Agaram Foundation
-
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటించింది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మే 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్సో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం పౌండేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.హైదరాబాద్లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ చూసి తాను స్ఫూర్తి పొందినట్లు సూర్య వివరించారు. మెగాస్టార్ను ఆదర్శంగా తీసుకుని చెన్నైలో అగరం ఫౌండేషన్ను ప్రారంభించినట్లు సూర్య వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను సందర్శించిన తర్వాత తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.సూర్య మాట్లాడుతూ.. 'ఇదంతా ఇక్కడే మొదలైంది. ఇక్కడ ఒకరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్లాను. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. " అన్నారు. ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. అగరం ఫౌండేషన్ను ప్రారంభించేందుకు మీరు నాకు శక్తిని, ధైర్యాన్ని అందించారు. మీ వల్ల ఎనిమిది వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు అయ్యారు. మీ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. తన ఫౌండేషన్ కోసం తెలుగు వారి నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం అగరం ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కోసం యుఎస్లో ఉన్నా. అక్కడ ఉన్న తమిళ విద్యార్థుల కోసం తెలుగు మాట్లాడే వారి నుంచే ఎక్కువ నిధులు వచ్చాయి. తెలుగు ప్రజలు చాలా దయగల హృదయం ఉన్న వ్యక్తులు. వారు ఇప్పటికీ తమిళ విద్యార్థుల చదువుకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో మీపట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమా నాని నటించిన హిట్-3 మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
అగరం కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో సూర్య-జ్యోతిక (చిత్రాలు)
-
వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య
-
వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య
చెన్నై : స్టార్ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారనే సంగతి తెలిసిందే. అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. ఇటీవల చెన్నైలో అగరం ఫౌండేషన్ తరఫున రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రి అనే అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను.. తన చదువుకు అగరం ఫౌండేషన్ ఎలా సహాయం చేసిందో వివరించారు. ‘మాది తంజావూరులోని ఓ చిన్న పల్లెటూరు. పదో తరగతి వరకు ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. అమ్మ దినసరి కూలీగా పనిచేసేది. నాన్న క్యాన్సర్తో బాధపడుతుండేవారు. అయితే పదో తరగతి పూర్తయ్యాక.. ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా కూలీ పనికి పోతానని అమ్మకు చెప్పాను. కానీ అమ్మ మాత్రం మా లాగా నువ్వు కష్టపడకూడదు.. బిచ్చమెత్తుకోని అయిన నిన్ను చదివిస్తానని చెప్పింది. ఆ తర్వాత నేను అగరం ఫౌండేషన్లో చేరాను. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే నాన్న చనిపోయారు. అప్పుడు చదువు మానేద్దామని అనుకున్నాను. కానీ అమ్మ నీ కోసం నువ్వు చదవాలని చెప్పింది. చాలా మంది ఇక్కడ నన్ను ఎగతాళి చేశారు. అగరం సాయంతో కాలేజీ విద్యను పూర్తిచేశాను. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. నా జీవితంలో వెలుగులు నింపిన అగరానికి, సూర్య అన్నకు కృతజ్ఞత తెలుపుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను’ అని గాయత్రి తెలిపారు. అయితే గాయత్రి తన కథ చెబుతున్న సమయంలో వేదికపైనే ఉన్న సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. గాయత్రి వద్దకు వచ్చి అప్యాయంగా పలకరించడంతో పాటు ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అభిమానులు సూర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. అగరం ఫౌండేషన్కు తోడుగా నిలుస్తున్న వాలంటీర్లకు, దాతలకు, పలు విద్యాసంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. -
50, 60 కథలు విన్నాను కానీ..
తమిళసినిమా: తన అగరం ఫౌండేషన్ ద్వారా పలువురికి విద్యాదానం చేస్తున్న నటుడు సూర్య. హీరోగా ప్రముఖ స్థానంలో కొనసాగుతున్న ఈయన ఇప్పుడు నిర్మాతగానూ రాణించాలన్న నిర్ణయంతో 2డి ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా తన భార్య ప్రధాన పాత్రలో నటించిన 36 వయదినిలే చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. తాజాగా పాండిరాజ్ దర్శకత్వంలో పసంగ-2 చిత్రం, తాను హీరోగా మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో 24 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటిలో పసంగ-2 చిత్రం ఈనెల 27న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ విద్య, బాలల ఇతివృత్తాలతో మంచి చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో తన పిల్లలు దియా, దేవ్ పేర్లు కలిసే విధంగా 2డి ఎంటర్టెయిన్మెంట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించానన్నారు. ఈ సంస్థలో చిత్రం చేయడానికి సుమారు 50, 60 కథలు విన్నా మంచి కథ అమరలేదన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు పాండిరాజ్ ఒక సీడీ ఇచ్చి ఇలాంటి కథతో మీ సంస్థలో చిత్రం చేస్తే బాగుంటుందని అన్నారన్నారు. బాలల గురించి ఆయన రెండేళ్ళు పరిశోధన చేసి తయారు చేసిన కథ అదని తెలిపారు. ఇలాంటి కథతో చిత్రం చేయాలన్నది తన ఉద్దేశం కావడంతో పసంగ-2 చిత్రాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. ఇందులో పలువురు బాలబాలికలు ప్రధాన పాత్రలు పోషించారని చెప్పారు.తాను ఒక సాధారణ వ్యక్తిగా నటించినట్లు తెలిపారు. చిత్రం చూసిన ప్రేక్షకులు ఒక మంచి ప్రయోజనకరమైన అంశాన్ని గ్రహిస్తారని సూర్య పేర్కొన్నారు. అమలాపాల్, బింధుమాదవి ముఖ్యపాత్రల్ని పోషించిన పసంగ-2 చిత్రం ఈ నెల 27 తెరపైకి రానుంది. సూర్య హీరోగా నటిస్తున్న 24 చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్లను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.