-
వసూళ్లపై విజిలెన్స్ ఆరా!
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వసూళ్ల పర్వానికి పాల్పడుతున్న వైనంపై విజిలెన్స్ అఽధికారులు ఆరా తీస్తున్నారు. గతేడాది కాలంగా ఎక్కడెక్కడ ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారో.. దానికి సంబంధించిన వివరాలను విజిలెన్స్ సేకరిస్తోంది. ఉమ్మడి విశాఖలో తరచుగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై ‘సమన్వయ లోపంతో షాక్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై విజిలెన్స్ దృష్టిసారించింది. మరోవైపు కథనంపై ఈపీడీసీఎల్ సర్కిల్ అధికారులు స్పందిస్తూ విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా సబ్బవరం, ఇతర మండలాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై దృష్టిసారిస్తున్నామని, బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తామని ఎస్ఈ మహేంద్రనాథ్ అన్నారు. రెండు నెలల కాలంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన హెల్పర్స్.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మతులు చేపట్టేందుకు వెళ్లడం వల్ల దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ విషయంలో మిగిలిన వారందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈ తెలిపారు. అదేవిధంగా కశింకోట డివిజన్ పరిధిలో ప్రతి చోటా వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని డివిజన్ ఈఈ రామకృష్ణ తెలిపారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. భద్రతపై బాధ్యతగా వ్యవహరిస్తున్నాం.. వసూళ్లపై దృష్టిసారిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ అధికారులు -
స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనామహారాణిపేట: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, పోలీసు కమిషనర్ డాక్టర్ రవిశంకర్తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. విశాఖ పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమలను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను పరిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్లో మీనా సంతకం చేశారు. మూడెంచల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్కు సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడని ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు వహించాలన్నారు. పర్యటనలో భాగంగా అక్కడి పరిస్థితులను, జిల్లా యంత్రాంగం తరఫున చేపట్టిన చర్యలను సీఈవోకు కలెక్టర్, పోలీసు కమిషనర్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు డి.హూస్సెన్ సాహెబ్, సీతారామ్ముర్తి, శేష శైలజ, అఖిల పాల్గొన్నారు. -
సంపత్ వినాయగర్ హుండీ ఆదాయం రూ.15.31 లక్షలు
సీతమ్మధార : ఆశీలమెట్టలో గల సంపత్ వినాయగర్ ఆలయంలో హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 23 రోజులకు రూ.15,31,839 లక్షలు, వెండి 171 గ్రాములు, యూఎస్ఏ డాలర్లు 90, సింగపూర్ డాలర్లు 10, ఎస్బీఐ చెక్కు రూ.111 వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారిని ఎన్.సుజాత తెలిపారు. దేవాదాయ శాఖ తనిఖీదారులు, డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.యు.డి.ఎన్ ప్రసాద్, బి.వసంత కుమార్, ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ టి,చోళన్, వెంకటేశ్వర సేవా సంఘం సభ్యులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు. -
రెండో విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం నుంచి రెండో విడత చందనం అరగదీత ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 23న వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు తెల్లవారుజామున స్వామికి సమర్పించనున్న మూడు మణుగుల పచ్చిచందనం (120 కిలోలు) సమకూర్చేందుకు అరగదీత కార్యక్రమం చేపట్టారు. ఉదయం 7 గంటలకు చందనం చెక్కలకు పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ భాండాగారం వద్ద బేడామడంపంలో 20 మంది సిబ్బంది అరగదీతని శాస్త్రోక్తంగా ప్రాంభించారు. తొలిరోజు 40 కిలోల చందనాన్ని అరగదీశారు. ఈ చందనాన్ని అర్చకులు తూకంవేసి భద్రపరిచారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఏఈవో ఆనంద్కుమార్ పర్యవేక్షించారు. కాగా ఏడాదిలో నాలుగుసార్లు మూడు మణుగుల చొప్పున పచ్చి చందనాన్ని సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజు చందనం సమర్పణ జరుగుతుంది. ఈనెల 10న జరిగిన చందనోత్సవం రోజు తొలివిడత చందన సమర్పణ చేశారు. రెండో విడతగా ఈనెల 23న వైశాఖ పౌర్ణమి రోజు చందనాన్ని సమర్పించనున్నారు. -
రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ జోన్–2 పరిధి పలు ప్రాంతాల్లో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా చేసే విషయమై బోని గ్రామం వద్ద ఉన్న గోస్తనీ హెడ్ వాటర్ వర్క్స్ నుంచి తగరపువలస వరకు నూతనంగా 400 ఎంఎం మందం గల పైపులైన్ వేస్తున్నందున ఆ రోజు జోన్–2 పరిధి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని చెప్పారు. బోయపాలెం హౌసింగ్ కాలనీ, పరదేశిపాలెం, ఈడబ్ల్యూఎస్ కాలనీ, పరదేశిపాలెం విలేజ్, బోరవానిపాలెం విలేజ్, మారికవలస విలేజ్, పీపీ–2 హౌసింగ్ కాలనీ, సాయిరాం కాలనీ ఫేస్ 2 అండ్ 3, జీసీసీ లే అవుట్, భగవాన్దాస్ కాలనీ, రేవళ్లపాలెం, ఎంఎస్ఆర్ లే అవుట్, సంపత్నగర్, సాయిప్రియ లే అవుట్, గాయత్రీనగర్ హౌసింగ్ కాలనీ, పీఎం పాలెం మొదటి బస్టాప్ ఏరియా, స్టేడియం వెనుక ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడనుందని, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు నీటి సరఫరా చేయనున్నట్టు చెప్పారు. -
తెలంగాణ ఎంసెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
విశాఖ విద్య : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. శ్రీ చైతన్య ఉత్తరాంధ్ర విద్యాసంస్థల విద్యార్థులు టాప్ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇంజనీరింగ్ విభాగంలో రెడ్డి అనిల్ (ఎన్ఏడీ)47వ ర్యాంకు, తోట ఽధీరేశ్వర్ (దువ్వాడ) 184వ ర్యాంకు, కొత్తమూరి కౌశల్ (యలమంచిలి) 190వ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో శరగడం పావని(గాజువాక) 32వ ర్యాంకు, మేక గాయత్రి (సీబీఎం కాంపౌండ్) 44వ ర్యాంకు, శంబంగి మనో అభిరామ్( గాజువాక) 73వ ర్యాంకు జాజుల సాకేత్ సాయి (గాజువాక) 113వ ర్యాంకు, తేజావత్ సాయి నిఖిలేష్ (గాజువాక) 149వ ర్యాంకు, భీశెట్టి జైదీప్(ద్వారకా నగర్) 169వ ర్యాంకు సాధించినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్వూటివ్ ఏజీఎం కె.వి.రమణ వెల్లడించారు. అదే విధంగా 500 లోపు ర్యాంకులు 59 మంది విద్యార్థులు సాధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా మన విద్యార్ధులు సత్తా చాటడం గర్వకారణమన్నారు. -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి జూన్ 24వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికేట్లు అందజేయబడతాయి. శిక్షణలో నేర్పించే అంశాలు : 1. త్రెడ్డింగ్, 2. వ్యాక్స్, 3 పెడిక్యూర్, 4. మెనిక్యూర్, 5. బ్లీచింగ్, 6. స్కిన్ కేర్, 7. హెయిర్ కేర్, 8. వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, 9. డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, 10. హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, 11. హెయిర్ కట్స్, 12. హెయిర్ స్టైల్స్, 13. హెన్నా ప్రిపరేషన్ 14, డై అప్లికేషన్, 15. మేకప్స్ (బ్రైడల్, పార్టి మరియు లైట్ మేకప్స్) 16. పింపుల్ ట్రీట్మెంట్, 17. హెయిర్ మసాజ్, 18. కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, 19. ఫేషియల్స్, 20. సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్స్ స్వీకరించు తేదీలు : 17–5–2024 నుంచి 26–5–2024 వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫీజు : 3000/– వర్క్షాపు షెడ్యూలు తేదీలు : 27–05–2024 నుంచి 24–06–2024 వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్ మరియు శిక్షణా స్థలం : వనితశ్రీ బ్యూటీ ఇన్స్టిట్యూట్ బాలాజీ హిల్ వ్యూ ఎన్క్లేవ్, వేపగుంట, గోశాల, బి.ఆర్.టి.ఎస్.రోడ్, విశాఖపట్నం సంప్రదించవలసిన నంబర్లు : 70757 09205, 91001 73200 -
సీబీఎస్ఈపై ముగిసిన శిక్షణ
కశింకోట: సీబీఎస్ఈపై ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకుని, విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) విజయభాస్కర్ తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులకు విద్యార్థులకు గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. మండలంలోని తేగాడ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూలు)లో ఇచ్చిన ఈ శిక్షణ శనివారం ముగిసింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు ఆకళింపు చేసుకుని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి కృషి చేయాలన్నారు. సాంఘిక, జీవ శాస్త్రాలు బోధించే ఉపాధ్యాయులకు కూడా ఇదే తరహాలో సోమవారం నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా విద్యా శాఖ అఽధికారి వెంకటలక్ష్మమ్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉప విద్యా శాఖ అధికారి అప్పారావు, రాష్ట్ర పరిశీలకురాలు శ్రీలత, జిల్లా సీబీఎస్ఈ విద్యా సమన్వయకర్త విజయలక్ష్మి, ఎంఈవో కె.చిట్టిబాబు, కెఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్ ఐ.మార్తా తిలకం పాల్గొన్నారు. -
ఫుడ్ ట్రెండ్
కొత్త రుచులు కోరుతున్న జనం వారంలో ఒకసారి బయటి భోజనానికి ప్రాధాన్యం ఇంటికొచ్చే బందువులకూ హోటల్ వంటలతోనే విందు వైరెటీ రుచులతో హోటళ్ల ఆహ్వానం ప్రత్యేక ఆఫర్లతో ఊరిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్స్ డాబాగార్డెన్స్ : నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వైరెటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో వచ్చేస్తున్నాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్లో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్లు వేరు. ల్యాప్టాప్లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లో ఫుడ్ డెలివరీ యాప్స్లో ఫుడ్ ఆర్డర్ చేయడం నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్ తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. -
No Headline
విశాఖ విద్య : ఇంటర్మీ డియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ఐవో పి.మురళీధర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు ఉన్న 172 జూనియర్ కాలేజీల నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులకు 31,142 మంది, ఒకేషనల్ కోర్సులకు 626 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. అదే విధంగా సెకండ్ ఇయర్ జనరల్ కోర్సులకు 7,774 మంది, ఒకేషనల్ కోర్సులకు 455 మంది విద్యార్థులు హాజరతున్నారన్నారు. ఇందుకు జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు సంబంధించిన సామగ్రి ఇప్పటికే జిల్లాకు చేరుకుందన్నారు. తగిన పోలీసు బందోబస్తు మధ్య జిల్లాలో గుర్తించిన 11 స్టోరేజ్ పాయింట్లులో వీటిని భద్రపరిచామన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదే విధంగా రెండో సంవత్సరం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. -
కొత్త రుచులు ఇంట్లో కష్టం
వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్కో, హోటల్కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపు నిండా తినొచ్చు. – సీహెచ్ పవన్కుమార్, ప్రైవేట్ ఉద్యోగి -
ప్రాణం తీసిన ఈత సరదా
పెందుర్తి : మేహాద్రిగెడ్డ రిజర్వాయర్కు స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీతంపేటకు చెందిన సుర పవన్(22) స్నేహితులతో కలిసి శనివారం ఉదయం ఈతకు వచ్చాడు. మేహాద్రిలో దిగిన తరువాత పవన్ ఆకస్మాత్తుగా నీట ముగినిపోయాడు. సాయంత్రం పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతుంది. -
గ్రూప్స్–2 మెయిన్స్కు ఉచిత శిక్షణ
ఎంవీపీకాలనీ : ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్–2 మెయిన్స్కు ఉచిత శిక్షణ అందించనున్నారు. మెయిన్స్కు అర్హత సాధించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రెండు నెలల పాటు సాగే శిక్షణకు 60 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిక్షణకు ఎంపికై న అభ్యర్థులకు స్టైఫండ్తో పాటు స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో అందజేయాలన్నారు. వివరాలకు 9492569177 నంబర్లో సంప్రదించాలన్నారు. -
ఆదివారం కోసం వెయిటింగ్
డబ్బుల విషయం పక్కన పెడితే.. ఆదివారం వచ్చిందంటే మాకు పండగే. భార్యాభర్తలిద్దరం ప్రైవేట్ ఉద్యోగులం. సోమవారం నుంచి శనివారం వరకు వర్క్ బిజీలో ఉంటాం. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు పని ఒత్తిడితోనే గడిచిపోతుంది. మధ్యాహ్నం కాస్త పొట్ట నింపుకుంటాం. రాత్రి వేళ్లల్లో కూడా అరకొరగానే తింటాం. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే ఇంట్లో వంట చేసుకోకుండానే కావల్సిన నాన్–వెజ్ ఐటెమ్స్ తెచ్చుకుంటాం. మనస్ఫూర్తిగా ఆరగిస్తాం. – పి. రాము, ప్రైవేట్ ఉద్యోగి -
సింహగిరికి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసు
సింహాచలం : సింహగిరి ఘాట్రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును శనివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రారంభించింది. దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలలో బస్సుకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఆయనతో పాటు దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, పలువురు ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు రెండో టోల్గేట్ ద్వారా సింహగిరికి బస్సులో తరిలివెళ్లారు. ఈసందర్భంగా అశోక్గజపతిరాజు మాట్లాడుతూ భక్తులే భగవంతునికి నిజమైన ప్రతినిధులని, భగవంతుడికి ఇచ్చిన విరాళాలు వృథా చేయకూడదని, భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు చేస్తే హర్షిస్తాడన్నారు. భగవంతుడు ఇచ్చిన సృష్టిని భావితరాలకు అందించాలన్నారు. పర్యావరణ పరిక్షణలో భాగంగా దేవస్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సింహగిరి ఘాట్రోడ్డులో రెండు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించామని. తొలుత రూ.1.65 కోట్లతో కొనుగోలు చేసిన బస్సును ప్రారంభించామన్నారు. మొత్తం 42 సిట్టింగ్ కెపాసిటీ, స్టాండింగ్ కెపాసిటీ 30 ఉంటుందన్నారు. రెండున్నర గంటలు చార్జ్చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. టికెట్టు రూ.15గా నిర్ణయించామన్నారు. రెండో బస్సు కొనుగోలుకు కూడా ఇప్పటికే 50శాతం నగదును చెల్లించినట్టు చెప్పారు. అతిత్వరలోనే ఆ బస్సు కూడా దేవస్థానానికి రానుందన్నారు. రూ.18 లక్షలతో 18కేవీ కెపాసిటీతో శ్రీకృష్ణాపురం గోశాలలోనే చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సమకూర్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లతో బస్సును నడుపుతున్నామని చెప్పారు. దేవస్థానం డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ అనంతరం వారే ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ రాంబాబు, డీఈ హరిరాజు, ఏఈ గోవర్దన్, సూపరింటెండెంట్లు యనమండ్ర అప్పారావు, సునీల్, సింహాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించిన దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు రూ.1.65 లక్షలతో కొనుగోలు 18 లక్షలతో చార్జింగ్ పాయింట్ ఏర్పాటు పనులు త్వరలో రానున్న మరో బస్సు -
జర్రా అప్పారావుకు చందు సాహిత్య పురస్కారం
సీతంపేట: ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ కల్చరల్ ట్రస్టు సాహిత్య సేవా పురస్కారం 2024 సంవత్సరానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు జర్రా అప్పారావుకు ప్రధానం చేశారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పూర్వ వైస్ చాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు చేతులమీదుగా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గుర్తింపు పొందడం కంటే పదవులు గొప్పవికాదన్నారు. సభాధ్యక్షుడు ఆచార్య కె.ఎస్.చలం మాట్లాడుతూ ఆదివాసుల జీవిత చరిత్రను వెలుగులోకి తెచ్చిన జర్రా అప్పారావుకు చందు సాహితీ పురస్కారం అందజేయడం సముచితమన్నారు.ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లిన ఘనత తెలుగుశాఖ అధ్యక్షుడు జర్రా అప్పారావుకే దక్కుతుందన్నారు. ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ ఆదివాసిల చరిత్ర, జీవనవిధానంపై మరిన్ని రచనలు రావాలన్నారు. ఎమ్మెల్సీ కుంభారవిబాబు మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే సాహిత్యం జర్రా అప్పారావు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు డీఆర్కే రావు, మేడా మస్తాన్రెడ్డి, డీవీ సూర్యారావు, అడపా రామకృష్ణ, ఉప్పల అప్పలరాజు, జీకేడీ ప్రసాద్, హనుమంతరావు, జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
రాజశేఖర్ సేవలు శ్లాఘనీయం
విశాఖ లీగల్: న్యాయవాదులు, న్యాయమూర్తులు సాంకేతికత వైపు అడుగులు వేయాలని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సూచించారు. శనివారం నగరంలోని ఒక హోటల్లో దివంగత హైకోర్టు రిజిస్టర్ జనరల్ బట్ట రాజశేఖర్ చిత్రపటం వద్ద నివాళలర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ రాయ్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిగా ఆన్లైన్ ద్వారా ప్రథమ సమాచార నివేదికను స్వీకరించిన రాజశేఖర్ సంచలనం సృష్టించినట్లు చెప్పారు. కేవలం న్యాయమూర్తి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక సలహాలకు కేంద్ర బిందువుగా రాజశేఖర్ నిలిచారన్నారు. నిజాయితీ, నీతి కలిగిన న్యాయమూర్తిగా విశేష ఖ్యాతి గడించినట్లు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్.ఎస్.సోమయాజులు అన్నారు. రాజశేఖర్ సేవలను రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్ వివరిస్తూ అందరికీ ఆప్తుడుగా నిలిచిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. జూనియర్లకు ఒక మార్గదర్శి రాజశేఖర్ నిలిచారని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి కొనియాడారు. కార్యక్రమంలో విశాఖ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, రాజశేఖర్ కుటుంబ సభ్యులు, విశాఖ జిల్లా వినియోగదారుల మండలి–2 సభ్యురాలు బి.విజయదుర్గ, సీనియర్ న్యాయవాది హేమమాలిని, రాజశేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని గవర్నమెంట్ రైల్వేపోలీసులు, రైల్వే భద్రతా దళం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పి సిబ్బంది తెలిపిన వివరాలు... జీఆర్పీ, ఆర్పీయఫ్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో వివిధ ప్లాట్ఫారాలు తనిఖీలు నిర్వహించారు. బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాకు చెందిన సూరజ్కుమార్ విశాఖ మీదుగా చైన్నె తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.80 వేలు విలువగల 16కేజీల గంజాయిని కనుగొని స్వాధీనం చేసుకొన్నారు. మరో తనిఖీలలో భాగంగా ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన ప్రదీప్ మల్లిక్ అనే వ్యక్తి విశాఖ మీదుగా సుమారు రూ.54,500 విలువైన 10.9కేజీల గంజాయిని తరలిస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. ఇద్దర్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. బాలల సంక్షేమానికి కృషిఆరిలోవ: బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. పైనాపిల్కాలనీలో జిల్లా మహిళా కేంద్రంలో శనివారం ఆరు జిల్లాల సీ్త్ర సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, జిల్లాల బాలల సంరక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్జేడీ జి.చిన్మయిదేవి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎస్సీపీసీఆర్ చైర్మన్తో పాటు సభ్యుడు గొండు సీతారాం పాల్గొని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతరామరాజు జిల్లాల్లో ఇంతవరకు నమోదైన బాల్య వివాహాలు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, గ్రామ స్థాయిలో వాటి నిర్మూలనకు ఏర్పాటు చేసిన కమిటీలు తదితర రికార్డులు పరిశీలించి, చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అఽధికారులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. సమీక్షలో ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
మరికొన్ని ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఆయా మార్గాలలో నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ● సంబల్పూర్–కాచిగూడ(08325) సమ్మర్ స్పెషల్ సంబల్పూర్లో ప్రతీ సోమవారం రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7.20 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.25 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 24వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కాచిగూడ–సంబల్పూర్(08326) సమ్మర్ స్పెషల్ కాచిగూడలో ప్రతీ మంగళవారాలలో రాత్రి 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 12.35 గంటలకు బయల్దేరి బుధవారాలలో రాత్రి 11.45 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ● సంబల్పూర్–బెంగళూరు(08321) సమ్మర్ స్పెషల్ ప్రతీ గురువారాలలో సాయంత్రం 6.45 గంటలకు సంబల్పూర్లో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 5 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 11.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు జూన్ 27వ తేదీ వరకు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో బెంగళూరు–సంబల్పూర్(08322) సమ్మర్ స్పెషల్ ప్రతీ శనివారాలలో తెల్లవారు 1.15 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 8.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు జూన్ 29వ తేదీ వరకు నడుస్తాయి. హిరాకుడ్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు అంబాలా డివిజన్, శంభు స్టేషన్ పరిధిలో జరుగుతున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే హిరాకుడ్ ఎక్స్ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖలో బయల్దేరే విశాఖపట్నం–అమృత్సర్ (20807) హిరాకుడ్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో 22వ తేదీన అమృత్సర్లో బయల్దేరే అమృత్సర్–విశాఖపట్నం(20808) హిరాకుడ్ ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా జఖల్, దూరి, లూధియానాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
సింహగిరి కిటకిట
సింహాచలం: సింహగిరి శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. భక్తులతో దర్శన క్యూలు కిక్కిరిశాయి. మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్నప్రసాద భవనం, ప్రసాద విక్రయశాల, కేశఖండనశాల వద్ద భక్తులు బారులు తీరాయి. భక్తుల రద్దీ కారణంగా అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. కేవలం నీలాద్రిగుమ్మం వద్ద నుంచే దర్శనాలు కల్పించారు. మరోపక్క సింహగిరిపై వాహనాల పార్కింగ్కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ద్విచక్రవాహనాలు, కార్లు ఎక్కువగా రావడంతో పార్కింగ్ ప్రదేశాలన్నీ నిండిపోయాయి. దీంతో ఎక్కడ వాహనాన్ని పార్క్ చేయాలో తెలియక భక్తులు తికమక పడ్డారు. గజపతి సత్రం మార్గంలోను, మైక్రో టవర్కు వెళ్లే మార్గంలో భారీ ఎత్తున వాహనాలను పార్క్ చేశారు. అలాగే సింహగిరి ఘాట్రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకుంది. దీనికి తోడు ఒక కారు ఘాట్రోడ్డులో మరమ్మతుకు గురై నిలిచిపోవడంతో వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే నిలిచిపోయిన కారును పక్కకు తీసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అలాగే రెండో టోల్గేట్ ప్రవేశ ద్వారం వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనాల రద్దీ నెలకుంది. కొండదిగువ తొలిపావంచా ఏరియా అంతా పెద్ద ఎత్తున వాహనాలతో నిండిపోయింది. దేవస్థానానికి రూ.53 లక్షల ఆదాయం శనివారం సాయంత్రానికి దేవస్థానానికి సుమారు రూ.53లక్షల ఆదాయం లభించింది. దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా రూ.33లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా సుమారు రూ.13 లక్షలు, కేశఖండనశాల ద్వారా రూ.5.29లక్షలు, సేవల ద్వారా రూ.93వేలు, విరాళాల రూపంలో సుమారు రూ.80వేలు వచ్చింది. రాత్రి 7.15 సమయానికి 42వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సింహగిరికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఘాట్రోడ్డులో భారీగా నిలిచిపోయిన వాహనాలు కొండదిగువ పెద్ద ఎత్తున ట్రాఫిక్జామ్ ఒక్కరోజు రూ. 53 లక్షల ఆదాయం రాత్రి 7.15గంటల్లోపు 42వేల మంది భక్తులు స్వామిదర్శనం -
Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు.అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్లైన్ 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవాని ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...నిరుద్యోగులకు వల...గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్కు అప్పగించాడు. ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.చీకటి గదిలో బంధించి..ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్గేమ్స్, ట్రేడింగ్తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...కంచరపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ముఠాకు భారత యువత విక్రయం...నిరుద్యోగులను ముందు బ్యాంకాక్ పంపించి, అక్కడ రెండో ఏజెంట్కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది. -
తెరుచుకున్న గంగవరం పోర్టు గేట్లు
● చర్చలు ఫలించడంతో కార్మికుల సమ్మె విరమణ ● స్టీల్ప్లాంట్కు యథావిధిగా బొగ్గు సరఫరాపెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టు గేట్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. పోర్టులో పని చేస్తున్న ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి విధులకు హాజరయ్యారు. బొగ్గు రవాణా జోరుగా సాగడంతో విశాఖ స్టీల్ప్లాంట్ ఊపిరి పీల్చుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం గంగవరం పోర్టులో పని చేస్తున్న నిర్వాసిత కార్మికులు గత నెల 10వ తేదీ నుంచి పోర్టు ప్రధాన గేటు వద్ద ఆందోళన చేయడం తెలిసిందే. కార్మికులకు ప్రతి నెలా కనీస వేతనం కింద రూ.36 వేలు చెల్లించాలని, విధి నిర్వహణలో ఉన్న కార్మికులు మృతి చెందితే రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నష్టపరిహారం కింద రూ.50 లక్షలు ఇచ్చి వన్టైమ్ సెటిల్మెంట్ చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఆదేశం మేరకు నగర సీపీ రవిశంకర్ పోర్టు యాజమాన్య ప్రతినిధులు, నిర్వాసిత కార్మిక సంఘ నాయకులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఎట్టకేలకు గురువారం రాత్రి చర్చలు ఫలించాయి. ఒక్కో కార్మికునికి రూ.27 లక్షలు ఇచ్చి వన్ టైమ్ సెటిల్మెంట్ చేయడానికి పోర్టు యాజమాన్యం అంగీకరించడంతో కార్మికులు సమ్మె విరమించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి పోర్టులో కార్యకలాపాలు యథావిధిగా సాగాయి. స్టీల్ప్లాంట్కు ఇక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు సరఫరా చేశారు. -
ఐటీఐలో దివ్యాంగుల ప్రవేశాలకు ఆహ్వానం
మధురవాడ: బక్కన్నపాలెంలోని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సిహెచ్.భాస్కరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోనే ఏకై క శిక్షణ సంస్థ ఇదేనని, రాష్ట్రంలోని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్పెంటర్ కోర్సుకు 24 సీట్లు, షీట్మెల్ వర్క్ కోర్సుకు 20, వెల్డర్ 20, పెయింటర్ 20 సీట్లు చొప్పున ఉన్నాయని, ఏడాది కాలం పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిలైన పురుష దివ్యాంగ విద్యార్థులు అర్హులని, వచ్చే నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరాఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాల కోసం ప్రాజెక్ట్ అధికారి పి.వి.రమణమూర్తి (ఫోన్ 78933 83633) ప్రిన్సిపాల్ సిహెచ్.భాస్కరరావు(73964 24319)ను సంప్రదించాలన్నారు. https://iti.ap.gov.in/ వెబ్సైట్లో కూడా వివరాలు పొందవచ్చునన్నారు. -
జూన్ 4న చరిత్ర సృష్టించబోతున్నాం
● రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వెంటే ● అందుకే భారీగా ఓటింగ్ ● కూటమికి ఓటమి తప్పదు ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణిబీచ్రోడ్డు : జూన్ 4 వెలువడే ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ మరోసారి చరిత్ర సృష్టించబోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు మేలు చేసిన సీఎం జగన్కు అండగా నిలవాలని భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. చంద్రబాబు కూటమికి ఓటమి తప్పదని స్పష్టంచేశారు. ఆమె శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలంతా జగన్ను సోదరుడిలా భావిస్తున్నారని, మరో ముప్పై ఏళ్లు ఈ రాష్ట్రం జగన్ నాయకత్వంలో నడవాలని కోరుకుంటున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిన పురందేశ్వరితో కలిసి అబద్ధాల హామీలు, కుట్రలతో అధికారులను మార్చి రాష్ట్రంలో అశాంతిని రగిల్చారన్నారు. టీడీపీ అంటే తెలుగు డెకాయిట్స్ పార్టీ, తెలుగు దండుపాళ్యం పార్టీ, తెలుగు దొంగల పార్టీలా తయారైందన్నారు. నర్సీపట్నంలో, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మహిళలపైన, వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన ప్రజలపైనా దాడులు చేశారన్నారు. ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కుటుంబంలోని మహిళల పైనా ఇదే తరహా దాడులు చేయాలనే సంకేతాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బాబు హయాంలో మహిళల హత్య, దాడులు, విజయవాడలో కాల్మనీ రాకెట్లో మహిళలను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలు ప్రజలందరికీ తెలుసన్నారు. ఆడపిల్ల పుట్టుకను అవహేళన చేసిన హీనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన నేతలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుని మహిళలను రక్షించాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెంచాలని కల్యాణి కోరారు. -
కౌంటింగ్ ప్రక్రియకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట: జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు టేబుల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. టేబుల్స్ వివరాలు : ప్రతి అసెంబ్లీకి 14 టేబుల్స్, పార్లమెంటుకు 14 టేబుల్స్ చొప్పన ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తూర్పు, విశాఖ ఉత్తర, దక్షిణ, పశ్చి మ, గాజువాక, భీమిలి, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఏయూ ఆవరణలో నిర్వహించనున్నారు. ఏడు అసెంబ్లీలకు కలిపి మొత్తం 98 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పార్లమెంటుకు కూడా 98 టేబుల్స్ వేర్వేరు హాళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్కు ముగ్గుర్ని నియమిస్తున్నారు. సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంటు, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నారు. అలాగే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపునకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. 20 వేల ఓట్లు కోసం సుమారుగా 40 టేబుల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ టేబుల్స్ పార్లమెంటుకు, అసెంబ్లీకి వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సర్వీసెమెన్ కోసం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ అన్ని పోస్టు ద్వారా వస్తున్నాయి. జిల్లాలో నాలుగు వేల వరకు పోస్టల్ బ్యాలెట్ వచ్చే అవకాశం ఉంది. వీటి కోసం 15 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం మీద 291 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్కు ముగ్గురు చొప్పన 873 మంది సిబ్బంది అవసరం ఉంటుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement