
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 312వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో అశేష ప్రజానీకం అపూర్వ ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది.
జననేత మంగళవారం ఉదయం అంతకపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విఆర్ ఆగ్రహారం క్రాస్, పొగిరి, మర్రివలస క్రాస్కు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. లంచ్ బ్రేక్ అనంతరం రాజన్న పాదయాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గంగువారి సిగడాం మండలంలోని గేదెలపేట క్రాస్, మెట్టవలస క్రాస్, పలఖండ్యం, సంతవురితి వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 311వ రోజు ముగిసింది. సోమవారం ఉదయం బూరాడ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి కొర్లవలస క్రాస్, గురవాం, రాజాం మీదుగా, అంతకపల్లి వరకు నేటి పాదయాత్ర కొనసాగింది. రాజన్న తనయుడు సోమవారం 9 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 3,369.5 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.