BlackRock
-
అదానీ గ్రూప్లో రూ. 2,165 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ చేపట్టిన బాండ్ల జారీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. అదానీ గ్రూప్ 75 కోట్ల డాలర్ల(రూ. 6,500 కోట్లు) విలువైన బాండ్ల జారీని చేపట్టగా.. 25 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,165 కోట్లు)తో సబ్స్క్రయిబ్ చేసినట్లు తెలుస్తోంది.సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 3–5ఏళ్ల కాలపరిమితితో అదానీ గ్రూప్ ఈ బాండ్లు విడుదల చేసింది. కాగా.. గతేడాది నవంబర్లో లంచం ఆఫర్ చేసిన కేసు నమోదుకావడంతో అదానీ గ్రూప్పై యూఎస్ న్యాయశాఖ పరిశోధనకు తెరతీసింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ బాండ్లలో బ్లాక్రాక్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
భారత్లో బ్లాక్రాక్ కొత్తగా 1,200 ఉద్యోగాలు
ప్రపంచంలోనే ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్రాక్ ఇంక్.(BlackRock) భారత్లో సుమారు 1,200 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. దీని ద్వారా దేశంలో తన ఉద్యోగుల సంఖ్యను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను పెంచడం, ముంబై, గుర్గావ్లో ఐహబ్స్గా పిలువబడే దాని సపోర్ట్ హబ్లను పెంచేందుకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.వ్యూహాత్మక విస్తరణమెరుగైన అసెట్ మేనేజ్మెంట్ సేవల కోసం ఏఐను ఉపయోగించుకోవాలనే బ్లాక్రాక్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇంజినీర్లు, డేటా నిపుణులతో సహా కృత్రిమ మేధ సాంకేతికతల అభివృద్ధి, వాటిని అమలు చేసే విభాగాల్లో రిక్రూట్మెంట్ ఉంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. ముంబై, గుర్గావ్లోని బ్లాక్రాక్ ఐహబ్లు ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్, బిజినెస్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్ వంటి విలువ ఆధారిత సేవలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులతో మొత్తం భారత్లో వీరి సంఖ్య 3,500కు చేరుతుంది.ఇదీ చదవండి: గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలుప్రికిన్ కొనుగోలుబ్లాక్రాక్ సంస్థ ప్రికిన్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీను కూడా కొనుగోలు చేయనుంది. దాంతో బెంగళూరులో 1,500 మంది ఉద్యోగులతో గ్లోబల్ సామర్థ్యాల కేంద్రాన్ని బ్లాక్రాక్ సొంతం చేసుకోనుంది. ఈ కొనుగోలు సంస్థ డేటా ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతున్నారు. సంస్థకు కీలకమైన కార్యకలాపాల స్థావరంగా ఈ బెంగళూరు కార్యాలయం ఉంటుందని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా ముంబై శివారులోని గోరేగావ్లో అదనపు కార్యాలయ స్థలాన్ని ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్ నుంచి బ్లాక్రాక్ లీజుకు తీసుకుంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య దాదాపు రూ.400 కోట్లు (45.9 మిలియన్ డాలర్లు) విలువైన డీల్ కుదిరింది. -
స్టాక్ బ్రోకింగ్లోకి జియో అడుగు.. ఇక దూకుడే!
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services), యూఎస్ కంపెనీ బ్లాక్ రాక్ (BlackRock) తమ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంపై రూ.117 కోట్లను తాజాగా ఇన్వెస్ట్ చేసినట్టు ప్రకటించాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్ రాక్ చెరో 50 శాతం వాటాతో ‘జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజర్స్ ప్రైవేటు లిమిటెడ్’ను ఏర్పాటు చేయడం తెలిసిందే.జియో బ్లాక్ రాక్ అస్సెట్ మేనేజర్స్కు సంబంధించి రూ.117 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను (రూ.10 ముఖ విలువ) జియో ఫైనాన్షియల్, బ్లాక్రాక్కు (చెరో 5.85 కోట్ల షేర్లు) కేటాయించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. ఇరు సంస్థలు ఇప్పటికే చెరో రూ.82.5 కోట్ల చొప్పున ఆరంభ పెట్టుబడి పెట్టడం గమనార్హం. అలాగే, ఇరు సంస్థలూ కలసి తమ జాయింట్ వెంచర్ కంపెనీ జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా ‘జియో బ్లాక్రాక్ బ్రోకింగ్ ప్రైవేటు లిమిటెడ్’ను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ ద్వారా స్టాక్ బ్రోకింగ్ వ్యాపారం నిర్వహించనున్నాయి. వృద్ధిలో స్టాక్ బ్రోకరేజ్ పరిశ్రమభారతీయ స్టాక్ బ్రోకరేజ్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించింది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం డిజిటల్ స్వీకరణలో పెరుగుదల నేపథ్యంలో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు తరలివస్తున్నారు. మార్కెట్లు, పెట్టుబడి అవకాశాలను సులభంగా అందుకునేందుకు ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. దీంతో జెరోధా (Zerodha), ఏంజిల్ వన్ (Angel One), అప్స్టాక్స్ (Upstox), ఫైవ్పైసా (5Paisa) వంటి ప్రముఖ సంస్థల వృద్ధికి దారితీసింది.ఈ ప్లాట్ఫామ్లు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్లు, పోటీ ధర, అధునాతన సాధనాలను అందించడం ద్వారా పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చాయి. స్టాక్ ట్రేడింగ్ను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత, ఈక్విటీ మార్కెట్లలో పెరుగుతున్న ఆసక్తి, డిజిటల్ ఫైనాన్స్ను ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలతో భారతీయ బ్రోకరేజ్ పరిశ్రమ అపారమైన వృద్ధి సామర్థ్యంతో బలమైన భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంది.జియో ఫైనాన్స్ క్యూ3 ఫలితాలుజియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2024 డిసెంబర్కి అమ్మకాలలో స్వల్ప పెరుగుదలను నివేదించింది. 2023 డిసెంబర్ నాటి రూ. 414 కోట్ల నుంచి 5.8% వృద్ధిని నమోదు చేసి రూ. 438 కోట్లకు పెరిగాయి. అయితే ఎబిటా (EBITDA) 2.2% స్వల్ప క్షీణతను చూసింది. రూ.320 కోట్ల నుంచి రూ. 313 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభాల మార్జిన్ (OPM) కూడా క్షీణిచించింది. 2023 డిసెంబర్లో ఉన్న 77% నుండి 2024 డిసెంబర్లో 71%కి పడిపోయింది. మార్జిన్లలో క్షీణత ఉన్నప్పటికీ, నికర లాభం స్థిరంగా ఉంది. స్వల్పంగా 0.3% రూ. 294 కోట్ల నుంచి రూ. 295 కోట్లకు పెరిగింది. కార్యాచరణ సామర్థ్యం, మార్జిన్ కంప్రెషన్లో సవాళ్లు ఉన్నప్పటికీ ఇది స్థిరమైన లాభదాయకతను సూచిస్తోంది. -
కొత్త బిజినెస్లోకి అంబానీ.. రూ.1200 కోట్ల పెట్టుబడి!
భారతదేశంలోని సంపన్నుల జాబితాలో అగ్రగణ్యుడుగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మ్యూచువల్ ఫండ్ రంగంలోకి ప్రవేశిస్తారంటూ కొన్ని వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్లాక్రాక్ భాగస్వామ్యంతో మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్లికేషన్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన బ్లాక్రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ మార్కెట్ కలిగి ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు కలిసి మ్యూచువల్ ఫండ్ విభాగంలో ప్రవేశించడానికి 50:50 ప్రాతిపదికన ఒక్కొక్కరు 150 మిలియన్ డాలర్లు (రూ. 12,48,63,52,500) పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ! జియో, బ్లాక్రాక్ రెండూ కలిసి భారతదేశంలో పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందించే దిశగా అడుగేస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్ విభాగం జోరుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జియో ఫైనాన్షియల్ దీనిపై ద్రుష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. -
బ్లాక్రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. దేశంలో ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆ రంగంలోని ప్రత్యర్థులను ఢికొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ బ్లాక్రాక్తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇటీవల డీమెర్జ్ అయిన జియో ఫైనాన్సియల్స్తో కలిసి ఒక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇరు సంస్థల సమ భాగస్వామ్యంతో జియో బ్లాక్రాక్ అనే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొత్తం 300 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతమ జాయింట్ వెంచర్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విడిపోయిన కొద్ది రోజులకే ఈ డీల్ కుదుర్చుకోవడం విశేషంగా నిలుస్తోంది. జూన్ చివరి నాటికి 9.4 ట్రిలియన్ డాలర్లు ఆస్తుల నిర్వహణలో ఉన్న బ్లాక్రాక్తో దాదాపు 20 బిలియన్ డాలర్లు మార్కెట్ క్యాప్తో ఉన్న జియో ఫైనాన్సియల్స్ డీల్ కీలకమైన, వ్యూహాత్మకమైన వ్యాపార నిర్ణయంగా మార్కెట్ నిపుణుల అంచనా. (షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్తో కలిసి భారతదేశంలో రాబోయే జాయింట్ వెంచర్ ద్వారా ఇండియాలో తమ ఉనికిని మరింత విస్తరణకు కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని, బ్లాక్రాక్కు ఇది కీలక అడుగు అని బ్లాక్రాక్ చైర్మన్, సీఈవో లారీ ఫింక్ లింక్డ్ఇన్ పోస్ట్లో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు, రిస్క్ మేనేజ్ మెంట్లో బ్లాక్రాక్ లోతైన నైపుణ్యంతో, సాంకేతిక సామర్థ్యం జియో ఫైనాన్షియల్స్ లోతైన మార్కెట్ నైపుణ్యం కలగలిసి తమ డిజిటల్ ప్రొడక్ట్స్ డెలివరీ బాటలు వేస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో హితేష్ సేథియా చెప్పారు. (Maruti Jimny Into Camping Setup: మారుతి జిమ్నీని సింగిల్ బెడ్తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో)