గజ వాహనంపై రంగనాథుడు | - | Sakshi
Sakshi News home page

గజ వాహనంపై రంగనాథుడు

Published Sun, Apr 13 2025 2:13 AM | Last Updated on Sun, Apr 13 2025 2:13 AM

గజ వా

గజ వాహనంపై రంగనాథుడు

నేడు రథోత్సవం

జూపాడుబంగ్లా: తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథుడు స్వామివారు శనివారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మూల, ఉత్సవ విగ్రహాలకు అర్చకులు పంచామృతాభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం చెక్కబొమ్మ రూపంలో ఉన్న స్వామివారి ఉత్సవ మూర్తిని పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం గజవాహనంతో అలంకరించిన గ్రామోత్సవ వాహనంపైకి చేర్చి పూజలు నిర్వహించారు. ఆతర్వాత భక్తులు గోవింద నామాన్ని స్మరిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. పూజల్లో ఆలయ ఈఓ సాయికుమార్‌, చైర్మన్‌ నారాయణరెడ్డి, ప్రధాన అర్చకుడు ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరొందిన తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి రథోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.

గజ వాహనంపై రంగనాథుడు1
1/1

గజ వాహనంపై రంగనాథుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement