-
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఆయన విసిరేసిన డబ్బుకు పచ్చపార్టీ టిక్కెట్ ఇచ్చింది. అదే కావరంతో ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లకు డబ్బులు వెదజల్లారు. డబ్బుంటే ఏదైనా నా దాసోహం అవుతుందనుకున్న ఆ పచ్చనేత అహంకారానికి నియోజకవర్గ ప్రజలు తెలివిగా సమాధానమిచ్చాని టాక్. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసులో నిలవాలని ఓటింగ్తో ఆయనకు బుద్ధి చెప్పారని స్తోంది. అంతేకాదు ఆ పచ్చనేత బెదిరింపులకు భయపడేది లేదంటోన్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది ? 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని విపక్షకూటమి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాఫియాడాన్గా పేరున్న కావ్య కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఎప్పుడూ ప్రజల కష్టాలను కానీ, నియోజవర్గంలోని అభివృద్ధి గురించి కానీ ఈయన గారు పట్టించుకున్నది లేదు..చేసింది కూడా ఏమీ లేదు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తామన్నది కూడా ఓటర్లకు ఈయన చెప్పింది కూడా లేదు. నామమాత్రంగా ప్రచారాన్ని ముగించి పోలింగ్కు సమయం దగ్గర పడుతున్నప్పుడు కుట్ర రాజకీయాలు మొదలెట్టాడు. ఎన్నికల్లో గెలవాలి..అధికారం అందుకోవాలన్న తాపత్రయతంతో ఓటర్లను కొనేయాలని డిసైడ్ అయ్యారు. అనుచరులతో డబ్బులు పంపిణీ చేశారు. ఓటుకు రెండు వేలు చొప్పున పంచారు. పోలింగ్ రోజున కూడా ఈ ఓటుకు నోటు యవ్వారం నడిచినట్లు సమాచారం. కావలి నియోజకవర్గంలో 2 లక్షల 3853 ఓట్లు ఉండగా.. వాటిల్లో లక్షా 98 వేల ఓట్లు పోలయ్యాయి. 97,916 ఓట్లు పురుషులు, లక్ష ఓట్లు మహిళలు వేశారు. గత ఎన్నికల కంటే ఈసారి ఆరు శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. ఈ భారీ పోలింగ్ను చూసి కావ్యకృష్ణారెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందని సమాచారం. సర్కార్ సానుకూల ఓటు పోటెత్తిందనే విషయం తెలియడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. తన దగ్గర నోట్లు తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్కు గుద్దారని తెలుసుకుని రగిలిపోయారు. అనుచరులను పంపి ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించడమే కాదు బెదిరింపులకు దిగిన కాల్ రికార్డింగ్స్ బయటకొచ్చాయి. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమపాలనను మరోసారి జనం కోరుకుంటూ తీర్పునివ్వడాన్ని చంద్రబాబు కూటమి జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు.వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో మరోసారి కావలిలో గెలవనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించే నేత కావడం వల్లే ఆయన గెలవబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుకున్న నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర ప్రలోభావాల విలువ రూ.8889 కోట్లుంటుందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది. ఈ మేరకు ఈసీ శనివారం(మే18) ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్స్,లిక్కర్ పట్టుకోవడంపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్గార్డ్ సంయుక్తంగా మూడు రోజుల్లో రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. -
రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్
న్యూఢిల్లీ: ఎంపీ స్వాతిమలివాల్పై దాడి కేసులో తన సహాయకుడు బిభవ్కుమార్ అరెస్టయిన తర్వాత ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైరయ్యారు. బీజేపీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఆదివారం(మే19) తన పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని, ఎవరిని కావాలంటే వారిని అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేశారు.‘మోదీజీ మీరు జైల్ గేమ్ ఆడుతున్నారు. మనీష్ సిసోడియా, సంజయ్సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఒకరి తర్వాత ఇంకొకరిని జైలుకు పంపుతున్నారు. నా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వస్తా. ఎవరిని కావాలంటే వారిని జైల్లో పెట్టండి. మొత్తం అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి’అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఆప్ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని, అయితే ఆప్ ప్రజల గుండెల్లో ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా, కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్పై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ స్పందించారు. ఎంపీ స్వాతిమలివాల్పై మీ ఇంట్లోనే దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. -
బీజేపీ భారీ ప్రయోగం.. ఫలించేనా?
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ ఎన్నికల్లో హ్యట్రిక్ విక్టరీపై బీజేపీ కన్నేసింది. అయితే అది కేవలం జాతీయ స్థాయిలోనే కాదు. దేశానికి గుండెకాయలాంటి రాజధాని ఢిల్లీలోనూ హ్యట్రిక్ క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లకు ఏడు సీట్లు కాషాయం పార్టీనే గెలుచుకుంది. అయితే.. ఈసారి ఇక్కడ బీజేపీ భారీ ప్రయోగానికే దిగింది. ఢిల్లీలో ఈనెల 25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి పాత వాసనలు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. మొత్తం ఏడు సీట్లలో.. ఆరుగురు సిట్టింగ్లను పక్కన పెట్టేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారి మాత్రమే టికెట్ దక్కించుకోగలిగారు. బీజేపీ లీగల్ సెల్లో యాక్టివ్గా పనిచేస్తున్న సుష్మాస్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్.. న్యూఢిల్లీ ఎంపీ సీటు నుంచి పోటీకి దిగారు. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేయడం బన్సూరికి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. బస్సూరితో పాటు చాందిని చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, ఈస్ట్ ఢిల్లీ నుంచి హర్ష మల్హోత్ర, నార్త్వెస్ట్ ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా, వెస్ట్ డిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రవాత్, సౌత్ ఢిల్లీ నుంచి రాంవీర్ సింగ్ బిదూరి కొత్తగా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ➡️ అయితే.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బిజెపికి గట్టి సవాలే ఎదురవుతోంది. గత రెండు ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీచేయడంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. కానీ ఈ సారి ఆప్, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. ఆప్ నాలుగు సీట్లలో, కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీ విజయం కాస్త కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా.. ➡️ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ ప్రచారం చేస్తోంది. తద్వారా ప్రజల్లో కొంత సానుభూతిని రాబట్టాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలను బీజేపీ ఎలా తిప్పికొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈలోపే.. ➡️కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్పై సీఎం వ్యక్తిగత అనుచరుడు దాడి చేసిన ఘటన జరిగింది. ఇది ఇప్పుడు బీజేపీకి రాజకీయ ప్రచార అస్త్రంగా మారింది. సీఎం ఇంట్లోనే మహిళలకు భద్రతలేదనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుతోంది. అయితే బీజేపీ కేవలం ప్రత్యర్థులపై విమర్శలతోనే సరిపెట్టడం లేదు. ➡️నరేంద్ర మోదీ సారథ్యంలో గత ప్రభుత్వం పదేళ్ల సాధించిన విజయాలనూ ఢిల్లీలో బిజెపి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్ను రాజధాని ప్రజల ముందు పెడుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఢిల్లీలో అమలు చేయకుండా కేజ్రీవాల్ అడ్డుపడ్డారనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మినీ ఇండియా లాంటి ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అన్ని పార్టీల ప్రచారాలను గమనిస్తున్న ఓటరు ఎటు నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే. ఎందుకంటే ప్రధాని మోదీ ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో స్టాండప్ కమెడియన్ 'శ్యామ్ రంగీలా' ప్రధాని మోదీపై పోటీ చేయాలనీ ప్రయత్నించారు. అయితే అతని నామినేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తిరస్కరణకు గురైంది. దీంతో మోదీ పోటీ చేస్తున్న వారణాసి బరిలో దిగాలనుకున్న శ్యామ్ రంగీలా ఎవరనేది ప్రశ్నగా మారిపోయింది.. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూసెయ్యండి.రాజస్థాన్కు చెందిన శ్యామ్ రంగీలా.. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఈ ఎన్నికల్లో ఆయనపైనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించి వార్తల్లోకెక్కాడు. ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాడు శ్యామ్ రంగీలా. నామినేషన్ తిరస్కరణకు గురవడంతో.. ప్రధానిపై పోటీ చేసే అవకాశం మిస్ అయ్యాడు. అయితే నామినేషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.మే 10, 13వ తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా.. తన పత్రాలను ఎవరూ తీసుకోలేదంటూ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశాడు శ్యామ్ రంగీలా. చివరి రోజైన మే 14న ఇదే పరిస్థితి అని తెలిపాడు. అనేక ప్రయత్నాల తరువాత నామినేషన్ల గడువు ముగియడానికి రెండు నిమిషాల ముందు.. అధికారులు తన డాక్యుమెంట్లు తీసుకున్నారని చెప్పాడు.మరుసటిరోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్ రంగీలా పత్రాలను తిరస్కరించారు. నామినేషన్ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్పై ప్రమాణం చేయలేదని పేర్కొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పత్రాలను తిరస్కరించారని శ్యామ్ రంగీలా ఆరోపించారు.లోక్సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. దీనికి మే 14న ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ బరిలోకి దిగారు. వారణాసిలో పోటీకి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా.. 36 పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోజార్టీ పెంచేందుకే పోటీలో ఉన్నవారిని తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీచేయడం వరుసగా ఇది మూడోసారి. తొలిసారి 2014లో ఇక్కడి నుంచి పోటీచేసిన ప్రధాని.. 56శాతం ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మోజార్టీతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. ఈసారి మెజార్టీ 5లక్షలు దాటి పోతుందని ధీమా వ్యక్తంచేస్తోంది బీజేపీ. ఓ కమెడియన్ పోటీచేసినంత మాత్రాన.. మోదీ ఆధిక్యత తగ్గుతుందని అనుకోవడం విపక్షాల తెలివితక్కువతనమని కొట్టిపారేసింది. -
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్లల్లాను టెంట్కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలనుకుంది. కాంగ్రెస్ వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్, పవార్.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ అన్నారు. మత నిర్జవ్స్త్రన్లకు ల్యాబ్గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు. -
‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
లక్నో: లోక్సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్నాడ్లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.అమేథీ, రాయ్బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది. -
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్లోని హనుమాన్గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం. -
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ శాతం 65.67గా ఎన్నికల కమిషన్ మంగళవారం(మే14) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల మంది ఓటర్లుండగా పోలింగ్లో 2 కోట్ల 20 లక్షల 24 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక కోటి 11 లక్షల 91 వేల మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కోటిమంది పోలింగ్కు దూరంగా ఉన్నా గతంతో పోల్చితే 3 శాతం పోలింగ్ పెరగడం గమనార్హం. అతి తక్కువగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 48.8 శాతం ఓటింగ్ జరిగింది. భువనగిరిలో అత్యధికంగా 76.78శాతం పోలింగ్ జరిగింది.నియోజకవర్గాల వారిగా పోలింగ్ ఇలా.. ఆదిలాబాద్- 74.03 పెద్దపల్లి 67.87 కరీంనగర్- 72.54 నిజామాబాద్- 71.92 జహీరాబాద్- 74.63 మెదక్- 75.09 మల్కాజ్గిరి- 50.78 సికింద్రాబాద్- 49.04 హైదరాబాద్- 48.48 చేవెళ్ల- 56.50 మహబూబ్నగర్- 72.43 నాగర్ కర్నూల్- 69.46 నల్గొండ- 74.02 భువనగిరి- 76.78 వరంగల్- 68.86 మహబూబాద్-71.85 ఖమ్మం - 76.09 -
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి మంగళవారం(మే14) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్కు అఫిడవిట్లో సమర్పించారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని మోదీ అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లని వెల్లడించారు. తన ఆస్తిలో రూ.2.86 కోట్లు స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు. సేవింగ్స్ ఖాతాలో రూ.80,304, తన చేతిలో రూ. 52,920 నగదు ఉందని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్లు తెలిపారు.2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్నవార్షిక ఆదాయం 2022-23లో రూ.23.56లక్షలకు పెరిగినట్లు తెలిపారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో తెలిపారు. జూన్1న తుది దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగనుంది. -
నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. మండి ప్రజలకు నాపైన ఉన్న ప్రేమే ఇంత దూరం తీసుకువచ్చిందని కంగనా పేరొన్నారు.మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. అయితే మండి ప్రాంతంలో ఇప్పటికి కూడా భ్రూణహత్య ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.#WATCH | Himachal Pradesh: Ahead of filing nomination, BJP candidate from Mandi, Kangana Ranaut says "The people of Mandi and their love for me have brought me here. Women in our country are making a mark in every field but incidents of feticide in Mandi were high a few years… pic.twitter.com/MTi9WndTgH— ANI (@ANI) May 14, 2024తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను మండి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.#WATCH | Himachal Pradesh: After filing her nomination, BJP candidate from Mandi Lok Sabha constituency, Kangana Ranaut says "Today I have filed nomination from Mandi LS seat. It is a matter of pride for me to have the opportunity to contest from Mandi...I have been successful in… pic.twitter.com/qh1DnIMi0A— ANI (@ANI) May 14, 2024 -
ఇండియా కూటమికి 315.. బీజేపీకి 195: దీదీ
కోల్కతా: దేశంలో నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇండియా కూటమి 315 సీట్లు గెలుస్తుందని, బీజేపీ గరిష్టంగా 195 సీట్లకు పరిమితం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బంగావ్ లోక్సభ నియోజకవర్గం ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఢిల్లీలో మోదీ ఉండరు.. కానీ దీదీ ఇక్కడి ప్రజలతోనే ఉంటుందని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు.ఇప్పటి వరకు పోలింగ్ బాగా జరిగింది. ఈసారి మోదీ అధికారంలోకి రావడం లేదు. అందుకే కేంద్రంలోని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. మళ్లీ మోదీ పీఎం కాలేరని గ్రహించారు. 400 సీట్ల గురించి గొప్పగా చెప్పుకోవద్దు అని బెనర్జీ అన్నారు.బొంగావ్ నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించే మాతువాస్ గురించి బెనర్జీ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రికి మాతువాస్ పట్ల అంత ప్రేమ ఉంటే, వారికి పౌరసత్వం ఇవ్వాలి. కానీ సీఏఏ అమలు సరికాదని ఆమె అన్నారు. దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని కూడా పేర్కొన్నారు.#WATCH | North 24 Parganas, Bangaon: West Bengal CM Mamata Banerjee says, "... Didi will bring the INDIA alliance to power there (at the Centre), we will help from here (West Bengal). The INDIA alliance will win with all of us (parties). As per the calculations we have till… pic.twitter.com/ROccx2dhhD— ANI (@ANI) May 13, 2024 -
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
న్యూఢిల్లీ: భూ కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్సోరేన్కు త్వరలో ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోరేన్ అరెస్టు అక్రమమంటూ దాఖలైన పిటిషన్పై సోమవారం(మే13) జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోరేన్ దాఖలు చేసిన పిటిషన్పై మూడు రోజుల్లో స్పందించాలని ఈడీని సుప్రీంకోరింది. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నందున పిటిషన్పై విచారణ వేగవంతం చేయాలని సోరేన్ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సుప్రీం అంగీకరించింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కల్పించిన ఊరటనే హేమంత్ సోరేన్కు ఇవ్వాల్సిన అవసరం ఉందని సిబల్ సుప్రీంను కోరారు. అయితే ధర్మాసనం కేసును 20కి వాయిదా వేయబోతుంటే సిబల్ మళ్లీ జోక్యం చేసుకున్నారు. 20కి వాయిదా వేస్తే పిటిషన్ విత్డ్రా చేసుకుంటానని, తన క్లైంట్కు అన్యాయం జరుగుతుందని వాదించారు. దీంతో ధర్మాసనం పిటిషన్ విచారణను 17కు వాయిదా వేసింది. -
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్రాజ్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటింది. ఇక హైదరాబాద్లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు.ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. -
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెసిన్(ఈవీఎం)ల భద్రతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సంచలన ఆరోపణలు చేశారు. తాను పోటీచేసిన బారామతి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లో సీసీ కెమెరాలు సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు నిలిచిపోయాయని తెలిపారు.దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఆగిపోవడం పూర్తి అనుమానాస్పద ఘటన అని సూలే పేర్కొన్నారు.‘బారామతి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ సీసీ కెమెరాలు సోమవారం ఉదయం పనిచేయలేదు. ఇది పూర్తి భద్రతా ఉల్లంఘనా చర్య. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదిస్తే వారి నుంచి సంతృప్త సమాధానాలేవీ రాలేదు.దీనికి తోడు సీసీకెమెరాలు రిపేర్ చేసే టెక్నీషియన్ కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేడు’అని సూలే తెలిపారు. -
లోక్సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
పాట్నా: భారతదేశంలో నాలుగో దశ లోక్సభ ఎన్నికలు తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి 'మిసా భారతి' సోమవారం లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.'మిసా భారతి' లోక్సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన సమయంలో.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీహార్కు ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. కానీ ప్రజలకు చేసినేమీ లేదు. మోదీ దేశం కోసం ఏదైనా చేసి ఉంటే.. ఇప్పుడు రోడ్షో నిర్వహించాల్సిన అవసరం లేదని మిసా భారతి అన్నారు. మోదీ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో జాబితా చేసి చెప్పాలని ఆమె కోరారు.మిసా భారతి 2024 లోక్సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్పై పోటీ చేయనున్నారు. ఇక్కడ జూన్ 1న ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మిసా భారతి 2014, 2019 ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో పాటలీపుత్ర నియోజకవర్గంలో ఓటమి చవి చూసారు. 2014కు ముందు రామ్ కృపాల్ యాదవ్.. లాలూ యాదవ్కు అత్యంత సన్నిహితుడు. -
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
లక్నో: నాలుగో దశ లోక్సభ ఎన్నికలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని 'ప్రియాంక గాంధీ వాద్రా' సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మొదటి మూడు దశలను చూశారు. ఈ దశలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.దేశంలోని ప్రతి ఒక్క ఓటు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితం. కాబట్టి ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమ కోసం అవిశ్రాంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బయటకు వచ్చి ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈరోజు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు మరియు ఒడిశా రాష్ట్ర శాసనసభలోని 28 స్థానాలకు కూడా లోక్సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో పోలింగ్ ప్రారంభమైంది.తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 5, జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో ఒక లోక్సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది. -
కేజ్రీవాల్కు పిగ్గీ బ్యాంక్ - వీడియో వైరల్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓ చిన్న పాప తన పిగ్గీ బ్యాంకును అప్పగించింది. దీనికి సంబంధించిన వీడియో ఆప్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. దేశాన్ని నియంతృత్వం నుంచి విముక్తి చేసేందుకు ఓ అమ్మాయి తన మామ కేజ్రీవాల్కు తన పిగ్గీ బ్యాంకును ఇచ్చింది' అంటూ పోస్ట్ చేశారు.నేను 20 రోజుల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాలి. మీరు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ రోడ్షోలో మాట్లాడుతూ , రాబోయే ఎన్నికల్లో ఆప్ విజయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఢిల్లీ - ఎన్సీఆర్ కోసం నేను పాఠశాలలు నిర్మించడమే నా తప్పు. నేను మీ కోసం పనిచేశాను కాబట్టి వారు నన్ను జైలుకు పంపారు. ఢిల్లీ ప్రజలకు మంచి జరగటం బీజేపీకి ఇష్టం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.నేను ప్రజలకు ఉచిత వైద్యం కోసం సౌకర్యాలు ఏర్పాటు చేసాను, కానీ నేను జైల్లో ఉన్నప్పుడు 15 రోజుల పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఆగిపోయాయని.. జైల్లో తాను అనుభవించిన పరిస్థితిని గురించి కూడా కేజ్రీవాల్ వెల్లడించారు. నేను మళ్ళీ జైలుకు వెళితే.. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులను బీజేపీ ఆపేస్తుందని అన్నారు.ఎవరైనా బాగా పని చేస్తుంటే, మీరు అతనిని అలా చేయనివ్వండి, నేను 500 పాఠశాలలు నిర్మించాను. మీరు దేశానికి ప్రధాని.. కాబట్టి కనీసం 5000 పాఠశాలలు నిర్మించాలని మోదీని ప్రశ్నించారు. బీజేపీ 400 సీట్లు అడుగుతోంది. తమకు 400 సీట్లు ఎందుకు కావాలని అడిగితే ఎందుకు చెప్పడం లేదని ఆప్ చీప్ అన్నారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి, కేజ్రీవాల్ మోతీ నగర్లో ఆప్ న్యూ ఢిల్లీ లోక్సభ అభ్యర్థి సోమనాథ్ భారతికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని.ये प्यार ही तो कमाया है केजरीवाल ने ❤️एक बच्ची ने देश को तानाशाही से मुक्ति दिलाने के लिए अपने केजरीवाल Uncle को दिया अपना Piggy Bank 🙌👇 pic.twitter.com/Aa7sNEsOVx— AAP (@AamAadmiParty) May 13, 2024 -
పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని వర్ధమాన్ - దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గానికి నాలుగో దశ పోలింగ్ సోమవారం ప్రారంభం కాగానే, ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్.. టీఎంసీ గూండాలు పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదని ఆరోపించారు.నిన్న రాత్రి ప్రిసైడింగ్ అధికారితో సహా పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదని, పరిస్థితి చక్కబడేలా.. ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని దిలీప్ ఘోష్ అన్నారు. ప్రతి బూత్ దగ్గర పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ టీఎంసీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.వర్ధమాన్-దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్కు చెందిన కీర్తి ఆజాద్, సీపీఐ(ఎం)కి చెందిన సుకృతి ఘోషల్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.2014 లోక్సభ ఎన్నికలలో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 34 స్థానాల్లో గెలిచింది. అయితే అప్పుడు బీజేపీ కేవలం 2 సీట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. సీపీఐ(ఎం) 2, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి బీజేపీ మరిన్ని స్థానాల్లో గెలుపొందటానికి ప్రయత్నిస్తోంది. -
బీహార్ లోక్సభ ఎలక్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు
పాట్నా: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో రోడ్షో నిర్వహించిన ప్రధాని 'నరేంద్ర మోదీ' కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈ సారి మరింత గొప్ప విజయాన్ని సాధిస్తామని, ఓడిపోయిన ఏకైక నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.బీహార్ రాష్ట్రంలో గెలుపు ఎన్డీఏ సొంతమని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంతో, ప్రజలతో బలమైన సంబంధాలున్నాయని అన్నారు. నేను తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాను, ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాను. బీహార్ రాష్ట్రంలో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మోదీ అన్నారు.దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రానికి వెళ్ళాను.. బీజేపీ (ఎన్డీఏ) 400 సీట్లను గెలుపొందుతుందనే దృఢ విశ్వాసం నాకుందని అన్నారు. బీహార్ ఎన్డీఏకు మాత్రమే కాకుండా ఇండియా కూటమికి కూడా చాలా కీలకం. ఎందుకంటే రాష్ట్రం నుంచి 40 మంది ఎంపీలు పార్లమెంట్కు వెళ్తారు.బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ పార్టీ మారడం.. తిరిగి ఎన్డీయేలోకి వెళ్లడంతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రతిపక్ష కూటమి కుదేలైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ 17 స్థానాల్లో పోటీ చేయగా, అవిభక్త లోక్ జనశక్తి పార్టీ ఆరింటిలో పోటీ చేసింది. బీజేపీ, ఎల్జేపీ తమ కోటాలో అన్ని స్థానాల్లో విజయం సాధించగా, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఒక్క స్థానంలో ఓడిపోయింది. కిషన్గంజ్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ సారి ఈ నియోజక వర్గం కూడా ఎన్డీఏ కైవసం చేసుకుంటుందని మోదీ అన్నారు.ఈ ఏడాది బీహార్ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఏర్పాటులో.. బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయగా, జేడీయూ 16 స్థానాల నుంచి, చిరాగ్ పాశ్వాన్లోని లోక్ జనశక్తి పార్టీకి (రామ్ విలాస్) ఐదు సీట్లు, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహ యొక్క రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.బీహార్లో ఇండియా కూటమి విషయానికి వస్తే.. అత్యధికంగా ఆర్జేడీ 26 స్థానాల నుంచి, కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) 3, సీపీఐ, సీపీఎం ఒక్కొక్కటి చొప్పున పోటీ చేస్తున్నాయి. ఈ రోజు జరిగే ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. -
అక్కడ ఒక్క సీటు కూడా ఓడిపోం: ప్రధాని మోదీ
పట్నా: బిహార్లో గత పార్లమెంట్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఓ జాతీయమీడియాతో మాట్లాడారు.‘‘బిహార్లో మా మిత్ర పక్షాలతో మాట్లాడాను. మేము గత 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్ ఒక్క సీటులో ఓడిపోయాం. ఈసారి ఓడిపోయిన ఆ ఒక్క సీటులోను విజయం సాధిస్తాం. బిహార్ రాష్ట్ర ప్రజలతో నాకు బలమైన అనుబంధం ఉంది. సంస్థాగత పనులపై బిహార్లో ప్రాంతాల్లో పర్యటించాను. బిహార్ ప్రాంతం, ఇక్కడి ప్రజలతో చాలా మంచి అనుబంధం ఉంది.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి పార్టీలు అధిక సంఖ్యలో గెలిచి.. 400 స్థానాల లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ కొత్త సంకల్పంతో బిహార్ రంగులతో ఉంది. దానికి బలాన్ని చేకూరుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న సానుకూల వాతావరణ బిహార్లో అద్దం పడుతోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.40 ఎంపీ సీట్లు ఉన్న బిహార్లో బీజేపీ కూటమి మొత్తం 39 సిట్లను గెలుచకుంది. ఒక్కసీటును కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి గెలుపొందింది. -
నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
దేశంలో నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ''నాలుగో దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు.. యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం''.. అన్నారు.लोकसभा चुनाव के चौथे चरण में आज 10 राज्यों और केंद्र शासित प्रदेशों की 96 सीटों पर मतदान हो रहे हैं। मुझे विश्वास है कि इन सभी सीटों पर लोग भारी संख्या में मतदान करेंगे, जिसमें युवा और महिला वोटर बढ़-चढ़कर हिस्सा लेंगे। आइए, अपने कर्तव्य को निभाएं और लोकतंत्र को मजबूत करें!— Narendra Modi (@narendramodi) May 13, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఉద్దేశించి.. ''ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను''... అంటూ మోదీ ట్వీట్ చేశారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను.ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను .— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
2024 లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ మొదలైపోయింది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 5, జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో ఒక లోక్సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది.నాలుగో దశ ఎలక్షన్స్ 2024 - ఆసక్తికర విషయాలులోక్సభ నాలుగవ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. పోల్ ప్యానెల్ ప్రకారం, 96 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 4,264 నామినేషన్లు దాఖలయ్యాయి.తెలంగాణ (1,488) నుంచి అత్యధికంగా నామినేషన్ పత్రాలు అందాయని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాల నుంచి 1,103 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల సంఘం తెలిపింది.ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది.ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో ఇది మొదటి ప్రధాన ఎన్నికలు.బీజేపీ నేతృత్వంలోని NDA లోక్సభ ఎన్నికల నాలుగో దశలో పోలింగ్ జరగనున్న 96 స్థానాల్లో 40కి పైగా ఎంపీలు ఉన్నారు.కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్, బీహార్), నిత్యానంద్ రాయ్ (ఉజియార్పూర్, బీహార్), రావుసాహెబ్ దాన్వే (జల్నా, మహారాష్ట్ర ఉన్నారు.మహారాష్ట్రలోని బీజేపీకి చెందిన పంకజా ముండేతో పాటు పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్లో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ విజయం కోసం పోటీ పడుతున్నారు.నాలుగో దశలో పోలింగ్ జరగనున్న పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పోలింగ్ రోజున ఈ ప్రాంతాల్లో వేడిగాలులు వీచే పరిస్థితులు ఉండవని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.2024 లోక్సభ ఎన్నికల మొదటి మూడు దశల్లో ఓటింగ్ శాతం వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65.68 శాతంగా నమోదైంది. -
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
ఢిల్లీ: ఎన్నికల్లో కొంతమంది పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కాకుండా.. నోటా గుర్తుకు ఓటు వేస్తుంటారు. ఇటీవల ఇండోర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.ఇండోర్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు (సోమవారం) జరుగుతున్న నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.నిజానికి నోటా గుర్తుకు 99 శాతం మంది ఓటు వేసి, ఒక్కరు అక్కని పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేసినా.. ఆ అభ్యర్థే విజేతగా నిలుస్తారని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ పేర్కొన్నారు. అయితే ఒక నియోజక వర్గంలో నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు.. అక్కడి అభ్యర్థిని అక్కడి ప్రజలు ఎన్నుకోవడానికి సుముఖత చూపడం లేదని దానిపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. దీనివల్ల పార్లమెంటు, ఎన్నికల కమిషన్లపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement