
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 263వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి ఎస్పార్ పురం కాలనీ, దబ్బండ క్రాస్, ఎస్సార్ పురం క్రాస్, సత్తరువు వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్ క్యాంప్ నుంచి బొంతువాని పాలెం, సొంత్యం జంక్షన్, దిబ్బడి పాలెం జంక్షన్ మీదుగా గుమ్మడివాని పాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.