రెండు పెగ్గులేస్తే ఫ్రంట్, బ్యాక్ తెలియదు | Revanth Reddy Criticises CM KCR | Sakshi
Sakshi News home page

రెండు పెగ్గులేస్తే ఫ్రంట్, బ్యాక్ తెలియదు

Published Wed, Mar 7 2018 6:33 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Revanth Reddy Criticises CM KCR - Sakshi

రేవంత్‌రెడ్డి

సాక్షి, సిరిసిల్ల: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడి(కల్వకుంట్ల దోపిడి) పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తమ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దేవుడిని చేయాలంటాడేమో!
‘రెండు పెగ్గులేస్తే ఫ్రంట్ ఏదో, బ్యాక్ ఏదో తెలియని కేసీఆర్‌కి థర్డ్ ఫ్రంట్ అవసరమా? తెలంగాణలో ఆంధ్రోడి పెత్తనం ఏంటని తెలంగాణ రాష్ట్రం కావాలన్నాడు. ఇప్పుడు కేంద్రం పెత్తనం ఏంటని ప్రధానమంత్రిని చేయాలంటున్నాడు. రేపు ప్రజల మీద దేవుడి పెత్తనమేందని నన్ను దేవుడిని చేయాలంటాడేమో!’

కమీషన్ల కేటీఆర్‌
‘కేటిఆర్‌ను ఉద్యమ నాయకుడి కొడుకు అని గెలిపిస్తే సిరిసిల్ల ప్రజల నెత్తినెక్కి నాట్యమాడుతున్నాడు. బతుకమ్మ చీరల పేరుతో రూ.150 కోట్ల కమీషన్ కొట్టేసిన చరిత్ర కేటీఆర్‌ది. మైనింగ్ శాఖ హరీశ్‌రావు నుంచి గుంజుకుని కేటీఆర్‌కి కట్టబెట్టారు. మరి నా కథేందని సంతోష్‌రావు అడిగితే ఆయనకు ఇసుక రీచ్‌లు అప్పగించారు. ఇప్పుడు రాజ్యసభకి పంపిస్తున్నారు’

పేదోడి ప్రాణాలకు విలువ లేదా?
‘నేరెళ్ల బాదితులు తగలబెట్టిన లారీలను మేం కొనిస్తాం, లారీల ప్రమాదంలో చనిపోయిన వారిని తిరిగి తీసుకొస్తారా? తెచ్చిన తెలంగాణాలో పేదోడి ప్రాణాలకు విలువ లేదా? పన్ను కట్టలేదని గౌడ సోదరులను ఎక్సైజ్ కార్యాలయంలో నిర్భందిస్తారా? 4200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రైతుని పరామర్శించిన పాపాన పోలేద’ని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement