
మయన్మార్లో భూకంపం సంభవించింది. ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మయన్మార్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

స్వల్ప వ్యవధిలో 6.8 తీవ్రతతో భూకంపం నమోదైంది.

సాగైంగ్కు 16కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

మయన్మార్లో ఇప్పటివరకు 20 మంది మరణించినట్లు స్థానిక మీడియా నివేదించింది.











