ఫ్లయింగ్‌ స్క్వాడ్‌పై టీడీపీ నాయకుల దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌పై టీడీపీ నాయకుల దౌర్జన్యం

Published Mon, May 6 2024 8:05 AM

-

నాదెండ్ల: గణపవరంలోని శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చే వారిని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లో ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున నగదు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. ఆ ఇంట్లోకి వచ్చిపోయే వారిని గుర్తించడంతో.. ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది ఆ ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నాయకులు స్క్వాడ్‌కు అడ్డు తగిలారు. ఇద్దరు సిబ్బందిని చొక్కా పట్టుకుని లాగి పడేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement