-
వంద పడకలుముందుకు సాగేనా?
పరకాల: పరకాల ప్రజల ఏళ్ల కల వంద పడకల ఆస్పత్రి నిర్మాణం. రెండేళ్ల కిందట రూ.35 కోట్ల నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంటున్న సమయంలో ప్రభుత్వం మారింది. బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రి నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. దీంతో చాలా మంది రోగులు మెరుగైన వైద్య సేవలందుకోలేకపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, ములుగు జిల్లాల్లోని వందలాది గ్రామాల నిరుపేద రోగులకు పరకాల సివిల్ ఆస్పత్రి పెద్ద దిక్కుగా ఉంటోంది. అంతేకాకుండా మహారాష్ట్రలోని నాలుగు జిల్లాకు చెందిన 20 మండలాల ప్రజలు పరకాల సివిల్ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. సేవల్ని విస్తరించేందుకు 30 పడకల ఆస్పత్రి నుంచి వంద పడకలకు అప్గ్రేడ్ చేయాలని అధికారులు 2014లో ప్రతిపాదనలు పంపారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం 2022లో రూ.35 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభమైనప్పటికీ బిల్లులు అందకపోవడం, కాంట్రాక్టర్ కాలయాపనతో పనులు నిలిచిపోయాయి. పెరిగిన రోగులు.. ప్రతీ పేద గర్భిణి ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించేలా చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నెలకు 20 నుంచి 30 వరకు ఇక్కడ ప్రసవాలు జరుగుతున్నాయి. దీంతో ఉన్న 30 పడకల్లో ప్రసూతి వార్డుకు 20 కేటాయించాల్సి వస్తోంది. మిగిలిన పదింటిని అత్యవసర, ఇతర వైద్య సేవలకు వినియోగించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రిలో స్థలం లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్ గది అనుసంధానంగా ఉన్న గదుల్లోనే ఎక్స్రే, ఫార్మసిస్ట్ స్టోరేజీ, వీసీటీసీ, పీపీఎం యూనిట్, ల్యాబ్ నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే అంతే సంగతి వెంటిలేటర్స్ సదుపాయం లేకపోవడంతో పరకాల సివిల్ ఆస్పత్రికి పురుగుల మందు తాగిన కేసులు వస్తే వారికి ప్రథమ చికిత్స చేసి పంపించడం తప్ప మరో మార్గం లేదు. దీంతో మందు తాగిన కేసులు ఎక్కువ శాతం వరంగల్ ఎంజీఎం లేదా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. పరకాల సివిల్ ఆస్పత్రిలో వంద పడకలు ప్రారంభమైతే ఇబ్బందులు తొలగిపోతాయి. గదుల కొరత ఉంది. సమస్యను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వాస్పత్రి వైద్య సేవలపై నమ్మకం పెరిగి రోగుల సంఖ్య పెరుగుతోంది. కొద్ది రోజుల్లోనే కొత్త భవనం నిర్మాణం పూర్తవుతుందని, సమస్య పరిష్కారమవుతుందనుకుంటున్నా. – గౌతమ్ చౌహాన్, సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, పరకాల నత్తనడకన ఆస్పత్రి భవన నిర్మాణం రెండేళ్లయినా ముందుకు సాగని పనులు 30 పడకలతో రోగులకు అవస్థలు బిల్లులు రాక కాంట్రాక్టర్ కాలయాపన -
పగలు ఎండ.. సాయంత్రం వర్షం!
జిల్లాలో వారం రోజులుగా ఇవే పరిస్థితులు కల్లాల్లో తడిసిముద్దవుతున్న ధాన్యం ఈదురుగాలులతో పండ్ల తోటలకు నష్టంహన్మకొండ : వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో పగలు ఎండలు మండుతుండగా.. సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతమవుతోంది. ప్రాంతాన్ని బట్టి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి. గురువారం, శుక్రవారం రాత్రి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురసింది. అకాల వర్షం రైతులను ఆగమాగం చేస్తోంది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దవుతోంది. మరోవైపు ఈదురుగాలులతో పండ్ల తోటలకు నష్టం వాటిల్లుతోంది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను జిల్లా ప్రణాళిక శాఖ విడుదల చేసింది. ఐనవోలులో 84.6 మిల్లీమీటర్లు, హనుమకొండలో 67.3, కాజీపేటలో 65.8, ఆత్మకూరులో 53.9, హసన్పర్తిలో 47.1, శాయంపేట 30.6, దామెరలో 30.4, ఎల్కతుర్తిలో 25.8, ధర్మసాగర్లో 20.7, నడికూడలో 26.2, భీమదేవరపల్లిలో 7.8, వేలేరులో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. నడికూడలో 37.3 మిల్లీమీటర్లు, వేలేరులో 18, దామెర మండలం పులుకుర్తిలో 16, హసన్పర్తి మండల చింతగట్టులో 6.5, హనుమకొండలో 4.8, ఎల్కతుర్తిలో 4, కమలాపూర్లో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండ -
ఉమ్మడి వరంగల్ ఓటర్లే కీలకం...
ఈ ఉప ఎన్నికలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు కీలకం కానున్నారు. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అభ్యర్థులు కాకతీయ యూనివర్సిటీ, ఉమ్మడి వరంగల్ పట్టభద్రులు కేంద్రంగా ప్రచారం నిర్వహించారు. 2021 ఎన్నికల్లో గెలుపొందిన పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,61,811 ఓట్లు రాగా, ఆ తర్వాత స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 1,49,005 ఓట్లు సాధించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్కు 71,126 ఓట్లు రాగా, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి (బీజేపీ) 39,306, రాములు నాయక్ (కాంగ్రెస్) 27,729 ఓట్లతో సరిపెట్టుకున్నారు. రెండో ప్రాధాన్యం ఓట్లతో పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొందగా.. ఆ పోలింగ్లో ఉమ్మడి వరంగల్ ఓటర్లు అత్యధికంగా ఓటుహక్కును వినియోగించుకున్నట్లు తేలింది. కాగా ఎన్నికల అధికారుల ప్రకటన మేరకు 12 జిల్లాల్లో మొత్తం 4,61,786 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 2,86,993, మహిళలు 1,74,788, థర్డ్జెండర్స్ ఐదుగురు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ మొత్తం ఓట్లలో అత్యధికంగా 1,67,849 మంది ఉమ్మడి వరంగల్లో ఉండగా.. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూడా ఇక్కడి ఓటర్లే కీలకం కానున్నారన్న చర్చ జరుగుతోంది. -
ఒకే ప్లాటు.. డబుల్ రిజిస్ట్రేషన్
పరకాల: ఒకే ప్లాటును డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన బాగోతం వెలుగులోకి రావడంతో కొనుగోలు చేసిన ఓ బాధితుడు పరకాలలో శుక్రవారం వినూత్న రీతిలో ఆందోళన చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పరకాలలోని భూపాలపల్లి రోడ్డులో ఉన్న డీపీఆర్ ఫంక్షన్హాల్ యజమాని డి.రవీందర్రావు 2013లో 186 గజాల ఒక ప్లాటును రెండు సర్వే నంబర్లతో ఇద్దరికి వేర్వేరుగా విక్రయించాడు. ఫంక్షన్హాల్ పక్కనే ఉన్న ఆ భూమి విలువ ఇప్పుడు పెరిగింది. దీంతో ఆ భూమి కొనుగోలు చేసిన పరకాలకు చెందిన కందుకూరి గిరి అమ్మకానికి పెట్టాడు. తనకు సంబంధం లేకుండా అమ్మే హక్కు మీకెక్కడిదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకకు చెందిన మరొక వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. అనారోగ్య కారణాలతో ఫంక్షన్హాల్ యజమాని కొంతకాలం క్రితం చనిపోవడంతో ఆయన కుమారులు ప్రేంచందర్రావు, రాజేశ్వర్రావును గిరి నిలదీశాడు. న్యాయం చేస్తామంటూనే కాలయాపన చేయడమే కాకుండా భూమి కావాలంటూ వేధిస్తున్నారంటూ కోర్టు ద్వారా వారు ఆయనకు నోటీసులు ఇప్పించారు. దీంతో అవాకై ్కన బాధితుడి కుటుంబ సభ్యులు ఫంక్షన్హాల్ యజమాని ఇంటి ఎదుట వినూత్నరీతిలో ఆందోళనకు దిగారు. టెంట్ వేయడంతోపాటు చావుడప్పు, క్రిమిసంహారక మందు డబ్బాలతో బైఠాయించారు. ఆ సమయంలో ఇంట్లో రవీందర్రావు కుమారులు లేరు. తమకు అవమానంగా ఉందని ఆయన కోడళ్లు డయల్ 100 ద్వారా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని సూచించారు. ఈక్రమంలో బాధితుడి కుటుంబ సభ్యులు, భూమి యజమాని కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటూ అక్కడే భోజనం చేసి అర్ధరాత్రి వరకు గిరి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. బాధితుడి కుటుంబానికి స్థానికులు అండగా నిలించారు. ఈ విషయమై ఫంక్షన్హాల్ యజమాని కుమారుడు డి.ప్రేంచందర్రావును ‘సాక్షి’ వివరణ కోరగా వారికి మరోచోట భూమి ఇచ్చి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. తమ ఇంటి ఎదుట చావుడప్పు కొట్టించడం బాధగా ఉందని చెప్పాడు. భూమి విక్రయించిన వ్యక్తి ఇంటి ఎదుట బాధితుడి ఆందోళన పరకాలలో చావుడప్పు, పురుగుల మందు డబ్బాతో బైఠాయింపు -
ఆదాయ వనరులపై దృష్టి సారించాలి
వర్ధన్నపేట: మహిళలు ఆదాయ వనరులపై దృష్టి సారించి ఆదాయ అభివృద్ధితో పాటు ఆర్థిక ప్రగతి సాధించాలని డీఆర్డీఎ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) భవాని అన్నారు. శుక్రవారం మండలంలోని ఇల్లందలో గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూని ఫామ్స్ కుట్టు మిషన్ సెంటర్లను సందర్శించి ప్రా రంభించారు. అదే విధంగా మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సెంటర్ను ఏపీఎం వే ణు ప్రారంభించారు. ఇల్లందలోని గంగా గ్రామైక్య సంఘం నెలసరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్నారు. ఈ అవకాఽశాన్ని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వేణు, సీసీలు గోలి కొమురయ్య, టి.రమేష్, స్వామి, పంచాయతీ కార్యదర్శి రామారావు, గంగా గ్రామైక్య సంఘం ప్రతినిధులు భాను, బొంతల మౌనిక, కవిత, ఎల్లమ్మ, సఫియా, వీఓఏలు కారోబార్ రాజు, తదితరులు పాల్గొన్నారు. డీపీఎం భవాని -
ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలి
చెన్నారావుపేట: ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ ఆవిర్భావ జూబ్లీ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామం ఆవిర్భావించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామ ప్రజలకు, గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. 40 సంవత్సరాలుగా నాకు వెన్నంటి ఉంటూ గ్రామ ప్రజలు సహకరిస్తున్నారన్నారు. చర్చి ఆవరణలో ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 7 లక్షలతో సీసీ ప్లాట్పామ్ పనులు చేయించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. విచారణ గురువు యాగారెడ్డి, గుడి పెద్దలు ఎమ్మెల్యే మాధవరెడ్డిని సన్మానించారు. అనంతరం గ్రామంలో అనిల్కుమార్ అనే ఉపాధ్యాయుడు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
వరంగల్
శనివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2024నలుగురు దొంగల అరెస్టు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తూ పట్టుబడిన నలుగురిని అరెస్ట్ చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పరకాల ఏసీపీ కిశోర్కుమార్ తెలిపారు.వీసీ నియామకం జరిగేనా..? ఈ నెల 21న కేయూ వీసీ రమేశ్ పదవీకా లం ముగుస్తుంది. కాగా మిగితా వర్సిటీలతో పాటే కేయూకు కూడా కొత్త వీసీని నియమి స్తారా..లేదా అనే చర్చ జరుగుతోంది.– 8లోuన్యూస్రీల్ -
గులాబీ కోటలో పట్టభద్రుడెవరో?
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నికల పోలింగ్కు మరో తొమ్మిది రోజులే సమయం ఉంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికై రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారం ఇప్పటికే రసవత్తరంగా మారాల్సి ఉంది. ఈ నెల 13 వరకు లోక్సభ ఎన్నికల హడావుడి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అంతగా పట్టించుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ము గిసి ఆరు రోజులు గడిచినా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇంకా అంటీముట్టనట్లే ఉంటున్నారు. పట్టభద్రుల ను కలిసే ప్రయత్నం చేయకపోగా.. ఓటర్ల జాబితా, ఫోన్ నంబర్లను సేకరించి మెస్సేజ్ల పంపడానికే పరిమితమవుతున్నారు. ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఒక్కరోజు ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారం ఇంకా పట్టభద్రులను తాకకపోవడంపై ఓటర్లలో చర్చ జరుగు తోంది. పట్టభద్రులు పట్టం కట్టేది ఎవరికో... నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 52మంది పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కానీ, ప్రధాన పార్టీల ముఖ్యనేతలు కొందరు మాత్రం ఇంకా లోక్సభ ఎన్నికల మూడ్ నుంచి బయట పడలేదన్న చర్చ జరుగుతోంది. కాగా ఈ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2007లో ఈ నియోజకవర్గం ఏర్పడగా, అప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. ఎమ్మెల్సీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్)ను పార్టీ అభ్యర్థిగా బరిలో దింపింది. నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు నుంచే ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తన స్థానాన్ని పదిలపర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి పలువురు సీనియర్లు టికెట్ ఆశించినా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం కల్పించారు. ఈయన అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ టికెట్ ఆశించిన, మద్దతు పలికిన నేతలు ఇంకా అసంతృప్తి వీడలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికే ఆ పార్టీ అధిష్టానం మళ్లీ అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందిన ప్రేమేందర్ రెడ్డి.. ఈసారి ఎలాగైనా విజయ తీరాలకు చేరాలని భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ ఓటర్లే కీలకం... ఈ ఉప ఎన్నికలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు కీలకం కానున్నారు. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎ న్నికల్లోనూ అభ్యర్థులు కేయూ, ఉమ్మడి వరంగల్ పట్టభద్రులు కేంద్రంగా ప్రచారం నిర్వహించారు. 2021 ఎన్నికల్లో గెలుపొందిన పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,61,811 ఓట్లు రాగా, ఆ తర్వాత స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 1,49,005 ఓట్లు సాధించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్కు 71,126 ఓట్లు రాగా, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) 39,306, రాములు నాయక్ (కాంగ్రెస్) 27,729 ఓట్లతో సరిపెట్టుకున్నారు. రెండో ప్రాధాన్యం ఓట్లతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందగా.. ఆ పోలింగ్లో ఉమ్మడి వరంగల్ ఓటర్లు అత్యధికంగా ఓటుహక్కును వినియోగించుకున్నట్లు తే లింది. కాగా ఎన్నికల అధికారుల ప్రకటన మేరకు 12 జిల్లాల్లో మొత్తం 4,61,786 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 2,86,993, మహిళలు 1,74,78 8, థర్డ్జెండర్స్ ఐదుగురు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓట్లలో అత్యధికంగా 1,67,849 మంది ఉమ్మడి వరంగల్లో ఉండగా.. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూడా ఇక్కడి ఓటర్లే కీలకం కానున్నారన్న చర్చ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు తొమ్మిది రోజులే సమయం ఇంకా ఊపందుకోని ప్రచారం... ప్రధాన పార్టీల గెలుపు ధీమా... అతి నమ్మకంలో అభ్యర్థులు అంటీముట్టనట్లుగా మూడు పార్టీల ముఖ్యనేతలు ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. -
మౌలిక వసతులు త్వరగా కల్పించాలి
కాళోజీ సెంటర్: పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని సీఎస్ శాంతకుమారి అన్నారు. శుక్రవారం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ శాంతకుమారి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్లు రెగ్యూలర్గా తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి మే చివరి నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభానికి ముందే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేశామని, వీటిని తర్వగా కొనుగోలు దారులకు అప్పగించాలని, గోడౌన్ల నుంచి తర్వగా ధాన్యం తరలింపు పూర్తి కావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మండల సమాఖ్యలచే ఏకరూప దుస్తులు తయారీ చేయించి జూన్ 10లోగా విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ శ్రీనివాస్, డీఆర్డీఓ పీడీ కౌసల్యాదేవి, డీఎస్ఓ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడం కూల్చివేత
దుగ్గొండి: అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూల్చి వేసిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కందికొండ శ్రావణ్ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ప్రహారీ నిర్మించారని పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెల్లవారుజామున జేసీబీ సాయంతో ప్రహారిని కూల్చి వేశారు. అయితే తన భూమిలో తాను నిర్మాణం చేసుకుంటే కూల్చివేయడం ఏమిటని, పూర్తి ఆధారాలతో తాను అనుమతి కోసం జీపీకి దరఖాస్తు చేశానని తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి వేశారని శ్రావణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై డీపీఓ, ఎంపీఓలపై కమీషనర్కు పిర్యాదు చేస్తానని అన్నాడు. ఇదే విషయంపై ఎంపీఓ శ్రీధర్గౌడ్ను వివరణ కోరగా గ్రామ పంచాయతీ పక్కనే ఉన్న స్థలంలో చేసే నిర్మాణం అక్రమం అని జిల్లా పంచాయతీ అధికారి రిపోర్టు ఇచ్చారన్నారు. కూల్చి వేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. అయితే రాత్రి పూట కూల్చిన విషయం తన దృష్టికి రాలేదని ఆయన వివరణ ఇచ్చారు. -
హేమాచలక్షేత్రం ముస్తాబు
మంగపేట: ములుగు జిల్లాలో రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మంగపేట మండలం మల్లూరు గుట్టపైగల శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాల(జాతర)కు ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకులు(వేద పండితులు) అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఆగమ శాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా జరిపించనున్నారు. రేపటి(19వ తేదీ) నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా పది రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి శనిగల సురేష్ శుక్రవారం తెలిపారు. -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
