-
వెయ్యేళ్ల విగ్రహాలు.. చరిత్రకు సాక్ష్యాలు
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులో వెయ్యేళ్ల నాటి దేవతల రాతి విగ్రహాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. కాకతీయుల కాలం నాటి చరిత్రకు ఆనవాళ్లుగా రాతి శిల్పాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నాలుగు నూర్ల గుడులతో నగునూరుగా మారిన ఈ గ్రామంలో ఇంకా రాతి విగ్రహాలు బయటపడుతుండటం విశేషం. స్థానికుల కథనం ప్రకారం.. నగునూరు పంచాయతీ పరిధి పాపగారిపల్లె గుట్టపై పురాతన విగ్రహాలున్నాయనే సమాచారంతో కొందరు హనుమాన్ దీక్షాపరులు శనివారం గుట్టపైకి వెళ్లారు. ఒక పెద్ద బండపై నాలుగు చేతుల్లో ఢమరుకం, త్రిశూలంతో ఉన్న శివుని విగ్రహం, నాట్యం చేస్తున్న దేవత విగ్రహంతోపాటు నాగదేవత శిల్పాలు కన్పించాయి. బండరాళ్లపై చెక్కిన ఈ విగ్రహాలకు హనుమాన్ భక్తులు రంగులు వేసి క్షీరాభిషేకం చేశారు. కాగా, ఈ ప్రాంతంలో గతంలో ఆలయం ఉండవచ్చనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
డీలర్ వద్దే విత్తనాలు కొనాలి
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ అనుమతి గల అధీకృత డీలర్ వద్దనే విత్తనాలు కొనాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. కొత్తపల్లి మండలం చింతకుంటలోని రైతు సంఘం సమావేశ మందిరంలో శనివారం విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాలు కొన్న సమయంలో బిల్లులు తీసుకోవాలని సూచించారు. బిల్లుపై కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నంబర్, లాట్ నంబర్, ధర ఉండేలా చూసుకోవాలన్నారు. విత్తన ప్యాకెట్పై తయారైన తేదీ, ఎక్స్పైరీ తేదీలను సరిచూసుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి విత్తనాలు విక్రయిస్తే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చింతకుంట రైతు సంఘం అధ్యక్షుడు ఎన్.శంకరయ్య, ఏఈవో రాము, రైతులు పాల్గొన్నారు. ఇయ్యాల నగరంలో పవర్ కట్కొత్తపల్లి: విద్యుత్ లైన్ల నిర్వహణ, తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ చౌక్ ఫీడర్ పరిధిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కశ్మీర్గడ్డ, ముకరంపుర ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.సుధీర్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీనివాస థియేటర్, షాషామహల్, పద్మశాలీ స్ట్రీట్, మధుగార్డెన్, ఆటోనగర్, కేబుల్ బ్రిడ్జి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని టౌన్–1 ఏడీఈ నరేందర్ వివరించారు. -
లక్ష్యం చేరేవరకు విశ్రమించొద్దు
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: లక్ష్యం చేరేవరకు విశ్రమించొద్దని కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు. కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్డులోని వీ–కన్వెన్షన్హాల్లో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం గంప వజ్రమ్మ మూడో విద్యాపురస్కార్ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3వేల నగదు, గోల్డ్ మెడల్ అందజేశారు. మంచిఫలితాలు సాధించిన విద్యార్థులకు వెంకట్ ఫౌండేషన్ సాయం చేయడం అభినందనీయమన్నారు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యం సాధించాలన్నారు. అనంతరం హెచ్ఎంలను సన్మానించారు. సివిల్స్ ర్యాంకర్లు నందాల సాయికిరణ్, కొలనుపాక సహన, ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్, వైస్ ప్రెసిడెంట్ జయరాములు, సెక్రటరీ సతీశ్కుమార్, ప్రతినిధులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కృషి మహిళల ఆర్థిక అభివృద్ధికి సర్కారు ప్రత్యేకంగా కృషి చేస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని భాగ్యనగర్, సరస్వతినగర్లో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు కేంద్రాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టే ప్రక్రియను పరిశీలించారు. దారం కట్ కాకుండా డబుల్ స్టిచ్చింగ్ చేసి, ఏడాది పాటు ఉండేలా యూనిఫామ్స్ తయారు చేయాలన్నారు. స్కూల్ పిల్లలకు అవసరమయ్యే జ్యూట్ బ్యాగులు తయారు చేయాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభం రాగానే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తామని తెలిపారు. ఇన్చార్జి మెప్మా పీడీ స్వరూపారాణి, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ అనిత తదితరులు పాల్గొన్నారు. -
తుమ్మేటి సమ్మిరెడ్డికి షోకాజ్
కరీంనగర్ కార్పొరేషన్/జమ్మికుంట: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్న జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజు నోటీసు జారీచేసింది. జమ్మికుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కసుబోజుల వెంకన్న, ఒల్లాల శ్రీనివాస్, ఎండీ సలీం, ఎండీ ఇమ్రాన్, ఎండీ సలీంపాషా, వాసాల రామస్వామిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబుపై ఉద్దేశపూర్వకంగా చేసిన విమర్శలు, కక్షపూరితంగా చేసిన అసందర్భ ఆరోపణలపై స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా అందిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ నాయకులపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఆదేశం మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలెకరీంనగర్రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు వచ్చేనెల 5 వరకు పూర్తిచేయాలని కరీంనగర్ రూరల్ మండల ప్రత్యేక అధికారి, జెడ్పీ సీఈవో ఎం.శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం మండలంలోని జూబ్లీనగర్లోని జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో చేపట్టిన పనులు పరిశీలించారు. హెచ్ఎంలు, ఏఏపీసీ చైర్మన్లతో సమీక్షించారు. ఆయా పాఠశాలల్లో 50 శాతం నుంచి 60 శాతం వరకు పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవరావు, ఎంఈవో మధుసూధనాచారి, ఐకేపీ ఏపీఎం భార్గవ్, పంచాయతీ కార్యదర్శి కిరణ్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కరీంనగర్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈవో జగన్మోహన్రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఫస్టియర్ జనరల్లో 1,941 మంది విద్యార్థులకు 178 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. వొకేషనల్లో 115 మంది విద్యార్థులకు 16 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. సెకండియర్ జనరల్లో 273 మందికి 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 74 మంది విద్యార్థులకు ఆరుగురు గైర్హాజరయ్యారు. అనుమతి లేకుండా స్కూళ్లు ప్రారంభించొద్దు కరీంనగర్: ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రై వేట్ యాజమాన్యాలు కొత్తగా పాఠశాలలు ప్రా రంభించవద్దని డీఈవో జనార్దన్రావు ప్రకటనలో తెలిపారు. అనుమతి ఉత్తర్వులు లేకుండా ప్రచారం చేయొద్దని సూచించారు. హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్రోచర్స్తో ప్రచా రం చేయొద్దని, ఆన్లైన్, ఆఫ్లైన్లో కానీ ప్రచా రం నిర్వహించొద్దని సూచించారు. నిబంధనల కు విరుద్ధంగా పాఠశాలలను ప్రారంభిస్తే చట ్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుల ఆహ్వానంకరీంనగర్: టీఎస్డబ్ల్యూ ఆర్ జూనియర్ కళాశాలలో జనరల్–ఒకేషనల్ కోర్సుల్లో ఇంటర్ 2024–25 మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం అర్హతగల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈనెల 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు www.trwreir.ac.in లో ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిర్లక్ష్యంపై కొరడాకరీంనగర్: ‘అమ్మ’ ఆదర్శ పాఠశాల పథకంలో భా గంగా జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న పనుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఉపాధ్యాయులపై వి ద్యాశాఖ కొరడా ఝళిపించింది. ఎస్.ప్రభావతి, జెడ్పీ హెచ్ఎస్ ఉప్పురమల్యాల(గంగాధర), రాజేంద్రప్రసాద్, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ చిగురుమామిడి కాంప్లెక్స్, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం ఎంపీపీఎస్ హెచ్ఎం, ముదిమాణిక్యం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప నుల్లో నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని డీఈవో జనార్దన్రావు మెమోలు జారీ చేశారు. -
ఆలస్యం.. అవకాశం
● స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంతో అనర్హులకు ఊరట ● ఈ నెలాఖరుతో అనర్హత వేటు గడువు పూర్తి ● ఉమ్మడి జిల్లాలో 5వేల మంది పోటీకి అవకాశంకరీంనగర్రూరల్: ‘ఆలస్యం అమృతం విషం’ అనే సామెత కొంతమందికి విషం కాగా.. రాజకీయ నాయకులకు మాత్రం అమృతంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో అనర్హతకు గురైన అభ్యర్థులు మళ్లీ పోటీచేసే అవకాశం కలిగించింది. లోక్సభ ఎన్నికల కారణంగా సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఆగస్టులో నిర్వహించే అవకాశముందనే సమాచారం అనర్హులకు ఆనందం కలిగిస్తోంది. ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. దీంతో వీరికి పోటీ చేసే అవకాశం కలుగుతోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1న ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగియనుంది. ఐదువేల మందిపై.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరూ తప్పనిసరిగా లెక్కలు చూపెట్టాలి. అయితే కొందరు సకాలంలో లెక్కలు అప్పగించకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులయ్యారు. 2019 జనవరిలో పంచాయతీ, మే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 1,212 పంచాయతీల్లోని సర్పంచులు, 12,045 మంది వార్డు సభ్యులు, 52 మంది జెడ్పీటీసీ సభ్యులు, 646 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాలి. అయితే ఖర్చుల నివేదికపై అవగాహన లేకపోవడంతోపాటు మరోసారి పోటీ చేయమనే ఆలోచనతో పలువురు అభ్యర్థులు లెక్కలు అప్పగించలేదు. అధి కారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో 2021 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 5,055 మందిపై అనర్హత వేటు పడింది. ఇందులో వార్డు మెంబర్ అభ్యర్థులు 4,228, సర్పంచ్ అభ్యర్థులు 410, ఎంపీటీసీ అభ్యర్థులు 387, జెడ్పీటీసీ అభ్యర్థులు 30 మంది ఉన్నారు. ఈ నెలాఖరుతో గడువు ముగింపు అనర్హత వేటుకు గురైన అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే అవకాశం కలిగింది. అనర్హత నోటీసులు జారీ చేసినప్పటి నుంచి మూడు సంవత్సరాలు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. వార్డుసభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఈ నెలాఖరుతో అనర్హత వేటు కాలం ముగుస్తోంది. షెడ్యూల్ ప్రకారం సర్పంచు ఎన్నికలు నిర్వహిస్తే అనేకమంది పోటీచేసే అవకాశం కోల్పోయేవారు. లోక్సభ ఎన్నికల నిర్వహణతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టులో నిర్వహించే అవకాశముండటంతో నిషేధం గడువు తీరిపోయి అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే అదృష్టం కలిసివచ్చింది.ఉమ్మడి జిల్లాలో అనర్హుల వివరాలు జిల్లా వార్డు సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కరీంనగర్ 1,295 115 145 07 జగిత్యాల 1,348 153 116 10 పెద్దపల్లి 1,104 96 79 10 రాజన్న సిరిసిల్ల 481 46 47 03 -
సిటీలో చెత్త కనిపించొద్దు
● వారం రోజుల్లో పరిస్థితిలో మార్పురావాలి ● విధులను విస్మరిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్లకు మెమో ● అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కరీంనగర్ కార్పొరేషన్: ‘వారం రోజుల్లోగా పారిశుధ్యం మెరుగు పడాలి...ఎక్కడా చెత్తాచెదారం కనిపించొద్దు..సిటీ క్లీన్గా మారాలి...లేదంటే చర్యలు తప్పవు’ అంటూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. శనివారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో అధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. రెండురోజుల క్రితం తాను పర్యటించిన సమయంలో నగరంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందన్నారు. అప్పుడు క్షేత్రస్థాయిలో లేని శానిటరీ ఇన్స్పెక్టర్లందరికీ మెమో జారీ చేయాలని కమిషనర్ను ఆదేశించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించాలని, రోడ్లపై చెత్త కనిపించొద్దని ఆదేశించారు. రోడ్లపై చెత్తవేసే వారికి జరిమానా విధించాలన్నారు. మున్సిపల్ చెత్తను, హాస్పిటల్స్ వ్యర్థాలను కలవకుండా, హానికర చెత్తను సురక్షితంగా డిస్పోజ్ చేయాలన్నారు. వారంరోజుల్లోగా నగరం శుభ్రంగా ఉండాలని, ముందుగా మేజర్ డ్రైనేజీల్లో పూడిక తీయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ నరేశ్, శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్, పర్యావరణ ఇంజినీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
మీ సేవలు చాలిక!
‘నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్ల కీలక బాధ్యతలను గతంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమితులైన వారు బిల్కలెక్టర్లుగా ఉద్యోగాలు నిర్వర్తించేవారు. నగరపాలకసంస్థ కావడంతో కోట్ల రూపాయల పన్నుల వసూళ్లు చేయాల్సి ఉండేది. వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి రూ.లక్షల్లో పన్ను వసూలు జరిగేది. అయితే పలువురు ఔట్సోర్సింగ్ బిల్కలెక్టర్లు పన్నుల వసూళ్లలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో ఒక్కోసారి బల్దియా ఉన్నతాధికారులు ఇరుకునపడిన ఉదంతాలూ ఉన్నాయి.’’‘నగరంలోని రేకుర్తిలో నకిలీ పత్రాలతో భూకబ్జాకు పాల్పడిన నిందితులకు సహకరించారనే అభియోగంపై గత నెలలో నగరపాలకసంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్తో పాటు, బిల్కలెక్టర్ రాజులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ వ్యవహారంలో ఆర్ఐ శ్రీకాంత్ను సస్పెండ్ చేయగా, ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న బిల్కలెక్టర్ రాజును నగరపాలకసంస్థ నుంచి తొలగించి.. వారధికి సరెండర్ చేశారు.’’ -
వైభవం.. నృసింహుని రథోత్సవం
ధర్మారం(ధర్మపురి): ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఎం అశోక్కుమార్కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఎం(ఎమ్మార్టీ), ఇన్చార్జి డైరెక్టర్(హెచ్ఆర్డీ) బి.అశోక్కుమార్ ఆదేశించారు. రేకుర్తి, బొమ్మకల్, కొత్తపల్లి, గంగాధర 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వర్షాకాలానికి ముందే విద్యుత్ లైన్లు సరిచేయాలన్నారు. తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగించాలని సూచించారు. సబ్స్టేషన్లు, లైన్ల నిర్వహణ తనిఖీ చేయాలని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లలో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జిల్లా స్టోర్స్కు వెళ్లకుండా ఆన్లైన్లోనే అవసరమైన పరికరాలను ఆర్డర్ చేయాలని తెలిపారు. టౌన్ డీఈ జె.రాజం, డీఈ(ఎమ్మార్టీ) కె.కాళిదాస్, కరీంనగర్ రూరల్ ఏడీఈ కొలుపుల రాజు, ఏఈలు శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. మెరుగైన సేవలు అందించాలి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ గంగాధర్ సూచించారు. కరీంనగర్లోని విద్యుత్ భవన్లో కరీంనగర్ –1, 2 సబ్ డివిజన్ల సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ టౌన్ డీఈ జె.రాజం, ఏడీఈలు నరేందర్, సుధీర్కుమార్, ఏఏవోలు సత్యనారాయణ, సుల్తాన్ రవి, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
హుజూరాబాద్లో ప్రైవేట్ క్లినిక్ల తనిఖీ
● తాళంవేసి పారిపోయిన యజమానులు హుజూరాబాద్: టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ నరేశ్ కుమార్, రాజ్కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం హుజూరాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. టీఎస్ఎంసీ చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల ఓ కంటి వైద్య శిబిరంలో సుమారు 400మందికి చుక్కలమందు వేసి పొరలు తీసివేసినట్లు వీడియో వైరల్ కావడంతో సదరు చికిత్స కేంద్రాన్ని తనిఖీ చేశారు. నిర్వాహకుడు ఆయుర్వేద వైద్యవిద్య, నాచురోపతీలో ఓపెన్ డిగ్రీ చేసినట్టుగా సర్టిఫికెట్లు చూపించాడు. కాగా ఆయుర్వేద కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కానీ, ఆ చికిత్స కేంద్రానికి జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి అనుమతులు లేవని గుర్తించారు. హుజూరాబాద్లోని మార్కెట్రోడ్లో ఉన్న సంజీవని పాలిక్లినిక్, శ్రీరామ పాలిక్లినిక్, సూర్య పాలిక్లినిక్ల్లో తనిఖీ చేశారు. అనుమతి లేని సెంటర్లను సీజ్ చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి సిఫార్సు చేయనునున్నట్లు తెలిపారు. టీఎస్ఎంసీ వైద్యబృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు తమ క్లినిక్లకు తాళాలు వేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ వెంకట్రెడ్డి, హెచ్ఆర్డీఏ సెక్రటరీ శరణ్సాయి, పసుల గౌతం పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ పమేలా సత్పతిహుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్/మానకొండూర్: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రయివేటు ఆస్పత్రులకు ధీటుగా సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం హుజూరాబాద్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రతీ వార్డును పరిశీలించారు. దాదాపు రెండు గంటల పాటు ఆస్పత్రిలో పర్యటించారు. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. డయాలసిస్ కేంద్రం, ఆపరేషన్ థియేటర్, మందులు నిల్వ ఉంచే గది, మెటర్నిటీ వార్డు, లేబర్రూంతో పాటు, పలు వార్డులను తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలని సూచించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్ను పరిశీలించి రోజుకు ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. దాదాపు 500 మందికి పరీక్షలు చేస్తున్నామని సిబ్బంది వివరించారు. ఇంక్యూబేటర్ గదిని సందర్శించారు. డిప్యూటీ డీఎంహెచ్వో చందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో సునీత, వైద్యులు శ్రీకాంత్రెడ్డి, వాణిలత, సోమశేఖర్ పాల్గొన్నారు. సౌకర్యాలు కల్పించాలి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజూరాబాద్ మండలం రాజావల్లి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. వాష్ రూముల్లో టైల్స్ వేయించాలని సూచించారు. పాఠశాలలోని ఖాళీస్థలంలో పండ్లు, పూల మొక్కలు పెంచాలన్నారు. మానకొండూరులోని రుద్రమ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు అందించే యూనిఫాం మన్నికగా కుట్టించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలు కుడుతున్న యూనిఫాంలను పరిశీలించారు. జూన్ 5లోపు విద్యార్థులకు డ్రెస్లను అందించాలని, అవసరమైన ఖర్చులను తాను అందిస్తానని తెలిపారు. డీఆర్డీవో శ్రీధర్, ఏపీఎం నిరంజన్, సంతోష్ పాల్గొన్నారు. -
ప్రణాళికతో ముందుకెళ్తేనే లాభాలు
● వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మంజులత కరీంనగర్ అర్బన్: అన్నదాతలు ప్రణాళికతో ముందుకెళ్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధానశాస్త్రవేత్త డాక్టర్ జి.మంజులత చెప్పారు. శుక్రవారం కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తన మేళా నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో ఏటా మే 24న రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి బి.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులందరూ విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనుము, జీలుగ సాగుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరికొయ్యలను తగలబెట్టవద్దని సూచించారు. నాణ్యమైన విత్తనాలు సాగుచేసి అధికదిగుబడి పొందాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డి.శ్రావణి, జి.ఉషారాణి, ఎ.విజయభాస్కర్, పి.మధూకర్ రావు, జిల్లా ఏరువాక కేంద్రం కరీంనగర్ కోఆర్డినేటర్ కె.మదన్ మోహన్ రెడ్డి, ఎం.రాజేంద్రప్రసాద్, ఆత్మ పీడీ ప్రియదర్శిని, తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్, విత్తన ధ్రువీకరణ ఆఫీసర్ కీర్తన తదితరులు పాల్గొన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలివిద్యానగర్(కరీంనగర్): మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని.. ఆమేరకు బ స్సులు అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలోని మీటింగ్ హాల్లో జోన్పరిధిలోని రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లతో రివ్యూ నిర్వహించారు. అవసరమైతే వెంటనే మరమ్మతులు చేసి బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలన్నా రు. ఆర్టీసీకి ఆదాయం సమకూరేలా సిబ్బంది చూడాలన్నారు. రీజనల్ మేనేజర్లు సోలమన్, వెంకన్న, శ్రీలత, జానిరెడ్డి, ఎన్. సుచరిత, డిప్యూటీ రీజ నల్ మేనేజర్లు, కె.సత్యనారాయణ, ఎస్.భూపతిరెడ్డి, భానుకిరణ్, మాధవరావు, సరస్వతి, పవిత్ర, ప్రణీత్, శ్రీప్రవీణ్, సుగుణాకర్, స్వప్నకుమారి, విలాస్ రెడ్డి, ఈడీ సెక్రటరీ కె.యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇవ్వాళ 2.30 గంటల పాటు సిటీలో కరెంట్ కట్కొత్తపల్లి: చెట్లకొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల నిర్వహణ, విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు సిటీలో పలుఏరియాల్లో కరెంట్ ఉండదని ఏడీఈ సుధీర్ కుమార్ తెలిపారు. 11 కేవీ తెలంగాణ చౌక్ ఫీడర్ పరిధిలోని గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, కశ్మీర్గడ్డ, ముకరంపుర ప్రాంతాల్లో సరఫరా ఉండదని టౌన్ 2 ఏడీఈ వివరించారు. ముగిసిన పాలిసెట్సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం జిల్లాలో నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,766 మంది విద్యార్థులకు గానూ 3,428మంది విద్యార్థులు హాజరయ్యారు. 338 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పాలిసెట్ కో– ఆర్డినేటర్ అప్పారావు తెలిపారు. -
● కీలక బాధ్యతల నుంచి ‘ఔట్’ సోర్సింగ్ ● సీడీఎంఏ ఆదేశాలతో చర్యలు ● బల్దియాలో 11 మందికి స్థానచలనం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో ఎక్కడ అవినీతి, అక్రమాలు వెలుగు చూసినా...అందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులపాత్ర తప్పకుండా కనిపిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిన నియామకమైన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కొంతమంది అవినీతి, అక్రమాలకు పాత్రదారులుగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి, అవినీతి, అక్రమాలు నిరూపణ అయినా, తాము పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదనే భావన చాలామందిలో ఉందని విమర్శలున్నాయి. అంతేకాకుండా ఉన్నన్ని రోజులు సంపాదించుకొని వెళ్లాలనే ధోరణితో మరికొంతమంది ఉన్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇక కొంతమంది అధికారులు అక్రమ సంపాదనకు నమ్మకస్థులైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులనే ఎంచుకుంటున్నారనేది బహిరంగరహస్యం. రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ లేనందున, సేవలకు అంతరాయం కలగరాదనే ఉద్దేశంతో ఏర్పడిన ఔట్సోర్సింగ్ విధానం, క్రమక్రమంగా కలెక్షన్లకు దగ్గరిదారిగా మారింది. కీలక బాధ్యతల నుంచి ఔట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఆయా మున్సిపాల్టీల్లో అక్రమాలకు ఎక్కువగా బాధ్యులుగా తేలుతుండడం, పలు మున్సిపాల్టీల కమిషనర్ల నివేదికల ఆధారంగా కీలక బాధ్యతల నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీడీఎంఏ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలతో నేరుగా సంబంధాలుండే రెవెన్యూ విభాగానికి ఈ ఉత్తర్వులను ప్రస్తుతానికి పరిమితం చేశారు. పురపాలక, నగరపాలకసంస్థల రెవెన్యూ విభాగంలో కలెక్షన్ బాధ్యతలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించొద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 11 మందికి స్థానచలనం కరీంనగర్ నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 11 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కీలకమైన బిల్కలెక్టర్ల బాధ్యతల నుంచి తప్పించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో అక్రమాలకు అవకాశం ఎక్కువగా ఉండడంతో నగరపాలకసంస్థ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. అంతకుముందు ఈ 11 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బిల్కలెక్టర్లుగా విధులు నిర్వర్తించారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మే ర కు వీరిని తప్పించి రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు. ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ బిల్కలెక్టర్లకు సహాయకులుగా నియమించారు. మిగతా విభాగాల్లోనూ... నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో కీలక బాధ్యతల నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తప్పించినట్లుగానే ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై దృష్టి సారించాల్సి ఉంది. నగరపాలకసంస్థలో దాదాపు అన్ని విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కొంతమంది కీలక బాధ్యతలు, ఎక్కువగా కంప్యూటర్ ఆపరేటర్స్గా విధులు సాగిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆయా విభాగాల్లో అక్రమాలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులే బాధ్యులుగా కనిపిస్తున్నారు. సూత్రధారులు వేరైనా పాత్రధారులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఉంటున్నారు. -
ఉపాధి లేదా?
ఆక్వాహబ్ రాదా?● చీర్లవంచ, చింతల్ఠాణా వద్ద భూకేటాయింపు ● ఆసక్తి చూపిన మూడు కంపెనీలు వెనక్కి ● అగమ్యగోచరంగా రూ.102 కోట్లు, 365 ఎకరాలు ● అసలు ప్రాజెక్టే ఉండకపోవచ్చంటున్న బీఆర్ఎస్ నేతలు ● 23 వేలమందికి ఉపాధి కల్పన కలే!ఆ కంపెనీలు వెనక్కే? ఆక్వా హబ్ పార్క్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఫిషింగ్ ఇండియా, ఆనంద్ గ్రూప్స్, ఫ్రెష్ టు హోమ్ సంస్థలు ఆసక్తి చూపాయి. కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వీలుగా 194 ఎకరాలు ప్లాటింగ్, 79 ఎకరాల్లో పచ్చదనం, రోడ్ల కోసం 31 ఎకరాలు, సామాజిక సదుపాయాల కింద 14 ఎకరాలు కేటాయించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా తంగళపల్లి నుంచి 120 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలిదశలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం.. మరిన్ని కంపెనీలు హబ్లో కొలువు దీరితే.. తొలిదశలో దాదాపు 5,000 మందికి, ప్రాజెక్టు పూర్తయ్యాక దాదాపు 17,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. అందులోనూ తొలుత మిడ్మానేరులోని ముంపుగ్రామాలకు.. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా యువతకు కొలువుల్లో ప్రాధాన్యం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ప్రాజెక్టు ఇక రద్దయినట్లేనని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తుండటంతో స్థానిక యువతలో తీవ్ర నిరాశ ఆవహించింది.సాక్షిప్రతినిధి, కరీంనగర్: గత ప్రభుత్వం సిరిసిల్లలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్వా హబ్ రద్దయ్యిందా? దాదాపు 23 వేల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా దేశీయ, బహుళజాతి కంపెనీలను సిరిసిల్లకు ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇక అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో మిడ్మానేరులో నీటి లభ్యత, స్థానిక వాతావరణం ఆక్వా హబ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన(టీఎస్ ఐఐసీ) ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలంలో 365 ఎకరాల భూ సేకరణ, ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అధ్యయనం కూడా పూర్తిచేసింది. కానీ.. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు కోసం సిద్ధం చేసిన రూ.102 కోట్లు. 365 ఎకరాల కేటాయింపులు అగమ్యగోచరంగా మారాయి. ఎక్కడ నిర్మించతలపెట్టారు? దాదాపు రూ.102.9 కోట్ల వ్యయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్ఠాణాలోని ముంపు గ్రామాల్లో ఆక్వా హబ్ ఏర్పాటు చేయాల్సింది. దీనిపై ఇప్పటికే సర్వే పూర్తిచేసిన అధికారులు.. భూకేటాయింపులు కూడా జరిపారు. రెండు గ్రామాల పరిధిలో 365 ఎకరాలు ఇందుకోసం కేటాయించారు. ఇవి మిడ్మానేరు ముంపు గ్రామాలు కావడం, గోదావరి బేసిన్లో మిడ్మానేరు ఉండటం, కాళేశ్వరం నుంచి నిరంతరం నీటిని ఎత్తిపోసే సౌలభ్యం ఉండటంతో టీఎస్ ఐఐసీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యూహాత్మకంగా ఈ రెండు గ్రామాలను ఎంపిక చేసింది. ఆక్వా రంగంలో సత్తా చాటాలకునే కంపెనీలకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి భూమి, రోడ్లు, విద్యుత్, నీరు, వ్యర్థాల నిర్వహణ తదితర సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. అప్పటికే ఇక్కడ ఫిషింగ్ ఇండియా, ఆనంద్ గ్రూప్స్, ఫ్రెష్ టు హోమ్ సంస్థలు కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. మత్స్య పరిశ్రమ ఏర్పాటై ఉండేది. ప్రభుత్వం మారడంతో టీఎస్ ఐఐసీ, స్థానిక కలెక్టర్, అధికారులెవరూ ప్రాజెక్టు మనుగడపై ఇంతవరకూ ప్రకటన చేయలేదు. బంజరు భూమి, కొండ ప్రాంతాలు.. వాస్తవానికి చీర్లవంచ, చింతల్ఠాణా రెండూ ముంపుగ్రామాలే. ముంపు పోను రెండు గ్రామాల్లో మిగిలిన సర్వే నంబర్లు 224, 225, 226, 310, 613, 614, 698, 699, 701, 702, 704, 715, 718, 719లోని 365 ఎకరాలను ఈ పరిశ్రమ నిర్మాణానికి కేటాయించారు. ఇందులో అధికశాతం బంజరుభూమి, కొండ ప్రాంతం. అందుకే, ఇక్కడ ఆక్వా హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆక్వా హబ్కు ప్రతీరోజు 15.52 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటిని అందించాలనుకున్నారు. పరిశ్రమల నుంచి 10.8 ఎంఎల్డీ రిసైకిల్డ్ వాటర్ విడుదలవుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా నీటి వ్యర్థాల శుద్ధికి 13 ఎంఎల్డీల సామర్థ్యంతో భారీ ఎస్టీపీ, ఇక ఘన వ్యర్థాలు, ఎలక్ట్రిక్వ్యర్థాల నిర్వహణను టీఎస్ ఐఐసీ చూసుకుంటానంది.నీరులేక మిడ్మానేరు వెలవెల సిరిసిల్ల ఆక్వాహబ్పై నీలినీడలు -
గుండెపోటుతో 104 కాంట్రాక్టు డ్రైవర్ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలో 104 కాంట్రాక్టు డ్రైవర్గా పనిచేస్తున్న కొక్కుల రాజ్కుమార్(47) గుండెపోటుతో చనిపోయాడు. శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో విధులకు హాజరైన రాజ్కుమార్ స్పృహతప్పి కింద పడిపోవడంతో తోటి ఉద్యోగులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుండపోటుతో చనిపోయాడని నిర్ధారించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్కు చెందిన రాజ్కుమార్ జగిత్యాల 104 విభాగంలో కాంట్రాక్టు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి కొద్ది రోజులుగా డీఎంహెచ్వో కార్యాలయంలో విధులు కేటాయించారు. శుక్రవారం ఉదయం కార్యాలయంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా తోటి ఉద్యోగులు జగిత్యాల ప్రభు త్వ ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలిసిన రాజ్కుమార్ బంధువులు, తోటి కాంట్రాక్టు ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు. ఆరునెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో పాటు రాజ్కుమార్కు వారం, పదిరోజులుగా విరామం లేకుండా విధులు కేటా యించాడంతో అస్వస్థతకు గురయ్యాడని తెలిపా రు. డీఎంహెచ్వో కాంట్రాక్టు ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ కారణంగానే రాజ్కుమార్ గుండెపోటుతో చనిపోయాడని ఆందోళన చేపట్టారు. రాజ్కుమార్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్వో వేధింపులే కారణమని ఆందోళన న్యాయం చేయాలని కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగుల డిమాండ్ -
ఎల్లమ్మ గుడికి తాళం వేసిన వారిపై ఫిర్యాదు
శంకరపట్నం: మండలంలోని కరీంపేటలో ఎల్లమ్మ గుడిలోపలికి దళితులను ప్రవేశించకుండా తాళం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ అనుపమ, ఎస్సై లక్ష్మారెడ్డికి దళితులు గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఎల్లమ్మ గుడిలోనికి మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయానికి వెళ్లగా లోనికి వెళ్లకుండా గౌడ కులస్తులు గుర్రం భిక్షపతి, గుర్రం తిరుపతి, తాళం వేశారని, తాళం ఎందుకు వేశారని ప్రశ్నించగా గుడిని మేమే కట్టించుకున్నాము, గుడి ఎదుట కొబ్బరి కాయలు కొట్టుకోవాలని సమాధానం ఇచ్చారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో సముద్రాల సంపత్, భద్రయ్య, శ్రీనివాస్, నర్సయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రేచపల్లిలో శ్రీగంధం తోట దగ్ధంసారంగాపూర్: మండలంలోని రేచపల్లిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీగంధం చెట్లు శుక్రవారం ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఎడమల తిరుపతిరెడ్డి, పాకాల నడిపి నర్సయ్య, పాకాల చిన్నమల్లయ్య వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ ముగ్గురూ శ్రీగంధం చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు. తిరుపతిరెడ్డి తన మూడు ఎకరాల విస్తీర్ణంలో 900 చెట్లను నాటాడు. పాకాల నడిపినర్సయ్య, చిన్నమల్లయ్య రెండు ఎకరాల్లో చెట్లను పెంచుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని, ముగ్గురికి చెందిన చెట్లు కాలిపోయాయి. తిరుపతిరెడ్డికి రూ.15 లక్షల వరకు, నర్సయ్య, మల్లయ్యలకు రూ.15లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపారు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని వ్యక్తి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలోని మిషన్ కంపౌండ్ ప్రాంతానికి చెందిన కొయ్యాల రతన్రాయల్(58) అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించడం లేదని శుక్రవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2021లో రతన్రాయల్ వైజాగ్ షిప్యార్డ్లో కర్ర శ్రీనివాసమూర్తితో పనిచేశాడు. రతన్రాయల్ భార్య కొయ్యాల విజయశీల పేరిట కర్ర శ్రీనివాసమూర్తి మంచిర్యాలలో ఉన్న భూమిని మార్టిగేజ్ చేసి దశలవారీగా రూ.45 లక్షలు అప్పు తీసుకున్నాడు. కొద్దిరోజులుగా అప్పు చెల్లించకపోవడంతో పాటు, మార్టిగేజ్ చేసిన భూమిని వీరికి తెలియకుండా ఇతరులకు విక్రయించాడు. మనస్తాపానికి గురైన రతన్రాయల్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య విజయశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
నాణ్యమైన విత్తనాలతో దిగుబడి
జగిత్యాలఅగ్రికల్చర్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధనస్థానంలో శుక్రవారం విత్తనమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒకసారి విత్తనం తీసుకెళ్లి, ఆ పంట నుంచి విత్తనాలు తయారు చేసుకోవాలని సూచించారు. రైతులు సంఘాలుగా ఏర్పడితే, పరిశోధన స్థానం నుంచి బ్రీడర్ సీడ్ ఇచ్చి ప్రోత్సహిస్తామని అన్నారు. సంఘాల్లోని రైతులు బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్, ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ తయారు చేసి విక్రయిస్తే, సంఘాలతో పాటు రైతులు అభివృద్ధి చెందుతారని సూచించారు. ప్రతీ విత్తనానికి మార్కెట్పై ఆధారపడటం మంచిది కాదన్నారు. పరిశోధనస్థానంలో శాస్త్రవేత్తలు కొద్ది మొత్తంలో మాత్రమే విత్తనం తయారు చేస్తారని, అది సైతం అభ్యుదయ రైతులకే ఇస్తామని అన్నారు. ఒక్కసారిగా విత్తనమేళాకు భారీగా రైతులు రావడంతో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ, రైతులకు తలాఒక్కటి, రెండు చొప్పున వరి విత్తనాలు విక్రయించామని అన్నారు. ఈ సందర్భంగా వరి శాస్త్రవేత్త శ్రీనివాస్ విత్తన రకాలు, లక్షణాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీలక్ష్మి, గోన్యానాయక్, పద్మజ, రవి, రజనీదేవీ పాల్గొన్నారు. పొలాస పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ విత్తన మేళాకు విశేష స్పందన -
పోలీసులకు పట్టుబడిన బ్యాగుదొంగ?
జగిత్యాలక్రైం: ఈనెల 20న కరీంనగర్కు చెందిన వందన అనే మహిళ కరీంనగర్ బస్టాండ్లో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగుతో బస్సు ఎక్కి ప్రయాణిస్తుండగా సినీఫక్కీలో బ్యాగును గుర్తుతెలియని దొంగ చోరీ చేశాడు. బంగారం చోరీ అయిందని కోరుట్ల, జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో సదరు మహిళ జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించింది. దీంతో ఈనెల 21న శ్రీసాక్షిశ్రీలో శ్రీబస్సులో ఆభరణాల బ్యాగు చోరీశ్రీ అనే శీర్షికన వార్త ప్రచురితం కాగా, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించారు. మెట్పల్లి మండలం ఆరెపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని, సొత్తు కూడా రికవరీ చేసి విచారణ చేపట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దివ్యాంగులకు శిక్షణ సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని శారీరక, బంధిర, అంధ విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి ఎంసెట్లో శిక్షణ ఇస్తామని జిల్లా సంక్షేమాధికారి సరస్వతి తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 7జీపీఏ లేదా ఆపై గ్రేడ్ సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 30లోగా ఈ పాస్ వెట్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తొలిజాబితాలో ఎంపికై న విద్యార్థుల జాబితాను జూన్ 3న వెబ్సైట్లో పొందుపర్చుతారని, ధ్రవీకణపత్రాల ఆధారంగా జూన్ 6న తుది జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారని ఆమె వివరించారు. -
10న రాష్ట్రస్థాయి సదస్సు
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు కరీంనగర్కల్చరల్: హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూన్ 10న రాష్ట్రస్థాయి ఉపాధిహామీ సదస్సు నిర్వహిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు తెలిపారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో శుక్రవారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి సీతక్క, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ సదస్సుకు హాజరవుతారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చుతోందన్నారు. ఈజీఎస్ కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజూ రూ.600 కూలి చెల్లించాలని, ఏడాదిలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని, పనిచేసే చోట నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలని, మెడికల్ కిట్లు, పనిముట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంల అనేకమంది పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారని, వాటికి పట్టాలిచ్చి స్థలాలు రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అందులో డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గన్నేరం నర్సయ్య, మాతంగి శంకర్, రాయికంటి శ్రీనివాస్, చిలకబాబు, సుంకరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
కాసుల కోసం తనిఖీలు
కోరుట్ల: రెండు రోజుల క్రితం.. కోరుట్ల సెగ్మెంట్లోని మూడు ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేపట్టడం స్థానికంగా కలకలం రేపింది. కోరుట్ల పట్టణంలోని రెండు ఇళ్లు, మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో మరో ఇంటిలో పోలీసులు తనిఖీ చేయడం చర్చనీయంగా మారింది. ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బుల డంప్లు మిగిలి ఉన్నట్లుగా వచ్చిన సమాచారంతో తనిఖీలు చేశారని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా, మరోవైపు హవాలా డబ్బుల కోసం కావచ్చనే పుకార్లు జోరందుకున్నాయి. అయితే మూడు ఇళ్లల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఎలాంటి నగదు దొరకలేదు. సమాచారం ఆలస్యమా ? పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు జోరుగా డబ్బులు పంపిణీ చేశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో అప్పటి డబ్బులు అట్టపెట్టెల్లో ఉంచి దాచి ఉంచారన్న సమాచారం పోలీసులకు ఎన్నికలు ముగిసిన తర్వాత అందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతస్థాయి పోలీసు అధికారుల నుంచి అందిన సమాచారాన్ని ధ్రువీకరించే క్రమంలో పోలీసులు మూడు ఇళ్లల్లో ఒకే సమయంలో తనిఖీలు నిర్వహించినా ఎలాంటి నగదు దొరకలేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించిన మూడు ఇళ్లల్లో ఒకటి కోరుట్లలోని సాయిరాంపురా కాలనీలో నివసించే కాంగ్రెస్ సేవాదళ్ నాయకునిది కాగా, మరొకటి కోరుట్ల పోలీస్స్టేషన్ వెనకబాగంలో ఉండే వ్యక్తిది కావడం గమనార్హం. మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో పోలీసులు తనిఖీలు చేసి ఇంటి యజమాని ఓ రైతుగా తెలిసింది. ఈ మూడు ఇళ్లల్లో డబ్బులు ఉన్నాయన్న సమాచారం తప్పు అని పోలీసుల తనిఖీల్లో తేలింది. లెక్కలేని కాసుల మాట ఉత్తిదే.. పోలీసులు తనిఖీలు చేసిన ఇళ్లల్లో లెక్కలేని డబ్బులు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. పోలీసులకు వచ్చే సాధారణ సమాచారంలో భాగంగా ఆయా ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బులు దొరకలేదు. ఓ ఇంట్లో ఒకటి, రెండు ప్రామిసరీ నోట్లు, మరో ఇంట్లో రూ.4వేలకు పైగా నగదు దొరకడంతో తమకు వచ్చిన సమాచారం తప్పు అని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయమై కోరుట్ల సీఐ సురేష్బాబు మాట్లాడుతూ.. పోలీసులు తనిఖీల్లో డబ్బులు దొరికాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఎన్నికల డబ్బు పేరిట కలకలం తప్పుడు సమాచారమా ? తనిఖీల్లో దొరకని నగదు -
ఆవు, లేగదూడ విక్రయించిన పూజారిపై ఫిర్యాదు
చందుర్తి(వేములవాడ): మండలంలోని నర్సింగపూర్–మోహినికుంట శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి ఓ భక్తులు ఇచ్చిన ఆవు, లేగదూడను పూజారి భద్రయ్య విక్రయించారని దేవాదాయ, ధర్మదాయశాఖ సహాయ కమిషనర్కు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ నక్క గంగాధర్, సభ్యులు కాసారపు శ్రీనివాస్రెడ్డి, పెరుక గంగరాజు, చింతకుంట గంగాధర్, ఇల్లంతకుంట గణేశ్, కొత్త ఎల్లారెడ్డి, సంపునూరి దశరథం ఉన్నారు. -
విద్యుత్ అంతరాయంతో కోళ్లు మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పౌల్ట్రీ కోళ్లఫాంకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వెయ్యి కోళ్లు మృతిచెంది రూ.3లక్షల నష్టం వాటిల్లిన సంఘటన శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత పౌల్ట్రీరైతు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సద్ది రాజిరెడ్డికి గల పౌల్ట్రీఫామ్లో 4వేల కోళ్లు ఉన్నాయి. పౌల్ట్రీఫామ్కు సమీపంలోని విద్యుత్ స్తంభం వంగిపోగా.. దాన్ని మరమ్మతు చేసే క్రమంలో విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ విషయం పౌల్ట్రీరైతు రాజిరెడ్డికి తెలపలేదు. వరుసగా నాలుగు గంటలు కరెంట్ నిలిచిపోవడంతో దాదాపు వెయ్యి వరకు కోళ్లు చనిపోయాయి. సెస్ అధికారులు ముందస్తు సమాచారం ఇస్తే ఫామ్ వద్ద జనరేటర్ ఏర్పాటు చేసుకునేవాడినని రాజిరెడ్డి పేర్కొన్నారు. తనకు భారీ నష్టం జరిగిందని విద్యుత్శాఖ అధికారులు ఇప్పించాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి పౌల్ట్రీఫామ్ను పరిశీలించి, బాధిత రైతును సెస్ సంస్థ ఆదుకోవాలని కోరారు. పౌల్ట్రీరైతుకు రూ.3లక్షలు నష్టం -
నమ్మించి.. నట్టేట ముంచి
వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన పూజారి మహేశ్ రూ.2కోట్లతో ఉడాయించిన ఘటనలో ఇరుక్కున్న బాధితులు బావురుమంటున్నారు. ఈనెల 4 నుంచి పూజారి ఆచూకీ కోసం నిత్యం అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తమ డబ్బులే కాకుండా బంధువులు, మిత్రుల వద్ద తీసుకొచ్చి మహేశ్కు అప్పగించామని, ఇప్పుడు వారికి తామే జవాబుదారీగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మంది మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించి జమానత్, ష్యూరిటీ సంతకాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్ప తమ సమస్యకు పరిష్కారం లభించేలా లేదని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఇప్పటికే బాధితుల గోడు విన్న పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి విచారణ ముమ్మరంగా చేపట్టారు. బావురుమంటున్న బాధితులు పోలీసులపైనే ఆశలు బంధువుల డబ్బులు పూజారికిచ్చి అవస్థలు -
నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి
జమ్మికుంట: వానాకాలంలో రైతులు నకిలీ విత్తానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్జీ అన్నారు. పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులను వ్యవసాయశాఖ ఏవో గోవర్దన్రెడ్డి, సీఐ వరగంటి రవితో కలిసి శుక్రవారం సందర్శించారు. అకౌంట్ రిజిస్టర్, ఇన్వాయిస్, కంపెనీ కొనుగోలు రశీదులుతోపాటు పలు అంశాలపై తనిఖీలు చేపట్టారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవాలని, తక్కువ ధరక వస్తున్నాయనే ఆశతో నకిలీ విత్తనాలు కొంటే పంట దిగుబడి తగ్గడంతోపాటు ఆర్థికంగా నష్టపోతారని, నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉందని, రైతులు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని, నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే స్థానిక పోలీస్స్టేషన్, వ్యవసాయ అధికారులు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్జీ -
మాస్టర్ స్విమ్మర్ మనోడే
సిరిసిల్లటౌన్: మాస్టర్స్ స్విమ్మింగ్ జాతీయస్థాయి పోటీల్లో జిల్లా వాసి నంబర్వన్గా నిలిచాడు. హైదరాబాద్లో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన జాతీయ మాస్టర్స్ గేమ్స్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. సిరిసిల్ల నుంచి చొప్పదండి శ్రీనివాస్ యాభై ఏళ్ల కేటగిరీలో పాల్గొన్నారు. 200 మీటర్స్ బ్యాక్స్ట్రోక్(ప్రథమ), 100 మీటర్స్ బ్యాక్స్ట్రోక్(ద్వితీయ), 50 మీటర్స్ బ్యాక్స్ట్రోక్(ద్వితీయ) బహుమతులు సాధించారు. జాతీయ స్థాయిలో రాణించిన శ్రీనివాస్ను బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, నాయకులు రెడ్డబోయిన గోపి, పత్తిపాక సురేశ్, గరిపెల్లి ప్రభాకర్ అభినందించారు. జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement