ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం డ్వాక్రా..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం డ్వాక్రా, రైతు రుణమాఫీపై వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా ఏపీ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) నేడు జరగనుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్లో ఈ సమావేశం జరుగుతుంది. స్పీకర్పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఇందులో నిర్ణయిస్తారు.