మతోన్మాద బీజేపీని ఓడించాలి | Sakshi
Sakshi News home page

మతోన్మాద బీజేపీని ఓడించాలి

Published Mon, May 6 2024 8:10 AM

మతోన్మాద బీజేపీని ఓడించాలి

జనగామ రూరల్‌: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మతోన్మాద బీజేపీని ఓడించాలని సీఐ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడుగుల భాస్కర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బోట్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన పార్లమెంట్‌ ఎన్నికలు కార్మిక వర్గం కర్తవ్యం అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్‌ ఎన్నికలు కార్మికులు, ఉద్యోగులకు ఎంతో కీలకమన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ శక్తుల దారాదత్తం చేసి నిర్వీర్యం చేసిందన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న ఎంపీ అభ్యర్థి ఎండీ జాహంగీర్‌ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాధ్‌, జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు, విజేందర్‌, యాక య్య, రాజు, సోమన్న, నాగరాజు, ప్రకాష్‌, ఆనందం, ప్రశాంత్‌, రామచంద్రం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement