ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి అభినందనలు | Sakshi
Sakshi News home page

ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి అభినందనలు

Published Tue, May 14 2024 3:25 PM

ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి అభినందనలు

సిద్దిపేటరూరల్‌: జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించామన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు వేసిన ఓటర్లకు, విధులను సక్రమంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బందికి, అధికారులకు, పోలీస్‌ సిబ్బందికి, కేంద్ర రక్షణ బలగాలకు కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను నర్సాపూర్‌ లోని బీవీఆర్‌ఐటీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచినట్లు తెలిపారు.

కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి

Advertisement
 
Advertisement
 
Advertisement