శించారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది. ప్రజ్వల్ పాస్పోర్టును రద్దు చేసేందుకు అవసరమైన చర్యలను కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ పాస్పోర్టు రద్దయితే ప్రజ్వల్ విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధమవుతుంది. -
‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఐదు దశల ఎన్నికల ఓటింగ్ పూర్తియ్యింది. ఇక రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400పైగా సీట్లను దక్కించుకుంటామని చెబుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి కూడా తాము సాధించే సీట్లపై అంచనాలు వేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ అందరికన్నా మహనీయుడని వ్యంగ్యంగా అన్నారు.రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి అని, ఆయన దేనికైనా సమాధానం చెప్పగలరని ప్రమోద్ కృష్ణం అన్నారు. మొదటి నుంచి రాహుల్ అన్ని విషయాలను ఎక్కువ చేసి చెబుతారని, అతని గురించి ఏమి చెప్పగలనని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. నాడు కాంగ్రెస్ను రద్దు చేయాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు. అయితే బీజేపీ కూడా ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పని చేస్తున్నారని ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు.కాంగ్రెస్ను నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని ప్రమోద్ కృష్ణం ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. జూన్ 4 తర్వాత ఇప్పటి వరకు అతి తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని ప్రమోద్ కృష్ణం అన్నారు. -
తీన్మార్మల్లన్నపై కేటీఆర్ సంచలన కామెంట్స్
సాక్షి,వరంగల్: మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కేటీఆర్ విమర్శించారు. వరంగల్లో బుధవారం(మే22) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఉప ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవి.మంగళవారం ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటల విద్యుత్ నిలిపోయింది. రూ.2లక్షల రుణమాఫీ కాలేదు. రైతులకు రైతుబంధు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వరికి రూ. 500 బోనస్ దక్కలేదు. రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే... పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్రెడ్డిని గెలిపించాలి.420 హామీలతో అధికారంలోకి వచ్చారు. కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు. తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భవితవ్యంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకవేళ పరాజయం పాలైతే రాహుల్గాంధీ రాజకీయాల నుంచి కొంత కాలం విరామం తీసుకోవాలని సూచించారు. ‘మీ సొంత వ్యూహాల మీద మీరు ఎన్నికలకు వెళ్లారు. ఇలాంటప్పుడు మీ పార్టీ ఓడిపోతే మీరు విరామం తీసుకోవడం వ్యూహాత్మకంగా, నైతికంగా సరైనది’అని రాహుల్ను ఉద్దేశించి పీకే అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్ల దాకా గెలుచుకునే అవకాశాలున్నాయని పీకే చెప్పుకొచ్చారు. -
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ సీఎంగా ఉన్నపుడు తాను ధరించే దుస్తుల విషయంలో మాజీ సీఎం ఒకరు తనపై చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మోదీకి 250 జతల దుస్తులు ఉన్నాయంటూ మాజీ సీఎం అమర్సిన్హా చౌధరీ అప్పట్లో ఆరోపించారు. అది నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ. నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు ఓ బహిరంగ సభలో చెప్పాను. రూ. 250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులున్న సీఎం కావాలా? అని ప్రజలను అడిగాను. ప్రజలు మాత్రం 250 జతల దుస్తులున్న సీఎం పనిచేస్తాడంటూ ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేసే ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు’ అని మోదీ పాత స్మృతులను పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తాజాగా గుర్తు చేసుకున్నారు. -
ఓట్ల కోసమే సాధువులపై దాడి: ప్రధాని మోదీ
కోల్కతా: బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్ తృణమూల్ (టీఎంసీ) గూండాలు సాధువులపై దాడులు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం(మే20) పశ్చిమ బెంగాల్లోని జార్గ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్పై దాడి చేశారు. ఇది చేసింది తామేనని టీఎంసీ ప్రకటించడం సిగ్గుచేటు. సీఎం రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ మఠాల సాధువులను బెదిరిస్తున్నారు. ఆదివారం రాత్రి జల్పాయ్గురిలోని రామకృష్ణ మిషన్పై దాడి చేశారు.ఇలాంటి వాటిని బెంగాల్ ప్రజలు సహించరు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ సంస్థలు సేవ, విలువలకు నిదర్శనం, కానీ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బహిరంగంగా వారిని బెదిరిస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు.కాగా, ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంస్థలకు చెందిన సాధువులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే మమత వ్యాఖ్యలను రెండు సంస్థలకు చెందిన సాధువులు ఖండించారు. -
అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
-
YSRCP దే ఘన విజయం..
-
చంద్రబాబు, నారా లోకేష్ పై పెద్దిరెడ్డి ఫైర్
-
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
జెంషెడ్పూర్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(మే19) జార్ఖండ్లోని జెంషెడ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ’యువరాజు రాహుల్గాంధీ పరిశ్రమలు, పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాడు. దీంతో పెట్టుబడిదారులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కాంగ్రెస్, దాని మిత్రపకక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు రాకపోతే అక్కడి యువత పరిస్థితి ఏంటి. చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చి నాతో ఇలా చెబుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు బాగోలేవంటున్నారు. వారి సిద్ధాంతాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు. యువరాజు ఆలోచన విధానం, వారి మిత్రపకక్షాల ఆలోచనా విధానం ఒకేలా ఉంది’అని ప్రధాని అన్నారు. -
జూన్ 4 తర్వాత అన్నీ మాట్లాడదాం: లోకేష్పై పెద్దిరెడ్డి ఫైర్
తిరుపతి,సాక్షి: టీడీపీ కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని, లోకేశ్ తమపై ట్విటర్లో తప్పుడు పోస్టులు పెడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటారన్నారు. తిరుపతిలో ఆదివారం(మే19) పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.‘దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు. 2013 నుంచి ఆఫ్రికాలో మేం వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నాం. మొదటి విడత 20 వాహనాలు ముంబై పోర్ట్ నుంచి షిప్పులో పంపిస్తున్నాం. అక్కడ మాకు ఫెర్రో మాంగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులున్నాయి. స్వర్ణ మెటల్స్ కు 100 వెహికల్స్ అవసరం ఉంది , ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాం. మేం వ్యాపారాలు చేసుకుంటూ రాజీయాల్లో ఉన్నాం. మేం విదేశాలకు పారిపోతున్నాం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఐదేళ్లు మంత్రిగా చేసి, సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడతావా. ఏపీ బీజేపీ నాయకురాలికి హైదారాబాద్లో ఓటు ఉంది. చంద్రబాబు కూడా హైదారాబాద్లో ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. నేను విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ యునియన్ నాయకుడిగా చంద్రబాబుకు పోటీగా నిలబడ్డా. 4వ తేది ఎన్నికలు ఫలితాల తర్వాత మీరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. మేం చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగింది. 4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాం. పోలింగ్ శాతం పెరగడానికి మహిళలే కారణం. ఐ ప్యాక్ టీమ్ ఇదే చెప్పింది. అందరి కృషివల్లే మేము ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలు జరిగాయి’అని పెద్దిరెడ్డి ఆరోపించారు. -
టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు
-
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
ముంబై: రామమందిరంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ముంబైలో శనివారం(మే 18) ఖర్గే మీడియాతో మాట్లాడారు.‘ప్రధాని మోదీ రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను రెచ్చగొడుతున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ఎక్కిస్తారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు మేం బుల్డోజర్ పదాన్ని ఎక్కడా వాడలేదు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారిపై ఎన్నికల కమిషన్(ఈసీ) చర్యలు తీసుకోవాలి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నింటిని కాపాడతాం. మేం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం’ అని ఖర్గే తెలిపారు. -
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
-
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
-
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
-
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
-
పోలీసులపై మల్లారెడ్డి ఫైర్
-
హింసా రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు..
-
ఏలియన్స్ ఉన్నాయా ?..ఎలాన్ మాస్క్ కీ కామెంట్స్..
-
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్
-
తాడిపత్రిలో పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేశారు..
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
పాక్తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
సంచలన నివేదికలు.. మరోసారి తెరపైకి షానన్ - మస్క్ సాన్నిహిత్యం
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మౌంట్ ఎవరెస్ట్పై పర్యాటకుల తాకిడి
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
Sakshi News Cartoon: అనవసరంగా తనని పాలిటిక్స్లోకి లాగొద్దంటున్నాడ్సార్!
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement