తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఎంసెట్-2 పేపర్ లీకేజ్ కేసుపై ముఖ్యమంత్రితో చర్చించారు.
తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు ఇక్బాల్ అనుచరుడు రాజేష్ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కన్సల్టెన్సీ యజమాని రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సీఐడీ అధికారులు కాసేపట్లో ప్రకటించే అవకాశముంది.