Gemini Suresh
-
W/O అనిర్వేశ్ మూవీ రివ్యూ
జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ W/O అనిర్వేశ్’. ‘ది డెవిల్ చైర్’ఫేం గంగ సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ప్రైవేట్ ఉద్యోగి అనిర్వేశ్(జబర్దస్త్ రామ్ ప్రసాద్) తన భార్య విచెలిత(సాయి ప్రసన్న) తనను నిత్యం వేధిస్తోందని సి.ఐ వరదరాజులు(జెమిని సురేష్)కి ఫిర్యాదు చేస్తాడు. మరో వైపు అనిర్వేశే నిత్యం తనను వేధిస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనకు చావే శరణ్యమని సీఐ వరదరాజులకు ఫోన్లో తన ఆవేధను అంతా వెలిబుచ్చుతుంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు రాబర్ట్(సాయి కిరణ్ కోనేరి).. అనిర్వేశ్, విచెలిత కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ, లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తాడు.కట్ చేస్తే..బిజినెస్ మ్యాన్ ధనుర్భాక్షి(కిరిటీ) ఓ వేశ్యతో సన్నిహితంగా ఉంటూ.. ఆమెను లోబరుచుకొని దారుణంగా హత్య చేస్తాడు. ఈ కేసు విచారణలో సి.ఐ వరదరాజులు బిజీ అయిపోతాడు. అనిర్వేశ్ కేసు విచారణకు మరో పోలీసు ఆఫీసర్(కిశోర్ రెడ్డి)ను నియమిస్తాడు. మరి రెండు కేసుల విచారణలో తేలిన నిజాలు ఏంటి? అనిర్వేశ్, విచెలిత, రాబర్ట్లలో ఎవరు ఎవరిని వేధించారు? మైథిలీ ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఈ కేసుతో రౌడీ షీటర్ ఆది, డాక్టర్ శరణ్య, సీఐ వరదరాజులుకు ఉన్న సంబంధం ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్ రామకృష్ణతో ఈ కేసులకు ఉన్న సంబంధం ఏటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని... గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయనే నమ్మకం ఉండటమే ఇందుకు కారణం. W/O అనిర్వేశ్ కూడా ఆ జానర్ కథే. మర్డర్ మిస్టరీ ప్లాట్ కి... కాస్త అడల్ట్ డ్రామా కంటెంట్ ను జోడించి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు గంగ సప్తశిఖర.భార్య వేధిస్తోందంటూ భర్త... భర్త వేధిస్తున్నాడంటూ భార్య... వీరిద్దరూ తోడుదొంగలు... నన్ను పార్టీ పేరుతో ఇంటికి పిలిచి... నేను, నా ప్రేయసి ఏకాంతంగా ఉన్న సన్నివేశాలను వీడియో తీసి బెదిరిస్తున్నారంటూ... మరో వ్యక్తి ఫిర్యాదు.. ఇలా ట్రయాంగిల్ లో జరిగే స్టోరీకి అడల్ట్ కంటెంట్ ను కాస్త జోడించి... సినిమాను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వకుండా చూసేలా తెరకెక్కించా. ఇది యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రామ్ ప్రసాద్, సాయి ప్రసన్నల మధ్య వచ్చే ఎపిసోడ్స్ రామ్ ప్రసాద్ లోని మరో కోణాన్ని భయట పెడతాయి. ఇక ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్స్ కొన్ని మరీ బోల్డ్ గా వున్నాయి. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు కథ రివీల్ అవుతుంది. వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధం... అలాగే సి.ఐ.వరదరాజులు అసలు పాత్ర ఏమిటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో... ఈ చిత్రం అసలు సిసలైన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అనిపించుకుంటుంది. దర్శకుడు ఎక్కడా పాత్రలపై అనుమానం రాకుండా... చివరిదాకా అసలు విషయంలో సస్పెన్స్ ను చివరి దాకా క్యారీ చేయడం నిజంగా దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఇది నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే..ఇప్పటి వరకు కామెడీతోనే అలరించిన జబర్దస్త్ రామ్ ప్రసాద్... ఇలాంటి క్రైం బేస్డ్ సినిమాలో నటించి తనలోని మరో సీరియస్ కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అనుమానపు మొగుడిగా శాడిస్ట్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించారు రామ్ ప్రసాద్. అలాగే ఇంటర్వెల్ తరువాత వచ్చే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లోనూ బాగా వేరియేషన్ చూపించారు. అతనికి జంటగా నటించిన సాయి ప్రసన్న కొన్ని బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక నజియా ఖాన్ హోమ్లీ గాళ్ గా చాలా క్యూట్ గా కనిపించి మెప్పించింది. కిరీటి క్యారెక్టర్ కూడా చివరి దాకా బ్యాగా క్యారీ అయింది.రాబర్ట్ పాత్రలో సాయి కిరణ్ కోనేరి ఆకట్టుకున్నాడు. సీఐ పాత్రలో జెమిని సురేష్ చివరి దాకా కనిపించి ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా ఉంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
షూటింగ్ లో మంచు లక్ష్మి ఎంత కష్టపడ్డారంటే ?
-
పొట్టకూటి కోసం పొగడ్తలు
‘‘ప్యారాషూట్ లేకుండా మనిషిని గాల్లో తేలగలిగేలా చేసేది పొగడ్త. దానికి పడని వాళ్లు ఉండరు. అలాంటి పొగడ్తనే ప్రవృత్తిగా పెట్టుకున్న ఒక కుటుంబానికి సంబంధించిన కథే మా ‘భజన బ్యాచ్’ సిరీస్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. దర్శకుడు మారుతి ఇచ్చిన కాన్సెప్ట్ ఆధారంగా చిన్నికృష్ణ రూపొందించిన వెబ్సిరీస్ ‘భజన బ్యాచ్’. పోసాని కృష్ణమురళి, గెటప్ శ్రీను, జెమిని సురేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సోనీ లైవ్లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సిరీస్ను 12 ఎపిసోడ్లుగా, ఒక్కో ఎపిసోడ్ 20 నిమిషాల నిడివితో రూపొందించాం. పొగడ్తల ద్వారా జీవితం సాగిస్తారు పోసాని. వాళ్ల పిల్లలను కూడా ఇదే వృత్తిని కొనసాగించమనడంతో తన పిల్లలు కూడా భజన చేయడం మొదలుపెడతారు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్కరి చుట్టూ చేరి భజన చేస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులారిటీ పొందిన వాళ్లను స్ఫూప్ చేశాం. విషం తీసుకుంటాను కానీ పొగడ్తలను తీసుకోను అనే మనస్తత్వం ఉన్న అజయ్ ఘోష్ వీళ్ల ఆటలు కట్టించాలనుకుంటాడు. ముందుగా సినిమాలా చేసి వెబ్ సిరీస్ స్టయిల్లో కట్ చేశాం. నాకు జంధ్యాలగారు, ఈవీవీగారు అంటే చాలా అభిమానం. వాళ్ల స్టయిల్ కామెడీ ఇందులో ఉంటుంది. నాటకరంగంలో నటుడిగా నాలుగు స్టేట్ అవార్డులు అందుకున్నాను. వినాయక్గారిని నటుడిగా అవకాశం అడిగితే రైటింగ్ టీమ్లోకి తీసుకున్నారు. ఆయన వద్ద ‘కృష్ణ, అదుర్స్’ సినిమాలకు వర్క్ చేశాను. ‘వీడు తేడా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, లండన్ బాబులు’ సినిమాలకు దర్శకత్వం వహించాను. ‘కొత్తబంగారు లోకం, ఖైదీ నంబర్ 150’ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాను. దర్శకులకు సినిమా సినిమాకు చిన్న గ్యాప్ రావడం సహజం. ఇకపై ఆ గ్యాప్లో వెబ్ సిరీస్లు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను తెరకెక్కించిన ‘అక్షర’ సినిమాని ఈ నెలాఖరులో విడుదల చేయానున్నాం’’ అన్నారు. -
నువ్వు మాస్రా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. బి.హరినాథ్ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్ కంటెంట్తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది. ఇందుకు అల్లు అరవింద్గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) అన్నారు. నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి. -
మా సొంతూరు బూరుగుపల్లి
కొవ్వూరు : జెమిని టెలివిజన్లో క్రియేటివ్ డెరైక్టర్గా 2003లో చేరిన పాలకొల్లు సమీపంలోని బూరుగుపల్లికి చెందిన నటుడు జెమిని సురేష్గా బుల్లి తెరతో పాటు వెండి తెరలో రాణిస్తున్నాడు. కుమారదేవంలో టైటానిక్ షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన సురేష్ విలేకరులతో ముచ్చటించారు. ప్ర : మీ స్వగ్రామం జవాబు : పాలకొల్లు సమీపంలో బూరుగుపల్లి ప్ర : నట ప్రస్థానం ఎలా మొదలైంది జవాబు : 2003లో జెమిని టీవీలో క్రియేటివ్ డెరైక్టర్గా చేరి 24 ఫ్రేమ్స్ పేరుతో సుమారు 1,600 మందిని ఇంటర్వ్యూ చేశా. ఇది సౌత్ ఇండియూలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. ప్ర : సినీ రంగ ప్రవేశం జవాబు : 2004లో నటుడు శ్రీహరి ప్రోద్బలంతో శ్రీ మహా లక్ష్మి చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యూ ప్ర : పేరు తెచ్చిన సినిమాలు జవాబు : రెడీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఆగడు ప్ర : మీ చదువు, కుటుంబ ప్రోత్సాహం జవాబు : ఎంబీఏ చదివాను. అమ్మ సుబ్బలక్ష్మి నన్నెంతగానో ప్రోత్సహించారు ప్ర : మీ లక్ష్యం జవాబు : మంచి నటుడిగా గుర్తింపు పొందాలని ప్ర :ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు జవాబు : సాయిధరమ్ తేజ హీరోగా సుప్రీమ్, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డిక్టేటర్, కళ్యాణ వైభోగమే, సినిమా హాల్, టైటానిక్ చిత్రాల్లో నటిస్తున్నా.