
సాక్షి, అనంతపురం : పై అధికారులు వేధిస్తున్నారనే మనస్థాపంతో ప్రకాష్ అనే కానిస్టేబుల్ శుక్రవారం అంబేద్కర్ సెంటర్ వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు విచారించగా, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ వేధిస్తున్నారనీ, ప్రమోషన్, ఇంక్రిమెంట్లలో తనకు అన్యాయం జరిగిందని ప్రకాష్ ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న కలెక్టర్ సత్యనారాయణ ఎస్పీతో మాట్లాడి న్యాయం చేస్తానని బాధితుడికి హామీ ఇచ్చారు.