-
తిలక్కు గృహ నిర్బంధం
నందిగాం: ఇటీవల తెలుగుదేశం మూకల దాడిలో గాయపడి మృతి చెందిన కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన తోట మల్లేష్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను స్వగ్రామం కణితూరులో పోలీసులు శనివారం మరోసారి గృహ నిర్బంధం చేశారు. నందిగాం ఎస్సై మహమ్మద్ అమీర్ ఆలీ అధ్వర్యంలో పోలీసులు, ప్రత్యేక టాస్క్ఫోర్స్ సిబ్బంది తిలక్ ఇంటి వద్దకు చేరుకొని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులు అక్కడకు చేరుకొని టీడీపీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, హరిప్రసాద్, రామ్మోహననాయుడు ప్రోత్సాహంతో ఆ పార్టీ మూకలు దాడులకు పాల్పడి, మృతి చెందేలా చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని వారు నిలదీశారు. -
బాలల సంరక్షణకు ప్రత్యేక నిఘా
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాలబాలికల సంరక్షణకు ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి పి.భాస్కరరావు అన్నారు. శనివారం ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా జిల్లా న్యాయ సదన్లో ప్రత్యేక కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పిపోతున్న బాలబాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి పిల్లల కదలికలపై ఆరా తీసి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో తేడా గుర్తిస్తే వెంటనే వారిని సన్మార్గంలో పెట్టాలన్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాల వల్ల కలిగే అనర్థాలను పిల్లలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యద ర్శి, సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) ఆర్.సన్యాసినా యుడు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ బగాది శాంతిశ్రీ, బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీవిద్య, ఎన్జీవో ప్రతినిధి ప్రసాద్, పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అల్లర్లకు దిగితే కఠిన చర్యలు
● ఎస్పీ రాధిక శ్రీకాకుళం క్రైమ్ : ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఎస్పీ జి.ఆర్.రాధిక హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని డేఅండ్ నైట్ కూడలి సమీపంలో నిర్వహించిన మాబ్ ఆపరేషన్ మాక్డ్రిల్ కార్యక్రమంలో భాగంగా విలేకరులతో మాట్లాడారు. తుది ఫలితాలు వచ్చేంత వరకు జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులకు సన్నాహకంగా.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇదే విధంగా జిల్లావ్యాప్తంగా ముఖ్య కేంద్రాల్లో జూన్ 4 వరకు పోలీసులతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా సంఘ విద్రోహక శక్తులు, అల్లరి మూకలను నియంత్రిస్తామన్నారు. ఇప్పటికే శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజు పెట్రోల్ విక్రయాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. పేలుడు పదార్థాలు, బాణసంచా విక్రయాలు, విజయోత్సవ ర్యాలీల నిర్వహణకు సైతం అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
యుద్ధ కళలో చరిష్మా
● మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తున్న చిన్నారి నేతింటి చరిష్మా ● జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట టాలెంట్ఎచ్చెర్ల క్యాంపస్ : ఆ చిన్నారి వయసు పదేళ్లే.. అయితేనేం యుద్ధకళ పోటీలో దిగిందంటే పతకం రావాల్సిందే. పోటీ ఏదైనా పతకం ఖాయం చేసుకుంటూ జాతీయ స్థాయిలో రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. ఎచ్చెర్ల గ్రామానికి చెందిన నేతింటి చరిష్మా శ్రీకాకుళం పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఐదో తరగతి చదువుతోంది. మూడో తరగతి నుంచే మార్షల్ ఆర్ట్స్లో సాధన చేస్తుంది. కోచ్ నక్క లక్ష్మణ్నాయుడు వద్ద మెలకువలు నేర్చుకుంటూ పోటీల్లో రాణిస్తోంది. కుమార్తె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు రాజారావు, రాజేశ్వరి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. పతకాల పంట.. ●చరిష్మా సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్ యుద్ధకళలో ప్రత్యేకంగా రాణిస్తోంది. ●2023లో శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరా విజ్ఞాన భవన్లో జరిగిన జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో అండర్–9 విభాగంలో కాంస్య పతకం సాధించింది. ●విశాఖలో జరిగిన ఇండో–నేపాల్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో వెపన్ ఈవెంట్ స్టిక్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ●త్రివేండ్రంలో జరిగిన సౌత్ ఇండియా పెన్కాక్ సిలట్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్లో టాండింగ్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. ●మహరాష్ట్రలోని నాందేడ్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ విభాగంలో టాండింగ్ ఈవెంట్లో (ఫైట్) కాంస్య పతకం సాధించింది. ●శ్రీకాకుళం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మే 5న జరిగిన 9వ రాష్ట్ర స్థాయి పోటీల్లో సోలో ఈవెంట్లో గోల్డ్ మెడల్, టాండింగ్ ఈవెంట్లో సిల్వర్ పతకం సాధించింది. ●పాండిచ్చేరిలో జూలై 6, 7 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో సౌత్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. స్టిక్తో చిన్నారి మెరుగైన ప్రదర్శన.. యుద్ధకళ సాధనలో చిన్నారి చరిష్మా ప్రత్యేక త చాటుకుంటోంది. మిగతా పిల్లలతో పోల్చితే కర్ర తిప్పటంలో మెరుగైన ప్రదర్శ న ఇస్తోంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించే అవకాశం ఉంది. – నక్క లక్ష్మణ్నాయుడు, కోచ్ -
ఉత్సాహంగా రగ్బీ జట్ల ఎంపికలు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. అండర్–18 విభాగంలో బాల బాలికలకు వేర్వేరుగా నిర్వహించిన ఈ ఎంపికల్లో ఒక్కో జట్టుకు 12 మంది చొప్పున 24 మంది ని ఎంపిక చేశారు. ఈ నెల 31 నుంచి విశాఖలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో వీరంతా పాల్గొంటారు. అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజర్ బి.నారాయణరావు, వ్యాయామ ఉపాధ్యాయు లు కె.కె.రామిరెడ్డి, కె.రఘునాథరావు, శైలజ, అని ల్, సీతయ్య, నర్మద తదితరులు పాల్గొన్నారు. -
మాక్ థ్రిల్
శ్రీకాకుళంఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు ధర్మలక్ష్మీపురంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసు ను పోలీసులు ఛేదించారు. ఆరుగురిని అరెస్టు చేసి రూ.4.80 లక్షలు రికవరీ చేశారు. –8లో● నిరసనకారుల దాడులు.. నిలువరించిన పోలీసులు శ్రీకాకుళం క్రైమ్: స్థలం: జిల్లా కేంద్రంలోని డేఅండ్ నైట్ కూడలి.. సమయం: శనివారం ఉదయం 11:14 గంటలు.. వంద మంది ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.. ఓ చేతిలో ప్లకార్డులు.. మరో చేతిలో రాళ్లు.. పోలీసులు డౌన్ డౌన్.. అంటూ నినాదాలు.. కూడలి మధ్య మంట పెట్టిన టైర్లు.. ఎటు చూసినా భయానక వాతావరణం.. ఒక్కసారిగా జరిగిన ఈ అలజడికి నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే రెండో పట్టణ సీఐ ఉమామహేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరికదా.. ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికందినవన్నీ పోలీసులపై విసరడం మొదలుపెట్టారు. అంతే ఉన్నతాధికారులకు సీఐ సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ రాధిక ఆదేశాలతో డీఎస్పీ శేషాద్రినాయుడు ఆధ్వర్యంలోని ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు రెండు వ్యాన్లతో అక్కడికి చేరాయి. మరో వైపు అగ్నిమాపక శకటం వెంటబెట్టుకుని జిల్లా అగ్నిమాపక సహాయాధికారి వరప్రసాదరావు సిబ్బందితో పాటు చేరుకున్నారు. ఎస్పీ రాధిక ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం ఆందోళనల్ని ఎలా అదుపు చేయాలో ప్రణాళిక సిద్ధం చేశారు. పోలీస్ బృందాలు ‘యాక్షన్’ మొదలుపెట్టాయి. ఫైర్ ఇంజన్తో ఒక్కసారిగా నీటితో పాటు ఫోమ్ను ప్రయోగించారు. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి లాఠీచార్జీ చేశా యి. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. మరోవైపు ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైర్ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి ‘కాల్పులు’ జరిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిరసన కారులు కుప్పకూలారు. అంబులెన్స్లు హడావిడి.. పోలీస్ సైరన్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు. ఈ దృశ్యాల్ని చూస్తూ భీతావహులైన ప్రజలకు మైక్లో ఒక ఎనౌన్స్మెంట్ వినిపించింది. ‘ఇది మాక్ డ్రిల్.. కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం’ అని పోలీసులు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంత వరకు ‘నటించిన’ పోలీసులు అక్కడ్నుంచి నిష్క్రమించారు. న్యూస్రీల్ -
అమరవీరులకు నివాళులు
కాశీబుగ్గ: పలాస మండలం బొడ్డపాడులో అమరవీరులు చారు మజుందార్ విగ్రహాల వద్ద శనివారం ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1967లో పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్ డివిజన్ నక్సల్బరీ బ్లాక్లో జరిగిన సాయుధ తిరుగుబాటులో కమ్యునిస్టు నాయకులు నాయకత్వం వహించారని, అప్పటి నుంచి దేశంలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని అన్నారు. అటువంటి అమరులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు తామాడ సన్యాసిరావు, మద్దిల కై లాష్, దుష్యంత్, రామారావు, అప్పారావు, సీపీఐ (ఎంల్) న్యూడెమొక్రసీ నాయకులు కుసుమ, బాలకృష్ణ, రాపాక మాధవరావు, గోపి రామకృష్ణ, ఉమాపతి పాల్గొన్నారు. -
తప్పిన ముప్పు
కవిటి: మండలంలోని కవిటి అశోక్ థియేటర్ సమీపంలో నెలవంక గ్రామం నుంచి కవిటి వెళుతున్న ఓ కారుపై శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో అకస్మాత్తుగా ఓ మోడువారిన చెట్టు విరిగిపడింది. కారు దెబ్బతిన్నా లోపల ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. చెట్టు మోడుబారి ఉండటం, ఓ మోస్తరు వర్షపు జల్లులకు నేలతడిచి ఉండటంతో ఒక్కసారిగా నేలకొరిగిందని స్థానికులు చెబుతున్నారు. సజావుగా ఉప విద్యాశాఖాధికారి పరీక్షలు ఎచ్చెర్ల క్యాంపస్/నరసన్నపేట: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డిప్యూటీ ఈవో (ఉపవిద్యా శాఖాధికారి) ప్రవేశ పరీక్ష జిల్లాలోని నాలుగు ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజ్లో 100 మందికి 68 మంది, ఎచ్చెర్లలోని శ్రీవేంకటేశ్వరా ఇంజినీరింగ్ కాలేజ్లో 100 మందికి 72 మంది, టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కాలేజ్లో 300 మందికి 178 మంది, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్ కేంద్రంలో 330 మందికి 233 మంది హాజరయ్యారు. మొత్తం 279 మంది గైర్హాజరయ్యా రు. నరసన్నపేటలో తహసీల్దార్ కనకారావు పర్యవేక్షించారు. క్యాంపస్ డ్రైవ్లో 33 మంది ఎంపిక ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం క్యాంపస్ డ్రైవ్ జరిగింది. ముందుగా జాబ్ అచీవర్స్ డే నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 33 మంది ఎంపికయ్యారు. కంప్యూటర్స్ బ్రాంచ్ నుంచి 23 మంది, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ నుంచి 10 మంది ఎంపికయ్యారు. ఎంపికై న వారికి రూ.8 లక్షలు నుంచి రూ.2.6 లక్షలు ప్యాకేజీ లభిస్తుందని ప్రిన్సిపాల్ జి.గోవిందనాయుడు తెలిపారు. అనంతరం ఎంపి కైన అభ్యర్థులకు జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ పీవీఆర్ రఘునాథ్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. -
31 నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు
టెక్కలి: జిల్లా క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల క్రికెట్ మైదానంలో ఈ నెల 31 నుంచి అండర్ –19 విభాగంలో అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. సుమారు దశాబ్ద కాలం తరువాత జిల్లాలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సెక్రటరీ హసన్ రాజా షేక్, కోశాధికారి కేఎస్ఎం శైలానీ, మెంటార్ ఇలియాస్ అహ్మద్, సెలక్టర్ ఆర్సీ.రెడ్డి, టోర్నమెంట్ కన్వీనర్ లాల్ తదితరులు శనివారం క్రికెట్ మైదానాన్ని పరిశీలించారు. జూన్ 15 నుంచి ఇదే కళాశాల మైదానంలో అండర్–23 క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు కూడా అసోషియేషన్ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. అండర్–19 జట్లు ఇవే.. ఈ నెల 31 నుంచి జరగనున్న అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో భాగంగా మొదటి రోజు శ్రీకాకుళం– తూర్పుగోదావరి, జూన్ 1న విజయనగరం–తూర్పుగోదావరి, 2న విశాఖ–తూర్పుగోదావరి, 3న విజయనగరం–విశాఖ, 4న శ్రీకాకుళం– విశాఖ, 5న విజయనగరం–శ్రీకాకుళం జట్లు తలపడనున్నాయి. అండర్–19 జిల్లా జట్టుకు వి.ప్రద్నీష్సాయి(కెప్టెన్), సుశాంత్, సిద్ధు విఘ్నేష్, జయరాం, గోపాలకృష్ణ, ఎన్.రాజ్కుమార్, సాయి సుజన్, పూర్ణ చంద్ర, జున్నారావు, ఎం.రోహిత్, థామస్ రామ్కుమార్, నవీన్కుమార్రెడ్డి, కళ్యాణ్కుమార్, వినీల్ సాగర్, అభయ్, సిద్ద, స్టాండ్ బై క్రీడాకారులుగా వి.కృష్ణ, వి.మోహన్రావు, అభినయ్, వి.వినయ్చంద్ర, పూజారి దినేష్, భరత్కుమార్ తదితరులను ఎంపిక చేశారు. ఆగస్టులో జరగనున్న డేస్ మ్యాచ్లకు ఎన్.సుశాంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం జరగనున్న మ్యాచ్లకు కోచ్, మేనేజర్గా మేఘనాథ్, నార్త్ జోన్ సెలక్టర్గా బొడ్డేపల్లి వర్థన్ వ్యవహరిస్తారు. -
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. డిగ్రీ ఆరో సెమిస్టర్లో మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవగా 27,483 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 99.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీఏ(సీబీసీఎస్)లో 99.68, బీబీఏ(సీబీసీఎస్)లో 98.66, బీకాం(కంప్యూటర్స్)లో 99.71, బీకాం(జనరల్)లో 99.92, బీహెచ్ఎంసీటీలో 100, బీఎస్సీలో 99.52, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో 90, బీఎస్సీ ఫుడ్ సైన్స్లో 100, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీలో 100, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషన్లో 100 మంది ఉత్తీర్ణత సాధించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కంచిలి: మండలంలోని పెద్దశ్రీరాంపురం జగనన్న కాలనీ వద్ద అంపురం–మాణిక్యపురం రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన కె.ఢిల్లీశ్వరరావు, టి.శ్రీసాయిలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న ఢిల్లీశ్వరరావుకు తీవ్రగాయాలవ్వగా, శ్రీసాయికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హెడ్కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు తులాల ఆభరణాలు చోరీ బూర్జ: మండలంలోని సింగన్నపాలెంలో వరలక్ష్మికి చెందిన మూడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వరలక్ష్మి భర్త తులగాపు బాబూరావు పాలకొండ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు విధుల్లో భాగంగా పాలకొండ వెళ్లిపోయారు. అనంతరం వరలక్ష్మి నిద్రపోయింది. ఈ సమయంలో గజాల తలుపులకు గడియ పెట్టడం మర్చిపోయింది. ఇదే అదునుగా అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి వరలక్ష్మి ధరించిన రెండు తులాల చైన్, తులం శతమానం తెంచుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత మెలకువ రావడంతో చోరీ జరిగినట్లు గుర్తించి కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చినా అప్పటికే దొంగలు పారిపోయారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్సై జి.వి.ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం పోలాకి: మండలంలోని పల్లిపేట వద్ద వంశధార నదిలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలాకి పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 50 ఏళ్లు ఉండవచ్చని చెప్పారు. వివరాలు తెలిసిన వారు పోలాకి పోలీసుస్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ సత్యనారాయణ కోరారు. -
పారా బీచ్ వాలీబాల్ పోటీలకు కొవ్వాడ క్రీడాకారుడు
రణస్థలం: ప్రపంచ పారా బీచ్ వాలీబాల్ పోటీలకు దేశం తరఫున కొవ్వాడ గ్రామానికి చెందిన క్రీడాకారుడు మైలపల్లి వెంకటరమణ ఎంపికయ్యాడు. ఈ నెల 28 నుంచి జూన్ 5వ వరకు చైనాలో జరిగే ఈ పోటీలకు వెంకటరమణకు పార్లెమిపిక్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఆహ్వానం అందిందని గ్రామస్తులు శనివారం చెప్పారు. విమాన చార్జీలతో పాటు ఇతర అలవెన్సులకు రూ.2.25లక్షలను ప్రభుత్వమే చెల్లించింది. వెంకటరమణ ప్రస్తుతం బెంగళూరులోని క్రీడా అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అక్కడి నుంచి రెండు రోజుల్లో చైనాకు బయలుదేరుతాడు. తండ్రి మైలపల్లి కృష్ణ చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. -
దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు
నరసన్నపేట: సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో ఇటీవల జరిగిన రూ.10 లక్షల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఆరుగురిని అరెస్టు చేసి రూ.4.80 లక్షలు రికవరీ చేశారు. ఈ నెల 18న ఈ ఘటన జరగ్గా, అదే రోజు సాయంత్రం బాధితుడు సారవకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు వివరాలు సేకరించిన ఎస్ఐ అప్పారావు సిబ్బందిని వెంటనే అలెర్ట్ చేశారు. నరసన్నపేట సీఐ బూర ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి వారం రోజుల్లోనే కేసు కొలిక్కి తీసుకువచ్చారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ బాలచంద్రరెడ్డి శనివారం నరసన్నపేట సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. పక్కా పథకం ప్రకారం.. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన కాంట్రాక్టర్ నక్కల్ల మణికంఠ శ్రీ కన్స్ట్రక్షన్లో ఓ బిల్డర్. ఈయన వద్ద యువరాజు అనే వ్యక్తి సూపర్వైజర్గా పనిచేసేవాడు. గత పరిచయం మేరకు ధర్మలక్ష్మీపురం వద్ద ఒక స్థలం అమ్మకానికి ఉందని, స్థలం చూసే ముందు కొంత మొత్తం టోకెన్ అడ్వాన్స్గా ఇవ్వాలని యువరాజు మణికంఠకు చెప్పాడు. దీంతో మణికంఠ రూ.10 లక్షలు పట్టుకొని ఈ నెల 18న ఆ స్థలం వద్దకు కారులో వచ్చాడు. అదే సమయంలో షడన్గా మరో కారులో నలుగురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని చెప్పి ఆ డబ్బును దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారు. వెంటనే మణికంట ఆ కారును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మంది భాగస్వామ్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలగా వీరిలో ఆరుగురు (నిమ్మల మనోజ్కుమార్, బిడ్డక యువరాజు, సోలిమాన్ కరోడా, పసుపు రెడ్డి తవుడు, అగ్గల రాజేష్, జీబంట లీమా)ను భామిని మండలంలోనూ, పర్లాకిమిడి వద్ద అరెస్టు చేశారు. వీరి వద్ద రూ.4.80 లక్షలు రికవరీ చేశారు. కారు, ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. మిగిలిన ఆరుగురు కోసం గాలిస్తున్నామని, మరో రూ.5.20 లక్షలను రికవరీ చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. ఎస్ఐ అప్పారావు, కానిస్టేబుల్స్ దాలినాయుడు, జోగారావు, గోపాలరావు, జి.సత్యనారాయణలు చురుగ్గా స్పందించి కేసును ఛేదించినందుకు రివార్డు కోసం ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. రూ.4.80 లక్షలు రికవరీ ధర్మలక్ష్మీపురం కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
జాబ్మేళాకు విశేష స్పందన
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న హెచ్పీఎన్ డిగ్రీ కళాశాలలో శనివారం హెటెరో ఫార్మా కంపెనీ, హెచ్పీఎన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం సంయుక్తంగా నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 310 మంది బీఎస్సీ కెమిస్ట్రీ అభ్యర్థులు హాజరు కాగా, ప్రతిభ కనబరిచిన 100 మందికి ఎంపిక పత్రాలు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తమ్మినేని రామారావు, కొత్తకోట రవీంద్ర, రామకృష్ణ, హెటెరో ఫార్మా కంపెనీ హెచ్ఆర్ ఎస్.నరేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలనా విభాగ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎస్.చంద్రశేఖర్, అర్చకులు ఇప్పిలి సాందీపశర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ భూములు, ఆదాయ వివరాలను ఈవో వివరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీవో సీహెచ్ రంగయ్య, తహసీల్దార్ రాణి పాల్గొన్నారు. కొబ్బరి చెట్టుపై పిడుగు సారవకోట: మండల కేంద్రం సారవకోటలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఆఫీసియల్ కాలనీలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు కాలిపోయింది. భారీగా ఉరుములు రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. తొలకరి జల్లులతో అన్నదాతల్లో ఆనందం కవిటి: గడిచిన రెండు రోజులుగా కవిటి మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా కురిసిన వర్షాలకు అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తుఫాన్ ెహెచ్చరికల నేపథ్యంలో శనివారం కురిసిన వర్షంతో కొబ్బరి రైతులు ఊపిరిపీల్చుకున్నారు. జూన్ రెండో వారంలో వరినారుమడులు సిద్ధంచేసుకునేందుకు, వేసవి దుక్కులకు సైతం ఈ వర్షం అనుకూలిస్తుందని అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. తాజా వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలు పాతపట్నం: పాతపట్నం వైటీసీలో నిర్వహిస్తున్న మెళియాపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 2024–25 సంవత్సరానికి ప్రవేశాలకు ఎంపికై న విద్యార్థులు అలాట్మెంట్ ఆర్డర్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వెరిఫికేషన్కు తీసుకురావాలని ప్రిన్సిపాల్ ఎం.రాధాకృష్ణ శనివారం తెలిపారు. ఇటీవల ఏకలవ్య స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని చెప్పారు. ఎంపికై న వారు జూన్ 6 నుంచి 15 మధ్య ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్సులతో పాఠశాలకు రావాలన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిశీలన ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపర్చిన చిలకపాలెం శివానీ కాలేజీలోని స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను శనివారం ఎస్పీ జీఆర్ రాధిక పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది రిజస్టర్, మూడంచెల భద్రతపై ఆరా తీశారు. కౌంటింగ్ నాడు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
వడదెబ్బతో ఉపాధి వేతనదారుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: ఉపాధి పని చేస్తూ వడదెబ్బకు గురై వేతనదారుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పంచాయతీ చిన్నలక్ష్మీపురం పెద్దగాయి నుంచి కీలువారిపుట్ట వరదగట్టుపై శనివారం ఉదయం ఉపాధి హామీ పనులు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన దున్న దుర్యోధన(57) అస్వస్థతకు గురయ్యాడు. పని ప్రదేశంలోనే కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు సపర్యలు చేసినప్పటికీ మృతి చెందాడు. ఫీల్డ్ అసిస్టెంట్ యర్ర జోగారావు ద్వారా విషయం తెలుసుకున్న ఏపీఓ పెట్ల శ్రీనివాసరావు, వీఆర్వో ఢిల్లీరావులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయాన్ని డ్వామా పీడీ దృష్టికి తీసుకువెళ్లి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతుడికి భార్య దాలమ్మ, పెళ్లైన ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
శ్రీకాకుళం
శనివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2024క్షీర సాగర మథనం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి శ్రీమహావిష్ణువు కూర్మరూపంలో అవతరించగా.. ఆ రూపాన్ని మరెక్కడా లేని తీరులో మూలవిరాట్టుగా ప్రతిష్టించి అర్చిస్తున్న విశిష్టత మన జిల్లాలో గోచరిస్తుంది. ఆధ్యాత్మిక భావానికి పరాకాష్టగా కూర్మనాథుడి ఆరాధనను చెప్పుకుంటే.. ఈ కాలంలో అందుకు ఏమాత్రం తీసిపోని మరో మానవీయ సేవ తీరప్రాంతంలో నిర్విఘ్నంగా సాగిపోతోంది. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతిని పరిరక్షించడానికి.. వాటి గుడ్లను సేకరించి.. ప్రత్యేకించి పొదిగించి.. మళ్లీ సముద్రంలో లక్షలాది చిరుజీవులను విడిచిపెట్టే గొప్ప ప్రయత్నం నిరతం సాగుతోంది. అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నం సముద్రం చేయూతతో ప్రశంసనీయ రీతిలో నడుస్తోంది. కాశీబుగ్గలో భారీ చోరీ కాశీబుగ్గ రోటరీనగర్లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.45 లక్షల విలువైన సొత్తును దొంగలు పట్టుకుపోయారు. –8లోఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సేకరించిన గుడ్లు1,59,275 ఇప్పటి వరకు సాగరంలోకి విడిచిపెట్టిన తాబేళ్లు: 95,696 ఒక్కో తాబేలు పెట్టే గుడ్ల సంఖ్య: 30 నుంచి 140 పొదిగే కాలం: 45 నుంచి 70 రోజులు 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు మగ తాబేళ్లుగా పరిగణిస్తారు. 30-32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు ఆడ తాబేళ్లుగా పరిగణిస్తారు. సంరక్షణకు పనిచేస్తున్న వలంటీర్లు: 41జిల్లా వ్యాప్తంగా తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు: 16 వె ర సికడలి మమకారం.. మనిషి సహకారం..వజ్రపుకొత్తూరు రూరల్: సముద్ర జీవుల్లో అరుదైన ఉభయచర జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ఇవి పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు కనిపిస్తూ ఉంటాయి. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెనిజూలా, గల్ఫ్ తదితర 80 దేశాలతో పాటు మనకు వేల నాటికల్ మైళ్ల దూరంలో గంగమ్మ ఒడిలో ఒదిగి ఉంటున్నాయి. తమ సంతతిని వృద్ధి పరిచే లక్ష్యంతో తీరానికి లక్షల సంఖ్యలో చేరుకుంటాయి. మాతృత్వాన్ని పొందేందుకు ప్రకృతిని(తీరాన్ని) ఆవాసాలుగా మార్చుకుంటాయి. అలాంటి ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతికి శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరం పుట్టినిళ్లుగా నిలుస్తోంది. భద్రంగా కాపాడుతూ.. జిల్లాలో 193 కి.మీ. విశాల సముద్ర తీరం ఉండ టంతో ఆలివ్ రిడ్లే తాబేళ్లు తమ సంతతి సంరక్షణకు నిలయంగా మార్చుకుంటున్నాయి. వీటికి అటవీ అధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు రక్షణగా నిలుస్తున్నారు. జిల్లాలో 16 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి జీవం పోస్తున్నారు. 41 మంది వలంటీర్లను నియమించి వారి ద్వారా గుడ్లు సేకరిస్తున్నా రు. తల్లి తాబేళ్లు ఇసుక తిన్నెలలో పెట్టిన గుడ్లు పక్షులు, జంతువులు, దొంగల బారిన పడకుండా భద్రపరుస్తున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన హేచరీలలో గుడ్లును పొదిగించి బుల్లి తాబేళ్లను సురక్షితంగా సముద్రంలో విడిచిపెడుతున్నారు. సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ.. ●జిల్లా వ్యాప్తంగా 16 హ్యాచరీలు(తాబేళ్ళ సంరక్షణ కేంద్రాలు )ఉన్నాయి. వజ్రపుకొత్తూరు సెక్షన్: వజ్రపుకొత్తూరు, మెట్టూరు ●బారువ సెక్షన్: కళింగపట్నం, గడ్డివూరు, బట్టిగల్లూరు, బారువ, ఇసుకవానిపాలెం ●కవిటి సెక్షన్: డొంకూరు, చేపల కపాసుకుద్ది, బట్టివానిపాలెం ●శ్రీకాకుళం సెక్షన్: కొచ్లెర్ల, గంగులవానిపేట ●టెక్కలి సెక్షన్: గుల్లవానిపేట, కుముందివానిపేట, మేఘవరం, భావనపాడు అరుదైన జాతిని కాపాడుకుందాం సముద్ర జీవులలో అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్ల రక్షణ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. రాత్రి వేళల్లో తీరం వెంబడి తిరుగుతూ వలంటీర్ల సహకారంతో గుడ్లను సేకరించి సంరక్షిస్తున్నాం. పొదిగిన బుల్లి తాబేళ్లను అటవీ శాఖా అధికారులు సహాయంతో మళ్లీ సముద్రంలోకి విడిచిపెడుతున్నాం. – కె.సోమేశ్వరరావు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ న్యూస్రీల్ అద్భుత ప్రయాణం.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రస్థానం జిల్లాలో 16 హ్యాచరీలతో అరుదైన జాతి సంరక్షణకు యత్నం 1,59,275 గుడ్లు సేకరణ.. సాగరంలోకి 95,696 చిట్టి తాబేళ్లు పక్కాగా సంరక్షణ తీరంలో తాబేళ్లు పొదిగిన గుడ్లను ఎలుగులు, నక్కలు, పక్షులు తినకుండా ట్రీ ఫౌండేషన్, యువకులు, మత్స్యకారుల సహకారంతో సంరక్షిస్తున్నాం. అరుదైన తాబేళ్ల జాతిని కాపాడుతున్నాం. ఇప్పటికే వేల సంఖ్యలో బుల్లి తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టాం. – మురళీకృష్ణనాయుడు, అటవీ శాఖాధికారి, కాశీబుగ్గ రేంజ్ -
క్యాంపస్ డ్రైవ్లో 131 మంది ఎంపిక
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ)లో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 131 మంది ఉద్యోగాల కు ఎంపికయ్యారు. 13 కంపెనీల ప్రతినిధులు హాజరై 322 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. విద్యార్హత, నైపుణ్యాలు ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు, ప్లేస్మెంట్ అధికారి కామేశ్వరరావు పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్లను శుక్రవారం అదనపు ఎస్పీ జి.ప్రేమ్కాజల్ పరిశీలించారు. సీసీ కెమె రాల ఫుటేజ్ పరిశీలించి భద్రతపై గార్డులకు పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏఓబీ సరిహద్దులో కార్డన్ సెర్చ్ పాతపట్నం: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పాతపట్నం మండలం బూరగాంలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాతపట్నం సీఐ నల్లి సాయి ఆధ్వర్యంలో పాతపట్నం, మెళియాపుట్టి ఎస్ఐలు మహమ్మద్ యాసీన్, రాజేష్, ఎస్టీఎఫ్ పోలీసులు, సివిల్ పోలీసు లు ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. వాహ నాల ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ యాసీన్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 25 నుంచి నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు, ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం శ్రీకాకుళంలోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్లలోని శివానీ ఇంజినీరింగ్, వేంకటేశ్వర ఇంజినీరింగ్, బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, నరసన్నపేటలోని గొట్టేపల్లి కోర్ టెక్నాలజీస్, టెక్కలి ఆదిత్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంద్రాలుగా పరీక్షలు జరుగుతాయని వివరించారు. 830 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థులను ఉదయం 7.30 గంటల నుంచి అనుమతిస్తామని, 8.30 తరువాత వచ్చిన వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమీపంలో జెరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. సమావేశంలో సెక్షన్ ఆధికారి ఎం. బాలరాజు, సహాయకులు పద్మప్రియ, వైద్య, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
No Headline
శ్రీకూర్మంలో కూర్మనాథుని కల్యాణ ముగింపు ప్రక్రియలో భాగంగా శుక్రవారం సాయంత్రం అనివెట్టి మంటపంలో పుష్పయాగం నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో పాటు ఆహార పదార్థాలను స్వామివారికి నివేదించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో జి.గురునాధం, ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు, అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, దాసుబాబు, పద్మనాభాచార్యులు, కిషోర్బాబు, శ్రీనివాసాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. –గార -
అల్లర్లు చెలరేగకుండా పటిష్ట భద్రత
● కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు ● పోలీసు అధికారుల సమీక్షలో ఎస్పీ రాధిక శ్రీకాకుళం క్రైమ్ : కౌంటింగ్ సమయంలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ జి.ఆర్.రాధిక తెలిపారు. ఓట్ల లెక్కింపు నాడు తీసుకోవాల్సిన చర్యలు, బందో బ స్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలతో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ జూన్ 4న ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద జరగనుందని, అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసులతో మూడంచెల బందోబస్తు ఏర్పా ట్లు చేపడుతున్నామన్నారు. కేంద్రాల వద్ద ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగ్కు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు. 144 సెక్షన్ పక్కాగా అమలు చేస్తూ ప్రజలు గూమిగూడకుండా చూడాలన్నారు.కేంద్రాల్లోకి వెళ్లే కౌంటింగ్ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, రిటర్నింగ్ అధికారి జారీ చేసి న అనుమతిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలకు అనుమతించాలన్నారు. ఫలితాలు వెల్లడైన తర్వాత జిల్లాలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా పేలుళ్లకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. శాంతియుతంగా కౌంటింగ్ పూర్తయ్యేలాగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ప్రేమ్కాజల్, ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
కూర్మావతారం
రాత్రివేళల్లో గుడ్లు సేకరణ.. ●ఏటా జనవరి నుంచి మార్చి వరకు తల్లి తాబేళ్ల గుడ్లు పెడుతుంటాయి. ●ఈ సమయంలో రాత్రి 10 నుంచి వేకువజాము 5 గంటల్లోపు తీరానికి చేరుకుంటాయి. ●ఈ సమయంలోనే ఇసుక తిన్నెలలో బొరియలు చేసి గుడ్లును పెట్టి సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి. ●వలంటీర్లు రాత్రి సమయంలోనే టార్చిలైట్, సంచులు పట్టుకుని తీరంలో తిరుగుతూ గుడ్లు సేకరిస్తారు. ●వాటిని సంరక్షణ కేంద్రంలో అధికారుల సమక్షంలో భద్రపరుస్తారు. ఉద్యమంలా సేకరణ.. పాతికేళ్లుగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్ల సేకరణ ఉద్యమంలా సాగుతోంది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు, మత్స్యకారుల సాకారంతో లక్షలాది గుడ్లను హ్యాచరీలలో సంరక్షించి పొదిగిన తర్వాత బుల్లి తాబేళ్లను తిరిగి సముద్రంలో విడిచిపెడుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తాబేలు గుడ్ల సేకరణ యజ్ఞంలా సాగింది. -
పొరపాట్లకు తావులేకుండా కౌంటింగ్
● కచ్చితమైన అవగాహనతో హాజరుకావాలి ● సిబ్బంది శిక్షణ తరగతుల్లో కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శ్రీకాకుళం పాతబస్టాండ్: కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వచ్చే నెల 4న జరగనున్నందున, ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలపై శుక్రవారం శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో పరిశీలకులు, కౌంటింగ్ అసిస్టెంట్ల తదితర సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ విజ యవంతమైందని, కౌంటింగ్ కూడా అదే స్థాయిలో నిర్వహించాలన్నారు. కచ్చితమైన, సమర్థవంతమై న ఓట్ల లెక్కింపునకు అవసరమైన నైపుణ్యాలు, మెలకువలు నేర్చుకుని కౌంటింగ్కు సిద్ధం కావాలన్నారు. ఈవీఎంల లెక్కింపు కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సందేహాలు తీర్చుతూ, ఓపికగా సిబ్బంది మెలగాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించాలన్నా రు. అనంతరం మాస్టర్ ట్రైనీలు మాట్లాడుతూ కౌంటింగ్ విధి విధానాలు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, మాస్టర్ ట్రైనీలు కిరణ్, ఎన్.బాలాజీ, మెప్మా పీడీ కిరణ్కుమార్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రా ల్లో తొలిరోజు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. తొలి రో జు ఫస్టియర్ విద్యార్థులు 3422 మందికి గాను 176 మంది గైర్హాజరయ్యారు. సెకెండియర్ విద్యార్థులు 926 మందికి గాను 80 మంది గైర్హాజరయ్యా రు. డీవీఈవో కోట ప్రకాశరావు, ఆర్ఐవో ప్రగడ దుర్గారావు, డీఈసీ కమిటీ సభ్యులు బొమ్మలాట శ్యామ్సుందర్, గూణ సింహాచలం, కీర్తి తవిటినాయుడు పర్యవేక్షించారు. మూడు ఫ్లయింగ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపడుతున్నారు. -
కథా నిలయం
చూసొద్దాం రండి ● అందుబాటులో 16 వేలకు పైగా పుస్తకాలు ● కథా పరిశోధకుల నిలయంగా ఖ్యాతి ● కారా మాస్టారి కృషితో ఏర్పాటు శ్రీకాకుళం కల్చరల్: కథా నిలయం.. సాహితీ ప్రపంచంలో శ్రీకా కుళం జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఎక్కడ కథ ప్రచురితమైనా ఇక్కడికి వచ్చి చేరుతూ వేలాది కథల పుస్తకాలతో విరాజిల్లుతోంది. పుస్తకాలు భద్రపరిచేందుకు ప్రత్యేకంగా భవనం ఉండాలన్న ఉద్దేశంతో జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత దివంగత కాళీపట్నం రామారావు మాస్టారు, మరికొంత మంది ఆత్మీయులు కలిసి 1997 ఫిబ్రవరిలో శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలో సుర్యానగర్లో రెండంతస్తుల భవనంలో కథా నిలయాన్ని ప్రారంభించారు. కేవలం పుస్తకాలను భద్రపరచడమే కా కుండా వెబ్సైట్ ద్వారా కూడా కథలు చదువుకునేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. కథలు–రచయితలు మొదటగా 800 పుస్తకాల సేకరణతో ప్రారంభమై ప్రస్తుతం 16 వేలకు చేరాయి. 24 వేలు పత్రికలు ఉన్నాయి. సంకలనాలు, కథా సంపుటాలు కలిపి మరో 5వేలు ఉన్నాయి. 100 ఫీచర్ రచనలు, 105 వ్యాస సంకలనాలు, 67 ఆత్మకథలు, 97 పరిశోధనా పత్రాలు, 95 జీవిత చరిత్ర లు, 130 సాహిత్య సర్వస్వాలు, 53 ఉపయుక్త గ్రంథాల సూచికలు, 45 ఇతర భాషల్లో వచ్చిన తెలుగు పుస్తకాలు, 8200 ఇతర పుస్తకాలు సేకరించారు. 15 వేల కథా రచయితలకు చెందినవి సేకరించారు. ఇక్కడ ప్రముఖ కథా రచయితల ఫోటోలు 285కు పైగా సేకరించి భద్రపరిచారు. సుమారు 40మంది రచయితల స్వరాలను రికార్డు చేశారు. అందుకు ఆల్ఇండియా రేడియో సహకారం అందించింది. డిజిటలైజేషన్ ప్రక్రియ.. ఆధునిక అవసరాలకు అనుగుణంగా కథలను దూరప్రాంతాల సాహిత్యాభిమానులకు అందించేందుకు వీలుగా డిజిటలైజేషన్ పనులు జరిగా యి. పాతపత్రికలను స్కానింగు చేసి పీడీఎఫ్లో మార్చారు. 1885 నాటి అమృత గ్రంథచింతామణి, 1895 నాటి ‘శారద’, 1896 నాటి చింతామణి, 1920 నాటి గురజాడ రచనలు, బండారు అచ్చమాంబ రచనలు, ‘హిందూ సుందరి’ వంటి పత్రికలు కూడా ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి. మొత్తం 88వేల కథలను ఇంటర్నెట్లో చక్కగా చదువుకోవచ్చు. ‘కథానిలయం డాట్కామ్’ వెబ్సైట్ ద్వారా 13వేల కథలు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. సందర్శన వేళలు... కథా నిలయాన్ని సందర్శించాలనుకుంటే ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య రావచ్చని ట్రస్టు సభ్యులు కాళీపట్నం సుబ్బారావు తెలిపారు. ముందుగా 94900 08743 నెంబరుకు ఫోన్ చేసి రావాలని కోరారు. -
కాశీబుగ్గలో భారీ చోరీ
కాశీబుగ్గ : కాశీబుగ్గ రోటరీనగర్లో గురువారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో చొరబడి డైమండ్స్తో కూడిన 40 తులాల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17వ వార్డు రోటరీనగర్లో నివాసముంటున్న చాప అలివేలు వజ్రపుకొత్తూరు మండలం ఎంఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. గురువారం విధులు ముగించుకు ని తన స్వగ్రామమైన నందిగాం మండలం హరిదాసుపురం చేరుకుని అక్కడే రాత్రి బస వేసింది. ఇదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు రోటరీగనర్లో ని ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. రెండు అలమరాలతో పాటు, బీరువాను పగలు కొట్టి అందులో ఉన్న ఆభరణాలు, నగదు దోచుకుపోయారు. అందులో రూ.17లక్షల విలువైన డైమండ్తో కూడిన 40 తులాల బంగారం, 10 తులాల వెండి వస్తువులు, రూ.18వేల నగదు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చోరీ జరిగిన సొత్తు విలువ రూ.45 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. కుమార్తె పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న సొత్తు దొంగల పాలైందంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె భర్త సీఆర్పీఎఫ్ జవాన్గా ప్రస్తుతం ఎన్నికల విధులలో ఉన్నారు. కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి గా పని చేస్తోంది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్ఐ పారినాయుడు, క్రైం హెచ్సీ శ్రీనివాసరావు, క్లూస్టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ.45 లక్షల విలువైన సొత్తుతో దొంగలు పరార్ రంగంలోకి దిగిన క్లూస్టీం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
పాక్తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
సంచలన నివేదికలు.. మరోసారి తెరపైకి షానన్ - మస్క్ సాన్నిహిత్యం
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మౌంట్ ఎవరెస్ట్పై పర్యాటకుల తాకిడి
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
Sakshi News Cartoon: అనవసరంగా తనని పాలిటిక్స్లోకి లాగొద్దంటున్నాడ్సార్!
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement