heat weather
-
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
సాక్షి స్పెషల్ డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల రైతులు ఈ సమయంలో దుక్కులు దున్నుకోవాలని రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బులెటిన్ విడుదల చేశారు.మామిడి పంటలో పండు ఈగ నియంత్రణకు ఇదే మంచి సమయమని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగులో ఈ నెల 26 (శనివారం) నుంచి 30 వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తున్నదని వెల్లడించారు.రైతులకు సూచనలు 5 రోజులు మండే ఎండలు.. ఈదురుగాలులతో వర్షాలు.. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని లీలారాణి తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావొచ్చని చెప్పారు. 26న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 27 నుంచి 29 తేదీల మధ్య ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. బులెటిన్లోని ప్రధాన సూచనలు ఇవే..వేసవి దుక్కుల వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న చీడపీడలు కలిగించే పురుగులు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల వేసవి జల్లులను వినియోగించుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంతలు తీసి ఎండకు ఆరనివ్వాలి. దీనివల్ల నేలలోని పురుగులు వాటి గుడ్లు తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు) వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రా. కార్బండజిమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
వేసవి మంటలు?.. అదే జరిగితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పైపైకి!
సాక్షి, హైదరాబాద్: చలి తగ్గింది. మధ్యాహ్నం ఎండ.. అప్పుడే వేసవి వచ్చిందా? అన్నట్టుగా ఉంటోంది. ఈసారి ఎండలు మండిపోతాయా? అని కూడా అనిపిస్తోంది. అమెరికా వాతావరణ పరిశోధన సంస్థ జనవరి అంచనాలు కూడా వేసవి ఉష్ణోగ్రతలు మోత మోగిపోతాయని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశం మొత్తమ్మీద గత మూడేళ్లలో వర్షాలకు ఏమాత్రం కొదవ లేకుండా పోయింది. అదే సమయంలో వేసవిలో విపరీతమైన వడగాడ్పులు వీచాయి. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గత ఏడాది శీతాకాలం చలి వణికించింది. వాతావరణంలో వస్తున్న మార్పులకు ఇవన్నీ తార్కాణాలే. కాగా నాలుగేళ్ల విరామం తరువాత ఈ ఏడాది వేసవి సమయంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని, ఎండలు అసాధారణంగా ఉండే అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు స్పష్టం చేశారు. లా నినా నుంచి ఎల్ నినో వైపు? అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) ఈ ఏడాది వాతావరణంపై గత నెలలో ప్రాథమిక అంచనాలను వెలువరించింది. దాని ప్రకారం ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టుల్లో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడేందుకు యాభై శాతం అవకాశం ఉండగా.. జూలై మొదలుకొని సెపె్టంబర్ వరకు ఏర్పడేందుకు 58 శాతం అవకాశాలున్నాయి. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ చుట్టుపక్కల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడాన్ని ఎల్ నినో అని పిలుస్తారు. ఇదే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గితే అది లా నినా అవుతుంది. కాగా దేశంలో గత మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు కారణమైన లా నినా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఎల్ నినో ఏర్పడేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అయితే కచి్చతంగా ఇలాగే జరుగుతుందని ఇప్పుడే చెప్పలేమని.. రానున్న మూడు నాలుగు నెలల్లో పరిస్థితులు మారినా మారవచ్చని వీరు అంటుండటం ఊరటనిచ్చే అంశం. ఎన్ఓఏఏ మాదిరిగానే భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) కూడా ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలే ఎక్కువని చెబుతోంది. అయితే ఎల్ నినో సీజన్ మొదలయ్యేందుకు ఇంకా మూడు నాలుగు నెలలు ఉన్నందున ఈ అంచనాలు తప్పు కావచ్చునని కూడా పేర్కొంది. కాగా ఈ నెలాఖరుకు తాజా అంచనాలను విడుదల చేస్తామని ఐఎండీ డైరెక్టర్ ఎం.మహాపాత్ర తెలిపారు. సమాచారం ఆందోళనకరమే: స్కైమెట్ ఈ ఏడాది ఎల్ నినో, లా నినా పరిస్థితులపై అందిన ప్రాథమిక సమాచారం ఆందోళనకరంగానే ఉందని దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్కు చెందిన మహేశ్ పలవట్ చెబుతున్నారు. ‘పరిస్థితులు లా నినా నుంచి ఎల్ నినో వైపునకు మారుతున్నాయంటేనే ప్రమాదం ముంచుకొస్తోందని అర్థం. రుతుపవనాల సమయంలో ఎల్ నినో ఏర్పడితే ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 2020లోనే లా నినా పరిస్థితులు ఏర్పడి, ప్రస్తుతం కూడా అదే కొనసాగుతున్నా ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో ఉండటం, గత ఏడాది కొన్నిసార్లు విపరీతమైన వడగాడ్పులు నమోదు కావడం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫ్రిబవరి, మార్చిల్లోనూ ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం అసాధారణ స్థాయిలో ఉండవచ్చు..’ అని పలవట్ పేర్కొన్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోమన్నాం.. మధ్యమ స్థాయి ఎల్ నినో రుతుపవనాలపై ప్రభావం చూపగలదు. దీనివల్ల కురిసే వర్షాల మోతాదు తగ్గుతుంది. కానీ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రం రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉంటాయని చెప్పలేం. రానున్న మూడు నాలుగు నెలల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్లో తేడాల ఆధారంగా రుతుపవనాల తీవ్రతలో తేడాలు రావచ్చు. మొత్తం మీద ఈ సారి ఎండలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించాం. – ఎం.రాజీవన్, ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సగటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత అత్యధిక వేడి నమోదైన సంవత్సరాల్లో 2022ది ఐదో స్థానం. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే ఈ రికార్డులు చెరిగిపోయే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు శతాబ్దం క్రితంతో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు పెరగవచ్చునని అంచనా. గత ఏడాది భారత్లో కనీసం తొమ్మిది నగరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఉత్తర, వాయువ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు రావచ్చని గత ఏడాది ఐఎండీ హెచ్చరించింది. సముద్ర జలాలు వెచ్చబడితే అధిక ఉష్ణోగ్రతలు లా నినా పరిస్థితుల్లో తూర్పు నుంచి పశ్చిమం వైపు వీచే వాణిజ్య పవనాలు బలంగా ఉంటాయి. దీనివల్ల సముద్ర ఉపరితలంపై ఉండే వెచ్చటి నీరు పశి్చమ దిక్కుకు ఎక్కువగా కదులుతుంది. అదే సమయంలో సముద్రపు లోపలి భాగంలోని శీతల జల ప్రవాహాలు తూర్పువైపునకు ప్రయాణిస్తాయి. అధిక వర్షాలకు కారణమవుతాయి. ఎల్ నినోలో పరిణామాలు మాత్రం దీనికి వ్యతిరేక దిశలో ఉంటాయి. వాణిజ్య పవనాలు బలహీనపడి ఉపరితలంపైని వెచ్చటి నీరు తూర్పు దిక్కుకు అంటే మన వైపు ప్రయాణిస్తుంది. అప్పటికే చల్లగా ఉన్న నీటిని ఇవి వెచ్చబెడతాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇండోనేసియా, ఆ్రస్టేలియాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాల్లో తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడిపోతాయి. కరువులు, కార్చిచ్చులు ఎక్కువవుతాయి. -
పసందైన పుచ్చకాయ..
ఎదులాపురం: ప్రస్తుతం ఎండలు అదరగొడుతున్నాయి... ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు ఆహార పదార్థాలను తీసుకునేందుకు ప్రజలు దృష్టి సారిస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ఒక నెల ముందుగానే ఎండ తీవ్రత పెరిగిపోయింది. వేసవిలో ప్రజలు పుచ్చకాయలను పసందు గా తింటుంటారు. ప్రసుత్తం ఆదిలాబాద్ మార్కెట్లో పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువు అధికంగా ఉండడంతో వీ టి కొ నుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది.. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయాలను వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. ఎండ తీవ్రతకు గొంతు తడారిపోకుండా, ఎండలో తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన వ్యక్తి తీసుకుంటే శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గిస్తోంది. చెమట రూపంలో విసర్జన జరిగిన శరీరంలోని నీటి శాతం పడిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో దోహద పడుతోంది. పట్టణంలో విక్రయాలు.. ఆదిలాబాద్ పట్టణంలో ప్రస్తుతం పుచ్చకాయల విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజలు పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ వీటిపై ఆసక్తి క నబర్చుతారు. రుచిగా తియ్యగా ఉండే ఈ కా యల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. ప్రస్తు తం పుచ్చకాయలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఎండలు ముదురుతున్న సమయంలో పుచ్చకాయల రుచిచూడటానికి అందరు ఇష్టపడతారు. కిలో పుచ్చకాయ ధర రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది. ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండలు ముదిరి శరీరంలోని ఖనిజ లవణాలు బయటకు పో యే తరుణంలో పుచ్చకాయ తినడం శ్రేయస్క రం. ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్చౌక్, ఎన్టీఆర్చౌక్, బస్టాండ్ ఏరియా, శివాజీచౌక్, దస్నాపూర్, గాంధీచౌక్, అంబేద్కర్లతో పాటు తదితర ముఖ్య కూడళ్ల లో వీటి విక్రయాలు జోరందుకుంటున్నాయి. భానుడు తన ప్రతాపం చూపించడం ఆరంభిం చడంతో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటూ పు చ్చకాయలపై దృష్టి పెట్టారు. దాహర్తిన్ని తీర్చేందుకు పుచ్చకాయలు ఉపయోగకరం. ప్రజలను ఆకర్షించేలా.. పుచ్చకాయలు మార్కెట్లో అందుబాటులోకి వ చ్చాయి. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని హోల్సేల్కు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారులు తోపుడు బండ్లపై పుచ్చకాయలను విక్రయిస్తున్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా ఐస్ గడ్డలపై ముక్కలు చేసిన పుచ్చకాయలను ఉంచుతూ అమ్ముతున్నారు. రూ.10 కి ఒక ప్లేట్ చొప్పున అమ్ముతూ, వాటిపై మసాల, ఉప్పు లాంటివి చల్లి ఇస్తుండడంతో ప్రజలు మరింత ఇష్టంగా వాటిని తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు. -
ఉష్ణశాపం - ఎల్ఇనో