Dharmasagar Reservoir
-
‘దేవాదుల’ నీటి విడుదల
ధర్మసాగర్/హసన్పర్తి: ఎట్టకేలకు దేవన్నపేటలోని పంప్హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి మంత్రులు నీటిని విడుదల చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని పంప్హౌస్ నుంచి 3వ ఫేజ్ పైప్లైన్ మోటార్ను ప్రారంభించడానికి వారం రోజుల క్రితం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీ«నివాస్రెడ్డి రాగా, సాంకేతిక సమస్యతో మోటార్లు ఆన్ కాని విషయం తెలిసిందే. మరమ్మతుల అనంతరం రెండు రోజల క్రితం కూడా మళ్లీ ట్రయన్రన్ చేయగా, గేట్వాల్్వలు పడిపోయాయి. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. దీంతో గురువారం తెల్లవారు జామున ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. సాయంత్రం మంత్రులిద్దరూ దేవన్నపేటలోని పంప్హౌస్ వచ్చారు. అయితే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో అరగంట పాటు ఆగాల్సి వచి్చంది. టెక్నీషియన్లు సమస్యను పరిష్కరించిన తర్వాత మంత్రులు మోటార్లు ఆన్ చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం : మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. దేవన్నపేటలోని పంప్హౌస్ నుంచి 3వ ఫేజ్ పైప్లైన్ మోటార్ను గురువారం సాయంత్రం ఆయన ఆన్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ వద్ద నీటిలో పూలు, చీర, సారె వదిలారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం డిసెంబర్లోపు అన్ని పనులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఒక పంప్ ఆన్ చేసి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని,. రెండవ మోటారును కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డితో కలిసి కేంద్ర నిధులు అందించాలని కోరుతూ కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమైన విషయాన్ని గుర్తు చేశారు. దేవన్నపేట వద్ద పంప్హౌస్ను అద్భుతమైన డిజైన్తో రూపొందించామని, 144.50 మీటర్ల లోతులో 25.50 మీటర్ల వెడల్పుతో నిర్మిoచిన ఈ పంప్హౌస్లో మూడు 31 మెగావాట్ల సింక్రోనస్ మోటార్లు అమర్చామని చెప్పారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టును నేడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే 3వ దశ పనులు పూర్తి చేసి మోటార్లను ఆన్ చేసిందన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు మంత్రి ఉత్తమ్ అధికారులను పరుగులు పెట్టించి టెక్నికల్గా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించి ఒక మోటార్ను ఆన్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడి యం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని, ఈఎన్సీ అనిల్కుమా ర్, సీఈ అశోక్కుమార్, ఎస్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రమాదకర ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు
ధర్మసాగర్ : వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాలతో ధర్మసాగర్ రిజర్వాయర్పై పలు ప్రమాదకరమైన ప్రదేశాల్లో ముళ్ల కంచెను, హెచ్చరిక బోర్డులను పోలీసులు ఏర్పాటు చేశారు. ఐదుగురు బీటెక్ విద్యార్థులు ఈ నెల 17న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ప్రదేశంతోపాటు, పైప్లైన్ పంపింగ్ ప్రదేశాల్లో ఇనుపముళ్ల కంచె ఏర్పాటు చేసి, ఎర్రజెండాలను పాతారు. ఉనికిచర్ల ఎస్ఆర్సీఎస్ పాఠశాల యాజమాన్యం, లయన్స్ క్లబ్ వారు రిజర్వాయర్కు వెళ్లే దారిలో, రిజర్వాయర్లోని పలు ప్రాంతాల్లో గతంలో రిజర్వాయర్లోపడి మృతిచెందినవారి ఫొటోలతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేశారు. కాజీపేట ఏసీపీ జనార్దన్ మాట్లాడుతూ సీపీ సుధీర్బాబు ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ఇక్కడ ముళ్లకంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్ వద్ద పోలీ సుల పహారాను కొనసాగించి ఇక్కడికి వచ్చేవారిని నీటిలోకి దిగకుండా చూస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్రాంకుమార్, హెచ్సీ ఉమాకాంత్, పోలీస్ సిబ్బంది, ఎస్సార్సీఎస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ధర్మసాగర్ రిజర్వాయర్లో విద్యార్థులు గల్లంతు
వరంగల్ : వరంగల్ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద శనివారం విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్ శివారులోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు శనివారం చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు యువకులతోపాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్న ఉప్పల శ్రీనిధి, రమ్య ప్రత్యూష, శ్రావ్యారెడ్డి(19), కర్నె శివసాయి (19), పొలినేని శివసాయికృష్ణా (20), పొలినేని వినూత్న (18) తో పాటు మరో యువకుడు కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్కు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. అయితే అదృష్టవశాత్తు ప్రత్యూషను మాత్రం పక్కనే ఉన్న మరో కళాశాల విద్యార్థులు కాపాడారు. విద్యార్థుల మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి శ్రావ్యారెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుల వివరాలు ఇవీ... ధర్మసాగర్ రిజర్వాయర్లోకి వెళ్లిన వారిలో.. శ్రావ్యారెడ్డి, కర్నె శివసాయి, ఉప్పల శ్రీనిధి, పొలినేని శివసాయికృష్ణ, పొలినేని వినూత్న మరణించారు. రామప్రత్యూషను మాత్రం చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాపాడగలిగారు. -
విహారయాత్రలో విషాదం..
రిజర్వాయర్లో నిట్ విద్యార్థి మృతి ధర్మసాగర్: స్నేహితులతో కలసి విహారానికి వచ్చిన ఆ విద్యార్థి అంతలోనే నీట మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామానికి చెందిన సామినేని వాసు, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్. వీరిలో నిఖిల్ (22) వరంగల్ నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఈసీఈ ఫైనలియర్ చదువుతున్నాడు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భం గా నిట్లో జరిగిన జెండావిష్కరణలో పాల్గొన్న అనంతరం ఆరుగురు మిత్రులతో కలిసి ఎన్ఐటీకి 10 కిలోమీటర్ల దూరంలోని ధర్మసాగర్ రిజర్వాయర్కు విహారం కోసం వెళ్లారు. రిజర్వాయర్ వద్ద మిత్రులతో కలసి నిఖిల్ కొద్దిసేపు సరదాగా గడిపాడు. అనంతరం జాలర్లు చేపలు పట్టడానికి ఉపయోగించే తెప్పను తీసుకుని ఒంటరిగా నీటిలో కొద్దిదూరం వెళ్లి ఫొటోలు దిగటానికి ప్రయత్నిస్తుండగా తెప్ప పట్టు తప్పంది. ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండ టం, నిఖిల్కు ఈత రాకపోవటంతో ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీంతో వీరిలో మిగతా ఇద్దరు విద్యార్థులతోపాటు, వీరి అరుపులు విని వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అతడిని రక్షించటానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే నిఖిల్ నీటిలో పూర్తిగా మునిగి మృతి చెందాడు. ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న కాజీపేట ఏసీపీ జనార్దన్, సీఐ రాజయ్య ఘట నాస్థలానికి చేరుకుని స్థానిక జాలర్ల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. విగతజీవిగా మారిన నిఖిల్ను చూసి మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక క్యాంపస్కు చెందిన విద్యార్థి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న నిట్ డైరక్టర్ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న సామినేని నిఖిల్ క్యాంపస్ ఇంటర్యూలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం పొందాడని, ఈ సెమిస్టర్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరాల్సి ఉందని తెలిపారు. తెలివైన విద్యార్థిగా పేరుపొంది, ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న నిఖిల్ మృతి చెందటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
దేవాదుల పైప్లైన్ లీక్
ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సమీపంలో దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్-2 పైప్లైన్ శుక్రవారం రెండుచోట్ల లీకైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి గండిరామారానికి ఫేజ్-2 పైప్లైన్ ద్వారా నీటిని తలిస్తున్నారు. ఈ క్రమంలో జానకిపురం గ్రామ సమీపంలో పైప్లైన్ ఎయిర్వాల్వ్లు రెండుచోట్ల లీక్ కావటంతో నీరు పెద్దఎత్తున పైకి చిమ్ముతూ పక్కనే ఉన్నపంటపొలాలకు వెళ్తోంది. -
దేవాదుల నుంచి నీటి విడుదల
►ఇన్టేక్వెల్ వద్ద 80 మీటర్లకు చేరిన నీరు ►మొదటి దశలో రెండు మోటార్లు ప్రారంభం ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని దేవాదుల వద్ద జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం రెండు మోటార్లను ప్రారంభించినట్టు ఇరిగేషన్ ఈఈ గంగాధర్ తెలిపారు. ఈనెల 17న దేవాదుల ఇన్టేక్వెల్ వద్ద గోదావరి నీటి మట్టం 74 మీటర్లకు చేరడంతో నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం గోదావరి నీటి మట్టం 80 మీటర్లకు చేరడంతో వరంగల్ నగరానికి తాగునీటిని అందించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మోటార్లను ప్రారంభించారు. వరద నీరు ఇలాగే నిలకడగా ఉంటే.. రెండో దశలో మరో రెండు మోటార్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. దేవాదుల పంప్హౌస్ నుంచి నీరు పైపులైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకునే క్రమంలో నీరు వెనుకకు రాకుండా ఎయిర్ట్యాంక్లను సిద్ధం చేశారు. దేవాదుల ప్రాజెక్టు కింద అన్ని రిజర్వాయర్లకు నీరు అందే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.