
సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవులకు నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా డా.మనోజ్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులుగా కె.ఇందిర, ఎం.జాహ్నవి, కార్యదర్శిగా నిమ్మల లలిత నియమితులైనట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.