నర్సంపేట: పట్టణంలోని ద్వారకపేట వేణుగోపాల వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ గంధం నరేందర్గుప్తా ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు రెండో రోజు శుక్రవారం కొనసాగాయి. ప్రధాన అర్చకుడు ఆరుట్ల వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు పూజలు నిర్వహించి అన్నప్రసాద సన్నిధిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, భక్తులు పాల్గొనగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలుకొని అష్టోత్తర శత 108 కలశములతో స్వామివారికి అభిషేకం, మహా త్రిమంజనం, విశిష్ట అర్చనలు నిర్వహించారు. అన్న ప్రసాద సన్నిధి దాతలు కటంగూరి ప్రేమానందరెడ్డిసుమతి, కటంగూరి దయానందరెడ్డి, మదన్మోహన్రెడ్డిల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అభిషేకలు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నరేందర్గుప్తా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు, విశిష్ట దాతలు, అన్నదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరుగు సాంబయ్యగౌడ్, మోతె నరేందర్రెడ్డి, గాండ్లోజు భాస్కరాచారి, నంద్యాల సురేష్రెడ్డి, పావనివేణు, గోపగాని వెంకటేశ్వర్లుగౌడ్, కాసర్ల శ్రీనివాస్రెడ్డి, యాదుగురి జగన్, తదితరులు పాల్గొన్నారు. 20 నుంచి ఆర్చరీలో శిక్షణపర్వతగిరి: మండలంలోని కల్లెడ ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్చరీ వేసవి శిక్షణ శిబిరం ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్చరీ కోచ్ రేణుమండల్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ శిక్షణలో భాగంగా షూటింగ్, బాడీ పోస్టుర్, ఫిజికల్ ఆక్టివిటీ, ఇతర విషయాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జనార్దన్ మాట్లాడుతూ ఈ శిక్షణలో పాల్గొన్న బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి కల్పించబడుతుందన్నారు. మండలంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9959301913, 9989030018 నంబర్లో సంప్రదించాలన్నారు. ప్రేమేందర్రెడ్డిని గెలిపించాలి నర్సంపేట: బీజేపీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్, కామారెడ్డి శాసన సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలో ముఖ్య నాయకులతో శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయానికి ముందుండి పోరాడాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్లు మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ నాయకులు డాక్టర్ గోగుల రాణాప్రతాప్రెడ్డి, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచందర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కంభంపాటి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కాళోజీ సెంటర్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో భాగంగా 1, 5వ తరగతుల్లో షెడ్యూల్ కులాల విద్యార్థుల అడ్మిషన్లకు జూన్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1వ తరగతికి 60, 5వ తరగతికి 62 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకానికి అర్హులని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ.2లక్షలకు మించరాదన్నారు. దరఖాస్తు పత్రంతో పాటు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలు(3) గత సంవత్సరం మార్కుల జాబితా జిరాక్స్ కాపీలతో గెజిటెడ్ అధికారి సంతకంతో సమర్పించాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం వరంగల్, నర్సంపేటలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 9346374583, 9550078045, 9701198330 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు.. ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 95055 14424 ఫీజు : రూ.3 వేలు -
హామీల అమలుపై నోరువిప్పని ఎమ్మెల్యే ‘దొంతి’
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఖానాపురం: దొంగ హామీలతో గెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎందుకు నోరు విప్పడంలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా దొడ్డు రకంతో పాటు ఇతర పంటలకు రూ.500 బోనస్ చెల్లించా లని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో గురువా రం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్మార్కెట్ యార్డు వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడారు. ఎన్నికల తర్వాత మాటమారుస్తున్న కాంగ్రెస్కు బుద్దిచెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎన్నికలు ముగిసాక నోరువిప్పకపోవడం దుర్మార్గమన్నారు. బోనస్ ఇవ్వకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిరసనలు తప్పవన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ ప్రకాశ్రావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, వెంకటనర్సయ్య, శ్రీనివాస్గౌడ్, అశోక్, ప్రసాద్, అశోక్, వెంకన్న, శ్రీనివాస్గుప్త, యువరాజు పాల్గొన్నారు. -
మరో 22 డివిజన్లు!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరుగనుంది. 66 నుంచి 88కు చేరనుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా బల్దియా అధికారులు డివిజన్ల పునర్విభజనకు ప్రతిపాదనలపై సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత గ్రేటర్ వరంగల్ పాలకవర్గానికి సుమారు రెండేళ్ల గడువు ఉంది. ఎన్నికలకు 6 నెలల ముందు అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి డివిజన్ల మధ్య జనాభా సంఖ్యలో వ్యత్యాసం 10 శాతం మాత్రమే ఉండాలి. కానీ, 2021 మార్చిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో అధికారులు తలొగ్గారనే అప్పట్లో విమర్శలు వచ్చాయి. కొన్ని డివిజన్లలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోవడం, మరికొన్ని డివిజన్లలో భారీస్థాయిలో జనాభా వృద్ధి పెరిగింది. ఈ పరిస్థితిని వివరిస్తూ అప్పట్లోనే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రముఖులు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేరాయి. దీంతో పునర్విభజన అనివార్యమైంది. కానీ, 2021 ఏప్రిల్లో ఎన్నికల తంతు ముగించేశారు. జనాభా వ్యత్యాసాన్ని సమీక్షిస్తూ కొత్త డివిజన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 66 నుంచి 88 డివిజన్ల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని అధికారులు తెలిపారు. 1951లో మేజర్ మున్సిపాలిటీ.. ఫసిలి హైదరాబాద్ లోకల్ సెస్ 1309 చట్టం ప్రకారం 1899 సంవత్సరంలో వరంగల్ పట్టణంగా రూపుదిద్దుకుని 1929 నుంచి స్వతంత్రంగా పనిచేయడం ఆరంభించింది. 1959లో మేజర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1951 హైదరాబాద్ మున్సిపాలిటీల చట్టం ప్రకారం మొదటిసారి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. 1959 జూలైలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 1960 జూలైలో తిరిగి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ శ్రేణికి చేరింది. హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టం ప్రకారం 1961లో నగర విస్తీర్ణం 61.69 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 1965 ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం నగరంలో అమలులో ఉండేది. 1979లో మున్సిపాలిటీల పరిధిని 110 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. జీఓ ఎంఎస్ నంబర్ 450 ఎంఏ ప్రకారం 18–08–1994లో వరంగల్ సెలక్షన్ గ్రేడ్ శ్రేణి నుంచి నగర పాలక సంస్థగా ఏర్పాటైంది. అప్పడు డివిజన్ల సంఖ్య 50కి పెరిగింది. 2001 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటూ అప్పటి ప్రభుత్వం 2005 ఏప్రిల్ 28న డివిజన్ల పునర్విభజన చేసింది. పెరిగిన జనాభా ప్రకారం 50 నుంచి 53 డివిజన్లకు పెరిగాయి. 2013 మార్చి 16న ట్రైసిటీలోకి శివారులోని 42 గ్రామాలను విలీనం చేశారు. 110 చదరపు కిలోమీటర్లు ఉన్న నగరం కాస్త 407.7 కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా కూడా 8,19,441కి చేరింది. 2015 జనవరిలో గ్రేటర్ వరంగల్ హోదా కల్పించారు. అదేసంవత్సరం జూన్ 16న అప్పటి ప్రభుత్వం 53 డివిజన్ల నుంచి 58కి పెంచింది. 2021 మార్చి 7న 58 డివిజన్ల నుంచి 66 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6కు చేరనున్న సర్కిళ్ల సంఖ్య.. మహా నగరపాలక సంస్థ పాలన స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు గ్రేటర్ వరంగల్ తాజాగా డివిజన్ల పునర్విభజనపై దృష్టిసారించింది. సర్కిళ్ల సంఖ్య ప్రస్తుతం రెండుగా ఉంది. గతంలో ప్రభుత్వం 4 సర్కిళ్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా డివిజన్ల పునర్విభజనతో సర్కిళ్ల సంఖ్య 6కు చేరే అవకాశాలు ఉంటాయని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారులు రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. పెరిగిన జనాభా.. బల్దియా పరిధిలో 66 డివిజన్ల జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ట్రైసిటీతోపాటు 42 విలీన గ్రామాల్లో జనాభా వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గ్రామాల నుంచి నగరానికి వలసల సంఖ్య ఎక్కువైంది. ప్రస్తుతం జనాభా 12.40 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి డివిజన్లో 14 వేలకు పైచిలుకు జనాభా ఉంటుందని, అందువల్ల డివిజన్ల సంఖ్య 88కి పెంపు అనివార్యమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.గ్రేటర్ పరిధిలో 66 నుంచి 88కి పెరగనున్న సంఖ్య ప్రతిపాదనలకు సన్నాహాలు చేస్తున్న అధికారులు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పునర్విభజన 2011 సంవత్సరం జనాభా లెక్కలే ప్రామాణికం -
ఎస్డీఎల్సీఈ ఏడీగా గోపీనాఽథ్
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని ఎస్డీఎల్సీఈ సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.వెంకటగోపీనాఽథ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు గురువారం కేయూ వీసీ రమేశ్ ఉత్తర్వులు అందజేశారు. ఇప్పటివరకు సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న బాటనీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.కరుణాకర్ నుంచి ఈనెల 17న గోపీనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
మండల సర్వసభ్య సమావేశం బహిష్కరణ
నల్లబెల్లి: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హమీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మండల పరిషత్ సర్వసభ్య స మావేశాన్ని సభ్యులు బహిష్కరించారు. ఎంపీపీ ఊ డుగుల సునిత అధ్యక్షతన సమావేశం నిర్వహించేందుకు ఎంపీడీఓ నర్సింహమూర్తి ప్రయత్నిస్తుండగా ఎంపీటీసీ సభ్యులతోపాటు జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అడ్డుకున్నారు. గత మండల సభ తీర్మానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సమావేశం నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కాగా, సమావేశానికి హాజరైనట్లు సంతకాలు చేయాలని ఎంపీడీఓ కోరినప్పటికీ నిరాకరించి, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరస న వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సునిత, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతును మోసం చేస్తుందని మండిపడ్డారు. వైస్ ఎంపీపీ గందె శ్రీలత, ఎంపీటీసీలు బోళ్ల శ్రీలత , జయరావు, రవీందర్రావు, దేవునాయక్, విజయ , అజ్మీర లక్ష్మి, నజీమా బేగం ఉన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 9505514424 ఫీజు : రూ.3 వేలు -
భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి
వర్ధన్నపేట: భూగర్భజలాల పెంపొందించుకోవడానికి ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని నీటిని పొదుపు చేసుకోవాలని సెంట్రల్ వాటర్ బోర్డు సైంటిస్ట్ ఎంఎస్ గౌతమ్ అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో ఉపాధి హామీ పనులు, భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టిన ఫాం పాండ్స్ తదితర పనులను గురువారం సెంట్రల్ వాటర్ బోర్డు సభ్యుల బృందం మండలంలోని పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం ప్రతినిధి ఎంఎస్ గౌతమ్ గ్రామైక్య సంఘాల మహిళతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. భూగర్భ జలాలు పెంపొందించుకుని నీటిని పొదు పు చేయడం ద్వారా భూగర్భ జలాలు అడుగంట కుండా ఉంటాయన్నారు. దక్షిణ భారతదేశంలో 7 గ్రామాలు జాతీయ స్థాయి వాటర్ అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను సందర్శించి నీటి సంరక్షణ, వినియోగం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఉపాధి హామీ పనులపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ప్రతినిధి గౌతమ్తోపాటు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ బృందం వెంట డీఆర్డీఓ కౌసల్యదేవి, ఎంపీడీఓ వెంకటరమణ, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీఓ ధనలక్శ్మి, ఈజీ ఎస్ విభాగం అధికారులు రమేశ్, సురేశ్, నాగరాజు , సుధాకర్, సెర్ప సిబ్బంది వేణు, గోలి కొమురయ్య, ఎఫ్ఏ రేణుక, వీఓల ప్రతినిధులు అనూష, భాను, శ్రావణి, రజిత, స్వప్న, వీఓఎలు శోభ, స్రవంతి, పద్మావతి, రమ పాల్గొన్నారు. సెంట్రల్ వాటర్ బోర్డు సైంటిస్ట్ గౌతమ్ -
అమ్మవారికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరంగల్లోని శ్రీభద్రకాళి దేవాలయంలో బుధవారం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని గజమాలలతో అలంకరించిన అనంత రం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారి స్వపనమూర్తికి గంధం పట్టించి ప్రత్యేకపూజలు చేశారు. ఉత్సవమూర్తిని సాలభంజికవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కుమ్మరి సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవునూరి రాంమూర్తి ప్రజాపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రుద్రారపు కుమారస్వామిప్రజాపతి, కడారి ఓంప్రకాశ్, తౌటి దేవేందర్, వడ్లూరి విష్ణు, ఆకారపు రాజగోపాల్, ఉర్సు కుల సంఘం నాయకులు నాగరాజు, శ్రీనివా స్. సత్యం, కుమారస్వామి పాల్గొన్నారు. -
కాజీపేట రైల్వే ఆస్పత్రి తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఆస్పత్రిని సికింద్రాబాద్ రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణస్వామి బుధవారం తనిఖీ చేశా రు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను కలియ తిరిగి పరిశీలించారు. స్థానిక రైల్వే సీనియర్ డీఎంఓ డాక్టర్ నిరంజన్రావు, ఇతర డాక్టర్లతో మాట్లాడారు. అంతకు ముందు రైల్వే డాక్టర్లు, రైల్వే నాయకులకు సీఎంఎస్ నారాయణస్వామికి స్వాగతం పలికి సన్మానించారు. రైల్వే జేఏసీ, రైల్వే మజ్దూర్ యూని యన్ నాయకులు ఆస్పత్రి సమస్యలపై సీఎంఎస్కు వినతి పత్రం అందజేశారు. -
జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలి
వర్ధన్నపేట: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల ప్రగతిలో మండలానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని డీఆర్డీఓ కౌసల్యదేవి అన్నారు. బుధవారం మండలంలోని ఇల్లంద గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్ సెర్ప్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేడు(గురువారం) కేంద్ర బృందం సందర్శనను పురస్కరించుకుని సరైన ప్రణాళికలు రూపొందించి ఎలాంటి సందేహాలకు తావు లేకుండా పూర్తి స్థాయి నివేదికలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. సెర్ప్ ఉద్యోగుల సమన్వయంతోపాటు వారి సహకారంతో ఉపాధి హామీ పనుల ప్రగతిని జాతీయ స్థాయిలో చాటి చెప్పి తగిన గుర్తింపు పొందేందుకు కృషి చేయాలన్నారు. ఇల్లంద సిబ్బంది సేవలను మెచ్చుకున్నారు. ఈసందర్భంగా సెర్ఫ్ సిబ్బంది కౌసల్యదేవిని శాలువాతో సన్మానించారు. సమావేశంలో ఎంపీడీఓ వెంకటరమణ, ఎంపీఓ ధనలక్ష్మి, ఏపీఓ నాగేశ్వర్రావు, ఏపీఎం వేణు, సీసీలు గోలి కొమురయ్య, రమేష్, సురేష్, వీఓ ప్రతినిధులు తూల్ల శ్రావణి, స్వప్న, రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ రేణుక, వీఓఏలు కత్తి స్రవంతి, తక్కళ్లపెల్లి పద్మావతి, ఆకుల స్రవంతి, కారోబార్ రాజు, చోటేమియా పాల్గొన్నారు.డీఆర్డీఓ కౌసల్యదేవి -
ఫిర్యాదు చేస్తే మిల్లర్లపై చర్యలు
● అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఖానాపురం: ధాన్యం కొనుగోళ్లలో 1010 రకాన్ని కామన్ గ్రేడ్ కింద తీసుకునే మిల్లర్లపై రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ఈ మేరకు మండలంలోని బుధరావుపేట, ఖానాపురం, ఐనపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్, డీసీఓ, డీసీఎస్ఓ, సివిల్ సప్లయీస్ డీఎంలు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, వివరాలు సేకరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. 1010 గ్రేడ్ ఏ రకంపై మిల్లర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్షిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే మిల్లర్లకు సూచనలు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్ల సమయంలో తరుగు తీయొద్దని హెచ్చరించారు. ధాన్యం గ్రేడింగ్ విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ప్యాడి క్లీనర్లో శుభ్రం చేసి తాలు లేకుండా పంపాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీఓ సంజీవరెడ్డి, డీసీఎస్ఓ శివప్రసాద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, సివిల్ సప్లయీస్ టెక్నికల్ మేనేజర్ రాజయ్య, సీఈఓ ఆంజనేయులు, సివిల్ సప్లయీస్ డీటీ స్వప్న, మేరుగు రాజు, వినయ్, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళీభద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరంగల్లోని శ్రీభద్రకాళి దేవాలయంలో బుధవారం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని గజపూమాలలతో అలంకరించిన అనంత రం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారి స్వపనమూర్తికి గంధం పట్టించి ప్రత్యేకపూజలు చేశారు. ఉత్సవమూర్తిని సాలభంజికవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కుమ్మరి సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవునూరి రాంమూర్తి ప్రజాపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రుద్రారపు కుమారస్వామిప్రజాపతి, కడారి ఓంప్రకాష్, తౌటి దేవేందర్, వడ్లూరి విష్ణు, ఆకారపు రాజగోపాల్, ఉర్సు కుల సంఘం నాయకులు నాగరాజు, శ్రీనివా స్. సత్యం, కుమారస్వామి పాల్గొన్నారు. -
No Headline
కాళోజీ సెంటర్: సర్కారు బడిలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు దీటుగా వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన, గుణాత్మక విద్య అందించేందకు చర్యలు చేపట్టింది. పాఠశాల పునఃప్రాంభం రోజున విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలో ఉన్న 757పాఠశాలల్లో 43,865మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అయితే జిల్లాలోని విద్యార్థులకు 3,50,163 పాఠ్యపుస్తకాలు అవసరం ఉందని జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగా, బుధవారం నాటికి జిల్లాకు 1,04,120 పుస్తకాలు చేరుకున్నాయి. మొత్తం టైటిల్స్లో జిల్లాకు 187టైటిల్స్ కేటాయించగా.. ఇప్పటి వరకు 65టైటిల్స్ చేరుకోగా 122 టైటిల్స్ ఇంకా రావాల్సి ఉంది. రోజు వారీగా పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement