Mark Shankar Pawanovich
-
సింగపూర్ నుంచి ఇండియాకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఫ్యామిలీ
-
ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్..: జూనియర్ ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) అగ్నిప్రమాదంలో గాయపడ్డ ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలి. లిటిల్ వారియర్.. ధైర్యంగా ఉండు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులకు బలం చేకూరాలంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశాడు.ఏం జరిగిందంటే? పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ వేసవి శిక్షణ తరగతులకు సింగపూర్లోని రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్కు వెళ్లాడు. ఏప్రిల్ 8న ఈ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. దీంతో వెంటనే స్కూల్ యాజమాన్యం అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. ప్రస్తుతం శంకర్కు బ్రాంకోస్కోపీ చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే చిన్న కుమారుడికి ఇలా జరగడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.— Jr NTR (@tarak9999) April 9, 2025 చదవండి: Saptagiri: విషాదం.. బాధలో కమెడియన్ సప్తగిరి -
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
హైదరాబాద్, సాక్షి: సింగపూర్లో తన చిన్నకొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar Pawanovich) ప్రమాదానికి గురి కావడంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) స్పందించారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని.. తన కొడుకుకు గాయాలైన మాట వాస్తవమేనని ధృవీకరించారాయన. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.ఉదయం అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. సింగపూర్ హైకమిషనర్ సమాచారం అందించారు. నా కొడుకు మార్క్ శంకర్ స్కూల్లో ప్రమాదం జరిగింది. మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నా. కానీ, ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ పసిబిడ్డ చనిపోయింది. నా కుమారుడు మార్క్ శంకర్కు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లినట్లు తెలిసింది. ప్రధాని మోదీ ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. నా పెద్దకొడుకు అకీరా పుట్టినరోజే చిన్నకొడుక్కి ఇలా జరగడం బాధాకరం’’ అని పవన్ అన్నారు. సింగపూర్లో నా కుమారుడి అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ(PM Modi)కి ధన్యవాదాలు. అలాగే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ సహా అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని పవన్ అన్నారు.ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో సింగపూర్(Singapore) రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్-అన్నాలెజినోవాలకు కూతురు పోలేనా అంజనా పవనోవా, కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సంతానం. -
సింగపూర్లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ (Mark Shankar Pawanovich) చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ను వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో అక్కడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. -
‘మార్క్ శంకర్ పవనోవిచ్’ ముందు తలవొంచుతున్నా..
వెబ్ డెస్క్ : ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ ఇతనెవరో తెలుసా?. పవన్ కళ్యాణ్కు నాలుగో సంతానంగా అన్నా లెజినోవాకు జన్మించిన బాబుకు పెట్టిన పేరు. ఈ పేరును విన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాసేపు ఆశ్చర్యపోయారు. తర్వాత ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. భాషల పుట్టుక తర్వాత తాను విన్న పేర్లలో అతి గొప్పది ఇదేనని అన్నారు. క్రైస్తవ మత ఆరంభానికి ముందు కాలం నాటి నుంచి.. అసలు మనుషులు సంభాషించుకోగలరా? అని ఈజిప్టుకు చెందిన పారా సమెథికస్ I పరిశోధనలు చేసిన కాలం నుంచి వెతికినా ఇలాంటి పేరు వినలేదని తన పోస్టులో రాసుకొచ్చారు ఆర్జీవీ. ‘మార్క్ శంకర్ పవనోవిచ్’లో పవన్ ఆరిజినేటర్ శంకర్తో పాటు రష్యన్స్కు చెందిన ఓవిచ్ కూడా ఉందన్నారు. కూతురితో మాటల యుద్ధం.. ఆర్జీవీ చేసిన పోస్టుకు ఆయన కూతురు రేవతి వర్మ స్పందించారు. ‘మీరు చేసిన పోస్టులో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఊసుపోక సామాన్యులకు అందని పదాలతో పోస్టులు చేయడం సరికాదు. అసలు ఆ చరిత్రకు పేరుకు పొంతన ఏముంది?.’ అని కామెంట్ చేశారు. రేవతి కామెంట్పై స్పందించిన ఆర్జీవీ.. ‘మీకు అర్థం చేసుకోవడం రాదని మీరు చేసిన కామెంట్ చెబుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ను నేను ప్రేమిస్తున్నాను. మీకంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించినంతగా పవన్ను మీరు ప్రేమించలేరు’. అని రేవతి చేసిన కామెంట్కు సమాధానం ఇచ్చారు ఆర్జీవీ. అనంతరం ఈ సంభాషణ మొత్తాన్ని మరో పోస్టు కూడా చేశారు.