భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం

Published Tue, Apr 29 2025 7:15 AM | Last Updated on Tue, Apr 29 2025 7:15 AM

భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం

భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం

కాళేశ్వరం/పలిమెల: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. మహదేవపూర్‌ మండలకేంద్రం, పలిమెల మండలకేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్‌ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్‌లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్‌ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, తహసీల్దార్‌ ప్రహ్లాద్‌ రాథోడ్‌, అనిల్‌, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, వ్యవసాయ అధికారి సుప్ర జ్యోతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement