breaking news
Gold
-
బంగారం, వెండి క్రాష్..!
సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గత 12 ఏళ్లలోలేని విధంగా పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 6.3 శాతం పతనంకాగా.. వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7 శాతం పడిపోయింది. వెరసి యూఎస్ కామెక్స్లో ఔన్స్ పసిడి ధర 4,082 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్ 47.89 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా బంగారం 10 గ్రాములు కనీసం రూ. 6,000 తగ్గవలసి ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.దేశీయంగా ఇటీవల బంగారం 10 గ్రాములు రూ. 1,34,800ను తాకగా.. వెండి రూ. 1,85,000కు చేరిన విషయం విదితమే. అయితే డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దిగుమతి సుంకం మదింపు తదుపరి ధరలు నిర్ణయమయ్యే సంగతి తెలిసిందే. ఈ బాటలో పలాడియం, ప్లాటినం ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో 7 శాతం చొప్పున పతనం కావడం గమనార్హం! కాగా.. 2025 డిసెంబర్ ఫ్యూచర్స్ పసిడి రాత్రి 10.30 ప్రాంతంలో 5.5 శాతం (237 డాలర్లు) క్షీణించి 4,122 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 4,393 డాలర్లకు చేరగా.. 4,095 డాలర్ల వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 7.36 శాతం పడిపోయి 47.60 డాలర్ల వద్ద కదులుతోంది. ఒక దశలో 51.61 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 47.14 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. కారణాలేటంటే? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్కు దారితీస్తున్నట్లు వివరించారు. -
టపాసులా పేలిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు, ఎక్కడికి వెళ్లినా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇంకొందరైతే గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి.. అరబ్ దేశాలకు వెళ్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిబంధనల ప్రకారం.. భారతీయ ప్రయాణికుల వద్ద ఎంత విలువైన బంగారం ఉంటే డిక్లేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.భారతీయులు యూఏఈ (UAE)కి ప్రయాణించే సమయంలో తమ వద్ద ఉన్న బంగారం విలువ రూ.13.5 లక్షల(AED 60,000)కు మించి ఉంటే, దానికి డిక్లేర్ (declare) చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు వెంట తీసుకెళ్లే బంగారం విలువ.. ఈ పరిమితికి మించి ఉంటే, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.పరిమితికి మించి బంగారం తీసుకెళ్లడానికి లీగల్గా ఎలాంటి అనుమతి ఉండదు. కాబట్టి దీనికి ట్యాక్స్, డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు, పండుగలు లేదా గిఫ్ట్ రూపంలో.. సాంప్రదాయకంగా బంగారు ఆభరణాలను తీసుకెళ్లే భారతీయ పర్యాటకులు, NRIలు, వ్యాపార ప్రయాణికులు ఆ విషయాన్ని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిక్లేర్ చేయకుండా ఎక్కువ బంగారం తీసుకెళితే, దానిని సీజ్ చేయవచ్చు. లేదా మీకు భారీ జరిమానా పడవచ్చు లేదా జైలుశిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. -
గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్
పెరుగుతున్న బంగారం ధరలు.. ఆర్ధిక శ్రేయస్సు కంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిని సూచిస్తుందని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఎమ్ఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ రాసిన కథనంపై స్పందిస్తూ.. యూఎస్ మార్కెట్లపై చేసిన అంచనాతో తాను ఏకీభవిస్తున్నానని శ్రీధర్ వెంబు చెప్పారు. ''అమెరికా స్టాక్ మార్కెట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం కూడా ఒక పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సూచిస్తోంది. నేను బంగారాన్ని పెట్టుబడిగా భావించను, దానిని ఆర్థిక ప్రమాదానికి బీమాగా భావిస్తున్నాను. వ్యవస్థలోని అన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి AI కృషి చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని ఆయన ట్వీట్ చేశారు.గీతా గోపీనాథ్ ఏమన్నారంటే?వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇటీవల బాగా దెబ్బతింది. డాట్ కామ్ క్రాష్ తరువాత జరిగిన దానికంటే.. స్టాక్ మార్కెట్ కరెక్షన్ మరింత తీవ్రమైంది. టారిఫ్ యుద్ధాలు.. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతర్లీన సమస్య అసమతుల్య వాణిజ్యం కాదు అసమతుల్య వృద్ధి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని మరిన్ని దేశాలు/ప్రాంతాల్లో అధిక వృద్ధి మరియు రాబడి అవసరం.పెట్టుబడిదారులు చాలావరకు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోతోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడం మాత్రమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వంలో కొత్త ఆందోళనలు పుడుతున్నాయి. ఈ తరుణంలో 2026 జనవరి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు.. ముఖ్యంగా చైనా, జపాన్లలో బలమైన డిమాండ్ కారణంగా ప్రపంచ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) వ్యవస్థాపక సభ్యుడు & మాజీ చైర్మన్ అనంత పద్మనాబన్ పేర్కొన్నారు.I agree with Dr Gita Gopinath.The US stock market is in a clear and massive bubble.The degree of leverage in the system means that we cannot rule out a systemic event like the global financial crisis of 2008-9. Gold is also flashing a big warning signal. I don't think of… https://t.co/7xVPL3FXDq— Sridhar Vembu (@svembu) October 18, 2025 -
బంగారాన్ని దోచేస్తున్నారు.. జాగ్రత్త అక్కా!
-
రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు..
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich dad Poor dad) రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ద్రవ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి పెట్టుబడుల పెరుగుదల అనేది వ్యవస్థల వైఫల్యానికి సంకేతమని అని ఆయన హెచ్చరించారు. అమెరికా బేబీ బూమర్ (1946-1964 మధ్య పుట్టినవారు)తరగతికి ఈ ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపించబోతుందని ఆయన భావిస్తున్నారు."ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు" అంటూ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. "కానీ ద్రవ్యోల్బణం పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది." ధరలు పెరుగుతున్నప్పుడు, ఫియట్ మనీ లేదా "నకిలీ డబ్బు" సామాన్య అమెరికన్ల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం వంటి "నిజమైన డబ్బు" లో ఆదా చేయాలని ప్రజలకు సూచించారు.అక్టోబర్ లో బంగారం ధరలో జరిగిన నాటకీయ ర్యాలీని అనుసరించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం, బంగారం ప్రపంచవ్యాప్తంగా ఔన్సుకు 4,250 డాలర్లు, భారతదేశంలో 10 గ్రాములకు రూ.1.31 లక్షల వద్ద (అక్టోబర్ 18 నాటికి) ట్రేడ్ అవుతోంది. వెండి కూడా దూసుకెళ్తోంది. అయితే బిట్ కాయిన్ మార్కెట్ గందరగోళం మధ్య 1,21,000 డాలర్ల నుండి 108,000 డాలర్లకు పడిపోయింది.1947 లో జన్మించిన రాబర్ట్ కియోసాకి, తన లాంటి బేబీ బూమర్ తరగతికి ఈ ద్రవ్యోల్బణం బలమైన హానిని కలిగించే అవకాశం ఉందని చెప్పారు. "ద్రవ్యోల్బణం ద్వారా మనం పూర్తిగా తుడిచిపెట్టకుపోతామని" ఆయన హెచ్చరించారు. "మీ అమ్మ, నాన్నలు వీధుల్లోకి రావచ్చు ఎందుకంటే ద్రవ్యోల్బణం వారి సామాజిక భద్రతను తుడిచిపెట్టబోతోంది." అన్నారు.THE RICH get RICHER: while I am personally happy gold, silver, Bitcoin, Ethereum are going up…. My concern is the price of life…. AKA…inflation….makes life harder on the poor and middle class.Please do your best to not be a victim of a broken and corrupt monetary system.…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 17, 2025 -
బంగారం, వెండి కొనేవాళ్లకు ‘పండగే’
గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు (Gold Price) ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి (Dhanteras) రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించాయి. దాదాపు వారం రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు (Silver Price) కూడా భారీగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘బంగారం ఓ కొనేస్తున్నారా? ఆ రిస్క్ మాత్రం తప్పదు’
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్టోబర్ 17న తారాస్థాయికి పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,379 డాలర్లని తాకి, తరువాత 4,336 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 4,349 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ పెరుగుదల గత ఐదేళ్లలో బంగారం సాధించిన అతిపెద్ద వారపు లాభంగా నమోదైంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 8% పెరుగుదల నమోదైంది. ఇది 2020 మార్చి తర్వాత అతి పెద్ద వృద్ధి.భారతదేశంలో కూడా బంగారం (gold price) ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,21700కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,32,770గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని “సురక్షిత స్వర్గధామం”గా చూస్తున్నారు. బంగారం ఎక్కువగా కొనేస్తూ దాని మీదే ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నారు.దిద్దుబాటు వస్తే..అయితే, అందరూ ఈ పెరుగుదలపై సంబరాలు చేసుకుంటున్నారనే గమనించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ నిపుణుడు అక్షత్ శ్రీవాస్తవ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. "మీరు 100% బంగారంలో పెట్టుబడి పెట్టినవారైతే, ఇప్పుడు పరిస్థితి బాగున్నట్లే అనిపించొచ్చు. కానీ తిరిగి పెట్టుబడి పెట్టే సమయం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?" అంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆయన పునఃపెట్టుబడి ప్రమాదం (Reinvestment Risk)పై దృష్టి సారిస్తున్నారు. బంగారంలో లాభాల ఆశతో చాలామంది దీన్ని కలవరిస్తూ ఉండొచ్చు కానీ మార్కెట్ దిద్దుబాటు (correction) వచ్చినప్పుడు, దీని ప్రభావం ఈక్విటీల కన్నా తీవ్రమై ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఆస్తుల వైవిధ్యం అవసరంశ్రీవాస్తవ సూచన ఏమిటంటే.. పెట్టుబడులు ఒకే ఆస్తిలో కాకుండా ఈక్విటీలు, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి వివిధ ఆస్తుల్లో విభజించాలి. మరో ముఖ్యమైన అంశం.. బంగారంలో తిరుగులేని పెరుగుదల వల్ల, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPల నుండి పెట్టుబడిదారులు నిధులను తీసివేయొచ్చు. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీని ఫలితంగా ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలు మందగించవచ్చు.బంగారంపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని శ్రీవాస్తవ సూచిస్తున్నారు. బంగారంపై అధిక పన్నులు, లేదా ఈక్విటీ పెట్టుబడులకు పన్ను రాయితీలు వంటి మార్గాల ద్వారా సమతుల్యతను ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. -
ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ధన త్రయోదశి (ధన్తేరాస్) రోజున బంగారం కొనడం భారతదేశంలో ఒక శుభప్రదమైన సంప్రదాయం. ఈ రోజున పసిడిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం పొడవునా సంపద సమకూరుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, రూపాయి విలువ పతనం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా బంగారు ఆభరణాలు కొనడం కంటే మెరుగైన, ఆర్థికపరంగా లాభదాయకమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.నేరుగా ఆభరణాలు కొంటే..ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకోవడం చాలా మందికి ఆర్థిక భారంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా చిన్న వస్తువు కొనుగోలుకు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. బంగారు ఆభరణాల తయారీలో తరుగు రూపంలో కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. వీటికి తయారీ ఛార్జీలు (Making Charges) అదనం. బంగారం ధర, తయారీ ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆభరణాలు అమ్మినప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు కారణంగా కొనుగోలు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంది.ఈ ఛార్జీలు, నష్టాల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి నిపుణులు మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన, పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి.గోల్డ్ ఈటీఎఫ్లుగోల్డ్ ఈటీఎఫ్లు అనేవి స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో షేర్ల మాదిరిగా ట్రేడ్ చేయబడే ఫండ్లు. ఇవి దేశీయ భౌతిక బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. వీటిని లైవ్ మార్కెట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు ఉండవు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. భౌతిక బంగారంలాగా దొంగిలించబడుతుందనే భయం ఉండదు. రియల్ టైమ్ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా అవసరం.డిజిటల్ గోల్డ్PhonePe, Paytm వంటి యాప్ల ద్వారా 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని కొద్ది మొత్తంలో డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారం మీ తరపున భౌతిక రూపంలో లాకర్లో నిల్వ చేస్తారు. అయితే అమ్మాలనుకుంటే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విధానంలో చాలా తక్కువ డబ్బుతో కూడా కొంత మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. భౌతికంగా నిల్వ చేయాలనే ఆందోళన అవసరం లేదు. అయితే దీనికి కొనుగోలు పరిమితులు ఉంటాయి. ఈ పెట్టుబడి RBI లేదా SEBI నియంత్రణలో ఉండదని గమనించాలి.ఇదీ చదవండి: లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే.. -
శబరిమల బంగారం కేసు.. ప్రధాన నిందితుడు అరెస్ట్
తిరువనంతపురం: శబరిమల(Sabarimala) ఆలయంలో విగ్రహాల బంగారం తాపడం విషయంలో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తాజాగా ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని(Unnikrishnan Potti) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఉన్నికృష్ణన్ను హాజరుపరచనున్నారు.కాగా, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టిని ఆయన ఇంట్లో (పులిమత్లో) అదుపులోకి తీసుకున్నట్లు (సిట్) అధికారులు తెలిపారు. అనంతరం, తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారించారని సిట్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం సిట్ ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ కె.సునీల్ కుమార్ను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ గతంలో సస్పెండ్ చేశారు. కాగా, ఈ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న రిటైర్డ్ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.#WATCH | Thiruvananthapuram, Kerala | Unnikrishnan Potti, the prime accused in the Sabarimala gold theft case, has been arrested after over ten hours of questioning by the Special Investigation Team (SIT). The arrest was officially recorded at 2:30 a.m. on Friday. Unnikrishnan… pic.twitter.com/AMqUBpLric— ANI (@ANI) October 17, 2025జరిగింది ఇదీ.. శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించడం జరిగింది. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది.అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. అలాగే ముందుస్తు అనుమతి తీసుకోకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడం పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. -
Gold Rates: వణికిస్తున్న బంగారం
-
‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా పసిడి, వెండి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్ 18న ధన త్రయోదశికి ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: యూఏఈలో 6జీ కనెక్టివిటీ టెస్ట్ విజయవంతం(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి పండుగ..
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పసిడి మరో కొత్త మైలురాయి దాటింది. మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర మరో రూ. 2,850 పెరిగి ఏకంగా రూ. 1.30 లక్షలను అధిగమించింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30,800కి చేరింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా అంతే పెరిగి రూ. 1,30,200కి చేరింది. మరోవైపు, వెండి సైతం కేజీకి రూ. 6,000 ఎగిసి సరికొత్త జీవిత కాల గరిష్టమైన రూ. 1,85,000ని తాకింది.పండుగ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ గణనీయంగా పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 88.80కి పడిపోవడం వంటి అంశాలు పసిడి పెరుగుదలకు కారణమని ట్రేడర్లు తెలిపారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో (ఎంసీఎక్స్) డిసెంబర్ కాంట్రాక్టు రూ. 2,301 పెరిగి రూ. 1,26,930కి చేరింది. ఫిబ్రవరి కాంట్రాక్టు సైతం రూ. 2,450 ఎగిసి రూ. 1,28,220 రికార్డు స్థాయిని తాకింది. పుత్తడికి దీటుగా వెండి డిసెంబర్ కాంట్రాక్టు కూడా కేజీకి రూ. 8,055 పెరిగి రూ. 1,62,700 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా కామెక్స్లో గోల్డ్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 1% పెరిగి ఆల్టైమ్ గరిష్టమైన 4,190 డాలర్లను తాకింది. భౌగోళిక–రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, రేట్ల కోత అంచనాలు, ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 60% పెరిగి కీలకమైన 4,100 డాలర్ల మార్కును దాటిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా కొరత వల్ల వెండి ఔన్సు ధర కూడా 52 డాలర్లను దాటిందన్నారు. వెండి ధర దేశీయంగా రూ.1,94,639కి, అంతర్జాతీయంగా 59.89 డాలర్లకు పెరగవచ్చని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ తెలిపారు. -
Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు
-
ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్ 18న దంతేరాస్కు ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశం.. కోటక్ నుంచి గోల్డ్, సిల్వర్ ఫండ్
కోటక్ మహీంద్రా ఏఎంసీ కొత్తగా గోల్డ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) అక్టోబర్ 20తో ముగుస్తుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ప్రధానంగా కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF), కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF)యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది.బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తూ, దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం ఈ ఫండ్ లక్ష్యమని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, పరిశ్రమల్లో వెండి వాడకం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రెండింటి వృద్ధి ప్రయోజనాలను పొందేందుకు ఈ ఫండ్ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇన్వెస్కో ఇండియా కన్జంప్షన్ ఫండ్ దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా కన్జంప్షన్ ఫండ్ని (Invesco India Consumption Fund) ప్రవేశపెట్టింది ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ అక్టోబర్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. రోజువారీ సిప్ రూపంలో అయితే కనీసం రూ. 100, నెలవారీ అయితే రూ. 500 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు.వినియోగం థీమ్తో ప్రయోజనం పొందే కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సాధనాల్లో కనీసం 80% ఇన్వెస్ట్ చేస్తుంది. మనీష్ బొద్దార్, అమిత్ గణాత్రా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. ట్యాక్స్ శ్లాబులు మార్చడం, జీఎస్టీ సంస్కరణలు మొదలైనవి వినియోగానికి మరింతగా ఊతమిస్తాయని సంస్థ సీఈవో సౌరభ్ నానావటి తెలిపారు. -
బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే..
బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ (Street Smarts: Adventures on the Road and in the Markets) చాలా ప్రసిద్ధి చెందింది.ఇటీవల జిమ్ రోజర్స్ (Jim Rogers) బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల వద్ద కొత్తగా కొనుగోలు చేసే ఆలోచన తనకు లేకపోయినా, ధరలు తగ్గితే మరింత కొనడానికి ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.రోజర్స్ పెట్టుబడి తత్వం ఇదే..తాను మార్కెట్ భవిష్యత్తు గురించి లెక్కలు వేస్తూ కూర్చోనని, ఎప్పుడైతే వస్తువుల ధరలు పడిపోతాయో అప్పుడే ఎక్కువగా కొనుగోలు చేస్తానని జిమ్ రోజర్స్ చెప్పుకొచ్చారు. బంగారం (gold), వెండి (silver) వంటి విలువైన లోహాలు తన వద్ద ఉన్నాయని, అవి తన పిల్లలకు మిగలాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఇటీవల వెండి ధరలు దూసుకుపోతున్న తరుణంలో తానూ కొంత వెండి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.ప్రపంచంలోని చాలా దేశాలు భారీగా డబ్బును ముద్రిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం వంటి లోహాలు కరెన్సీ డీ-వాల్యుయేషన్ నుండి తమను తాము రక్షించుకునేందుకు మంచి మార్గమని రోజర్స్ చెప్పారు. ‘భారతీయ మహిళలు శతాబ్దాలుగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. వారికి ఉన్న తెలివితేటలు నేనూ నేర్చుకుంటున్నాను’ అని ఉదహరించారు.మార్కెట్లపై దృష్టిచైనా మార్కెట్లో కొంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ, తన ఇతర పోర్ట్ఫోలియోలో చాలా భాగం విక్రయించానన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లు బలంగా ఉండటాన్ని చూస్తే, తన అభిప్రాయం ప్రకారం ఇది అమ్మే సమయం అని చెప్పారు. జిమ్ రోజర్స్ తరచూ మార్కెట్లో వేచి చూసే పెట్టుబడిదారుల సరసన నిలబడతారు. వారు చెబుతున్నది స్పష్టం.. ధరలు పడితేనే కొనండి, ఎప్పుడూ ట్రెండ్ను అనుసరించవద్దు. బంగారం, వెండిలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలన్నది ఆయన సలహా.ఇదీ చదవండి: ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ నుంచి 10 శక్తివంతమైన డబ్బు పాఠాలు -
నం.1, 2 లోహాలు.. ఎందులో వాడుతున్నారంటే..
బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో అసాధారణ రీతిలో పెరుగుతున్నాయి. ఇటీవల కేజీ వెండి ధర ఏకంగా రూ.1.95 లక్షలకు చేరింది. తులంగా బంగారం రూ.1.20 పైమాటే. ఈ పెరుగుదలకు ప్రధానంగా ఆర్థిక అంశాలు దోహదపడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, దీనికి విరుగుడుగా సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండిపై మదుపరుల దృష్టి మళ్లడం ఒక ముఖ్య కారణం. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను కొనుగోలు చేస్తుండడం వంటివి కూడా ఈ ధరల పెరుగుదలకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక కారకాలు, ఆభరణాల తయారీ మాత్రమే కాకుండా ఈ లోహాలకు అనేక పారిశ్రామిక, అత్యాధునిక రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది.బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే (ductility), రేకులుగా మలిచే గుణం (malleability) వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.బంగారం వినియోగంబంగారాన్ని అత్యధికంగా ఆభరణాల తయారీలో వినియోగించినప్పటికీ దాని ప్రత్యేక లక్షణాల కారణంగా అనేక అత్యాధునిక రంగాల్లో దీనికి ప్రాధాన్యత ఉంది.ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీబంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.వైద్య పరికరాలుబంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.నానోటెక్నాలజీబంగారు నానోపార్టికల్స్కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.గ్లాస్, కిటికీలుకొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.వెండి వినియోగంవెండి కూడా బంగారంతో సమానంగా విస్తృత పారిశ్రామిక అనువర్తనాలను కలిగి ఉంది. ఇది అన్ని లోహాల్లో అత్యుత్తమ విద్యుత్, ఉష్ణ వాహకతను కలిగి ఉంది.సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలుప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.ఎలక్ట్రానిక్స్, కండక్టర్లువెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్లు, ఫ్యూజులు, కనెక్టర్లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలువెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.నీటి శుద్ధి, వైద్య రంగంవెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.ఫొటోగ్రఫీసాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: జరిమానా చెల్లించి, తప్పు అంగీకరిస్తే కేసు మూసివేత!బంగారం, వెండి వాటి ప్రత్యేక భౌతిక, రసాయన లక్షణాలు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వాటి వినియోగాన్ని అనివార్యంగా మార్చాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ, ఏరోస్పేస్, వైద్య పరికరాలు వంటి కీలక రంగాలలో పెరుగుతున్న డిమాండ్ ఈ లోహాల ధరల పెరుగుదలకు ఒక బలమైన పారిశ్రామిక కోణాన్ని జోడిస్తోంది. భవిష్యత్తులో సాంకేతిక ఆవిష్కరణలు పెరిగే కొద్దీ ఈ అమూల్యమైన లోహాల వినియోగం, వాటి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. -
రూ.1.95 లక్షల వద్ద వెండి: దూసుకెళ్తున్న బంగారం!
భారతదేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈ రోజు (అక్టోబర్ 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 320 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు.. చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీకి కూడా క్రేజ్ పెరుగుతోంది. అయితే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తున్న జోహో (Zoho)వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు.. తాను బంగారాన్నే(Gold) నమ్ముతా అంటున్నారు.క్రిప్టో క్రేజ్ లేదా తాజా మార్కెట్ ట్రెండ్లకు లోనుకాకుండా బంగారాన్ని సంపదకు విశ్వసనీయమైన నిల్వగా కొనసాగిస్తున్నారు. కరెన్సీ క్షీణతకు రక్షణగా బంగారాన్ని భావించే శిబిరంలో 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈమేరకు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోప్ట్ పెట్టారు. తనకు క్రిప్టోకరెన్సీలపై ఆసక్తి లేదని, బంగారాన్ని స్థిరమైన, కాలాతీత పెట్టుబడిగా చూస్తానని పేర్కొన్నారు. లిన్ ఆల్డెన్ అనే స్థూల ఆర్థిక వ్యూహకర్త చేసిన విశ్లేషణలో కూడా ఇదే భావనను సమర్థిస్తుందని ప్రస్తావించారు. ఆమె పరిశోధన ప్రకారం, అమెరికా ట్రెజరీ బాండ్లు, స్టాక్స్,రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ద్రవ్యోల్బణాన్ని అనుసరించే బంగారాన్ని దీర్ఘకాలంలో అధిగమించలేకపోయాయి.ఆల్డెన్ చెప్పినట్లు, కేవలం 4 శాతం స్టాకులే మార్కెట్ రాబడికి ముఖ్య కారణమవుతాయి. రియల్ ఎస్టేట్ కూడా పన్నులు, నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల వల్ల బంగారంతో పోలిస్తే తక్కువ పనితీరు చూపించింది.ఇదిలా ఉండగా, 2025లో ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు వంటివి బంగారం ధరలు ఔన్స్కు 4,000 డాలర్లు (రూ. 3.57 లక్షలు) దాటేలా చేశాయి. ఈ పరిణామాలు వెంబు నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్ కియోసాకిశ్రీధర్ వెంబు లాజిక్ స్పష్టంగా ఉంది. బంగారం తక్షణ లాభాల కోసం కాదు, ఇది దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం. “బంగారం ఓర్పునకు సంబంధించినది” అని చెబుతూ, ఆధునిక హైప్తో నిండిన పెట్టుబడి ప్రపంచంలో ఆయన దృఢమైన వైఖరి విశిష్టంగా నిలుస్తోంది.I have long been in the "gold as insurance against currency debasement" camp, for over 25 years now. Over the long term, gold has held its purchasing power in terms of commodities like petroleum, and gold has held its own against broad stock market indexes. No, I am not… pic.twitter.com/dyfnCFa7T6— Sridhar Vembu (@svembu) October 12, 2025 -
రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!
ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను పేర్కొంటూ ఉండే.. రిచ్ రాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో.. ఈ ఏడాది అతిపెద్ద క్రాష్ జరుగుతుందని హెచ్చరించారు.ప్రపంచ చరిత్రలో అతిపెద్ద క్రాష్ జరుగుతుందని.. నేను ముందే ఊహించాను. ఆ క్రాష్ ఈ ఏడాది జరుగుతుంది. బేబీ బూమ్ రిటైర్మెంట్లు తుడిచిపెట్టుకుపోబోతున్నాయి. కియోసాకి ప్రకారం.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను పొందే అవకాశం ఉందని, ఇదే అతిపెద్ద క్రాష్ అని స్పష్టంగా అర్థమవుతోంది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి టారిఫ్స్ ప్రభావం, ఆర్ధిక మాంద్యం, అంతర్జాతీయ అనిశ్చితి మొదలైనవి ప్రధాన కారణాలు.డబ్బు కూడబెట్టొద్దు, నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టండని హెచ్చరిస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా.. నేను సేవర్స్ ఓడిపోయేవారు అని చెబుతూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా నేను బంగారం, వెండి, బట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించాను. వాటి ధరలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు.ఇప్పుడు ఎథెరియంలను సేవ్ చేయమని చెబుతున్నాను. ఈ రోజు నేను వెండి & ఎథెరియం ఉత్తమమైనవని నమ్ముతున్నాను. ఎందుకంటే వీటి విలువ పెరుగుతూనే ఉంటుంది. వీటిని ముఖ్యంగా పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. దయచేసి వెండి, ఎథెరియం లాభాలు & నష్టాలను మాత్రమే కాకుండా.. ఉపయోగాన్ని కూడా అధ్యయనం చేయండి. మీ సొంత ఆర్థిక జ్ఞానంతో పెట్టుబడి పెట్టండి. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిపెరుగుతున్న వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రూ. 190000 వద్దకు చేరింది. ఈ సందర్భంగా ''వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్'' (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే.. వెండి కూడా మరింత పెరుగుతుందని తెలుస్తోంది.REMINDER: I predicted the biggest crash in world history was coming in my book Rich Dad’s Prophecy. That crash will happen this year. Baby Boom Retirements are going to be wiped out. Many boomers will be homeless or living in their kids basement. Sad.REMiNDER: I have…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 11, 2025 -
కరువునేలలో పసిడి పంట
తుగ్గలి (కర్నూలు జిల్లా): కరువు నేలల్లో పసిడి పంట పండనుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలిసారి ప్రైవేటు గోల్డ్ మైనింగ్ కంపెనీ బంగారం నిక్షేపాల వెలికితీతకు సిద్ధమైంది. నాలుగు దశాబ్దాల పాటు చేసిన సర్వేలు, పరిశోధనలు ఫలించడంతో ఈ నెలాఖరున పట్టాలెక్కనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లి, జీ.ఎర్రగుడి పరిసర ప్రాంతాల్లో 597.82 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు సర్వేల్లో గుర్తించారు. ఆ నిక్షేపాలను వెలికితీసేందుకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. కంపెనీలో 70 శాతం వాటాతో త్రివేణి ఎర్త్మూవర్స్, ప్రాకార్, లాయిడ్స్ మెటల్స్ ప్రధాన వాటాదారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ 27.27 శాతం వాటా కలిగి ఉంది. ప్రధాన వాటాదారు మైనింగ్ దిగ్గజం బి. ప్రభాకరన్ ఈ ప్రాజెక్టు బాధ్యతలు పర్యవేక్షించనున్నారు.40 ఏళ్లకు పైగా సర్వేలు, పరిశోధనలుఈ ప్రాంతంలో 40 ఏళ్లకు పైగా పలు సంస్థలు సర్వేలు, పరిశోధనలు చేశాయి. మొదట జీఎస్ఐ, ఎమ్మీసీఎల్ సంస్థలు సర్వే చేశాయి. ఆ తర్వాత 1994 నుంచి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సర్వే చేపట్టింది. బంగారం నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించుకున్న సంస్థ ప్రభుత్వ అనుమతులు కోరడంతో 2013లో అనుమతులు వచ్చాయి. పలు పరిశోధనల అనంతరం సంస్థ నిర్ధారించుకున్న తర్వాత 2023 సెపె్టంబరు 2న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు భూమి పూజచేశారు. మొదట చిన్నప్లాంట్ ఏర్పాటుచేసి అందులో ప్రాసెసింగ్ ట్రయల్ నిర్వహిస్తూనే మరో రూ.200 కోట్లతో పెద్ద ప్లాంట్ నిర్మాణం పూర్తిచేశారు. బంగారం ఉత్పత్తికి సిద్ధందాదాపు రూ.500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్టోబరు నెలాఖరు నుంచి గానీ, నవంబరు ప్రారంభం నుంచి కానీ బంగారం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైనట్లు ప్రధాన వాటాదారు బి. ప్రభాకరన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రారంభంలో ఏడాదికి 500 కిలోలు ఉత్పత్తి చేయనున్నారు. అన్ని చట్టబద్ధమైన అనుమతులతో క్రమంగా ఏడాదికి సుమారు 1,000 కిలోల బంగారం ఉత్పత్తి చేసేందుకు కంపెనీ సమాయత్తమవుతోంది. అలాగే, ప్రభుత్వ అనుమతులతో ఇక్కడే 24 క్యారెట్ల బంగారం ప్రాసెసింగ్ చేయనున్నారు. 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు నిజానికి.. ఈ ప్రాంతంలో 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ దాదాపు 30 ఏళ్ల క్రితం ఎకరా రూ.4,500 చొప్పున రైతుల నుంచి లీజుకు తీసుకుని సర్వేలు, పరిశోధనలు, డ్రిల్లింగ్ చేపట్టింది. ఆ తర్వాత లీజు మొత్తం పెంచుతూ వచ్చింది.బంగారం వెలికితీతకు ఎకరా రూ.12 లక్షల చొప్పున రైతుల నుంచి ఇప్పటివరకు 283 ఎకరాలు కొనుగోలు చేసింది. మిగిలిన భూములకు ఎకరాకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున చెల్లిస్తోంది. కంపెనీలో ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఉపాధి లభించింది. మున్ముందు మరింత మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు.. మరోవైపు.. జియో మైసూర్ కంపెనీ బంగారం నిక్షేపాలు వెలికితీస్తూనే సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జొన్నగిరి, పగిడిరాయిలో పాఠశాలలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తోంది. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలకు కృషిచేస్తోంది. చెన్నంపల్లి, పీ.కొత్తూరు, బొల్లవానిపల్లి విద్యార్థులు ఉన్నత చదువుకు పక్క గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిoచింది. ఉత్పత్తి బాగా జరిగితే విద్య, వైద్యంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్లాంట్ ప్రతినిధులు వివరించారు. -
ఇంతలా పెరిగితే కొనేదెలా.. తారాస్థాయికి చేరిన బంగారం ధరలు!
హమ్మయ్య బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి అనుకునేలోపే.. మళ్లీ ఊపందుకున్నాయి. నేడు (అక్టోబర్ 11) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 930 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం బంగారం ధర ఎక్కువగా ఉంది?, ఏ నగరంలో తక్కువగా ఉంది అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రుణమే.. బంగారమాయెనే!
బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్న తరుణంలో వాటిపై రుణం తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అతి తక్కువ వడ్డీకి రుణ సాయం లభిస్తుండడంతో ఎక్కువ మంది పసిడి రుణాలవైపు అడుగులు వేస్తున్నారు. దీంతో సంఘటిత రంగంలో (ఆర్బీఐ కింద నమోదైన బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు) బంగారం రుణాల మార్కెట్ 2026 మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది.నిజానికి 2027 మార్చి నాటికి సంఘటిత పసిడి రుణాల మార్కెట్ ఈ స్థాయికి చేరుకుంటుందని 2024 సెప్టెంబర్లో ఇక్రా అంచనా వేయగా.. ఇప్పుడు ఏడాది ముందుగానే ఇది సాధ్యపడుతుందని పేర్కొంది. 2027 మార్చి నాటికి రూ.18 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. 2025 మార్చి నాటికి మొత్తం మీద బంగారం రుణాల మార్కెట్ రూ.11.8 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ‘బంగారం ధరలు స్థిరంగా పెరుగుతుండడం వల్లే మా అంచనాను సవరించాల్సి వచ్చింది. ధరలు కొత్త గరిష్టాలకు చేరుకోవడంతో బంగారం రుణాల మార్కెట్ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో బ్యాంకులు తమ ఆధిక్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. వృద్ధిలో ఎన్బీఎఫ్సీలను వెనక్కి నెట్టేస్తున్నాయి’ అని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. బ్యాంకుల ఆధిపత్యం..సంఘటిత బంగారం రుణ మార్కెట్లో బ్యాంకులు మరింత బలంగా మారుతున్నాయి. 2025 మార్చి నాటికి తమ వాటాను 82 శాతానికి పెంచుకున్నట్టు ఇక్రా తెలిపింది. 2019–20 నుంచి 24–25 కాలంలో బ్యాంకుల వాటా ఏటా 26% చొప్పున కాంపౌండెడ్గా పెరిగినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీల) వాటా ఈ మార్కెట్లో ఏటా 20% వృద్దిని చూసినట్టు తెలిపింది. బ్యాంకుల రుణ పోర్ట్ఫోలియోలోనూ కీలక మార్పును ఈ నివేదిక ప్రస్తావించింది. 2025 మార్చి నాటికి రిటైల్/వ్యక్తిగత పసిడి రుణాలు బ్యాంకుల మొత్తం పసిడి రుణాల్లో 18%కి చేరాయని, ఏడాది ముందు ఇవి 11%గానే ఉన్నట్టు తెలిపింది. బంగారంపై తీసుకునే సాగు, ఇతర అవసరాలకు ఉద్దేశించిన రుణాలు 70% నుంచి 63%కి తగ్గినట్టు పేర్కొంది. ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని బంగారం రుణ ఆస్తుల విలువ 2025–26లో 30–35 శాతం పెరగొచ్చని ఇక్రా అంచనా వేసింది. బంగారం ధరలు పెరిగిపోవడం, అన్సెక్యూర్డ్ రుణాల్లో వృద్ధి తగ్గడాన్ని ప్రస్తావించింది. 2025 జూన్ నాటికి ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని బంగారం రుణాల విలువ రూ.2.4 లక్షల కోట్లుగా ఉండొచ్చని తెలిపింది.వడ్డీ రేట్లు ఇలా..బంగారం రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న ఆరంభ వడ్డీ రేటు 8 శాతం (వార్షిక)గా ఉంది. వ్యక్తిగత రుణాల్లో ఇంత తక్కువ రేటుకు మరే రుణం కూడా లభించడం లేదు. ఎన్బీఎఫ్సీలు మాత్రం బంగారం రుణాలపై 12 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు బ్యాంకుల్లో బంగారంపై రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఎన్బీఎఫ్సీలతో పోల్చినప్పుడు బ్యాంకులపై ఎక్కువ మందిలో విశ్వాసం ఉండడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. బంగారం, ఆధార్, పాన్ డాక్యుమెంట్లతో వెళితే అరగంట, గంట–గంటలోపే బ్యాంకుల్లో రుణం మంజూరవుతుంది.సిల్వర్ రూ.8,500 జంప్వెండి ధర రాకెట్ వేగాన్ని తలపిస్తోంది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం కిలోకి రూ.8,500 ఎగసి రూ.1,71,500 స్థాయికి చేరింది. ముఖ్యంగా గత మూడు పనిదినాల్లోనే వెండి కిలోకి రూ.17,500 పెరగడం డిమాండ్ను తెలియజేస్తోంది. ప్రధానంగా పెట్టుబడిదారుల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు బంగారం ధర (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ.600 నష్టపోయి రూ.1,26,000 వద్ద స్థిరపడింది. సురక్షిత సాధనాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ధరల పెరుగుదలకు మద్దతుగా నిలుస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్కు 51 డాలర్లకు చేరుకోగా, స్పాట్ గోల్డ్ ఔన్స్కు 17 డాలర్ల మేర పెరిగి 3,993 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.ఇదీ చదవండి: ఇళ్ల ధరలు ఎంత పెరిగాయంటే.. -
గోల్డ్ ఇలా పెట్టుబడి పెడితే మీరే కోటిశ్వరుడు
-
ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు: రూ.2 లక్షలకు చేరువలో వెండి!
అక్టోబర్ ప్రారంభం నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (శుక్రవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ రేటు.. ఏ నగరం ఎంత ఉంది అనే విషయం తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సాంప్రదాయ 60/40 పెట్టుబడి వ్యూహాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యూహం ప్రకారం 60 శాతం డబ్బును ఈక్విటీల్లో (స్టాక్స్), 40 శాతం డబ్బును బాండ్లలో (స్థిర ఆదాయ పెట్టుబడులు) పెట్టాలి. దీర్ఘకాలిక, స్థిరమైన ఆదాయాన్ని కల్పించగలదని భావించి, ఈ వ్యూహాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఆర్థిక ప్రణాళికదారులు ఒక "మ్యాజిక్ ఫార్ములా"గా వర్ణిస్తూ వచ్చారు.అయితే, కియోసాకి అభిప్రాయం (Rich Dad Poor Dad author Robert Kiyosaki) ప్రకారం, ఈ 60/40 విధానం 1971లోనే పనికిరానిది అయిపోయింది. అంటే, అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ బంగార ప్రమాణం నుంచి డాలర్ను వదిలించాక ఇది అసంబద్ధం అయింది.రాబర్ట్ కియోసాకి తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. "మొత్తానికి, ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ మంత్రదండం – 60/40 చనిపోయింది" అంటూ పోస్ట్ను మొదలు పెట్టిన కియోసాకి "ఆ బీఎస్ నిష్పత్తి నిక్సన్ బంగారు ప్రమాణం నుంచి డాలర్ను తీసేసిన 1971లోనే చనిపోయింది. దాన్నుంచి ఇప్పటివరకు, ఆర్థిక ప్రణాళికదారులు దీన్ని పదవీ విరమణ భద్రత కోసం మేజిక్ కార్పెట్ రైడ్ లా ప్రచారం చేస్తూ వచ్చారు" అని రాసుకొచ్చారు.అమెరికా ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద రుణగ్రహీత అని, అమెరికన్ డాలర్ ఒక “నకిలీ” కరెన్సీగా మారిందని కియోసాకి పేర్కొన్నారు. "యూఎస్ డాలర్ నకిలీ. ఇది మార్క్సిస్ట్ ఫెడ్ నియంత్రణలో ఉన్న, దివాలా తీసిన అమెరికన్ ప్రభుత్వ ఐఓయూ మాత్రమే. అలాంటి దేశం నుంచి బాండ్లు కొంటారా? ఆర్థిక భద్రత ఎక్కడుంది?" అంటూ ప్రశ్నించారు.కొత్త ఫార్ములా..మొత్తానికి వాస్తవం తెలిసొచ్చిందని, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయ వ్యూహం 60/20/20 పోర్ట్ఫోలియోను ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. ఈ వ్యూహం ప్రకారం.. 60 శాతం స్టాక్స్ లేదా ఇతర పెట్టుబడులు, 20 శాతం బాండ్లు, 20 శాతం బంగారం (లేదా ఇతర భద్రతా ఆస్తులు)పై పెట్టుబడి పెడతారు. ఇది పెట్టుబడిదారులకు పదవీ విరమణలో మరింత భద్రత కలిగిస్తుందని ఆయా సంస్థలు చెబుతున్నాయన్నారు.నేను వీటికే ప్రాధాన్యమిస్తా..ఎవరెన్ని చెప్పినప్పటికీ తాను ఎప్పటికీ నిజమైన ఆస్తులు అంటే, బంగారం, వెండి నాణేలు, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టో కరెన్సీలు, రుణంతో కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ నుంచి అద్దె ఆదాయం, చమురు బావులు, పశువులపై వచ్చే రాబడికే ప్రధాన్యత ఇస్తానన్నారు. ఇవన్నీ ఆదాయం అందించే "రియల్ అసెట్స్" అని చెబుతూ, వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్"నేను ఇప్పటికీ వీటినే ఇష్టపడతాను. నాకు ఇవే 30 సంవత్సరాల క్రితం ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చాయి" అన్నారు. ఇంకో ముఖ్యమైన జీవన పాఠం కూడా ఆయన పంచుకున్నారు. "ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ వాండ్ అయిన 60/40 ఫార్ములాని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు. మీకు ఉత్తమంగా పనికొచ్చే పెట్టుబడి వ్యూహం ఏదో దాన్ని కనుక్కోండి" అంటూ సూచించారు.FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025 -
తులం బంగారం రూ.లక్షా 28 వేల 200
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. మంగళవారం తులం బంగారం రూ. 1,25,400 ఉండగా బుధవారం రూ. 1,28,200కు చేరుకొని రికార్డు సృష్టించింది. తులం వెండి ధర రూ.1610కి చేరింది. దీపావళి పండుగ దాటేసరికి బంగారం ధర రూ. లక్షా 50 వేలకు చేరుకోవచ్చని బంగారు దుకాణాదారులు అభిప్రాయపడుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ప్రజలు ధరల పెరుగుదలతో తక్కువ బంగారంతోనే సరిపుచ్చుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు మందగించాయని దుకాణాదారులు చెప్తున్నారు.రూ.లక్షా 50వేలు దాటుతుంది..ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర హెచ్చు తగ్గులు ఉండడంతోనే బంగారం రేటు పెరుగుతోంది. రానున్న రోజు ల్లో తులం బంగారం ధర రూ. లక్షా50వేలకు దాటేలా కనిపిస్తోంది. ఇలా ఉంటే సామాన్యుడికి చాలా ఇబ్బందే.– లక్ష్మణచారి, వర్తకుడు, నగరవాసి -
ఇలా అయితే ఎలా 'బంగారం': మరింత పెరిగిన ధరలు
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (అక్టోబర్ 09) కూడా గరిష్టంగా రూ. 220 పెరిగింది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. పసిడి ప్రియులలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాగే కొనసాగితే పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం చెలగాటం.. డాలర్కు సంకటం!
ఈ భూమిపై బంగారాన్ని అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆయనే రాబర్ట్ కియోసాకి. ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత అయిన ఆయన ఎప్పుడూ బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులు పెడుతుంటారు. తనను అనుసరించేవాళ్లనూ పెట్టమని ప్రోత్సహిస్తుంటారు.బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతూ రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో 10 గ్రాములకు రూ .1,22,780 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్కు 4,000 డాలర్లను అధిగమించింది. దీంతో ఎప్పటిలాగే రాబర్ట్ కియోసాకి వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేశారు. విలువైన లోహాలుక, డిజిటల్ ఆస్తులపై తన బుల్లిష్ వైఖరిని పునరుద్ఘాటించారు."యూఎస్ డాలర్ అంతం?"నా బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం స్టాక్కు విలువ ఇంకా పెరుగుతోంది.యూఎస్ డాలర్ను నమ్ముకున్నోళ్లంతా నష్టబాధితులు.విజేతగా ఉండండి.జాగ్రత్త" అంటూ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.బంగారం, వెండి, బిన్ కాయిన్ల విలువలు పెరిగిపోతున్న తరుణంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) సాంప్రదాయ పొదుపులపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమెరికా డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు అంటూ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!END of US Dollar? Adding to my gold, silver, Bitcoin, and Ethereum stack.Savers of US dollars are losers. Be a winner. Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 8, 2025 -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం @ 4,000
న్యూఢిల్లీ: కనకం రోజుకో కొత్త రికార్డులతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి 4,000 డాలర్ల (ఔన్స్కు) కీలక మైలురాయిని దాటింది. కామెక్స్ ఫ్యూచర్స్లో 4,014 డాలర్ల స్థాయిని నమోదు నమోదు చేసింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ 2026 చివరికి 4,900 డాలర్లకు చేరుకోవచ్చని ప్రకటించింది. 4,300 డాలర్ల గత అంచనాలను భారీగా పెంచింది. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి అదే పనిగా వస్తున్న పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చింది. ప్రైవేటు రంగం వైవిధ్యం కోసం గోల్డ్ ఈటీఎఫ్లను ఆశ్రయిస్తుండడాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్లు 2025లో నెలకు 80 టన్నులు, 2026లో నెలకు 70 టన్నుల మేర బంగారం కొనుగోలు చేయొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఇక యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు సైతం బంగారంలో బుల్లిష్ సెంటిమెంట్కు కారణంగా తెలిపింది. 2026 మధ్య నాటికి ఫెడ్ 100 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని.. ఇది బంగారం తదితర ఆస్తులకు డిమాండ్ను పెంచుతుందని పేర్కొంది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు 17 శాతం పెరగడాన్ని మెహతా ఈక్విటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి సైతం గుర్తు చేశారు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితులు, ఫ్రాన్స్ తదితర దేశాల్లో రాజకీయ అలజడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ను పెంచుతున్నట్టు చెప్పారు. దేశీయంగా రూ.1.24 లక్షలు ఢిల్లీ మార్కెట్లో పుత్తడి ధర (99.9 శాతం స్వచ్ఛత) మంగళవారం సరికొత్త ఆల్టైమ్ గరిష్టం రూ.1,24,000ను నమోదు చేసింది. 10 గ్రాములకు రూ.700 లాభపడింది. వెండి కిలోకి రూ.3,400 లాభపడి రూ.1,54,000కు చేరుకుంది. -
బంగారం ధరల తుపాను.. ఒక్కరోజే భారీగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
శబరిమల ‘స్వర్ణ కుంభకోణం’: సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
కొచ్చి: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ఏర్పాటు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది.ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారు తాపడంలో బంగారం బరువు తగ్గడం, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్వర్ణ కుంభకోణం’పై ఏర్పాటైన సిట్కు కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హెచ్ వెంకటేష్ నేతృత్వం వహిస్తారు. ఈ కుంభకోణంలో అవినీతి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రమే కాదని, దేవాలయ ఆస్తులను నిర్వహించే దేవస్వం బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద శిక్షార్హమైన పలు నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది.సిట్ ఈ కుంభకోణంపై అత్యంత నిజాయితీతో, గోప్యంగా దర్యాప్తు నిర్వహించాలని, అసలు దోషులను బయటికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదానికి బలం చేకూర్చే ఒక కీలక అంశాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019 డిసెంబర్ 9న ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడికి పంపిన ఒక ఈ మెయిల్ను కోర్టు పరిశీలించింది. శబరిమల గర్భగుడి, ద్వారపాలకుల విగ్రహాల బంగారు పనులు పూర్తయిన తర్వాత తన వద్ద కొంత అదనపు బంగారు పలకలు మిగిలాయని పొట్టి ఆ ఈ మెయిల్లో పేర్కొన్నారు. ఆ అదనపు బంగారాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లి కోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. ఈ ఈ మెయిల్ చూస్తుంటే పొట్టి వద్ద మిగులు బంగారం ఉన్నట్లు స్పష్టమవుతోందని, అందుకే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది. -
Kerala: అసెంబ్లీకి ‘స్వర్ణ తాపడం’ వివాదం.. గందరగోళం మధ్య సభ వాయిదా
తిరువనంతపురం: శబరిమల స్వర్ణ తాపడం వివాదం కేరళ అసెంబ్లీని మరింత వేడెక్కించింది. శబరిమల ఆలయంలోని గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయనే ఆరోపణలతో ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. దీంతో సోమవారం శాసనసభలో హై డ్రామా నడిచింది. ఈ గందరగోళం నడుమ స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.సభలో తొలుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ శబరిమల స్వర్ణ తాపడం అంశాన్ని లేవనెత్తారు. గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయని ఆరోపిస్తూ, ఇందుకు బాధ్యత వహిస్తూ దేవస్వం(దేవాదాయశాఖ) మంత్రి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు వీఎన్ వాసవన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వెంటనే కలుగజేసుకుని ప్రశ్నోత్తరాల సమయంలో షెడ్యూల్ చేసిన ప్రశ్నలను అడగాలని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.‘అయ్యప్పన్ బంగారం చోరీ, దోపిడీదారులు ఆలయాన్నే స్వాహా చేశారు’ లాంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లను ప్రతిపక్ష సభ్యులు తమ చేత పట్టుకుని, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అక్కడున్న మంత్రులు, పాలకవర్గ సభ్యులు తమ సీట్ల నుండి లేచి నిలుచున్నారు. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రతిపక్ష సభ్యుల చర్యలను ఖండించారు. సభలో ఈ విధంగా అంతరాయం కలిగించడం సరైనది కాదన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుని, ఈ విధంగా కార్యకలాపాలను అడ్డుకోవడం సభను అగౌరవపరచడమేనన్నారు.సభ్యులు తమ చేతుల్లోని ప్లకార్డులను దించాలని ఆయన ఆదేశించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను వాయిదా వేశారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సభలో ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత వారంలో ప్రతిపక్షం ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. అయితే స్పీకర్ ఈ అంశం కేరళ హైకోర్టు పరిశీలనలో ఉందని పేర్కొంటూ, దానిని తోసిపుచ్చారు. కాగా రాబోయే రోజుల్లో శబరిమల స్వర్ణ తాపడం వివాదంపై తమ నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రతిపక్ష సభ్యులు ప్రకటించారు. -
అనిశ్చితులకు బంగారం సరికొత్త కొలమానం
ప్రపంచ అనిశ్చితులకు సరికొత్త కొలమానంగా బంగారం ధరలు వ్యవహరిస్తుట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు ఎలా ఉండేవో బంగారం ధరలు కూడా అలాగే మారినట్టు చెప్పారు. ద్రవ్యపరంగా నేడు ప్రతి దేశం ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న వాణిజ్య విధాపరమైన వాతావరణం కొన్ని ఆర్థిక వ్యవస్థల వృద్ధికి నష్టం కలిగించనున్నట్టు తెలిపారు.ఈ పరిస్థితుల్లో కొన్ని స్టాక్ మార్కెట్లు కరెక్షన్ను చూడొచ్చని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవకాశాలను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటూ.. ఈక్విటీ మార్కెట్లు సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పలు మార్కెట్లలో ర్యాలీ వెనుక టెక్నాలజీ స్టాక్స్ పాత్రను ప్రస్తావిస్తూ.. త్వరలో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చన్నారు.‘భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు మునుపటి దశాబ్దంలో చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఒక శ్రేణికి పరిమితమయ్యాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో చమురు అవసరాలు తగ్గడం ఇందుకు కారణం. గతంలో ప్రపంచ అనిశ్చితులను చమురు ధరలు ఎలా అయితే కొలమానంగా పనిచేశాయో.. ఇప్పుడు బంగారం ధరలు తీరు కూడా అలాగే ఉంది’ అని మల్హోత్రా వివరించారు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతోందా?: బఫెట్పై.. కియోసాకి ఆగ్రహం
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్లు, బాండ్లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.స్టాక్ మార్కెట్ మసకబారుతోందా?కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారెన్ బఫెట్కు అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్గా పేరుంది. ఆయన ఎక్కువగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఆయన్ను, ఆయన ఆలోచనలకు మంది అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు మారిన బఫెట్ వైఖరితో స్టాక్ మార్కెట్ నుంచి వైదొలిగి బంగారం, వెండి వైపు పయనిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గి కుప్పకూలలే ప్రమాదముందా అంటూ కియోసాకి సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.I WANT TO VOMIT: getting nauseus, listening to Buffet tout the virtues of gold and silver…. after he ridiculed gold and silver for years. That means the stock and bond market are about to crash. Depression ahead?Even though Buffet shit on gold and silver investors like me…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 1, 2025 -
Gold: 2 లక్షలకు తులం బంగారం
-
పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
భారీగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఈ కథనంలో నేటి (అక్టోబర్ 02) గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి మరో కొత్త రికార్డు
న్యూఢిల్లీ: పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. గురువారం సైతం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.1,100 పెరిగి మరో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,21,000ను నమోదు చేసింది.వెండి ధర కిలోకి రూ.1,50,500 వద్ద ఫ్లాట్గా ట్రేడయ్యింది. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కావడం పసిడి ధరలపై ప్రభావం చూపించింది. అమెరికా లేబర్ మార్కెట్లో బలహీనత నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతానికి పైగా పెరిగి 3,895 డాలర్లకు చేరింది. -
వడివడిగా పసిడి పరుగు
రాయవరం: ‘ఏవండీ దసరా పండుగకు నెక్లెస్ కొంటారా..’ అంటూ గారాలు పోతున్న భార్యల వైపు భర్తలు బేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగారం ధర చూస్తే బేర్మనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల మార్కుకు చేరుకుంది. బంగారం ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్నాయి. కదం తొక్కుతున్న కాంచనానికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పుత్తడితో పాటుగా తానూ ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా వెండి ధరలు కూడా విర్రవీగుతున్నాయి. స్వర్ణం వైపు చూడాలంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వివాహాల సీజన్ తిరిగి ప్రారంభం కావడంతో వివాహాలు నిర్వహించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే భయం భయంగా షాపుల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఇంతింతై వటుడింతై అన్నట్లుగా... పసిడి, వెండి ధరలు ఇంతింతై వటుడింతై అన్న చందంగా పెరుగుతున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకు పలకగా, జూలై నాటికి రూ.లక్షకు చేరుకుంది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుతూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.1.20 వేలకు చేరుకుంది. ఆగస్టు, సెపె్టంబరు నెలలో సుమారు 10 గ్రాములకు రూ.20 వేల వరకు పెరిగింది. ఇదిలా ఉంటే వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర రూ.92 వేలు పలుకగా, జూన్లో రూ.1.10 లక్షలు, జూలైలో రూ.1.11 లక్షలు, ఆగస్టులో రూ.1.11 లక్షలు ఉన్న కేజీ వెండి ధర నేడు రూ.1.50 లక్షలకు చేరింది. వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి అదే తరహాలో లాభాలు వచ్చాయి. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పరుగులు తీస్తూనే ఉంది. త్వరలోనే కేజీ రూ.2 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలున్నాయి. మదుపరుల ముందుచూపే కారణమా? పసిడి, వెండి ధరలు పెరుగుదలకు బులియన్ మార్కెట్ విశ్లేషకులు పలు రకాల కారణాలు పేర్కొంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న యుద్ధంతో పాటుగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావంతో పసిడి ధర రోజు రోజుకు పరుగులు తీస్తోంది. దీనికితోడు బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావిస్తున్న మదుపరులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా వర్తకులు భావిస్తున్నారు. ‘తూర్పు’లో పరిస్థితి ఇదీ.. కరోనా తర్వాత బంగారం వ్యాపారం బాగా తగ్గిపోయినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అంతకుముందు వారానికి ఆరు రోజులు వ్యాపారం సాగగా, ఇప్పుడు వారానికి నాలుగు రోజులు మాత్రమే వ్యాపారం సాగుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. పెద్ద షాపుల్లో రోజుకు 500 గ్రాముల వరకు అమ్మకాలు జరుగుతుండగా, చిన్న షాపుల్లో 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి 2,500 వరకు బంగారం విక్రయాల షాపులున్నాయి. ఉమ్మడి జిల్లాలో కరోనాకు ముందు రోజుకు 20 కేజీల చొప్పున బంగారం అమ్మకాలు జరగ్గా, ప్రస్తుతం 15 నుంచి 18 కేజీల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. సీజన్ బట్టి ఈ అమ్మకాలు అటూఇటూగా ఉంటాయి. బంగారంతో పాటుగా వెండి అమ్మకాలు కూడా తగ్గాయి. ఆరు నెలల క్రితం వెండి కిలో రూ.50వేలు ఉండగా, ఆరు నెలల కాలంలో రూ.1.50 లక్షలకు చేరింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో వెండిని ఎల్రక్టానిక్స్, సాంకేతిక అవసరాలకు ఉపయోగించడం, ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడంతో బంగారం, వెండి ధరలు ఊహించని పెరుగుదల కని్పంచి ఆల్టైమ్ రికార్డుకు వాటి ధరలు చేరుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. లాభాలు కళ్ల చూస్తున్న బడాబాబులుబంగారం ధర పెరగడంతో బడా బాబులు లాభాలు కళ్ల జూస్తున్నారు. ధర పెరుగుతుందన్న ముందుచూపుతో పలువురు మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. వడ్డీ వ్యాపారం చేసే వారు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో 100 గ్రాముల వంతున బిస్కెట్లు కొన్నారు. మరికొందరు 50 నుంచి 70 కాసుల మధ్య వడ్డాణం వంటి వస్తువుల్ని తయారు చేయించుకున్నారు. ప్రస్తుతం ధర రూ.లక్ష దాటడంతో వీరందరిలో జోష్ నెలకొంది. పెట్టిన పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం వరకు లాభాలను చూశారు. -
పండుగ పూట పెట్టెతో సహా గోల్డ్ కొట్టేసింది..! వీడియో వైరల్
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025 -
అంతులేకుండా పెరుగుతున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
22 కాదు.. 24 కాదు.. 18 వైపే మొగ్గు!
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో వినియోగదారుల కొనుగోలు వైఖరిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా భారతీయులు 22 క్యారెట్ల (ఆభరణాలు), 24 క్యారెట్ల (బార్లు, కాయిన్స్) బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపేవారు. అయితే ధరల పెరుగుదలతో ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లో కొనుగోలు నిర్ణయాలు ప్రభావితమవుతున్నాయి.కొనుగోలు వైఖరిలో మార్పులు18 క్యారెట్ వైపు మొగ్గుబంగారం అధిక ధరల కారణంగా కొంతమంది వినియోగదారులు 22 క్యారెట్ల బంగారానికి బదులుగా తక్కువ క్యారెట్ (ఉదాహరణకు 18 క్యారెట్) ఆభరణాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 18K బంగారంలో స్వచ్ఛత తక్కువగా (75% బంగారం) ఉన్నప్పటికీ దాని ధర తక్కువగా ఉంటుంది. దీనితో అత్యవసరాలకు, శుభకార్యాలకు ముందుగా కేటాయించిన బడ్జెట్లో ఆభరణాలు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.ఆభరణాల డిమాండ్లో స్వల్ప తగ్గుదలపెళ్లిళ్లు, పండుగల సీజన్లో డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ, అధిక ధరల వల్ల ఆభరణాల మొత్తం డిమాండ్లో స్వల్ప మందగమనం కనిపిస్తోంది. వినియోగదారులు ఆభరణాల బరువును తగ్గించుకోవడం లేదా తేలికపాటి, రోజువారీ వినియోగానికి సరిపోయే డిజైన్లను ఎంచుకోవడం చేస్తున్నారు.బంగారంపై మోజు ఎందుకంటే..బంగారం రికార్డు ధరలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల భౌతిక బంగారం (బార్లు, కాయిన్స్) రూపంలో పెట్టుబడులు పెరిగాయి. చాలామంది భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే సురక్షితమైన ఆస్తి (సేఫ్ హెవెన్ అసెట్)గా భావిస్తారు. కొంతమంది భౌతిక బంగారం కొనుగోలు, నిల్వ సమస్యలు, అధిక ధరలు, మేకింగ్ ఛార్జీలను నివారించడానికి గోల్డ్ ఈటీఎఫ్లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), డిజిటల్ గోల్డ్ వంటి పెట్టుబడి సాధనాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరల పెరుగుదల కేవలం దేశీయ డిమాండ్ పైనే కాకుండా, ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావించే అంతర్జాతీయ పెట్టుబడిదారులు మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు ఈ రంగంలో పెట్టుబడులు పెంచుతారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions)ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, రాజకీయ అస్థిరత పెట్టుబడిదారుల్లో అభద్రతా భావాన్ని పెంచుతాయి. ఈ అనిశ్చితి కారణంగా వారు స్టాక్ మార్కెట్ల నుంచి బంగారం వైపు మళ్లుతారు.ద్రవ్యోల్బణం (Inflation) భయాలుద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుంది. అయితే అలాంటి సమయంలో బంగారం విలువ అంతర్జాతీయంగా నిలకడగా ఉండటమే కాకుండా పెరుగుతుంది కూడా. అందుకే ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు పెట్టుబడిదారులు తమ కొనుగోలు శక్తిని కాపాడుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తారు.సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లుప్రపంచవ్యాప్తంగా చైనా, రష్యా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు (Central Banks) ఇటీవల తమ బంగారు నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవి మార్కెట్లో భారీ కొనుగోలుదారులుగా ఉండటం వల్ల పసిడికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలుయూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నప్పుడు డాలర్ విలువ పడిపోతుంది. డాలర్ బలహీనపడటం వల్ల ఇతర కరెన్సీల వారికి బంగారం చౌకగా లభిస్తుంది. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది.గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలుప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం లేదా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందనే అంచనాలు పెట్టుబడిదారులను రిస్క్ లేని బంగారం వంటి ఆస్తుల వైపు మళ్లేలా చేస్తాయి.ఇదీ చదవండి: పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం! -
భారత్లో కూడా ఇవాళ భారీగా గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం
-
బిగ్షాక్: పండగపూట దారుణంగా పెరిగిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు దారుణంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బయటపడుతున్న.. బంగారం బండారం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బంగారం వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే నరసన్నపేటలో ఇటీవల కాలంలో పలు అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ఒక్క పేటకే పరిమితం కాకుండా.. జిల్లా అంతటా పలు షాపుల్లో అక్రమాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో ఆ మధ్య నకిలీ హాల్మార్క్ బంగారం పెద్ద ఎత్తున దొరికింది. ఇప్పుడేమో జీఎస్టీ అధికారుల దాడులతో జీరో వ్యాపారం జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి వినియోగదారులను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడిది నరసన్నపేటకే పరిమితం కాకుండా జిల్లా అంతటా నడుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాటల గారడీ.. ధర పెరిగినా ప్రజలకు బంగారంపై మోజు తగ్గడం లేదు. తులం బంగారం రూ.లక్షా 25 వేలు దాటినా వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నా రు. ప్రజల్ని అమాయకులను చేసి బురిడీ కొట్టిస్తున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పి బుట్టలోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాల్లో బయటికొచ్చినవి కొన్నే. వెలుగులోకి రానివెన్నో. అలాగని అందరూ అలాంటి వారు కాదు. కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి, వినియోగదారుల మన్ననలు, నమ్మకం పొందుతున్నారు. దొంగ బంగారం ఆరోపణలు.. ఇప్పటికే దొంగతనం బంగారం, నాణ్యత తక్కువ ఉన్న ఆభరణాలు, ట్యాక్స్ చెల్లించని బంగారం విక్రయిస్తుంటారన్న ప్రచారం ఉంది. గతంలో దొంగ బంగారాన్ని పోలీసులు రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ రికవరీ చేశారు. 24 క్యారెట్ అని 22 క్యారెట్, 22 క్యారెట్ పేరిట 18 క్యారెట్ బంగారం ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. బిల్లులపై స్పష్టంగా రాయడం లేదని ఆ మధ్య ఒక అధికారి హెచ్చరించినట్టు తెలిసింది. మొత్తానికి మోసమనేది కొన్నిచోట్ల జరుగుతోంది. జీరో వ్యాపారం.. మోసాలతో పాటు జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్టుగా తాజాగా జరిగిన జీఎస్టీ అధికారుల సోదాలతో తెలుస్తోంది. కోయంబత్తూరు, చెన్నై, ముంబై తదితర నగరాల నుంచి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన బంగారాన్ని ఇక్కడ వినియోగదారులకు కట్టబెడుతున్నట్టు సమాచారం. ఒక్క వినియోగదారులకే కాకుండా పలు షాపులకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ఆ జీఎస్టీ లెక్కలు ఎవరికీ అర్ధం కాకుండా వేస్తున్నారు. కొందరికైతే జీఎస్టీ లేకుండా బంగారం విక్రయిస్తున్నారు. జీఎస్టీ లేకుండా బంగారం కావాలంటే బిల్లులు ఉండవని చెప్పేస్తున్నారు. ఈ తరహా కొనుగోళ్లలోనే మోసాలు జరుగుతున్నాయి. బిల్లుల్లేని బంగారంలో మోసాలకు పాల్పడుతున్నారు. తిరిగి అమ్మేటప్పుడు నిలదీయాలంటే బిల్లులు ఉండాలి. అవి లేనప్పుడు వినియోగదారుడు ఏం అడగగలడని వ్యాపారులు దగా చేస్తున్నారు. నకిలీ హాల్మార్క్ మోసాలు.. ప్రత్యేకంగా తయారు చేసిన లేజర్ మిషనరీతో నకిలీ హాల్మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నారు. ఆ నకిలీ హాల్మార్క్ బయటపడకుండా ఉండేందుకు నెట్లో ఉన్న వేరే వారి హెచ్యూఐడీ నంబర్లు వేస్తున్నారు. సాధారణంగా హెచ్ఐయూడీ నెంబర్ను గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి హెచ్ఐయూడీ నంబర్ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషన్తో హాల్మార్క్ వేసి వ్యాపారం సాగించేస్తున్నారు. ఆ మధ్య నరసన్నపేటలో ఇదే మోసం వెలుగుచూసింది. వాస్తవంగా ఈ రకమైన మోసం జిల్లాలో చాలాచోట్ల జరుగుతోందని సమాచారం. ఆకస్మిక తనిఖీల్లో అక్కడ బండారం బయటపడింది. దీంతో మనం కొనుగోలు చేస్తున్న బంగారంలో నాణ్యతెంతో ? అన్న అనుమానం వినియోగదారుల్లో నెలకొంది. -
బంగారం సరికొత్త రికార్డు
-
10 కేజీల బంగారంతో డ్రెస్..! ఎక్కడంటే..
బంగారం రేటు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.(చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
బంగారం, వెండిపై పెట్టింది అప్పుడే అంత అయింది!
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచియిత రాబర్ట్ కియోసాకి ఎప్పుడూ బంగారం, వెండి, బిట్ కాయిన్ల గురించే మాట్లాడుతుంటారు. వాటి మీదే పెట్టుబడులు పెట్టాలని తన ఫాలోవర్లకు సూచిస్తుంటారు. తన ప్రాధాన్యతల నమూనాగా రూపొందించిన పోర్ట్ ఫోలియో అంటే బంగారం, వెండి, బిట్కాయిన్లపై పెట్టిన పెట్టుబడులు 2025 లో ఇప్పటివరకు దాదాపు 40 శాతం పెరిగాయి.ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి, బిట్కాయిన్లపై పెట్టిన పెట్టుబడులే "నిజమైన డబ్బు" అని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చెప్పే మాటకు ప్రాధాన్యత పెరిగింది. ఫిన్ బోల్డ్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం.. సంవత్సరం ప్రారంభంలో బంగారం, వెండి, బిట్ కాయిన్.. ఈ మూడు ఆస్తులలో సమానంగా విభజించి 1,000 డాలర్లు పెట్టుబడి పెట్టారనుకుంటే ఆ పోర్ట్ ఫోలియో సెప్టెంబర్ 23 నాటికి 1,372.43 కు పెరిగింది.ఏది ఎంతలా పెరిగిందంటే..బంగారం (Gold) 43.06 శాతం లాభంతో ఔన్స్ కు 2,658 డాలర్ల నుంచి 3,754 డాలర్లకు పెరిగింది. వెండి మరింత బలమైన పనితీరును అందించింది. ఔన్స్ కు 29.57 డాలర్ల నుండి 43.89 డాలర్లకు అంటే 47.5 శాతం ఎగిసింది. ఇక బిట్ కాయిన్ 21.17% పెరిగింది. 94,388 డాలర్ల నుండి 113,080 డాలర్లకు చేరింది. వెండి అత్యధిక పనితీరు చూపినా మొత్తం మూడు ఆస్తులు పోర్ట్ ఫోలియో బలానికి అర్థవంతంగా దోహదపడ్డాయని ఫిన్ బోల్డ్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు! -
బిగ్రిలీఫ్.. బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గంటల వ్యవధిలో తారుమారైన బంగారం ధరలు
మంగళవారం ఉదయం గరిష్టంగా రూ. 1,260 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2,620లకు చేరింది. దీంతో పసిడి ప్రియులు ఒక్కసారిగా షాకయ్యారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేటు అమాంతం పెరిగిపోయింది, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ కథనంలో తాజా గోల్డ్, సిల్వర్ ధరలను చూసేద్దాం..👉హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,620 పెరిగి.. రూ.1,15,690 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ. 1,06,050 వద్దకు చేరింది.👉ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు.. రూ.2,620 పెరిగి రూ.1,15,840 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ.1,06,200 వద్దకు చేరింది.👉చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,300 పెరిగి రూ.1,16,080 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,06,400 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో బంగారం రూ.2 లక్షలకు!: కారణాలు ఇవే..వెండి ధరలువెండి ధర రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1,50,000కు చేరింది. ఉదయం రూ. 1000 పెరిగిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి మరో వెయ్యి రూపాయలు (మొత్తం రూ. 2000) పెరిగింది. -
బిగ్షాక్: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫారో కంకణం కరిగించేశారు!
కైరో: దాదాపు 3,000 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉండి అలనాటి ఈజిప్ట్ ఫారో రాజుల ఘనతను చాటిన స్వర్ణకంకణం చోరీ కథ చివరకు విషాదంగా ముగిసింది. ఈజిప్ట్ లోని ప్రఖ్యాత మ్యూజియంకు సంబంధించిన పునరుద్ధరణ ల్యాబ్లో తస్కరణకు గురైన కంకణాన్ని వెతికిపట్టుకునేందుకు రంగంలోకి దిగిన ఈజిప్ట్ దర్యాప్తు సంస్థ అధికారులు, పోలీసులుకు చివరకు ముద్ద బంగారమే లభించింది. సీసీకెమెరాల లేని ల్యాబ్లో కంకణం చోరీకి గురయ్యాక పలువురు అక్రమ పురాతన వస్తువుల డీలర్ల చేతులు మారి చివరకు స్వర్ణకారుల చేతుల్లో పడి కరిగిపోయింది. తొలుత చోరీ చేరిన దొంగ మొదలు చివరిసారిగా కొనుగోలుచేసిన వ్యక్తిదాకా ఎవరికీ దాని చారిత్రక నేపథ్యం, అమూల్యమైన అంతర్జాతీయ మార్కెట్ విలువ తెలియదు. దీంతో సాధారణ బంగారు కడియంగా భావించి దానిని కరిగించి ముడి బంగారాన్ని బయటకుతీశారు. ఇటలీలో ఒక పురాతన వస్తు ప్రదర్శన కోసం కైరో నగరంలోని తహ్రీర్ స్క్వేర్లోని ప్రఖ్యాత మ్యూజియం నుంచి ఈ కంకణాన్ని తెప్పించగా సెపె్టంబర్ 9వ తేదీన చోరీకి గురైన విషయం తెల్సిందే. క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్ ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్ ఫారో రాజుకు చెందిన ఈ కంకణంను అమేనీమోప్ ఆన్ఆర్టీ–4 ఛాంబర్లో గతంలో కనుగొన్నారు. మధ్యలో లాపిస్ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణం అత్యంత అరుదైంది. చోరీ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. చేతులు మారిన నగదునూ స్వా«దీనంచేసుకున్నారు.అసలేమైంది? భద్రంగా ‘సేఫ్’లో దాచిన కంకణాన్ని ల్యాబ్లో పునరుద్ధరణ పనులు చూసే ఒక మహిళా నిపుణురాలు దొంగలించింది. ఆమె కైరోలోని ఒక వెండి దుకాణం యజమానికి అత్యల్ప ధరకు విక్రయించింది. దీనిని ఆ వెండి దుకాణదారు మరో బంగారం దుకాణం యజమానికి కేవలం 3,800 డాలర్లకు విక్రయించాడు. దీనిని అతను 200 డాలర్ల లాభానికి అంటే 4,000 డాలర్లకు మరో బంగారం దుకాణయజమానికి అమ్మేశాడు. ఇతను కంకణాన్ని కరిగించి వచి్చన బంగారంతో తన కస్టమర్లకు కావాల్సిన స్వర్ణాభరణాలు చేసి ఇచ్చి డబ్బు సంపాదించాడు. కంకణం కోసం బయల్దేరిన పోలీసులకు కంకణానికి బదులు ఈ నలుగురు నేరస్తులు చిక్కారని ఈజిప్ట్ పర్యాటక, పురాతత్వ శాఖ మంత్రి షెరీఫ్ ఫతీ చెప్పారు. ‘‘కంకణం మాత్రమే కాదు ఈజిప్ట్ లో మరెన్నో చారిత్రక వస్తువులకు సరైన భద్రత లేదు. మ్యూజియంలలో సీసీటీవీలు సరిగా పనిచేయవు. రక్షణ ఏర్పాట్లను పటిష్టంచేయకపోతే అమూల్యసంపద ఇలాగే అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’’ అని ఈజిప్ట్ మహిళా పురాతత్వవేత్త మోనికా హనా ఆవేదన వ్యక్తంచేశారు. ఈమె ఈజిప్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోయి అక్కడి మ్యూజియంలలో ప్రత్యక్షమైన పలు వస్తువులను తిరిగి తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తున్నారు. ఈమె అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీలో డీన్గా సేవలందిస్తున్నారు. -
మరో ఐదేళ్లలో బంగారం రూ.2 లక్షలకు!: కారణాలు ఇవే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, ట్రంప్ సుంకాలు వంటి అంశాలు బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1,13,070 వద్దకు చేరింది. అయితే ఈ ధర ఐదేళ్లకు ముందు.. 2020లో రూ. 51,000 మాత్రమే అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు ఎంతలా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.బంగారం ధర ఐదేళ్లలో (2020 - 2025 మధ్య) డబుల్ అయింది. గోల్డ్ డిమాండ్ తగ్గే సూచనలు కనిపించకపోవడంతో.. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇది రూ. 2 లక్షలకు చేరుకుంటుందా?, దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..బంగారంపై పెట్టుబడులు ఎక్కువ కావడం.. గోల్డ్ రేటు పెరుగుదలకు కారణమవుతోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని.. బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఈటీఎఫ్ రూపంలో బంగారం డిమాండ్ పెరుగుతుందని ట్రేడ్జీనీ సీఓఓ త్రివేష్ పేర్కొన్నారు.సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ డాలర్ ధర, ద్రవ్యోల్బణం వంటివన్నీ కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడతాయని ఇన్క్రెడ్ మనీ సీఈఓ విజయ్ కుప్పా పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధర పెరిగినా.. డిమాండ్ తగ్గదు!ఇప్పుడు రూ.1,13,070 వద్ద ఉన్న 10 గ్రామ్స్ గోల్డ్ రేటు.. మరో ఐదేళ్లలో రూ. 1.70 లక్షల నుంచి రూ. 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. కారణాలు ఎన్ని ఉన్నా.. 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4000 డాలర్లు దాటవచ్చని చెబుతున్నారు. దీంతో భారతదేశంలో కూడా పసిడి ధర గణనీయంగా పెరుగుతుంది. -
గోల్డ్ కార్డ్ వచ్చేసింది
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత స్థిరనివాసానికి బాటలువేసే అత్యంత ఖరీదైన ‘గోల్డ్ కార్డ్’పథకానికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఎవరైనా 10 లక్షల డాలర్లు చెల్లించి ఈ గోల్డ్కార్డ్ను తమ వశంచేసుకోవచ్చు. ఎంచక్కా అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవచ్చు. తమ సంస్థ పురోభివృద్ధికి అక్కరకొస్తారని భావించే అత్యంత నైపుణ్యమున్న సిబ్బంది, ఉన్నతాధికారులను అమెరికాకు తీసుకురావాలని భావించే కార్పొరేట్ సంస్థలు మాత్రం ఒక్కో వ్యక్తి కోసం 20 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు అమెరికా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వును రూపొందించగా దానిపై ట్రంప్ సంతకం చేశారు. ద్రవ్యలోటును తగ్గిస్తూ అమెరికా ఖజానాకు వందల కోట్ల డాలర్లను జమచేసే ఈ కీలక పథకాన్ని స్వయంగా ట్రంప్ రూపొందించారని తెలుస్తోంది. గత మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న పెట్టుబడి వీసా(ఈబీ–5)కి ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డ్ను తాజాగా తీసుకొచ్చారు. హెచ్–1వీ వీసాదారులు మొదలు ఎలాంటి వీసాల కోసం దరఖాస్తుచేసుకున్నవాళ్లయినా నేరుగా అమెరికా స్థిరనివాసం కావాలంటే ఈ గోల్డ్కార్డ్ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ ప్రపంచంలోని ఏ దేశంలోని సంపన్నులైనా అమెరికాలో శాశ్వత స్థిరనివాస హోదా సంపాదించాలంటే వీసా పొంది తర్వాత గ్రీన్కార్డ్ కోసం ఆతర్వాత పౌరసత్వం కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి సంపన్నులు, లక్షల డాలర్లు గుమ్మరించే స్తోమత ఉన్న ఉన్నతాధికారుల కోసమే ప్రత్యేకంగా ఈ గోల్డ్కార్డ్ను అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఖజానాకు ఆదాయ వరద కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశాక ట్రంప్ శ్వేతసౌధంలోని ఓవెల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘గోల్డ్కార్డ్ సాయంతో ఇకపై మేం వందల కోట్ల డాలర్లను ఒడిసిపట్టబోతున్నాం. ఖజానాకు గోల్డ్కార్డ్ ఆదాయ వరదను పారించనుంది. తమకు అత్యంత కీలకమైన ఉన్నతాధికారులు, నిపుణులు అనుకున్న వాళ్లను కంపెనీలు ఈ గోల్డ్కార్డ్తో అమెరికాకు రప్పించుకోవచ్చు. గోల్డ్కార్డ్ అనేది నిజంగా అత్యద్భుతం. ఈ కార్డ్ల విక్రయాలతో వచ్చే నగదుతో మా ద్రవ్యలోటు భారం తగ్గిపోతుంది. ఖజానా నిండిపోతే మేం పన్నులు కూడా తగ్గిస్తాం. అప్పుల గుదిబండను కాస్తంత దించుకుంటాం. గోల్డ్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అడిగిన ప్రతి డాక్యుమెంట్ను సమయానికి ఇవ్వాలి. కార్డ్ మంజూరైతే 10 లక్షల డాలర్లను ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అమెరికాకు ప్రయోజనం చేకూరేలా మసలుకుంటామని మాటివ్వాలి’’అని ట్రంప్ చెప్పారు. ‘‘కార్డ్ పొందిన వాళ్లు చట్టబద్ధ శాశ్వత స్థిరనివాస హోదా పొందేందుకు అర్హత సాధిస్తారు. వీసా అందుబాటులో ఉంటుంది. గోల్డ్కార్డ్దారులు ఇచ్చే 10 లక్షల డాలర్లను వాణిజ్యమంత్రి ప్రభుత్వ ఖజానాలో జమచేస్తారు. ఈ నగదును అమెరికా వాణిజ్యం, దేశీయ పారిశ్రామికాభివృద్ధి కోసం ఖర్చుపెడతారు. అమెరికాలో స్థిరపడాలనుకునే సంపన్న పెట్టుబడిదారులు, అంకుర సంస్థల అధినేతలు, నైపుణ్య సిబ్బందికి గోల్డ్కార్డ్ సులువైన చక్కటి మార్గం’’అని ట్రంప్ అన్నారు. పౌరసత్వానికి గోల్డ్కార్డ్ అనేది సుగమం చేస్తుందని గతంలో వాణిజ్యమంత్రి హోవర్డ్ లుట్నిక్ అన్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రష్యా, చైనా అనే తేడాలేకుండా లక్షలు చెల్లించే ఏ దేశ పౌరునికైనా ఈ కార్డ్ను అమెరికా విక్రయించి స్థిరనివాసానికి సాదరస్వాగతం పలుకుతోంది. ట్రంప్ నిర్ణయంతో సంపన్న భారతీయులకు వేగంగా యూఎస్ పౌరసత్వం లభించే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. కార్డ్ వస్తే వెంటనే పౌరసత్వం ఇచ్చినట్లుగా భావించకూడదని ప్రభుత్వం గతంలోనే స్పష్టంచేసింది. -
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐటీ ఉద్యోగుల జీతాల పెరుగుదల అంతా ఫేక్..
సాధారణంగా ఐటీ ఉద్యోగులకు అధిక జీతాలు ఉంటాయని, ఏటా జీతాల పెరుగుదల కూడా భారీగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ అదంతా ఫేక్ అంటున్నారు చార్టెడ్ అకౌంటెంట్ (సీఎ), క్రియేట్ హెచ్క్యూ ఫౌండర్ మీనాల్ గోయెల్. 8 శాతం జీతం పెరుగుతోందంటే మంచి పెంపు అనుకుంటారని, కానీ ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) మీ ఖర్చులను 12% పెంచిందని మీరు గ్రహించాక అసలు సంగతి అర్థమవుతుందంటున్నారు.జీతాలు, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య అధికమవుతున్న అసమతుల్యతను గోయెల్ ఇటీవలి తన లింక్డ్ఇన్ పోస్టులో హైలైట్ చేశారు. ఆమె ఐటీ రంగాన్ని ఉదాహరణగా తీసుకుని ఆ అసమతుల్యతను ఎత్తి చూపారు. ఇక్కడ ఎంట్రీ లెవల్ వేతనం 2012లో రూ. 3 లక్షల నుండి 2022 నాటికి కేవలం 3.6 లక్షల రూపాయలు అయింది. అంటే ఒక దశాబ్ద కాలంలో ఏ మేరకు కదిలిందో అర్థం చేసుకోవచ్చు. అదే కంపెనీల సీఈవోల జీతాలు మాత్రం అనేక రెట్లు ఎగిశాయి."నేటికి, చాలా మంది ఐటీ ఉద్యోగులు సింగిల్-డిజిట్ పెంపు గురించి మాట్లాడుతుండగా, వారి అద్దె, కిరాణా సామగ్రి, జీవనశైలి ఖర్చులు రెండంకెలలో పెరుగుతున్నాయి" అని గోయెల్ రాసుకొచ్చారు. ఆదాయాలు, ఖర్చుల కంటే వెనుకబడి ఉండటంతో, చాలా మంది స్థిరత్వం కోసం బంగారం వంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.చారిత్రాత్మకంగా, బంగారం ద్రవ్యోల్బణాన్ని ఓడించడమే కాకుండా అనిశ్చితి సమయాల్లో రక్షణను కూడా అందించింది. భారతదేశంలో, దాని ధర గత దశాబ్దంలో దాదాపు రెట్టింపు అయింది. ఓ మధ్య-స్థాయి ఐటీ ఉద్యోగి జీతం పెరుగుదలను అధిగమించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి ఇకపై లగ్జరీ కాదని గోయెల్ నొక్కి చెప్పారు. "మీరు సంపాదించే ఆదాయం, ఖర్చుల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడానికి పెట్టుబడులు మాత్రమే మార్గం" అని ఆమె చెప్పారు.ఇదీ చదవండి: ఫోన్పే, పేటీఎంలో ఇక రెంటు కట్టడం కష్టం! -
భారీగా పెరిగిన బంగారం అమ్మకాలు..
న్యూఢిల్లీ: జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద పసిడి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి మంగళవారం కొత్త గరిష్ట స్థాయి రూ.1,15,100 స్థాయికి చేరుకోగా.. బుధవారం రూ.1,300 నష్టపోయి రూ.1,13,800కు పరిమితమైంది. ధరలు తగ్గుముఖం పట్టడంతో.. సేల్స్ పెరిగాయి.‘‘యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మెగ్గు చూపించడంతో బంగారం బలహీనంగా ట్రేడయ్యింది. కీలకమైన సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకున్నారు. కేవలం ఫెడ్ రేట్ల కోతపైనే కాకుండా, తదుపరి రేట్ల సవరణ దిశగా ప్రకటించే అంచనాల కోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి.ఇదీ చదవండి: కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటుతటస్థ విధానం లేదా తదుపరి రేట్ల కోతకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ లోపిస్తే బంగారం ధరలు ఇక్కడి నుంచి కొంత శాతం తగ్గొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. మరోవైపు వెండి సైతం అమ్మకాల ఒత్తిడితో కిలోకి రూ.1,670 నష్టపోయి రూ.1,31,200 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతం తగ్గి 3,665 డాలర్ల వద్ద, కామెక్స్ ఫ్యూచర్స్లో పావు శాతం తగ్గి 3,717 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు?
బంగారానికి భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భరోసానిచ్చే సాధనంగా సాధారణ ప్రజలు పసిడిని కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్ల కోసం ఖరీదు చేస్తారు. వీరితోపాటు భారీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇండియాతోపాటు చాలా దేశాలు ఎందుకు ఇలా భారీగా పసిడిని కొనుగోలు చేస్తాయో తెలుసుకుందాం.కరెన్సీకి అండగా..ద్రవ్యోల్బణం పెరుగుతూ, దేశ కరెన్సీ విలువ తగ్గుతుంటే దాన్ని కాపాడేందుకు బంగారం హెడ్జింగ్గా పని చేస్తుంది. ముద్రించిన కరెన్సీ(ఫియట్ కరెన్సీ) విలువ తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం విలువ బలపడుతుంది. ఇది దిగుమతులకు ఆసరాగా ఉంటుంది. అస్థిరత సమయాల్లో బంగారం జాతీయ కరెన్సీలను కాపాడుతుంది. దేశం ద్రవ్య విధాన చట్రానికి విశ్వసనీయతను అందిస్తుంది.రిస్క్ వైవిధ్యంకేంద్ర బ్యాంకులు రిస్క్ను డైవర్సిఫై చేసేందుకు బంగారం నాన్-కోరిలేటెడ్ ఆస్తిగా ఉపయోగపడుతుంది. దీని విలువ ఈక్విటీలు లేదా బాండ్లతో అనుగుణంగా పడిపోదు. యూఎస్ డాలర్ పడిపోయినప్పుడు ఇది పెరుగుతుంది. ఇది రిజర్వ్ పోర్ట్ ఫోలియోల్లో స్మార్ట్ డైవర్సిఫికేషన్ హెడ్జ్గా మారుతుంది.భౌగోళిక రాజకీయ పరిస్థితులుబంగారం ఏ ఒక్క దేశానికి పరిమితమైంది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడం ఏ ఒక్క దేశంలో వల్లనో సాధ్యం కాదు. దీని విలువపై ఎన్నో అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విదేశీ కరెన్సీ నిల్వల మాదిరిగా కాకుండా, బంగారాన్ని స్తంభింపజేయడం లేదా దానిపై రాజకీయం చేయడం సాధ్యం కాదు. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలను పెంచాయి.లిక్విడిటీబంగారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విటిటీ ఆస్తుల్లో ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చవచ్చు లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించవచ్చు.టాప్ 8 దేశాల్లోని బంగారు నిల్వలు..దేశంబంగారం నిల్వలు (టన్నులు)అమెరికా8,133.46జర్మనీ3,350.25ఇటలీ2,451.84ఫ్రాన్స్2,437.00రష్యా2,329.63చైనా2,279.60స్విట్జర్లాండ్1,040.00భారతదేశం880.00 -
బంగారంపై బిగ్ న్యూస్ అంటున్న రిచ్డాడ్ కియోసాకి
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి బిగ్ న్యూస్ అంటూ మరో సమాచారంతో ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ‘401(కె)’ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛనిస్తుందని, తనకు అనుకూలమైన బంగారం, వెండి, బిట్ కాయిన్ల విలువను మరింత పెంచుతుందని ఆనందం వ్యక్తం చేశారు.ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన 401(కె) రైటర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ అద్భుతమంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో రాబర్ట్ కియోసాకి ఓ పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడు ఆండీ షెక్ట్మాన్ ప్రకారం.. ఆగస్టు 7న అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (401k)పై సంతకం చేశారని, అది ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్.. లూసర్లకు‘మీలో చాలా మందికి తెలుసు కదా.. నేను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టను. నాకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు అనేవి నష్టపోయేవారి కోసం’ అంటూ రాసుకొచ్చారు. ట్రంప్ కొత్త ఉత్తర్వు 401కె.. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, రుణాలు, క్రిప్టో , విలువైన లోహాలు వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒకే పన్ను గొడుగు కిందకు తెస్తుందన్నారు. ఇది తెలివైన, అధునిక ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తుందన్నారు.కొత్త పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయలేనివారు, కష్టపడలేనివారు మాత్రం అవే సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ట్రంప్ కొత్త ఉత్తర్వుతో తాను మాత్రం చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఎందుకంటే ఇది తన బంగారం, వెండి, బిట్ కాయిన్ లను మరింత విలువైనదిగా చేస్తుందని వివరించారు.BIG NEWS: According to friend Andy Schectman….on August 7, 2025….President Trump signed an Executive Order “Democratizing Access to Alternative Investments for 401k Investors.”As some of you know I do not invest in mutual funds or ETFS. To me Mutual funds and ETFS are for…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 17, 2025 -
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రేటే 'బంగార'మాయెనే..
సాక్షి, విశాఖపట్నం : పసిడితో భారతీయులకు ఉన్న అనుబంధం మరే దేశంలోనూ కనిపించదు. చేతిలో కొద్దిగా డబ్బులు కనిపిస్తే.. వెంటనే కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. పుత్తడి కొంటే.. శుభసూచకమని అంటుంటారు. అందుకే స్వర్ణం.. సమస్తమయమైపోయింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ నేపథ్యంలో రోజురోజుకీ పసిడి ధర పైపైకి ఎగబాకుతూ.. ఆల్టైమ్ హై రేట్ని నమోదు చేస్తోంది. ఒకప్పుడు 10 గ్రాముల ధరతో ఇప్పుడు గ్రాము కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. వారం రోజులుగా ఎగబాకుతున్న బంగారాన్ని చూసి.. వెండి కూడా అదే బాటలో దూసుకుపోతోంది. లక్ష రూపాయల కంటే దిగువకు బంగారం ధర దిగే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గేదేలే అంటున్న పుత్తడి గత వారం రోజులుగా బంగారం ధర తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08, 380 ఉండగా.. 9వ తేదీన రూ.1,10,290కి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.10 లక్షలకు తక్కువ కాలేదు. వెండి కూడా ధగధగ మెరిసిపోతోంది. ఈ నెల 8న కిలో వెండి ధర రూ.1.37 లక్షలు ఉండగా.. 15వ తేదీ నాటికి రూ.6 వేలు పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు దాదాపు రూ.1000 చొప్పున పెరుగుతూ వస్తోంది. పెట్టుబడి విషయంలోనూ బంగారమే..! రోజు రోజుకీ ధర పెరుగుతూ వస్తున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ప్రజలు అస్సలు తగ్గేదే..లే అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పసిడి ఎంత ఉంటే అంత ఎక్కువ సొమ్ము ఉన్నట్లుగా భావిస్తారు. వాస్తవానికి బంగారం నిరర్థక ఆస్తి. ఎంతో కష్టించి సంపాదించిన సొమ్ము బంగారంగా మార్చితే బీరువాల్లోనూ, బ్యాంకు లాకర్లలోనూ భద్రంగా ఉంచడం తప్ప... మరో ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తులో ధర పెరిగి, పెరిగిన ధరకు దాన్ని విక్రయిస్తేనే లాభం. మనకు తెలిసినంత వరకూ బంగారం కొనడమే కానీ.. విక్రయించడమన్నది అరుదు. దీని బదులు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వెచ్చిస్తే సంపద సృష్టి జరుగుతుంది. మన దేశంలో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో బంగారం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సరకు బంగారమేనన్నది విస్మయపరిచే అంశం. ఇటీవల కాలంలో మనదేశంలో బంగారం కొనుగోళ్లు అధికమై.. నగదు పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గృహస్తులు ఇతర వాటిపై ఒక్క శాతం పెట్టుబడులు పెడుతుండగా బంగారంపై మాత్రం ఆరున్నర రెట్లు ఎక్కువ మొగ్గు చూపుతుండటం విశేషం. బంగారానికి ఇంత వన్నె ఎందుకో..? పుత్తడి ఎంత ఉన్నా సగటు వ్యక్తికి మోజు తీరడం లేదు. తన శక్తి మేరకు బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు బంగారానికి ఇంత వన్నె ఉండటానికి కారణం అంతర్జాతీయ కరెన్సీకి ప్రత్యామ్నాయం కావడమే. ఒక దేశం జారీ చేసిన నోట్లు చెల్లకపోవడం. వాటి విలువ క్షీణించడం ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి బేధాలేమీ లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కొంత ధరకు చెలామణి అవుతుంది. అందుకే స్వర్ణానికి అంత కళ. ధర తగ్గినా పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ స్వర్ణమండలి(డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని సంస్థలు, గృహస్తులు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద 25 వేల టన్నుల బంగారం ఉంది. భారత్లో మొత్తం ఇళ్లల్లోనూ, ఇతర అవసరాలకు ఈ బంగారం వివిధ రూపాల్లో నిల్వ ఉంది. ఇందులో విశాఖ నగర జనాభా ప్రకారం 80 నుంచి 100 టన్నుల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం సగటున విశాఖ నగరంలో ప్రతి ఇంటిలోనూ 15 నుంచి 25 గ్రాములు వరకూ బంగారం ఉంటుదని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోళ్లు తగ్గినా.. మార్కెట్ దూసుకుపోతోంది టెక్స్టైల్స్ మార్కెట్ 15 నుంచి 20 శాతం పడిపోయింది. బంగారం మార్కెట్ కూడా 15 నుంచి 20 శాతం పడిపోయింది. మార్కెట్ విలువ మాత్రం బంగారం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చైనా, భారత్ వంటి దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పసిడి ధర మూడు నాలుగు రోజులకోసారి మారేది. ఇప్పుడు ఒక పూట ఉన్న రేటు మరో పూటకు ఉండటం లేదు. బులియన్ మార్కెట్ కూడా అంచనా వేయలేకపోతోంది. పెట్టుబడుల విషయంలోనూ బంగారానికి మంచి డిమాండ్ ఉంది. బంగారంతో వెండి పోటీ పడుతోంది. బ్యాటరీ కార్లలో వెండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పవచ్చు. – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ పాస్ట్ ప్రెసిడెంట్ -
సరికొత్త శిఖరాలకు పసిడి
న్యూఢిల్లీ: దేశీయంగా పసిడి ధరలు మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి రూ.1,15,100 స్థాయికి చేరింది. ఇదొక సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి. డాలర్ బలహీనత, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండడంతో ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదవుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం కొత్త గరిష్టానికి చేరింది.కిలోకి రూ.570 పెరిగి రూ.1,32,870 స్థాయిని నమోదు చేసింది. యూఎస్ ఫెడ్ సెపె్టంబర్ భేటీలో భారీ రేట్ల కోత దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తీసుకురావడం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ డాలర్ బలహీనతకు తోడు, ఫెడ్ ఒకటికి మించిన రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలతో మంగళవారం బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరినట్టు చెప్పారు.పది వారాల కనిష్టానికి డాలర్ ఇండెక్స్ బలహీనపడినట్టు తెలిపారు. రేట్ల కోత దిశగా ఫెడ్ సానుకూల వైఖరి, భారత్, చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన పరిణామాలతో ట్రేడర్లు బంగారంలో లాంగ్ పొజిషన్లను కొనసాగిస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం లాభాలతో కొనసాగుతూ 3,739 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట స్థాయి నమోదు చేసింది. -
నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్
డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్లో మాట్లాడుతూ.. తన పోర్ట్ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబిట్కాయిన్ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్కాయిన్ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్కాయిన్, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. -
Eluru: కొబ్బరి నీళ్లు తెమ్మని చెప్పి రెండు కిలోల బంగారంతో పరార్
-
డుప్లాంటిస్... ప్రపంచ రికార్డు నంబర్ 14
ఊహించిన అద్భుతమే జరిగింది. పోల్ వాల్ట్లో మరోసారి ప్రపంచ రికార్డు బద్దలయింది. మారింది వేదిక మాత్రమే... ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి మాత్రం మారలేదు... వరల్డ్ రికార్డు నెలకొల్పడం... మళ్లీ దానిని సవరించడం... తన ఖాతాలో పసిడి పతకం వేసుకోవడం... సమీప ప్రత్యర్థులను రెండో స్థానానికే పరిమితం చేయడం... పోల్ వాల్ట్ క్రీడాంశం పేరు చెబితే తనను తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా రోజురోజుకూ రాటుదేలుతూ దూసుకుపోతున్న ఆ అథ్లెట్ ఎవరో కాదు... స్వీడన్ స్టార్ అర్మాండో డుప్లాంటిస్... బరిలో దిగితే ప్రపంచ రికార్డుపైనే గురి పెట్టే ఈ సూపర్ స్టార్ పోల్ వాల్టర్ సోమవారం టోక్యోలో మెరిశాడు. కళ్లు చెదిరే ప్రదర్శనతో తన ఖాతాలో 14వ ప్రపంచ రికార్డు వేసుకోవడంతోపాటు... ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించి... ఈ క్రీడాంశంలో దిగ్గజం సెర్గీ బుబ్కా సరసన డుప్లాంటిస్ చేరాడు. టోక్యో: అథ్లెటిక్స్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూసిన పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్లో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అర్మాండో డుప్లాంటిస్ అలరించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో స్వీడన్కు చెందిన 25 ఏళ్ల డుప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 6.30 మీటర్ల ఎత్తుకు ఎగిరిన డుప్లాంటిస్ తన కెరీర్లో 14వ సారి ప్రపంచ రికార్డును లిఖించాడు. గత నెలలో హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగిన మీట్లో 6.29 మీటర్లతో తానే నెలకొలి్పన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. విజేతగా నిలిచిన డుప్లాంటిస్కు 70 వేల డాలర్లు (రూ. 61 లక్షల 68 వేలు) ప్రైజ్మనీగా, ప్రపంచ రికార్డు సృష్టించినందుకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షల 12 వేలు) బోనస్గా లభించాయి. 12 మంది పోటీపడ్డ ఫైనల్లో డుప్లాంటిస్ తన ఆరో ప్రయత్నంలో 6.15 మీటర్ల ఎత్తును అధిగమించి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కరాలిస్ (గ్రీస్; 6 మీటర్లు) రజత పతకం నెగ్గగా... కురి్టస్ మార్షల్ (ఆ్రస్టేలియా; 5.95 మీటర్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పసిడి పతకం ఖాయమయ్యాక డుప్లాంటిస్ ప్రపంచ రికార్డుపై గురి పెట్టాడు. తొలి రెండు ప్రయత్నాల్లో 6.30 మీటర్ల ఎత్తును అధిగమించడంలో విఫలమైన డుప్లాంటిస్ మూడో ప్రయత్నంలో సఫలమై ప్రపంచ రికార్డును అందుకున్నాడు. డుప్లాంటిస్ కెరీర్లో ఇది వరుసగా 49వ విజయంకాగా... మేజర్ టోరీ్నల్లో ఐదో టైటిల్. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలిచిన డుప్లాంటిస్.. 2022 ప్రపంచ చాంపియన్íÙప్లో, 2023 ప్రపంచ చాంపియన్షిప్లో బంగారు పతకాలు సాధించాడు. తాజా విజయంతో డుప్లాంటిస్ ప్రపంచ చాంపియన్íÙప్లో ‘హ్యాట్రిక్’ స్వర్ణాలను సొంతం చేసుకున్నాడు. సెర్గీ బుబ్కా తర్వాత వరుసగా మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో బంగారు పతకాలు గెలిచిన రెండో పోల్ వాల్టర్గా డుప్లాంటిస్ గుర్తింపు పొందాడు. సెర్గీ బుబ్కా (సోవియట్ యూనియన్/ఉక్రెయిన్) వరుసగా ఆరు ప్రపంచ చాంపియన్íÙప్లలో (1983, 1987, 1991, 1993, 1995, 1997) స్వర్ణ పతకాలు సాధించాడు. -
భారీగా పెరిగిన బంగారం: పెట్టుబడికి ఓ మంచి మార్గం!
బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2024 సెప్టెంబర్లో దాదాపు రూ.73,200 వద్ద ఉండేది. అదే ఇప్పుడు (2025 సెప్టెంబర్) రూ.1,11,000కు చేరింది. అంటే రేటు సుమారు 54 శాతం పెరిగిందన్నమాట. గోల్డ్ ధరలు మాత్రమే కాకుండా.. గోల్డ్ ఈటిఎఫ్లు కూడా 50% వరకు రాబడిని అందించాయి. ఇది ఈటిఎఫ్లలో పెట్టుబడులను పెంచడానికి దోహదపడింది.2025 ఆగస్టులో గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు రూ.2,189.5 కోట్లు అని తెలుస్తోంది. ఏఎంఎఫ్ఐ ప్రకారం.. గోల్డ్ ఈటిఎఫ్లలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.72,495 కోట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని స్పష్టమవుతోంది.గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఏమిటి?గోల్డ్ ఈటీఎఫ్లు అనేవి.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే మ్యూచువల్ ఫండ్ వంటిది అన్నమాట. పెట్టుబడిదారులు షేర్ల మాదిరిగానే డీమ్యాట్ ఖాతాల ద్వారా ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు, తద్వారా వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వీటి విలువ బంగారం ధరలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.పెట్టుబడిదారులు గోల్డ్ ఈటిఎఫ్లను ఎందుకు ఇష్టపడతారు●గోల్డ్ ఈటీఎఫ్లను స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు.●సాధారణ బంగారం మాదిరిగా.. గోల్డ్ ఈటిఎఫ్లనుప్రత్యేకంగా భద్రపరచాల్సిన అవసరం లేదు.●గోల్డ్ ఈటీఎఫ్లను చిన్న మొత్తంలో.. అంటే రూ. 500 లేదా రూ. 1000 కి కూడా కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.●గోల్డ్ ఈటీఎఫ్లకు మంచి లిక్విడిటీ ఉంటుంది. వీటిని తొందరగా అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.బంగారంపై పెట్టుబడికి మార్గాలు●గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ప్రధానంగా గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడి●సావరిన్ గోల్డ్ బాండ్లు: వడ్డీతో పాటు, పెరిగిన ధరలను అందుకోవచ్చు●భౌతిక బంగారం: ఆభరణాలు, నాణేలు, కడ్డీలుబంగారం ధరలు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, కరెన్సీ కదలికలు, భౌగోళిక రాజకీయ సంఘటనలు వంటివన్నీ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి బంగారంపై సురక్షితమైనదని నిపుణులు చెబుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారుడే నిర్ణయం తీసుకోవాలి. -
సింహాచలం అప్పన్న ఆభరణాలకు శఠగోపం.. బంగారం ఏమైంది?
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాలకు శటగోపం పెట్టారు. భక్తులు ఇచ్చిన విలువైన బంగారు ఆభరణాల అపహరణకు గురైనట్టు సమాచారం. ఆభరణాల లెక్క తేలకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. సింహాచలం అప్పన్న ఆలయంలో లెక్కా పత్రం లేకుండా విరాళాల నిర్వహణ సేకరణ జరిగింది. దీనిపై కమిటీ వేసి విచారణ చేపట్టినా.. ఆభరణాల లెక్కను మాత్రం అధికారులు చెప్పలేదు. విచారణ కమిటీ ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా లెక్కలు చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు ఆభరణాలు అపహరణకు గురైనట్టు భక్తులు చెబుతున్నారు. అప్పన్న ఆలయంలో బంగారం అపహరణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అనుబంధ ఆలయాల్లో ఉన్న ఆభరణాలపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందు సింహాచలం అప్పన్న ఆభరణాలపై వివాదం నెలకొంది. అప్పన్న ఆభరణాలు అపహారణకు గురయ్యాయంటూ గత ఏడాది విశాఖ జిల్లా కలెక్టర్కు ప్రభాకరాచారి ఫిర్యాదు చేశారు. ఆభరణాల విషయంలో వాస్తవాలు తేల్చేందుకు ఆలయ ఉన్నతాధికారులు కమిటీ వేశారు. కమిటీ ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతో మరోసారి ప్రభాకరాచారి.. కలెక్టర్కు అర్జీ పెట్టారు. అనంతరం, కమిటీ విచారణ చేస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కానీ, కమిటీ సభ్యులు విచారణ చేయలేదు. భక్తులు ఇచ్చే బంగారు ఆభరణాల వివరాలు నమోదు చేసే రికార్డ్ కూడా మెయింటైన్ చేయడం లేదని ప్రభాకరాచారి ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అప్పన్న భక్తుల్లో ఆందోళన నెలకొంది. -
బంగారం బుల్లెట్ ర్యాలీ!
న్యూఢిల్లీ: కనకం ‘ల’కారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది! కొన్నిరోజులుగా రూ. లక్షపైనే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్లీ హైజంప్ చేసింది. బంగారం ధర మంగళవారం బుల్లెట్లా దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 5,080 పెరిగి రూ. 1,12,750 స్థాయికి చేరింది. దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి. అంతేకాదు.. ఒకేరోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు రూ. 2,800 లాభపడటంతో రూ. 1,28,800 స్థాయిని తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం 3,698 డాలర్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ‘బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది. ఈ ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35 శాతం పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ల నుంచి బలమైన డిమాండ్కు తోడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి పెట్టుబడుల రాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు.. బంగారం, వెండిలో రికార్డు బ్రేకింగ్ ర్యాలీకి కారణమవుతున్నాయి’అని హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలు సైతం సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నట్టు గాంధీ వివరించారు. -
దేశంలోకి రెండేళ్లలో రూ.800 కోట్ల దొంగ బంగారం
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ద్వారా గడిచిన రెండేళ్ల కాలంలో కనీసం టన్ను బరువైన రూ.800 కోట్ల బంగారంలో దేశంలోకి దొంగచాటుగా వచ్చింది. 2023, 2024 సంవత్సరాల్లో టిబెటన్లు, చైనీయులే ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు. గతేడాది జూలైలో లద్దాఖ్లో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) దళం 108 కిలోల విదేశీ బంగారం కడ్డీలను పట్టుకున్న నేపథ్యంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు మంగళవారం ఈడీ వర్గాలు తెలిపాయి.చైనాతో మనకున్న 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ రక్షణ బాధ్యతలను ఐటీబీపీయే చూసుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఐదు ప్రాంతాలు, లద్దాఖ్లో ఒక చోట మంగళవారం తనిఖీలు చేపట్టామని ఈడీ వివరించింది. దొంగతనంగా తీసుకువచ్చిన బంగారానికి సంబంధించిన చెల్లింపులన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారానే పూర్తయినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపింది. పట్టుబడిన 108 కిలోల విదేశీ బంగారాన్ని చైనాకు చెందిన భు చుమ్చుమ్ అనే వ్యక్తి భారత్లోని టెండు తాషికి ఎల్ఏసీ ద్వారా పంపాడని డీఆర్ఐ వివరించింది. ఇందుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నామంది. -
Today Gold Price: గోల్డ్ రేట్ ఎంతంటే?
-
స్పీడుమీదున్న కనకం.. తొలిసారి రికార్డు స్థాయికి!
భారతదేశంలో బంగారం ధరలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు (సెప్టెంబర్ 9) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1360 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,10,290 వద్దకు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పసిడి ప్రియులకు మంచి రోజు.. ఎందుకంటే?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూ.. ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి. నేడు (సెప్టెంబర్ 8) పసిడి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 99,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 99,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,08,770 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 99,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 1,08,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 90 తక్కువ. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (సెప్టెంబర్ 08) కేజీ సిల్వర్ రేటు రూ. 1,37,000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,27,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
Daslakshan Mahaparv: వజ్రాలు పొదిగిన స్వర్ణకలశం చోరీ
న్యూఢిల్లీ: ఎర్రకోట ప్రాంగణం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే దేశ రాజధానిలోని కీలక చారిత్రక ప్రాంతం. పోలీసుల వలయంగా వినతికెక్కిన అలాంటి చోట సైతం చోరకళను ప్రదర్శించాడు ఒక దొంగ. కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని కొట్టేసే లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆ దొంగ జైన గురువు వేషధారణలో వచ్చి అలవోకగా కలశాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జరిగిన ఈ చోరీ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెల్సుకున్న పోలీసులు వెంటనే ఆ చోరశిఖామణి వేటలో తలమునకలయ్యారు. వజ్రవైడ్యూరాలు, రత్నాలు, కెంపులు వంటి అత్యంత విలువైన రాళ్లు పొదిగిన ఆ కలశాన్ని భుజానికున్న బ్యాగులో పెట్టుకుని ఉడాయించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. జంకులేకుండా వచ్చి మరీ.. ఎర్రకోట ప్రాంగణంలోని 15వ నంబర్ గేట్ వద్ద సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జైనుల సంబంధ మత కార్యక్రమం ‘దస్లక్షణ్ మహాపర్వ్’నిర్వహించారు. ఆగస్ట్ 28వ తేదీ నుంచి మొదలై సెప్టెంబర్ 9వ తేదీదాకా జరగనున్న ఈ కార్యక్రమం కోసం సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన సుదీర్జైన్ అనే వ్యాపారి తన సొంత పుత్తడి కలశాన్ని ప్రతిరోజూ తీసుకొచ్చి పూజ తర్వాత ఇంటికి తీసుకెళ్తున్నారు. 760 గ్రాముల బరువైన ఈ కలశానికి చుట్టూతా 150 గ్రాముల బరువైన, అత్యంత విలువైన వజ్రాలు, కెంపులు, మరకతాలు అందంగా అద్ది ఉంటాయి. ఎప్పటిలాగే ఆయన కలశాన్ని తీసుకురాగా ఉదయం 9 గంటల 26 నిమిషాలకు కొందరు ప్రముఖులు కార్యక్రమానికి వచ్చారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం వచ్చి జైన గురువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీంతో కలశ యజమానిసహా తదితరులు పక్కకు వెళ్లారు. అదే అదునుగా భావించి ఒక దొంగ జైన గురువు వేషధారణలో శ్వేతవర్ణ దుస్తులు ధరించి కార్యక్రమంలో చొరబడ్డాడు. ఎవరూ గమనించని సమయంలో ఆ కలశంతోపాటు మరో కొబ్బరికాయ ఆకారంలోని పాత్ర, మరో బంగారు పాత్రను దొంగ ఎత్తుకుపోయాడు. ఈ తతంగం అంతా అక్కడి గదిలోని సీసీటీవీలో రికార్డయింది. కార్యక్రమం నిర్వాహకుడు పునీత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చేపట్టారు. అయితే ఈ దొంగ గతంలో ఇదే ఎర్రకోట ప్రాంగణంలో మూడుసార్లు చోరీలు చేసి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దొంగను గుర్తించామని త్వరలనే అతడిని పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. అయినప్పటికీ ఎర్రకోట ప్రాంగణంలో సరైన పోలీసు భద్రత లేదనే ఆరోపణ మరోసారి తెరమీదకొచ్చింది. ఇటీవల ఎర్రకోట సమీపంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు సన్నాహకాల వేళ ఉత్తుత్తి బాంబును సైతం గుర్తించడంలో విఫలమైన కానిస్టేబుల్సహా ఏడుగురు ఢిల్లీ పోలీసులను సస్పెండ్ చేయడం తెల్సిందే. -
డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం.. సుంకాల నుంచి గ్రాఫైట్, టంగ్స్టన్, యురేనియం, బంగారు కడ్డీలు, ఇతర లోహాలను మినహాయించాలని, సిలికాన్ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త మార్పు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా అధికారుల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి ఉత్తర్వులో పేర్కొన్నారు.ఈ ప్రకటన తరువాత విమాన భాగాలు, జెనరిక్ ఔషధాలు, దేశీయంగా పండించలేని, తవ్వలేని లేదా సహజంగా ఉత్పత్తి చేయలేని కొన్ని ఉత్పత్తులు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, కాఫీ వంటి వాటికి కూడా భవిష్యత్తులో సుంకాల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంటుందని సమాచారం.కొన్ని రోజుల క్రితం యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ తీర్పు వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బులియన్ దిగుమతి పన్నులకు లోబడి ఉంటుందని సూచించడం కొంత గందరగోళానికి గురిచేసింది. ఆ తరువాత బంగారు కడ్డీలను సుంకాల నుంచి మినహాయించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్నసుంకాలు మాత్రమే కాకుండా.. కొన్ని ఒప్పందాల విషయంలో కూడా ట్రంప్ సంచనలం సృష్టించారు. ఇవి దేశంలోని కీలకమైన మార్కెట్లకు అంతరాయం కలిగించవచ్చని, అమెరికాలో పండించలేని లేదా ఉత్పత్తి చేయలేని వస్తువుల ధరలను పెంచుతాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ట్రంప్.. అంతరిక్షం, కొన్ని ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించే కీలకమైన పదార్థాలతో సహా అనేక ఖనిజాలపై పరస్పర సుంకాలను ఎత్తివేయడం మొదలుపెట్టారు.సూడోఎఫెడ్రిన్, యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాల వంటి ఫార్మాస్యూటికల్స్ వంటివన్నీ.. ఇప్పటికే వాణిజ్య శాఖ దర్యాప్తుకు లోబడి ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా సుంకాల నుంచి ఉపసమయం పొందుతున్నాయి. అయితే.. సిలికాన్ ఉత్పత్తులతో పాటు, రెసిన్, అల్యూమినియం హైడ్రాక్సైడ్లపై సుంకాలను విధిస్తున్నారు. -
రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు: మూడు కారణాలు
ఈ రోజుల్లో బంగారం కేవలం అలంకారానికి ఉపయోగించే ఆభరణం కాదు. భవిష్యత్తు కోసం దాచుకునే ఓ పెట్టుబడి. ప్రస్తుతం గోల్డ్ రేట్లు రాకెట్లా దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో రూ. 78వేలు నుంచి రూ. 84వేలు మధ్య ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర నేడు.. రూ. లక్ష దాటేసింది. ఇంతలా ధరలు పెరగడానికి ద్రవ్యోల్బణం లేదా రిటైల్ డిమాండ్ వంటివి మాత్రమే కాకుండా.. మరో మూడు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి.➤పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. యూఎస్ డాలర్ మీద తగ్గుతున్న నమ్మకం వంటివి బంగారం ధరలను అమాంతం పెంచేసాయి. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడంపై సుముఖత చూపుతున్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో మాత్రమే, కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు ఐదేళ్ల సగటు కంటే 24 శాతం ఎక్కువగా ఉన్నాయి. చైనా, పోలాండ్ వంటివి ఈ విషయంలో ఇతర దేశాల కంటే ముందు ఉన్నాయి.➤బంగారం ధరలు పెరగడానికి.. ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణం. 2022లో 300 బిలియన్లకు పైగా రష్యన్ నిల్వలు స్తంభింపజేసినప్పుడు.. అనేక దేశాలు తమ డాలర్ విలువను పెంచుకోవచ్చని గ్రహించాయి. ఆ సమయంలో బంగారం ఒక భీమా పాలసీగా మారింది. కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు ఇప్పుడు 1,000 టన్నులను మించిపోయాయి, ఇది దశాబ్ద సగటు కంటే రెట్టింపు అని తెలుస్తోంది.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక➤భారతదేశంలో గోల్డ్ ఇటీఎఫ్లలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. పెట్టుబడిదారులు 2025 జూన్లో రూ. 2,000 కోట్లు, 2025 జూలైలో మరో రూ. 1,256 కోట్లకు పైగా ఈ నిధులలోకి ఇన్వెస్ట్ చేశారు. భారతీయులలో కూడా చాలామంది బంగారాన్ని కేవలం పండుగలకు మాత్రమే కాకుండా.. పొదుపు చేయడంలో భాగంగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.ఈ రోజు బంగారం ధరలు ఇలాసెప్టెంబర్ 05న భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 700 పెరిగి రూ. 98,650 వద్దకు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 760 పెరిగి రూ. 1,07,620 వద్ద నిలిచింది. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ పెరిగిపోయింది. -
Gold Price: ఈ రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధర
-
మధ్య తరగతి కొనలేని స్థాయికి.. రికార్డు బ్రేక్ చేసిన బంగారం
-
కేజీఎఫ్ గనుల్లో బంగారం లేదు
కేజీఎఫ్: కోలారు జిల్లాలోని ప్రఖ్యాత కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) గనుల పునఃప్రారంభంపై స్థానిక ఎంపీ చేదు కబురు చెప్పారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన బిజిఎంఎల్ సంస్థ పునః ప్రారంభం అనుమానమేనని కోలారు ఎంపీ ఎం.మల్లేష్ బాబు తెలిపారు. బుధవారం ఉరిగాంలో స్వర్ణభవన కార్యాలయాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడారు. బిజిఎంఎల్ భాగంలో ఇంకా బంగారు నిక్షేపాలు ఉన్నాయా అనేదానిని సర్వే చేయడానికి ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చారు, సర్వే చేసిన ఆ ఏజెన్సీ ఇక్కడ ఎలాంటి బంగారు నిక్షేపాలు లేవని నివేదిక సమరి్పంచింది. అందువల్ల బిజిఎంల్ సంస్థ పునః ప్రారంభం కావడం అనుమానమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ గనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా పునః తవ్వకాలు సాధ్యం కాదు. సైనైడ్ దిబ్బల వేలం.. అయితే గతంలో కేజీఎఫ్లో గనుల నుంచి తవ్వి తీసిన సైనైడ్ మట్టి దిబ్బల వేలం ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. రెండు నెలల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కుమారస్వామిలు కేజీఎఫ్కు వచ్చి, పునరావాస పథకం కింద గని కారి్మకులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేస్తారని ఎంపీ చెప్పారు. ఏపీలో మదనపల్లిలో వాన నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన డ్యాం నుంచి వానాకాలంలో వృథాగా వెళుతున్న నీటిని కోలారు జిల్లాలోని చెరువులకు అందించడం గురించి అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. -
కన్నడ నటి రన్యా రావుకు బిగ్ షాక్.. ఏకంగా వందకోట్లకు పైగా!
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ బ్యూటీ రన్యారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రూ.102.55 కోట్ల జరిమానా విధించారు. ఆమెతో సహా నలుగురు నిందితులకు మొత్తంగా రూ.270 కోట్ల పెనాల్టీ విధిస్తూ జైల్లోనే నోటీసులు ఇచ్చారు. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని డీఆర్ఐ అధికారులు హెచ్చరించారు. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె నుంచి 14.3 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. నిందితులకు ఏడాది పాటు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. ఆమెతోపాటు సహచరుడు తరుణ్ కొండూరు రాజు, బంగారం వ్యాపారి సాహిల్ జైన్లకూ శిక్ష పడింది. రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ నుంచి తరుణ్తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రూ.2.67 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు నుంచి మొత్తంగా రూ. 17.29 కోట్ల నగదు, బంగారాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. రన్యా రావు గత 12 నెలలకాలంలో 27 సార్లు విదేశాలకు వెళ్లిందని, కస్టమ్స్ సుంకం మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవే కారణాలు!
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పటిష్టంగా ఉండటం, టారిఫ్లపరమైన అనిశ్చితి, ఈ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య పసిడి ర్యాలీ కొనసాగుతోంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం సోమవారం దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ. 1,000 పెరిగి మరో కొత్త రికార్డు స్థాయి రూ. 1,05,670ని తాకింది.99.5 శాతం స్వచ్ఛత బంగారం రూ. 800 పెరిగి రూ. 1,04,800కి చేరింది. అమెరికా టారిఫ్లపరమైన అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఫెడ్ వైఖరి గురించి ఆందోళన పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు, పసిడిలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారని ట్రేడర్లు వెల్లడించారు. రూపాయి మారకం క్షీణిస్తుండటం, భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పుత్తడి ఆకర్షణీయత మరింత పెరిగిందని ట్రేడ్జీని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి. త్రివేశ్ తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ రిజర్వ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, టారిఫ్లపరమైన అనిశ్చితి, ఈ నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మొదలైన అంశాలు స్పాట్ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమవుతున్నాయని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కాయ్నాత్ చైన్వాలా చెప్పారు.ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) పసిడి రేటు ఒక దశలో 3,556.87 డాలర్లకు ఎగిసింది. ఇది కొత్త ఆల్టైమ్ రికార్డు స్థాయి కావడం గమనార్హం. మరోవైపు, వెండి ధర కేజీకి మరో రూ. 1,000 పెరిగి ఇంకో కొత్త గరిష్ట స్థాయి రూ. 1,26,000ని తాకింది. పర్యావరణహిత విద్యుత్, ఎల్రక్టానిక్స్ తదితర పరిశ్రమల నుంచి డిమాండ్తో పాటు స్పెక్యులేషన్ కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని త్రివేశ్ వివరించారు. -
Gold Price in India: బంగారం ధరలకు రెక్కలు
-
ఆన్లైన్ బెట్టింగ్కు అడ్డదారులు
గోదావరిఖని/చెన్నూర్: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఒకసారికాదు.. అనేకసార్లు అదే ఆట ఆడి డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బు సంపాదించేందుకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐలో క్యాషియర్గా పనిచేస్తున్న నరిగె రవీందర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసం 402 గోల్డ్లోన్లకు సంబంధించిన 25.17కిలోల బంగారం, రూ.1.10 కోట్ల నగదు చోరీ చేశాడు. రీజియన్ మేనేజర్ రితేశ్కుమార్గుప్తా ఆగస్టు 23న ఇచ్చిన ఫిర్యాదుతో చోరీ విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారంలో రోజుల్లోనే కేసు ఛేదించారు.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చోరీపై పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదివారం తన కార్యాలయంలో ఆ వివరాలు వెల్లడించారు.75 శాతం బంగారం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడు బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్..బ్యాంక్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్లతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు విచారణ జరిపి ఛేదించారు. రూ.40 లక్షల నష్టాన్ని పూడ్చుకునేందుకు.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్తో రూ.40 లక్షలు కోల్పోయిన రవీంద ర్.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అదే బెట్టింగ్పై దృష్టి సారించాడు. దీనికి బ్రాంచ్ మేనేజర్ మనోహర్, ఔట్సోర్సింగ్ ఉద్యో గి సందీప్తో కలిసి బంగారం, నగదుకు పక్కా ప్రణాళిక వేశాడు. పదినెలలుగా.. పకడ్బందీగా.. ఏడాది క్రితం చెన్నూర్ బ్రాంచ్–2 ఎస్బీఐ క్యాషియర్గా బదిలీపై వెళ్లిన రవీందర్.. బ్యాంక్లో కుదువ పెట్టిన బంగారాన్ని తీసి వేరే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందాడు. ఆ సొమ్మును బెట్టింగ్కు వెచ్చించాడు. గతేడాది అక్టోబర్ నుంచి గోల్డ్లోన్ చెస్ట్ నుంచి బంగారం తీసి తన స్నేహితులకు ఇచ్చి, ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టాడు. ఆ డబ్బును తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసిన స్నేహితులకు కొంత కమీషన్ కూడా ముట్టజెప్పేవాడు. ఇలా 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలు (ఎస్ఎఫ్సీ, ఇండెల్మనీ, ముత్తూట్ఫైనాన్స్, గోదావరి అర్బన్, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ కార్ప్, ముత్తూట్ మినీ) 44 మంది పేర్లపై 142 గోల్డ్లోన్లు తీసుకున్నాడు.బంగారం లేకుండానే.. గోల్డ్లోన్లు.. నరిగె రవీందర్ బంగారం లేకుండానే గోల్డ్ లోన్లు తీసుకున్నాడు. తన భార్య, బావమరిది, స్నేహితుల పేర్లతో 42 గోల్డ్లోన్లు మంజూరు చేసి 4.14 కిలోల బంగారం పేరుతో రూ.1.58 కోట్లు కాజేశాడు. ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బు అపహరించేవాడు. ఈ కేసులో 15.23 కిలోల బంగారం రికవరీ చేశారు. గోల్డ్లోన్ మేనేజర్ల పాత్రపై విచారణ జరుగుతోంది.15.237 కిలోల బంగారం రికవరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు రవీందర్, మేనేజర్ మనోహర్తోపాటు మరో 42 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 15.237 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.44 మంది నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు నరిగె రవీందర్, బ్యాంకు మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, లక్కాకుల సందీప్, ఎస్బీఎఫ్సీ సేల్స్ మేనేజర్ కొంగొంటి భీరే‹Ù, కస్టమర్ రిలేషన్ మేనేజర్ కోదాటి రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ బొల్లి కిషన్కుమార్తోపాటు మరో 38మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూర్ సీఐ దేవేందర్రావు, రూరల్ సీఐ బన్సీలాల్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ తదితరులను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. -
‘రిచ్ డాడ్..’ రాబర్ట్ కియోసాకి మరో ముఖ్యమైన హెచ్చరిక..
గ్లోబల్ ఫైనాన్స్ ఎడ్యుకేటర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరో ముఖ్యమైన అంశంపై ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఇటీవల తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా “టాకింగ్ యువర్ బుక్” (talking your book) అనే ఆర్థిక పదాన్ని వివరించారు. దీని అర్థం తనకు లాభం వచ్చే ఆస్తులను ప్రచారం చేయడం, అది విద్య పేరుతో జరిగినా, వాస్తవంగా అమ్మకానికి దారితీస్తే అది నైతికంగా తప్పు అని ఆయన అభిప్రాయం.“నేను నా రియల్ ఎస్టేట్ ద్వారా మిలియన్లు సంపాదించాను… కానీ నేను మీకు ఏ ఆస్తి లేదా మోర్టగేజ్ అమ్మడం లేదు. నేను బోధిస్తున్నాను, అమ్మడం కాదు,” అని కియోసాకి పేర్కొన్నారు. అలాగే, ఒక యూట్యూబ్ రియల్ ఎస్టేట్ కుటుంబం తమ ఆర్థిక సదస్సులో “ఒక ప్రత్యేక పెట్టుబడి అవకాశాన్ని” ప్రస్తావిస్తూ, “మీరు అర్హులైతే” అని చెప్పడం ద్వారా విద్యను అమ్మకానికి మలచడం జరిగిందని ఆయన విమర్శించారు.బిట్కాయిన్, బంగారం, వెండి కొంటాను..టాకింగ్ యువర్ బుక్ పాఠంపై పోస్టుకు కొనసాగింపుగా మరో చేసిన పోస్టులో, కియోసాకి తన పెట్టుబడి విధానాన్ని స్పష్టంగా చెప్పారు. “నేను బంగారం, వెండి, బిట్కాయిన్ కొనుగోలు చేస్తాను. అమ్మడం చాలా అరుదు” అంటూ రాసుకొచ్చారు. ఇది దీర్ఘకాలిక ఆస్తులపై ఆయన నమ్మకాన్ని సూచిస్తుంది. మార్కెట్ను ప్రభావితం చేయాలనే ఉద్దేశం లేకుండా, ఆయన తన ఆర్థిక నమ్మకాలను పంచుకుంటున్నారని ఇది సూచిస్తుంది.VERY IMPORTANTANT $ LESSON;Q: What does “talking your book” mean?A: When a person is “talking their book” they have stopped teaching and are now selling.For example: I often state I make millions from my real estate…using debt. When I state that I am teaching… not…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 31, 2025 -
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం..
బంగారం ధరలు రోజురోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. వెండి రేటు కూడా జీవితకాల గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు (ఆగస్టు 30) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1640 పెరిగి రూ. 1,04,950 వద్దకు చేరింది. కేజీ వెండి రూ. 1,31,000 వద్ద ఉంది. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే.. ఈ ధరలు చాలా ఎక్కువ అని తెలుస్తోంది.ఈ సంవత్సరం భారతదేశంలో బంగారం ధరలు దాదాపు 32 శాతం పెరిగాయి. ఇది పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులకు కొంత భారమైపోయింది. జనవరిలో పది గ్రాముల గోల్డ్ రూ. 80,000 నుంచి ప్రారంభమై.. మార్చి నాటికి రూ.90,000 చేరుకుంది. కాగా ఇప్పుడు ఈ ధరలు లక్ష రూపాయలు దాటేసింది.గ్లోబల్ మార్కెట్లో మే 2025 ప్రారంభంలో బంగారం ధర ఔన్సుకు 3392 డాలర్ల వద్ద ఉండేది. జూన్ మధ్య నాటికి ఇది 3368 డాలర్ల వద్దకు చేరుకుంది. గోల్డ్ రేటు విపరీతంగా పెరగడానికి రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న యూఎస్ డాలర్ విలువ మాత్రమే కాకుండా.. రూపాయి విలువ తగ్గడం కూడా ప్రధాన కారణమైందని నిపుణులు చెబుతున్నారు.ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆస్పెక్ట్ గ్లోబల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ 'అక్ష కాంబోజ్' మాట్లాడుతూ.. పండుగ సీజన్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ అనిశ్చితి, బలహీనపడుతున్న డాలర్ ఇండెక్స్ మధ్య పెట్టుబడిదారులు బంగారం వైపు ఆకర్షితులయ్యారు. భారత ఎగుమతులపై అమెరికా విధించిన.. 50 శాతం సుంకాలు కూడా పసిడి డిమాండును మరింత పెంచిందని అన్నారు.ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..బంగారం ధరలు పెరగడానికి సీజనల్ డిమాండ్ మరో కీలకమైన అంశం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారతదేశంలో పండుగలు.. వివాహాల సీజన్ మొదలైపోయింది. దీనివల్ల కూడా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ధర ఎంత పెరిగినా.. బంగారంపై పెట్టుబడి ఎప్పటికి మంచి లాభాలను తెస్తుందనేది మాత్రం వాస్తవం. -
267 కిలోల బంగారం ఎక్కడ?
చెన్నై: 2024 జూన్లో బంగారం అక్రమ రవాణా సంఘటన జరిగింది. ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన దర్యాప్తులో రూ.167 కోట్ల విలువైన 267 కిలోల బంగారాన్ని దుబాయ్ సహా విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేశారని తేలింది. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు బెయిల్పై విడుదలయ్యారు. అయితే, కస్టమ్స్ విభాగం ఇంకా ప్రధాన నిందితుడిని అరెస్టు చేయలేదు. నిందితుడు విదేశాల్లో పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. ఈకేసులో ఒక్క గ్రాము బంగారం కూడా స్వాధీనం చేసుకోలేదు. ఏడాది అవుతున్నా ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోనట్లు కనిపిస్తోంది. -
నెలకు రూ. 35వేలతో.. కోటీశ్వరులయ్యే మార్గం
కోటీశ్వరులవ్వాలనే కల అందరికీ ఉంటుంది. అయితే కోటీశ్వరులవ్వడం ఎలా అని మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. సరైన ఆర్థిక ప్రణాళిక, సరైన పెట్టుబడి ఎవ్వరినైనా కోటీశ్వరులను చేస్తుంది. ఈక్విటీ షేర్లు లేదా బంగారం వంటి వాటిలో పెట్టె పెట్టుబడి తప్పకుండా ధనవంతులను చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదేలాగో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మీరు నెలకు కేవలం రూ. 35,000 పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులవుతారు. మీరు పెట్టే పెట్టుబడిన బంగారం, స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (PPF) వంటి వాటిలో కొంత, కొంత విభజించి ఇన్వెస్ట్ చేయాలి. ఎలా అంటే.. మ్యూచువల్ ఫండ్స్లో రూ. 20000, బంగారంపై రూ. 10000, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో రూ. 5 వేలుగా విభజించి పెట్టుబడి పెట్టాలి.మ్యూచువల్ ఫండ్●నెలవారీ ఇన్వెస్ట్మెంట్: రూ. 20,000●కాల వ్యవధి: 12 సంవత్సరాలు●అంచనా వేసిన రిటర్న్స్: సంవత్సరానికి 12 శాతం ●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 28,80,000 ●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 35,65,043 ●మొత్తం విలువ: రూ. 64,45,043బంగారంపై పెట్టుబడి●నెలవారీ పెట్టుబడి: రూ. 10,000 ●కాల వ్యవధి: 12 సంవత్సరాలు ●అంచనా వేసిన రాబడి: సంవత్సరానికి 10 శాతం ●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 14,40,000 ●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 13,47,415 ●మొత్తం విలువ: రూ. 27,87,415పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ●నెలవారీ: రూ. 5,000 ●కాల వ్యవధి: 15 సంవత్సరాలు ●అంచనా వేసిన రాబడి: 7.1 శాతం●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 9,00,000 ●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 7,08,120 ●మొత్తం విలువ: రూ. 16,08,120ఇప్పుడు మీకు వచ్చిన మొత్తం కలిపితే రూ. 64,45,043 (మ్యూచువల్ ఫండ్) + రూ. 27,87,415 (బంగారం) + రూ. 16,08,120 (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)= రూ. 1,08,40,578 అవుతుంది. ఇది కేవలం అంచనా మాత్రమే. వడ్డీ శాతం పెరిగితే ఇంకా ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.NOTE: పెట్టుబడి పెట్టడం అనేది మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, తప్పకుండా ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. -
పండగ రోజు బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం వినాయక చవితి రోజున బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఊపందుకున్న బంగారం ధరలు: ఒక్కసారిగా పైకి..
వినాయక చవితి వచ్చేసింది. బంగారం ధరలు మరోసారి ఊపందుకున్నాయి. నేడు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 550 పెరిగింది. దీంతో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం విలువపై 90 శాతం లోన్
ప్రైవేటు రంగంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ ‘ఎస్ఐబీ గోల్డ్ ఎక్స్ప్రెస్’ పేరుతో కొత్త బంగారం రుణ పథకాన్ని ప్రారంభించింది. బంగారం విలువపై 90% వరకు రుణాన్ని ఈ పథకం కింద పొందొచ్చు. రూ.25,000 నుంచి రూ.25 లక్షల వరకు రుణం, గరిష్టంగా మూడేళ్ల కాలానికి తీసుకోవచ్చు.ఎంఎస్ఎంఈలు, నాన్ ఎంఎస్ఎంఈలు, చిన్న సంస్థలు తమ వ్యా పార విస్తరణ, మూలధన అవసరాల కోసం రుణాలు తీసుకోవచ్చని సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఎలాంటి రహస్య చార్జీల్లేకుండా, పారదర్శకంగా ఈ రుణ పథకం ఉంటుందని తెలిపింది. మొత్తం ప్రక్రియ డిజిటల్గా పూర్తవుతుందని, మొదటిసారి రుణం తీసుకునే వారు కూడా అర్హులేనని పేర్కొంది.ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా.. -
9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..
బంగారం అంటేనే అందరికీ 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ లేదా 18 క్యారెట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ 9K లేదా 9 క్యారెట్ గోల్డ్ ఒకటి ఉందని, దీని ధర చాలా తక్కువ ఉంటుందని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో 9 క్యారెట్స్ గోల్డ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.బంగారం పట్ల భారతీయులకు మక్కువ ఎక్కువ, అయితే 24 క్యారెట్స్ లేదా 22 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే చాలా డబ్బు వెచ్చించాలి. కానీ 9 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే మాత్రం అంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఈ 9 క్యారెట్స్ బంగారానికి కూడా హాల్మార్కింగ్ ఉండాలని.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) స్పష్టం చేసింది.2025 ఆగస్టు నాటికి హాల్మార్క్ ప్యూరిటీల జాబితాలో 14 క్యారెట్స్, 18 క్యారెట్స్, 20 క్యారెట్స్, 22 క్యారెట్స్, 23 క్యారెట్స్, 24 క్యారెట్స్ మాత్రమే ఉండేవి. ఇటీవల 9 క్యారెట్స్ గోల్డ్ కూడా జాబితాలో చేరింది.24 క్యారెట్స్.. 9 క్యారెట్స్ బంగారం మధ్య వ్యత్యాసం24 క్యారెట్స్ బంగారం అనేది.. 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అన్నమాట. అంటే ఇందులో దాదాపుగా ఇతర లోహాలు ఉండవు. అయితే 9 క్యారెట్స్ బంగారంలో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 62.5 శాతం.. రాగి, వెండి లేదా జింక్ వంటి మిశ్రమ లోహాలతో కూడి ఉంటుంది.9 క్యారెట్స్ బంగారం ఎందుకు?అధిక క్యారెట్ల బంగారం ధర చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు.. ముఖ్యంగా యువకులు లేదా గ్రామీణ ప్రజలు దీనికోసం అంత డబ్బు కేటాయించలేరు. అలాంటి వారు ఈ 9 క్యారెట్స్ గోల్డ్ కొనడానికి ఇష్టపడతారు. దీనికి హాల్మార్క్ కూడా ఉండటం వల్ల ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉంటారు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?9 క్యారెట్స్ vs 24 క్యారెట్స్ గోల్డ్ ధరలుఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 10,000 కంటే ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే.. 10 గ్రాముల కోసం రూ. లక్ష కంటే ఎక్కువ కేటాయించాలి. అయితే ఒక గ్రామ్ 9 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 3,700 ఉంటుంది. ఈ బంగారాన్ని 10 గ్రాములు కొనాలంటే రూ. 37,000 పెట్టుబడి సరిపోతుంది. -
చెన్నూర్ ఎస్బీఐలో కుంభకోణం
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్లో కుంభకోణం జరిగింది. నగదుతోపాటు ఖాతా దారులు తనఖా పెట్టిన బంగారునగలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. క్యాషి యర్ పెద్దఎత్తున బంగారం, నగదు మాయం చేసిన ట్టు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్ మనోహర్రెడ్డి రెండురోజుల సెలవు తర్వాత మంగళవారం విధుల్లో చేరారు. బ్యాంకులోని డబ్బు, ఖాతాదారులు తనఖా పెట్టిన నగల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలి సింది. దీంతో బ్యాంకు అధికారులు ఆడిటింగ్ నిర్వ హించారు. సుమారు 330 మంది ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు విలువైన బంగారు ఆభరణాలు, రూ.80 లక్షల నగ దు లావాదేవీల్లో తేడా వచ్చినట్టు గుర్తించి పోలీసు లకు సమాచారం ఇచ్చారు. జైపూర్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన క్యాషియర్ రెండ్రోజు లుగా బ్యాంకుకు రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతోపాటు బంగారం మాయంలో కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఆడిటింగ్ శుక్రవారం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్యాంక్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
బంగారం, వెండి & బిట్కాయిన్.. ఈ మూడు గత ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు భారీ రాబడులను ఇచ్చాయి. అంతకు ముందుతో పోలిస్తే బంగారం ధర 40 శాతం పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. కేజీ వెండి ధర రూ.1.16 లక్షల వద్ద ట్రేడవుతోంది. బిట్కాయిన్ అద్భుతాలు చేస్తోంది. దీని విలువ 111 శాతం పెరిగి, కోటి రూపాయలు దాటేసింది. ఈ మూడింటిలో దేనిని ఎంచుకోవాలని కొందరు పెట్టుబడిదారులు సతమతమవుతుంటారు. ఈ ప్రశ్నకు రాబర్ట్ కియోసాకి & వారెన్ బఫెట్ ఏం చెబుతారంటే..'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి.. బంగారం, వెండి, బిట్కాయిన్ 'నిజమైన డబ్బు' అని చెబుతారు. ఎందుకంటే డబ్బును అదా చేస్తే.. దాని విలువ పెరగదు. వీటిపై (బంగారం, వెండి, బిట్కాయిన్) ఇన్వెస్ట్ చేస్తే విలువ పెరుగుతుంది, సంపన్నులవుతారని అంటారు. డాలర్ లాంటి కరెన్సీలను ఆయన 'నకిలీ డబ్బు' అని పిలుస్తారు.పేదలు, మధ్యతరగతి వారు దాదాపు డబ్బును బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ఆ డబ్బు బ్యాంక్ ఖాతాలోనే ఉంటుంది. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కానీ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారం, చమురు, షేర్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. మీ సంపద పెరుగుతుందని కియోసాకి చెబుతారు.ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరైన వారెన్ బఫెట్.. పెట్టుబడిదారుడిగా అతని జ్ఞానాన్ని పెట్టుబడి ప్రపంచంలో బైబిల్గా పరిగణిస్తారు. అయితే బంగారం పనికిరానిదని, వెండి మంచిదని, బిట్కాయిన్కు విలువ లేదని చెబుతారు. బంగారం ఏమీ చేయదు.. అక్కడే ఉంటుంది. ఏదైనా ఆస్తి ఉత్పాదకంగా ఉన్నప్పుడు మాత్రమే విలువ పెరుగుతుందని బఫెట్ విశ్వసిస్తారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం మీద పెట్టుబడి చూపడానికి ఆసక్తి చూపని బఫెట్.. వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపుతారు. ఎందుకంటే.. వెండి ఎలక్ట్రానిక్స్, సౌర ఫలకాలు, వైద్య పరికరాల వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి మంచి వాల్యూ ఉంటుందని చెబుతారు. బిట్కాయిన్ లేదా క్రిప్టోకరెన్సీ ఏ ఉత్పాదక కార్యకలాపాలతోనూ సంబంధం లేదని ఆయన నమ్ముతారు.గమనిక: బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలంటే.. వాటిపై తప్పకుండా కొంత అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వీటిలో పెట్టుబడులు పెడితే.. లాభాల సంగతి దేవుడెరుగు, నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వీటిపై అవగాహన పెంచుకోవాలనే విషయం మర్చిపోవద్దు. -
ఆ రాష్ట్రంలో భారీగా బయటపడ్డ బంగారు నిక్షేపాలు
భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయలు దాటేసి చాలా రోజులైంది. ఇలాంటి సమయంలో ఒడిశాలో భారీ స్టాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) వెల్లడించింది.దేవ్ఘర్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్థారించారు. అయితే సుందర్గఢ్, నబరంగ్పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్లలో మాత్రమే కాకుండా.. మయూర్భంజ్, మల్కన్గిరి, సంబల్పూర్, బౌధ్లలో అన్వేషణ పనులు జరుగుతున్నాయి.ఇప్పటి వరకు.. ఒడిశాలో బంగారు నిక్షేపాల నిల్వలు ఎంత ఉన్నాయనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే నిల్వలు 10 నుంచి 20 మెట్రిక్ టన్నులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.ఇది భారతదేశం దిగుమతి చేసుకుంటున్న బంగారం పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.ఇదీ చదవండి: 'ఇండియాలో ధరలు ఇలా ఉన్నాయ్': ఎన్ఆర్ఐ షాక్గత సంవత్సరం భారతదేశం 700 - 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దేశంలో గోల్డ్ ఉత్పత్తి తక్కువగా ఉండటమే ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఉత్పత్తి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. దిగుమతి కొంత తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు. -
బంగారాన్ని మించిపోయిన సిగరెట్లు!
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల నుంచి అక్రమ రవాణా అవుతున్న బంగారానికి సంబంధించి శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 240 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి 132.4 కేజీల పసిడి స్వాధీనం చేసుకున్నారు. 2024–25 నాటికి కేసుల సంఖ్య 133కి, సీజ్ చేసిన బంగారం 42.5 కేజీలకు తగ్గిపోయింది. కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీని 15 నుంచి ఆరు శాతానికి తగ్గిండచమే దీనికి కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో సిగరెట్ల అక్రమ రవాణా మాత్రం గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఆ దేశాల నుంచే.. దుబాయ్ హవాలా రాకెట్లతో పాటు ఇప్పుడు బంగారం అక్రమ రవాణాకూ కేంద్రంగా మారిపోయింది. దీంతో పాటు జెద్దా, మస్కట్, కువైట్, బహ్రేన్ నుంచి స్మగ్లింగ్ అవుతుంటుంది. ఆయా దేశాల్లో ఆదాయపు పన్ను విధానం లేకపోవడంతో మనీలాండరింగ్ అనేదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపే స్మగ్లర్లు దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకు వస్తుంటారు. గరిష్టంగా ఏడు శాతం తక్కువ రేటు.. ప్రస్తుతం నగరంలో 24 క్యారెట్ల బంగారం కేజీ రూ.కోటి వరకు పలుకుతోంది. ఆయా దేశాల్లో దీని ఖరీదు ఐదు నుంచి ఏడు శాతం తక్కువగా ఉంటుంది. కేజీ బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి సూత్రధారులు రూ.7 లక్షల వరకు ఖర్చు చేస్తారు. గతంలో విదేశాల నుంచి తీసుకువచ్చే బంగారంపై 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆరు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విదేశాల నుంచి అక్రమ రవాణా చేసి తీసుకువచ్చినా, నేరుగా తీసుకువచ్చినా వచ్చే లాభంలో పెద్ద తేడా లేకపోవడంతో స్మగ్లింగ్ గణనీయంగా తగ్గింది. సిగరెట్లకు భారీగా పెరిగిన డిమాండ్.. బంగారం, ఎల్రక్టానిక్ వస్తువులు, మాదకద్రవ్యాలు... అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. అయితే సిగరెట్లు కూడా పెద్ద సంఖ్యలో స్మగ్లింగ్ అవుతున్నాయి. 2023–24లో కేవలం 54 కేసులు నమోదు కాగా... గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య 175కు చేరింది. హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.👉 ఇదీ చదవండి: ‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం! -
తగ్గుతున్న బంగారం ధరలు: వరుసగా ఎనిమిదో రోజు ఇలా
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు (శనివారం) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 60 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. పసిడి ధరలు తగ్గుతుంటే.. వెండి మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
భారతదేశంలో ఆగస్టు 09 నుంచి బంగారం ధరలు ఏ మాత్రం పెరగడం లేదు. క్రమంగా తగ్గుతూ నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,01,240 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్స్ పసిడి ధరలు కూడా అమాంతం తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం కొనడానికి ఇదో మంచి తరుణం అని పసిడి ప్రియులు భావిస్తున్నారు. ఈ కథనంలో ఈ రోజు (శుక్రవారం) దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్థిరంగా బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఎట్టకేలకు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో.. నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధరలు మాత్రమే పెరుగుదల దిశగా అడుగులు వేశాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు (గురువారం) పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఈరోజు కాస్త ఊరించిన బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. వరలక్ష్మీవ్రతం, రాఖీ పండుగ అనంతరం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారంపై సుంకం లేదు: డొనాల్డ్ ట్రంప్
బంగారం దిగుమతులపై అదనపు సుంకాలు ఉండవని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇటీవల ఆయన విధించిన సుంకాల పెంపు బంగారు కడ్డీలకు వర్తిస్తుందా?, లేదా?.. అనే దానిపై గందరగోళం చెలరేగిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు.బంగారం మీద సుంకాలు విధించడం వల్ల.. వీటి ధరలు మరింత ఎక్కువవుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి బంగారంపై సుంకాల విషయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తరువాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.ట్రంప్ పోస్ట్ తర్వాత.. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ రేటు ఔన్సుకు 2.4 శాతం తగ్గి 3,407 డాలర్లకు చేరుకుంది. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర 1.2 శాతం మేర తగ్గి 3,357 డాలర్ల వద్ద నిలిచింది. గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.BREAKING: President Trump just declared that gold will not be tariffed!HUGE! pic.twitter.com/0JdVT9cXIs— Gunther Eagleman™ (@GuntherEagleman) August 11, 2025భారతదేశంలో బంగారం ధరలుబంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం గోల్డ్ రేటు తగ్గుముఖం పడుతోంది. ఈ రోజు కూడా పసిడి ధరలు గరిష్టంగా రూ. 880 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 101400 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 800 తగ్గి.. రూ. 92950 (10 గ్రామ్స్) వద్ద నిలిచింది.ఇదీ చదవండి: కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే? -
దిగొస్తున్న కనకం ధరలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. వరలక్ష్మీవ్రతం, రాఖీ పండుగ అనంతరం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితిని గురించి హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా స్టాక్ మార్కెట్ క్రాష్ సూచికలు స్టాక్లలో భారీ పతనాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూసిస్తున్నాయి. స్టాక్లలో భారీ పతనం గురించి హెచ్చరిస్తున్నాయి. అయితే బంగారం, వెండి, బిట్కాయిన్ యజమానులకు శుభవార్త'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాలు పెట్టుబడిదారుల్లో కొంత భయాన్ని రేకెత్తించాయి. ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ సమయంలో స్థిరమైన రాబడి కోరుకునేవారు మాత్రం బంగారం, వెండి వంటివాటిలో మాత్రమే కాకుండా బిట్కాయిన్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి రాబడని తీసుకొస్తుందని. రాబోయే ఆర్ధిక మాంద్యం సమయంలో ఇవే కాపాడతాయని కియోసాకి పేర్కొన్నారు.Stock market crash indicators warning of massive crash in stocks.Good news for gold, silver, and Bitcoin owners.Bad news for Baby Boomers with 401 k.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) August 11, 2025 డొనాల్డ్ ట్రంప్ గ్రేట్!అమెరికన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన 401(కె) రిటైర్మెంట్ ప్లాన్ల బ్యాలెన్స్లలో ఉన్న నిధులను డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. దీనిని రాబర్ట్ కియోసాకి ప్రశంసించారు. బిట్కాయిన్ కొనుగోలుకు ప్రజలు తమ రిటైర్మెంట్ పొదుపును ఖర్చు చేయడానికి ట్రంప్ అనుమతించడం గొప్ప వార్త. ఆయన గొప్ప అధ్యక్షుడు, గొప్ప నాయకుడు. మీరు బిట్కాయిన్ సేవ్ చేస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే? -
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. వరలక్ష్మీవ్రతం, రాఖీ పండుగ అనంతరం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత మార్కెట్ సెషన్తో పోలిస్తే సోమవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పెరుగుతున్న బంగారం ధరలు: ప్రధాన కారణాలు
బంగారం ధరలు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేటు మరింత పెరిగి పసిడి ప్రియులను అవాక్కయ్యాలా చేసింది. ఈ స్థాయిలో కనకం ధరలు పెరగడానికి కారణం ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత పెంచిన సుంకాలు చాలామంది పెట్టుబడిదారుల్లో భయాన్ని రేకెత్తించింది. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతుంటే.. బంగారం రేటు మాత్రం ఆకాశాన్నంటుతోంది. దీనికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు.. గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే అని నిపుణులు భావిస్తున్నారు.2025 ఆగస్టు 01న గరిష్టంగా రూ. 210 తగ్గి రూ.99,820 (10 గ్రా 24 క్యారెట్స్) వద్ద నిలిచిన గోల్డ్ రేటు.. ఆ తరువాత ఆగస్టు 08 నాటికి రూ. 1,03,310 కు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఈ మధ్య కాలంలోనే రూ. 3490 పెరిగింది. ఇది బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి తెలుపడానికి నిదర్శనం.బంగారు కడ్డీలపై అమెరికా సుంకాలు, బలహీనమైన అమెరికా డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై మార్కెట్ అంచనాలు, ఆర్థిక అనిశ్చితి మధ్య పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ వంటివన్నీ గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..అస్థిర ఆర్థిక పరిస్థితుల్లో బంగారం సురక్షితమైన ఆస్తి. కాబట్టి గోల్డ్ కొనుగోలు చేసే పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఓ వైపు శ్రావణమాసం.. మరోవైపు వస్తున్న పండుగ సీజన్. ఇవన్నీ కూడా బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉంది. 2005లో రూ. 7000 వద్ద ఉన్న గోల్డ్ రేటు.. 2025లో రూ. 100000 దాటేసింది. దీన్నిబట్టి చూస్తే దశాబ్దంలో రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. -
భయంతోనే బంగారం కొంటున్నారా?
పెట్టుబడుల ప్రపంచంలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో ఉన్నారు. అధిక రాబడులనిచ్చే స్టాక్స్ ఎంచుకునే చాతుర్యానికి పేరుగాంచిన బఫెట్ స్టాక్ మార్కెట్లో తిరుగులేని రారాజు. మరి ఆయన సంపద ఎంతనుకుంటున్నారు..? 140 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.12 లక్షల కోట్లు. ఇంత భారీ సంపద ఉన్నా ఆయన దగ్గర రవ్వంత బంగారం కూడా లేదంటే నమ్ముతారా?బంగారంపై ఇన్వెస్ట్ చేసే విషయానికి వస్తే వారెన్ బఫెట్ చాలా క్లియర్ గా ఉంటాడు. ఆయనకు బంగారంపై ఎటువంటి పెట్టుబడులు లేవు. బంగారం వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టకూడదనేది వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్. తన వాల్యూ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీకి బంగారం సరిపోదని కొన్నేళ్లుగా ఆయన చెబుతూ వస్తున్నారు. బఫెట్కు ఏకైక బంగారు పెట్టుబడి బారిక్ గోల్డ్ అనే గోల్డ్ మైనింగ్ కంపెనీలో ఉండేది. అది కూడా ఆయన అంతర్గత మనీ మేనేజర్లలో ఎవరైనా స్వతంత్రంగా పెట్టి ఉండవచ్చు. దాన్ని తర్వాత ఆరు నెలలోనే బఫెట్ విరిమించుకున్నారు.బఫెట్ దగ్గర బంగారం ఎందుకు లేదంటే..?బఫెట్ బంగారాన్ని ఉత్పాదకత లేని ఆస్తిగా భావిస్తారు. ‘బంగారంలో రెండు ముఖ్యమైన లోపాలు ఉన్నాయి. అది పెద్దగా ఉపయోగం లేనిది అలాగే ఉత్పాదకత లేనిది’ అని 2011లో వారెన్ తన షేర్ హోల్డర్లతో అన్నారు. బంగారానికి కొంత పారిశ్రామిక ఉపయోగం, ఆభరణాలుగా పనికొస్తుంది కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇది తప్పుడు పెట్టుబడి అనేది ఆయన అభిప్రాయం.2011లో బఫెట్ ఈ వైఖరి తీసుకున్నప్పుడు 1,750 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం ప్రస్తుతం 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంటే పద్నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు అయింది. దీన్ని బట్టి బఫెట్ అభిప్రాయం తప్పని చాలా మందికి అనిపిస్తుంది. కానీ కాంపౌండ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) పరంగా చూస్తే ఇది కేవలం 5 శాతం మాత్రమే. ఇదే సమయంలో యూఎస్ స్టాక్స్ 14 శాతానికి పైగా సీఏజీఆర్ పెరిగాయి. కాబట్టి బంగారం విషయంలో బఫెట్ అభిప్రాయం కరెక్టే..బంగారం ధర పెరగడానికి భయమే కారణంపెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందంటాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం. -
Magazine Story: దూసుకుపోతున్న బంగారం ధరలు..
-
బాబోయ్ బంగారం!.. వరుసగా నాలుగో రోజు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 220 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (గురువారం) బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు అమాంతం పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 110 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (బుధవారం) బంగారం ధరల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మరోమారు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు (ఆగస్ట్ 04) 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 50 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో.. పసిడి ధరల్లో స్వల్ప కదలికలు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారీగా పెరిగిన బంగారం ధరలు
ధరలు తగ్గుతున్నాయని సంబరపడేలోపే.. బంగారం రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నేడు గరిష్టంగా రూ. 1530 పెరిగిన ధరలు పసిడి ప్రియులను అవాక్కయేలా చేసింది. శుక్రవారం ధరలతో పోలిస్తే.. ఈ రోజు (శనివారం) పసిడి రేటు తారాజువ్వలా పైకి లేచింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వరదల్లో కొట్టుకుపోయిన 20 కేజీల బంగారం.. తర్వాత ఏం జరిగిందంటే?
చైనాను కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు కారణంగా షాంగ్జీ ప్రావిన్స్లో ఓ బంగారం షాపులో నుంచి గోల్డ్, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో జనం పోటీపడ్డారు. షాంగ్జీ ప్రావిన్స్లోని వుచి కౌంటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సముద్ర తీరానికి సమీపంలో ఉండే ఈ ప్రాంతం భారీ వర్షాలతో వరదమయంగా మారింది. బంగారు నగల షాపును ఎప్పటిలాగే జులై 25న ఉదయం తెరిచారు. దీంతో వరద నీరు దుకాణంలోకి దూసుకొచ్చింది. దీంతో షాపులోని నగలు కొట్టుకుపోయాయి. సేఫ్ బాక్సులో రీసైకిల్ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు ఆ షాపు యజమాని పేర్కొన్నారు. దాదాపు 20 కిలోల బంగారం, వెండి గల్లంతయ్యాయి. మొత్తం నష్టం విలువ 10 మిలియన్ యువాన్ (రూ.12 కోట్లు)గా అంచనా. A gold shop in Wuqi County, Shaanxi says around 20kg of jewelry was lost in recent floods. About 1kg has been recovered so far. Police are investigating, and local authorities are urging anyone who found gold to return it. #Shaanxi #floods pic.twitter.com/kZQsaLqJnz— Spill the China (@SpilltheChina) July 27, 2025 అయితే, బంగారం కొట్టుకుపోయిన విషయం తెలియగానే స్థానికులు భారీగా వీధుల్లోకి చేరుకుని బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు. మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి మరి ఆభరణాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు 1 కిలో బంగారం మాత్రమే తిరిగి లభించింది. కొంతమంది స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చారు కానీ చాలా మంది తిరిగి ఇవ్వలేదని దుకాణ యజమాని తెలిపారు. బంగారాన్ని దొంగిలించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరించారు. -
ప్రొద్దుటూరులో ఘరానా మోసం.. సచివాలయ ఉద్యోగస్తులమంటూ..
ప్రొద్దుటూరు క్రైం: వృద్ధాప్య పింఛన్ను దివ్యాంగుల పింఛన్కు మారుస్తానని నమ్మించిన ఓ మోసగాడు 5 తులాల బంగారు నగలతో ఉడాయించాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని చోటు చేసుకుంది. బద్వేలి గురివిరెడ్డి, లక్ష్మీదేవి వృద్ధ దంపతులు. నెహ్రూరోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. లక్ష్మీదేవికి వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సచివాలయం నుంచి వచ్చానని ఒక వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. మీకు వస్తున్న వృద్ధాప్య పింఛన్ను దివ్యాంగుల పింఛన్గా మార్పు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు.వృద్ధాప్య పింఛన్ కంటే దివ్యాంగుల పింఛన్కు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పడంతో వృద్ధ దంపతులు సంతోషించారు. వెంటనే ఆథార్ కార్డు తీసుకొని వెళ్తే మున్సిపల్ ఆఫీసులో ఒక సర్టిఫికెట్ ఇస్తారని అతను వారితో అన్నాడు. ఆ సర్టిఫికెట్ను తెచ్చి సచివాలయంలో ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గురివిరెడ్డి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లాడు. అతను వెళ్లగానే లక్ష్మీదేవి ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు.ఫొటో అప్డేట్ చేయాలని చెప్పి వృద్ధురాలికి ఫోటో తీసేందుకు సెల్ఫోన్ బయటికి తీశాడు. ఆమె ఒంటిమీద బంగారు నగలు ఉండటంతో వాటిని తీయమని చెప్పాడు. నగలతో ఫొటో దిగితే పింఛన్ రాదని, నగలను పక్కన పెట్టాలని చెప్పాడు. దీంతో ఆమె బంగారు గాజులు, ఇతర నగలను తీసి కిచెన్ రూంలో పెట్టింది. ఫొటో తీయమని ఆమె చెప్పగా ఇక్కడ చీకటిగా ఉందని ఫొటో సరిగా రాదని చెప్పి ఆమెను బెడ్ రూం సమీపంలోకి తీసుకెళ్లాడు.ఇదే అదునుగా భావించిన ఆ అగంతకుడు లక్ష్మీదేవిని బెడ్రూంలోకి తోసేసి గడియ పెట్టాడు. కిచెన్ రూంలో ఉన్న నగలను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వ్యక్తులు గడియ తీశారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి బంగారు నగలను దోచుకెళ్లాడని ఆమె బోరునా విలపించింది. లక్ష్మీదేవి ఐదు తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు. -
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ద్వారా ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి ఏదో క్రాష్ రాబోతోందని హెచ్చరించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ సహా అసెట్ క్లాసుల్లో బుడగలు పేలబోతున్నాయంటూ ఈ 78 ఏళ్ల ఇన్వెస్టర్, ఎంట్రాప్రెన్యూర్ సంకేతాలిచ్చారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో రాబర్ట్ కియోసాకి ఒక పోస్ట్ చేశారు. "బుడగలు పేలడం ప్రారంభించాయి.. బుడగలు పేలినప్పుడు బంగారం, వెండి, బిట్ కాయిన్ కూడా పతనమవుతాయి. గుడ్ న్యూస్’ అంటూ రాసుకొచ్చారు.క్రాష్ అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ రానున్న పతనాన్ని కొనుగోలు అవకాశంగా కియోసాకి పేర్కొన్నారు. ధరలు పడిపోతే తాను బంగారం, వెండి, బిట్ కాయిన్లలో ఎక్కువ పెట్టుబడి పెడతానని చెప్పుకొచ్చారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్తమ సమయం ధరలు తక్కువగా ఉన్నప్పుడు, భయం ఎక్కువగా ఉన్నప్పుడు అని ఆయన వివరించారు.BUBBLES are about to start BUSTING.When bubbles bust odds are gold, silver, and Bitcoin will bust too.Good news.If prices of gold, silver, and Bitcoin crash…. I will be buying.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) July 21, 2025 -
పసిడి.. మళ్లీ రూ.లక్ష పైకి!
న్యూఢిల్లీ: పుత్తడి మరోసారి జిగేల్మంది. కొనుగోళ్ల మద్దతుతో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మంగళవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 లాభపడి రూ.1,00,020 స్థాయికి చేరింది. స్టాకిస్టుల నుంచి బలమైన కొనుగోళ్లు జరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,000 పెరిగి రూ.99,550 స్థాయిని చేరుకుంది.అటు వెండిలోనూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో రూ.3,000 లాభపడి కిలోకి రూ.1,14,000 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో (కామెక్స్ ఫ్యూచర్స్) ఔన్స్ బంగారం 35 డాలర్లకు పైగా లాభంతో 3,440 డాలర్ల స్థాయిని చేరుకుంది. వెండి ధర ఔన్స్కు 39.50 డాలర్ల వద్ద ఉంది. పరపతి విధానంపై యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నట్టు అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.చైనా లోన్ ప్రైమ్ రేటుపై నిర్ణయం, యూఎస్ ఆర్థిక డేటా (పీఎం, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు), వడ్డీ రేట్లపై నిర్ణయాలు అంతర్జాతీయంగా బంగారంలో తదుపరి ర్యాలీని నిర్ణయిస్తాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ అభిప్రాయపడ్డారు. -
పుత్తడి ప్రియుల నడ్డి విరిసేలా ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధర(Today Gold Rate)లు ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం పసిడి ధరలు పెరిగాయి. వెండి ఏకంగా కేజీపై రూ.4000 పెరిగి ఆల్టైమ్హై చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అమాంతం ఎగిసిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు అమాంతం ఎగిశాయి. క్రితం రోజున ఫ్లాట్గా ఉన్న పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గురు పూర్ణిమ: షిర్డీ సాయినాథుడికి కళ్లు చెదిరే బంగారు వజ్రాభరణాల కానుకలు
సాక్షి,ముంబై: శిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ముఖ్యమైన రోజు కావడంతో లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. గురుపూర్ణిమ సందర్భంగా మందిరాన్ని వివిధ రకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుపూర్ణిమతో ‘శ్రీ సాయిసచ్చరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండపారాయణం సమాప్తి అయిన సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అంజు శెండే (సోనటక్కే) ‘పోతి’(ధాన్యపుసంచి)ని చేతబట్టుకోగా, మందిరం కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) గోరక్ష గాడిల్కర్ వీణ, డిప్యూటీ ఈఓ భీమరాజ్ వరాడే, మెకానికల్ విభాగం ప్రముఖులు అతుల్ వాఘ్లు సాయిచిత్రపటం చేతబట్టుకుని ముందుకు నడిచారు. ఈ ఊరేగింపులో సంస్థాన్ పదాధికారులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై వివిధ భక్త మండళ్ల బృందాల ఆధ్వర్యంలో రోజంతా భజనలు, ఆధ్యాత్మిక గీతాలు, కీర్తనల ఆలాపన కొనసాగింది. గురుస్థాన్లో నేడు రుద్రాభిషేకంగురుపౌర్ణమి ఉత్సవాల ముగింపు సందర్భంగా నేడు గురుస్థాన్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించ నున్నారు. ఉట్టి ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపనున్నారు. ఆంధ్ర భద్రావతి పేట్ ఆలయానికి భక్తుల తాకిడి సోలాపూర్: గురుపూర్ణిమను పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్కల్కోట్లో శ్రీ స్వామి సమర్థ మహారాజ్ను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయాలు, ఆశ్రమాల్లో ధార్మిక, ఆధ్యాత్మికక కార్యక్రమాలు ప్రవచనాలు, సత్సంగాలు జరిగాయి. వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబా దర్శనం కోసం ఆంధ్ర భద్రావతి పేట్లోని శ్రీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనంతోపాటు స్పెషల్ క్యూలైన్లలోనూ బారులు తీరారు. ఈ ఆలయంలో వారంరోజులుగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా బుధవారం ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాయినాథ రథ ఊరేగింపు నిర్వహించారు. శ్రీ సాయి దర్బార్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు దత్త నగర్, పద్మశాలీ చౌక్, జంకండి పూల్, జోడు బసవన్నచోక్, మార్కండేయ చౌక్, గుజ్జ నివాస్, వినాకర్ బాగ్, కన్నా చౌక్, రాజేంద్ర చౌక్ మార్గాల గుండా ఆంధ్ర బద్రావతి పేట్ వరకు కొనసాగింది. గణేశ్పురి ఆలయంలో గురుపూర్ణిమ పూజలు భివండీ: గురుపూర్ణిమ సందర్భంగా గణేశ్పురిలోని శ్రీ నిత్యానంద స్వామిని దర్శించు కునేందుకు భివండీ, ముంబై, కళ్యాణ్, ఠాణా, ముర్బాడ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాజీ కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసపూరి్ణమ సందర్భంగా గురువారం తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పి.ఈ. ఎం. హైసూ్కల్, జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల, వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విద్యానికేతన్ స్కూల్, వివేకానంద ఇంగ్లీశ్ మీడియం హైసూ్కల్, బాబా హైసూ్కల్ అండ్ జూనియర్ కాలేజీలోప్రత్యేక కార్యక్రమాలు, విద్యార్థులతో తల్లిదండ్రులకు–ఉపాధ్యాయులకు పాద సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అఖిల పద్మశాలి సమాజ్ కోశాధికారి అవదూత బలరాం బాలె శ్రీనివాస్, భైరి నిష్కమ్, గాజెంగి కృష్ణ, చిటికెన్ వెంకటేశ్, గాజెంగి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా విద్యానందగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజ, పాదపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి నారాయణ, మహేశుని భూమేశ్, యెన్నం శ్రీనివాస్, చెక్కరకోట మనోహర్, వేమున ఆనంద్, బాలె సత్యనారాయణతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా ఓ అజ్ఞాత భక్తుడు సాయిబాబాకు బంగారు కిరీటం, వెండి హారం సమర్పించారు. 566 గ్రాముల బరువున్న రూ.59 లక్షల విలువైన బంగారు కిరీటం, 54 గ్రాముల బరువున్న బంగారు పువ్వులు, 2 కిలోల బరువున్న వెండి హారం ఇందులో ఉన్నాయి.గురుపూర్ణిమను పురస్కరించుకుని చెన్నైకి చెందిన లలితా మురళీధరన్, కె. మురళీధరన్ దంపతులు బాబాకు రూ. 3.05 లక్షల విలువైన బ్రూచ్ సమర్పించారు. బంగారం, వజ్రాలతో దీనిని తయారు చేశారు. -
బంగారంపై ఇప్పుడు పెట్టుబడి పడితే నష్టమా?
-
మీకు తక్కువ ధరకే బంగారం కావాలా?
దొడ్డబళ్లాపురం: మాజీ ఎంపీ డీకే సురేశ్, తదితర ప్రముఖ రాజకీయ నాయకులు బాగా తెలుసని చెబుతూ ఐశ్వర్యగౌడ అనే కిలాడీ కోట్లాది రూపాయల బంగారం, నగదు వసూలు చేయడం తెలిసిందే. ఆ కేసుల్లో ఆమె అరెస్టయి ఈడీ విచారణను ఎదుర్కొంటోంది. అచ్చం అలాంటిదే మరొకటి బయటపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాగా తెలుసని చెప్పుకొని రూ.30 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసిన కేడీ లేడీని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్టు చేశారు.బాగా డబ్బు కలిగిన మహిళలను కిట్టీ పార్టీ పేరుతో ఇంటికి పిలిచి విందు వినోదాలు నిర్వహించేది. వారు పూర్తిగా నమ్మారని తెలిశాక అదను చూసుకుని ఏదో కారణం చెప్పి లేదా తక్కువ ధరకు బంగారం ఇస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునేది. తనకు సీఎం, డీసీఎం, స్పీకర్ ఇంకా చాలామంది రాజకీయ నాయకులు తెలుసని చెప్పుకునేది.స్పీకర్ ఖాదర్తో సహా పలువురు వీఐపీలతో తీసుకున్న ఫోటోలు చూపించేది. ఇలా 20 మంది నుండి రూ.30 కోట్ల వరకూ వసూలు చేసింది. చాలా రోజుల తరువాత మోసపోయామని తెలుసుకున్న బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సవితను అరెస్టు చేశారు. గోవిందరాజనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కూడా ఈమెపై కేసు నమోదైంది. -
తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate)లు ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వెండిలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయా?
-
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పుంజుకుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పుత్తడి ప్రియుల ఆశలపై నీళ్లు.. మళ్లీ పసిడి ధరలు పైకి..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖం పట్టినట్లేపట్టి మళ్లీ నిన్నటి నుంచి పెరుగుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నా భారత్.. బంగారం..!
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద విలువ అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుత ధరల ప్రకారం భారతీయుల వద్ద దాదాపు రూ.204 లక్షల కోట్ల (2.4 ట్రిలియన్ డాలర్లు) విలువైన బంగారం ఉందని స్విస్ ఆర్థిక సేవల సంస్థ– యూబీఎస్ అంచనా వేసింది. ఆది నుంచి బంగారంపై విపరీతమైన మక్కువ కలిగిన భారతీయుల వద్ద 25,000 టన్నులకుపైగా (దేవాలయాలతో కలిపి) ఉన్నట్లు యూబీఎస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో 2020 నుంచి బంగారం విలువ రెండు రెట్లు పైగా పెరిగితే ఒక్క 2025 సంవత్సరంలోనే 25 శాతం పెరగడంతో భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ భారీగా పెరిగిందని, ఇది దేశ జీడీపీలో 56 శాతానికి సమానమని పేర్కొంది. అంతేకాదు అభివృద్ధి చెందిన దేశాలు ఇటలీ (2.4 ట్రిలియన్ డాలర్లు), కెనడా (2.33 ట్రిలియన్ డాలర్ల) జీడీపీకి సమానంగా భారతీయులు బంగారాన్ని కలిగి ఉన్నారని తెలిపింది. అదే మన పక్క దేశం పాకిస్థాన్ జీడీపీ కంటే మన దగ్గర ఉన్న బంగారం విలువ ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారంలో అత్యధికంగా 14 శాతం వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉందని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని అంశాలు...తాకట్టుకూ ఇష్టపడటం లేదు...భారతీయుల సంప్రదాయం ప్రకారం బంగారంతో విడదీయరాని ఆధ్యాతి్మక అనుబంధం కూడా ఉంది. దీనితో వాటిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడటం లేదు. భారతీయులు తమ వద్ద ఉన్న బంగారంలో రెండు శాతం మాత్రమే తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన గోల్డ్ మోనటైజేషన్ స్కీం, సావరిన్ గోల్డ్ బాండ్ పథకాలు కూడా విఫలమయ్యాయి. భౌతిక కొనుగోళ్లనే ఇష్టపడ్డం, పసిడి విక్రయాలకు ససేమిరా అనడం దీనికి ప్రధాన కారణం.» అంతర్జాతీయంగా యుద్ధభయాలు , ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భారతీయుల సంపద మరింత పెరగనుంది.» బంగారంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి.» బంగారం ధరలు భారీగా పెరుగుతున్నా, భారతీయులకు బంగారంపై మక్కువ తీరడం లేదు. కొనుగోళ్లకు వెనుకడుగు వేయడం లేదు.» 2025లో 782 టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేస్తుందని అంచనా. అయితే ఇప్పుడు ఆభరణాల కంటే పెట్టుబడుల రూపంలో అంటే నాణేలు, బంగారు కడ్డీల రూపంలో అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. బంగారం ఆభరణాల కొనుగోళ్లలో స్వల్ప క్షీణత నమోదవుతున్నప్పటికీ, నాణేలు, బంగారు కడ్డీల కొనుగోళ్లలో వార్షికంగా 25 శాతం పెరుగుదల నమోదవుతోంది.» గతేడాది కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గడంతో బంగారంలో పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది.» వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ అమలు చేయనుండటంతో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయని అంచనా. -
పసిడికి కొనుగోళ్ల కళ
న్యూఢిల్లీ: పసిడి ధరల్లో ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి బలమైన సానుకూలతల అండతో స్టాకిస్టులు కొనుగోళ్లకు దిగడంతో పసిడి మంగళవారం ఒక్క రోజే రూ.1,200 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.98,670కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.98,150 స్థాయిని తాకింది. వెండి సైతం కిలోకి రూ.2,000 లాభపడి రూ.1,04,800కు చేరుకుంది.డాలర్ బలహీనత కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ ఏర్పడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అమెరికా ఆర్థిక గణాంకాలపై అంచనాలతో ఈ వారం పసిడి పట్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండొచ్చని అంచనా వేశారు. మరోవైపు అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 3,362 డాలర్ల స్థాయికి పుంజుకుంది. ‘‘డాలర్ బలహీనపడడం, అమెరికా ద్రవ్యలోటు విస్తరణపై ఆందోళనలతో.. ట్రంప్ ప్రతిపాదిత పన్ను తగ్గింపుల బిల్లుపై మార్కెట్లు దృష్టిపెట్టాయి. దీంతో బంగారం ఆకర్షణీయంగా మారింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. -
మా బంగారం మాక్కావాలె.. మాకు న్యాయం చేయాలె
-
'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్ బోర్డుల నుంచి...
ఎన్నో విలాసవంతమైన భవనాలను చూసి ఉంటారు. ానీకానీ ఇలాంటి విలాసవంతమైన ఇంటిని మాత్రం చూసుండరు. మహా అయితే ఇన్ని అంతస్థుల భవనం, కట్టిపడేసే లగ్జరీయస్ ఫర్నీచర్లు తదితర విశేషాలతో ఉన్న బంగ్లాలనే ూచూశాం. కానీ ఈ ఇల్లు వాటన్నింటిని తలదన్నేలా అత్యంత విలాసవంతంగా అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఆ ఇంటిని తిలకిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. కంటెంట్ క్రియేటర్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక విలాసవంతమైన బంగారంతో అలకరించి ఉన్న లగ్జరీయస్ ఇంటిని సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ ఇంటి లోపల ఫర్నిచర్ నుంచి ఎలక్ట్రిక్ స్విచ్బోర్డుల వరకు ప్రతీది స్వచ్ఛమైన బంగారంలా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసినవే అట. కంటెంట్ క్రియేటర్ సరస్వత్ అంతటి ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యంగా తిలకిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ భవనంలో మొత్తం పది బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంటి ప్రాంగణంలో గోశాల నుంచి మొదలై.. ఎంట్రన్స్లో 1936 వింటేజ్ మెర్సిడెస్ కారు నుంచి పలు విలాసవంతమైన కార్ల సేకరణ కనిపిస్తుంది. అంతేగాదు ఆ ధనవంతుడి సక్సెస్ జర్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తమ కుటుంబంలో మొత్తం 20 మంది సభ్యులం ఉండేవాళ్లమని, అందరికీ ఒకే ఒక పెట్రోల్ బంక్ ఆధామని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆ ధనవంతుడికి అర్థమైపోయిందట ఏదోరకంగా కష్టపడకపోతే తన మనుగడ ప్రశ్నార్థకమై పోతుందని. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ కాంట్రాక్టర్షిప్లోకి ప్రవేశించారట. అలా ప్రభుత్వ రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మించే తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సుమారు 300 గదుల హోటల్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, అందుకు సంబంధించిన వీడియోకి "భారతదేశంలోని ఇండోర్లో బంగారంతో అలంకరించబడిన ఇల్లు" అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు కంటెంట్ క్రియేటర్ సరస్వత్. నెటిజన్లు అంతటి విలాసవంతమైన ఇంటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరూ లక్ష్మీపుత్రుడు, అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyam Saraswat (@priyamsaraswat) (చదవండి: 'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
జీఆర్టీ జ్యువెలర్స్ బంపర్ ఆఫర్
-
నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా నగలు, నగదు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే నివ్వెరబోతున్నారు. సోమవారం నాలుగో రోజు కస్టడీలో భాగంగా నూనె శ్రీధర్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించారు. మొదటి మూడు రోజులు సహకరించనప్పటికీ సోమవారం పలు ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు ముందుంచి ప్రశ్నించడంతో శ్రీధర్ నోరువిప్పినట్లు తెలిసింది. మరోవైపు ఆయనకు చెందిన బ్యాంకు లాకర్లను తెరిపించగా వాటిలో భారీగా బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు, నగదును ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. అనధికారిక సమాచారం ప్రకారం లాకర్లలో లభ్యమైన బంగారు ఆభరణాల విలువే రూ. 25 కోట్లకుపైగా ఉంటుందని తెలిసింది. అయితే అందులోని ఆస్తుల వివరాలు ఏమిటో తెలియరాలేదు. కోర్టు ఆదేశం ప్రకారం మంగళవారంతో శ్రీధర్ ఏసీబీ కస్టడీ ముగియనుంది. మరోవైపు ఇప్పటివరకు సేకరించిన వివరాల ఆధారంగా శ్రీధర్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో కొందరికి ఏసీబీ త్వరలో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. -
వెండి రికార్డుల మోత
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్టైమ్ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది. రూపాయిలో బలహీనత దేశీ మార్కెట్లో బులియన్ ధరలకు మద్దతుగా నిలిచింది’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర పెద్దగా మార్పు లేకుండా 3,400 డాలర్ల స్థాయిలో ఉంది. డాలర్ బలపడడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల పెరుగుదల బంగారం ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. దీనికితోడు బుధవారం యూఎస్ ఫెడ్ సమావేశం నిర్ణయాలు బయటకు రానుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి పాటించినట్టు తెలుస్తోంది. -
డాలర్ వెలవెల... బంగారం ధగధగ
బంగారం ఒక విలువైన లోహం. భారతదేశం వంటి దేశాలలో అది మహిళలకు ఇష్టమైన అలంకారం.లేకుంటే, ధనవంతులకు తమ సంపదను దాచుకునే ఒక మార్గం. కానీ ఇదే బంగారం 1971 ఆగస్టు 15 వరకూ అమెరికా డాలర్కు విలువను కల్పించిన సాధనం. నాటి వరకూ, అమెరికా డాలర్ అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు అవసరమైన రిజర్వ్ కరెన్సీగా కొనసాగగలిగేటందుకు, ఈ డాలర్ – బంగారం లింక్ ఉపయోగపడింది. అయితే, నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఈ లింక్ను తెగ్గొట్టేశాడు. అంటే, ఇక ముందర తాము ముద్రిస్తోన్న డాలర్లకు ఆ మేరకు, వెనుక తట్టున బంగారాన్ని నిల్వ పెట్టబో మని తేల్చి చెప్పేశాడు. ఈ రకంగా డాలర్ అనేది ఫ్లోటింగ్ కరెన్సీగా మారింది. అంటే, బంగారం లింక్ తెగిపోయిన తర్వాత డాలర్ తాలూకు విలువ, ఇతర దేశాల కరెన్సీ లతో పోలిస్తే, దానికున్న డిమాండ్పై ఆధారపడ సాగింది. ఇదే క్రమంలో, ప్రపంచంలోని అనేక కరెన్సీలు మెల్లమెల్లగా ఫ్లోటింగ్ కరెన్సీలుగా మారాయి. ఒక దేశం వివిధ దేశాలతో చేసిన వ్యాపారం తదితర లావాదేవీల ఫలితంగా సమకూరిన అనేక దేశాల కరెన్సీలతో పాటుగా... వాటిలో ఒకటిగా, కొద్దిపా టిగా బంగారం నిల్వలను కూడా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (మన రిజర్వ్ బ్యాంక్ వంటివి) తమ కిట్టీలో అట్టిపెట్టుకోసాగాయి. కాగా, ఈ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న వివిధ కరెన్సీల నిల్వలు అన్నింటిలోనూ డాలర్దే తిరుగులేని పై చేయిగా ఉంటూ వస్తోంది. కానీ, ఇటీవల మరలా కథ తిరగబడుతోంది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మారకం నిల్వలలో యూరో కరెన్సీని అధిగమించి డాలర్ తరు వాతి స్థానంలోకి బంగారం నిల్వలు చేరుకుంటు న్నాయి. అంటే, డాలర్ యుగం ముగుస్తోందన్న మాట. కానీ దానికి తక్షణ ప్రత్యామ్నాయం కనపడని ఈ సంధి దశలో, బంగారం తిరిగి ప్రాభవంలోకి వస్తోంది. దీనికి తార్కాణమే నేడు కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వల స్థాయి సుమారుగా 36 వేల టన్నులకు చేరుకోవడం. గతంలో ఈ స్థాయిలో అవి ఉన్నది 60 సంవత్సరాల క్రితం మాత్రమే! 1971లోనే బంగారంతో లింక్ తెగిపోయినా... నేటి వరకూ కూడా డాలర్ తన అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ స్థానాన్ని పదిలంగా అట్టిపెట్టుకోగల్గింది. అయితే 1980ల నుంచీ, ఔట్సోర్సింగ్ రూపంలో అమెరికా పరిశ్రమలు చైనా వంటి ఇతర చవక శ్రమ శక్తి దేశాలకు తరలిపోవడం, 1990ల మధ్య నుంచీ, ఇంటర్నెట్ సాంకేతికత వలన అమెరికాలోని సేవా రంగం కూడా పెద్ద ఎత్తున భారతదేశం వంటి దేశాలకు తరలి వెళ్ళిపోవడం; యాంత్రీకరణ వేగం పెరిగి అమెరికాలో ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గి పోవడం... ఫలితంగా వారి కొనుగోలు శక్తి పడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే అమెరికా భారీ ఎత్తున ఇతర దేశాల దగ్గర అప్పులు చేయసాగింది. అంతిమంగా నేడు ఈ అప్పు స్థాయి సుమారుగా 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా పాలకులు తమ ప్రజల కొనుగోలు శక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో, 2020 కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఉద్దీపన పథకాల కోసం పెద్ద ఎత్తున లక్షల కోట్ల డాలర్లను ముద్రించారు. అంతకు ముందర అనేక దశాబ్దాలుగా కూడా అమెరికాలో డాలర్ల ముద్రణ శ్రుతి మించి జరిగింది. ఈ క్రమంలోనే డాలర్ కరెన్సీ తన విలువను కోల్పోసాగింది. 2022 అనంతరం, ఆ దేశంలో విజృంభించిన ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల అనేవి దశాబ్దాల పాటు జరి గిన డాలర్ల అపరిమిత ముద్రణ ఫలితమే.ఈ క్రమంలోనే, బలహీనపడుతోన్న డాలర్ రూపంలో తమ తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను అట్టిపెట్టుకోవడం కంటే, బంగారం వంటి నికరంగా విలువను నిలబెట్టుకోగల ప్రత్యామ్నాయాన్ని ఆశ్ర యించడం మేలని కేంద్ర బ్యాంకులు నిర్ణయించుకుంటున్నాయి. దీనంతటితో పాటుగా, రష్యా – ఉక్రెయిన్ యుద్ధ క్రమంలో, అమెరికా ప్రభుత్వం రష్యాపై అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలలో భాగంగా అమె రికా డాలర్ కరెన్సీ లావాదేవీల వ్యవస్థ నుంచి, రష్యాను బయటకు నెట్టివేసింది. ఈ బహిష్కరణ అనేది ప్రపంచంలోని చాలా దేశాలకు డాలర్పై ఆధారపడడం తాలూకు అభద్రతను బోధపరిచింది. ఫలితంగా, నేడు పలు దేశాలు డాలర్పై ఆధారపడ డాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అవి బంగారం దిశగా కూడా మళ్ళుతున్నాయి.గత 15 ఏళ్లుగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. 2024లో ఇవి రికార్డు స్థాయిలో 1,180 టన్నుల బంగా రాన్ని కొనుగోలు చేశాయి. కేంద్ర బ్యాంకుల కిట్టీలో బంగారం నిల్వల స్థాయి పెరుగుతూ రావడం అనేది... పాత డాలర్ యుగం ఆధిపత్య స్థానంలో మరో సరికొత్త కరెన్సీ లేదా కరెన్సీల సమూహం వచ్చి చేరే వరకూ నడిచే సంధి యుగం లక్షణమే.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
పాత బంగారానికి 2 క్యారెట్ల అదనపు విలువ
పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బంగారు ఆభరణాల రిటైల్ బ్రాండ్ తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తమ పాత బంగారానికి గరిష్టంగా 2 క్యారెట్ల అదనపు విలువ పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ పరిమిత కాల ఆఫర్ జూన్ 30, 2025 వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.ఆఫర్ ఎలా పనిచేస్తుందంటే..పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే కస్టమర్లు కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు అదనపు క్యారెట్ విలువను పొందేలా ఈ ఆఫర్ను డిజైన్ చేశారు. ప్లేయిన్ జ్యువెలరీ లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 1 క్యారెట్ అదనంగా పొందవచ్చు. అదే వజ్రాలతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 2 క్యారెట్లను అదనంగా పొందేందుకు ఈ ఆఫర్ ద్వారా వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకంకస్టమర్ల పాత బంగారం 20 క్యారెట్లు ఉండి దాన్ని ఎక్స్ఛేంజ్ ఇచ్చి తిరిగి కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే పాత దాన్ని 21 క్యారెట్లుగా లెక్కిస్తారు. అదే వజ్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు 22 క్యారెట్లుగా విలువ కడుతారు. బంగారం ధరలు పెరుగుతున్నందున ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా తనిష్క్ ప్రీమియం డిజైన్లను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. పండుగలు, పెళ్లిళ్లు లేదా వ్యక్తిగతంగా తమ ఆభరణాలు కొత్త డిజైన్లలోకి మార్చుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. -
Gold Price: మళ్లీ రూ.లక్ష దాటిన బంగారం ధర
-
గోల్డ్ ఈటీఎఫ్లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మే నెలలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు రూ.292 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను వెనక్కి తీసుకోగా, మార్చిలోనూ రూ.77 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోవడం గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో తిరిగి ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. మే చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.62,453 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ చివరికి ఇది రూ.61,422 కోట్లుగా ఉంది. ‘‘మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడాన్ని సూచిస్తోంది. బంగారం ధరలు గరిష్టాల్లో స్థిరంగా ఉండడం, అంతర్జాతీయంగా అనిశి్చతులు కొనసాగుతుండడంతో హెడ్జింగ్కు బంగారం మంచి సాధనంగా కనిపిస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మే నెలలో బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించి ఉంటారని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న అవగాహన తమ పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా కలిగి ఉండాలని ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నాని, దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లు పెరిగినట్టు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ తెలిపారు. ‘‘బంగారం అన్నది వినూత్నమైన సాధనం. ఇది డాలర్ డినామినేషన్లో ఉంటుంది. ఈక్విటీలతో సంబంధం లేనిది. ఈక్విటీలకు ప్రతికూల సంబంధం కలిగి ఉంటుంది. కనుక పోర్ట్ఫోలియో హెడ్జింగ్కు ఇదొక చక్కని సాధనం’’అని జోసెఫ్ చెప్పారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.1,980 కోట్లుగా ఉండడం గమనార్హం.అంటే మే నెలలో కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సి ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు గత కొన్నేళ్లలో స్థిరమైన ర్యాలీ చేయడం గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసిందని చెప్పుకోవాలి. ఇక మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల పరిధిలో ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.24 లక్షలు పెరిగాయి. దీంతో మే చివరికి మొత్తం ఫోలియోలు 73.69 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అయ్యే డిజిటల్ బంగారం సాధనం. భౌతిక బంగారం ధరలను ఇవి ప్రతిఫలిస్తుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. -
బంగారం కోసమే బాలమ్మ హత్య
మణికొండ(హైదరాబాద్): ఓ వృద్ధురాలి మెడలో, కాళ్లకు ఉన్న బంగారం, వెండిపై కన్నేసిన ఓ మహిళ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి హత్య చేసిన సంఘటనను నార్సింగి పోలీసులు చేధించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన రామేశ్వరం బాలమ్మ(75) ఈ నెల 3వ తేదీన ప్రతిరోజు మాదిరిగానే వాకింగ్కు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవటం, ఆమె కోడలు ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా కోడలు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు..ఆమె అనుమానం వ్యక్తం చేసిన మహిళ అనిత కూడా అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో వెదకడం ప్రారంభించారు. 4వ తేదీనే బాలమ్మ మృతదేహం వికారాబాద్ జిల్లా చెన్గొముల్ పోలీస్స్టేషన్ పరిధిలో కనిపించింది. అప్పటికే మృతదేహం గుర్తు పట్టరాకుండా ఉండటం, శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవటంతో వారు స్పాట్లోనే పోస్టుమార్టం నిర్వహించి కండ్లపల్లి అడవిలోనే ఖననం చేశారు. అనిత చిక్కడంతో వెలుగులోకి.. నార్సింగి పోలీసులు విచారణ క్రమంలో అనితను ఈ నెల 7వ తేదీన ఆమె స్వస్థలం వికారాబాద్ జిల్లా పరిగి మండలం, మిట్టకోడూరు గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తమదైన శైలిలో విచారించటంతో బాలమ్మను తానే బంగారం గురించి హత్య చేశానని, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి తస్కరించినట్టు అంగీకరించింది. మృతదేహం కండ్లపల్లి అడవిలో వదిలేశానని తెలిపింది. దాంతో చెన్గొముల్ పోలీసులను సంప్రదించటంతో గుర్తు తెలియని మహిళ శవంగా భావించి పోస్టు మార్టం నిర్వహించి అక్కడే పూడ్చివేశామని తెలిపారు. దాంతో పూడూర్ మండల తహసీల్దార్ అనుమతితో పాతిపెట్టిన బాలమ్మ మృతదేహాన్ని ఈనెల 7వ తేదీన వెలికి తీశారు. ఆమెను బాలమ్మగానే బంధువులు గుర్తించటం, హంతకురాలి వద్ద ఉన్న బంగారం, వెండి స్వా«దీనం కావటంతో అనితను అరెస్టు చేశారు. -
దిగొస్తున్న పసిడి ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) రూ.లక్షకు చేరువైంది. కానీ ఇటీవలి కాలంలో ఇది క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,550 (22 క్యారెట్స్), రూ.97,690 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.250, రూ.280 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.280 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,550 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,690 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.250 దిగి రూ.89,700కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.280 తగ్గి రూ.97,840 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే సోమవారం వెండి ధరలు(Silver Price) తగ్గాయి. క్రితం ముగింపు ధరలతో పోలిస్తే సోమవారం కేజీ వెండి ధర రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,17,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1500, రూ.1630 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1630 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1500 దిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1630 తగ్గి రూ.98,120 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు శనివారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. శుక్రవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,18,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
దుబాయ్లో హీరోయిన్ సమంత సందడి.. (ఫోటోలు)
-
గోల్డ్ లోన్ నిబంధనల సడలింపు ప్రతిపాదనలు
బంగారు రుణాల కొత్త ముసాయిదా నిబంధనల నుంచి చిన్న రుణగ్రహీతలకు మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వశాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. బంగారం తనఖా పెట్టి రూ.2 లక్షల వరకు రుణాలు పొందేవారికి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తోపాటు కొందరు ఆర్థిక నిపుణుల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అదనంగా కొన్ని మార్గదర్శకాలను జనవరి 1, 2026 నుంచి అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ఆర్బీఐకి సిఫార్సు చేసింది.ప్రతిపాదిత మార్పులు ఇలా..ఆర్బీఐ ముసాయిదా నిబంధనల్లో రుణగ్రహీతలను గణనీయంగా ప్రభావితం చేసే రెండు కీలక మార్పులను ప్రతిపాదిస్తున్నారు. అందులో లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి తగ్గింపు నిర్ణయం కీలకంగా ఉంది. అంటే రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారం విలువలో ఇప్పటివరకు 80% వరకు రుణాలు వచ్చేవారు కాస్తా దీన్ని 75% కి తగ్గించాలనే ప్రతిపాదనలున్నాయి. దీని ద్వారా రుణగ్రహీతలు బంగారంపై తక్కువ డబ్బును పొందుతారు. తాకట్టు పెట్టిన బంగారానికి యాజమాన్య రుజువును అందించాలనేలా మరో ప్రతిపాదన ఉంది.ఇదీ చదవండి: టర్కీ ఎయిర్లైన్స్ డీల్ ప్రశ్నార్థకంఆ నిబంధనలను ఖరారు చేయడానికి ముందు ఆర్బీఐ ప్రస్తుత బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలతో సహా ఇతర వాటాదారుల నుంచి ఫీడ్బ్యాక్ను సమీక్షిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిరంతరాయంగా రుణ సదుపాయం లభించేలా చూడటం ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ విధుల్లో ప్రాథమిక అంశమని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
బంగారానికి భారీ డిమాండ్: ఆభరణాల ధరలు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. భారతీయులు బంగారాన్ని ఆభరణాలుగా, పెట్టుబడికి ఉత్తమ మార్గంగా భావించి.. ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. దేశంలో బంగారు ఆభరణాల వినియోగం 2026 ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 12-14 శాతం గణనీయంగా పెరుగుతుందని ''ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్'' (ICRA) వెల్లడించింది.2025 ఆర్ధిక సంవత్సరంలో బంగారం ధరలు 33 శాతం పెరిగాయి, 2026లో ధరలు పెరుగుతూనే ఉంటాయని ICRA తెలిపింది. సాధారణంగా గోల్డ్ రేటు పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. కానీ భారతదేశంలో శుభకార్యాలకు, శుభదినాలకు బంగారం కొనుగోలు పెరుగుతోంది. ధరలు మరింత పెరగడానికి ఇది ప్రధాన కారణమవుతోందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ జితిన్ మక్కర్ అన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల వినియోగం విలువలో గణనీయమైన 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా బంగారం ఆభరణాల వినియోగం అదే తరహాలో పెరుగుతుంది. ధరలు కూడా గత ఆర్ధిక సంవత్సరం కంటే.. 20 శాతం ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..2024 ఆర్థిక సంవత్సరం, 2025 ఆర్థిక సంవత్సరాలలో గోల్డ్ బార్లు, నాణేల వినియోగం వరుసగా 17 శాతం, 25 శాతం పెరిగింది.దీనికి ప్రధాన కారణం ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి, పెరిగిన భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలే. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల చాలామంది.. పసిడి కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ బార్లు, నాణేలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న బంగారం: ఎందుకిలా..
భారతదేశంలో బంగారం ధరలు మళ్ళీ లక్ష రూపాయల ధర వద్దకు చేరువకు చేరుతున్నాయి. మే మొదటి వారం తరువాత తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేటు.. మళ్ళీ దూసుకెళ్తోంది. గురువారం గోల్డ్ మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగింది. దీంతో ధరలు మళ్ళీ పైపైకి పయనించాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ నష్టాలను చవిచూశాయి.స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తున్న సమయంలో.. బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో రెండు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర సుమారు 300 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు దాదాపు రూ. 98,000 వద్దకు చేరింది. ఇదిలా కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో.. తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంటుండటంలో ఎటువంటి సందేహం లేదు.స్టాక్ మార్కెట్లు డీలా పడుతుండటంతో.. పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇంతుకు ముందు ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు కొంత అనుకూలంగా ఉన్నట్లే అని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం ఎప్పుడూ భద్రమైన ఆస్తి, కాబట్టి పసిడి కొనుగోలు చేయడానికే ఆసతి చూపండి అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే ఉన్నారు. బంగారం కొనుగోలు చేస్తే.. పేదవారు కూడా భవిష్యత్తులో ధనవంతులవుతారని ఆయన చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కూడా ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, జాగ్రత్త పదండి.. అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్ని వెల్లడించారు. -
బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..
బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారమే రూ.లక్ష వరకూ పలుకుతోంది. బంగారం సాధారణంగా చాలా మంది దగ్గర ఆభరణాల రూపంలోనే ఉంటుంది. వీటిని ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగిలిన సమయాల్లో పెద్దగా ధరించరు. ఈ నగలను ఇంట్లోని బీరువాల్లోనే భద్రపరుచుకుంటుంటారు. అయితే విలువైన బంగారు ఆభరణాలను ఇలా ఇంట్లో పెట్టుకుంటే వల్ల చోరీకి గురవుతాయేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంటుంది. అందుకే అనేక బ్యాంకులు బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు సేఫ్ డిపాజిట్ లాకర్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.ఈ సేఫ్ డిపాజిట్ లాకర్లలో బంగారం, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు బ్యాంకులు కొంత చార్జీలను వసూలు చేస్తాయి. లాకర్ పరిమాణం, బ్రాంచ్ లొకేషన్ (గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ లేదా మెట్రో), బ్యాంక్ అంతర్గత విధానాల ఆధారంగా ఈ లాకర్లకు అద్దె ఛార్జీలు మారవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని నాలుగు టాప్ బ్యాంకులలో సేఫ్ డిపాజిట్ లాకర్ల చార్జీలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాకర్ పరిమాణం, స్థానాన్ని బట్టి మారుతూ ఉండే అంచెల ధరల నిర్మాణాన్ని అందిస్తుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు వర్తిస్తుంది. ఇది చిన్న, మధ్యతరహా లాకర్లకు రూ .500, పెద్ద, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు రూ .1,000. వీటికి జీఎస్టీ అదనం.వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా):చిన్న లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.1,000 అర్బన్/ మెట్రో: రూ.1,500మీడియం లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్/ మెట్రో: రూ.3,000పెద్ద లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.5,000అర్బన్/ మెట్రో: రూ.6,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్/ మెట్రో: రూ.9,000పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేఫ్ లాకర్ల కోసం అందుబాటు చార్జీలను వసూలు చేస్తోంది. కొన్ని నిర్దిష్ట మెట్రో శాఖలలో 25% ప్రీమియం వర్తిస్తుంది. కస్టమర్లు సంవత్సరానికి 12 సార్లు ఉచితంగా తమ లాకర్ను సందర్శించవచ్చు. ఆ తర్వాత ప్రతి అదనపు సందర్శనకు రూ .100 వసూలు చేస్తారు.వార్షిక ఛార్జీలు ఇలా.. (జీఎస్టీ కాకుండా)చిన్న లాకర్లు: రూరల్: రూ.1,000 సెమీ అర్బన్/ అర్బన్: రూ.1,250 అర్బన్/ మెట్రో: రూ.2,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,200 సెమీ అర్బన్/ అర్బన్: రూ.2,500 అర్బన్/ మెట్రో: రూ.3,500పెద్ద లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.3,000 అర్బన్/ మెట్రో: రూ.5,500ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.6,000 అర్బన్/ మెట్రో: రూ.8,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: అన్ని ప్రాంతాల్లో: రూ.10,000ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): చిన్న లాకర్లు: గ్రామీణం: రూ.1,200 సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్: రూ.3,000 మెట్రో: రూ.3,500 మెట్రో+: రూ.4,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,500 సెమీ అర్బన్: రూ.5,000 అర్బన్: రూ.6,000 మెట్రో: రూ.7,500 మెట్రో+: రూ.9,000పెద్ద లాకర్లు: గ్రామీణం: రూ.4,000 సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్: రూ.10,000 మెట్రో: రూ.13,000 మెట్రో+: రూ.15,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: గ్రామీణం: రూ.10 వేలు సెమీ అర్బన్: రూ.15,000 అర్బన్: రూ.16,000 మెట్రో: రూ.20,000 మెట్రో+: రూ.22,000హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): ఎక్స్ట్రా స్మాల్ లాకర్లు: మెట్రో: రూ.1,350 పట్టణ: రూ.1,100 సెమీ అర్బన్: రూ.1,100 గ్రామీణం: రూ.550చిన్న లాకర్లు: మెట్రో: రూ.2,200 పట్టణ: రూ.1,650 సెమీ అర్బన్: రూ.1,200 గ్రామీణం: రూ.850మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,000 అర్బన్: రూ.3,000 సెమీ అర్బన్: రూ.1,550 గ్రామీణం: రూ.1,250ఎక్స్ట్రా మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,400 పట్టణ: రూ.3,300 సెమీ అర్బన్: రూ.1,750 రూరల్: రూ.1,500పెద్ద లాకర్లు: మెట్రో: రూ.10,000 అర్బన్: రూ.7,000 సెమీ అర్బన్: రూ.4,000 గ్రామీణం: రూ.3,300ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: మెట్రో: రూ.20,000 పట్టణ: రూ.15 వేలు సెమీ అర్బన్: రూ.11,000 గ్రామీణం: రూ.9,000🔶 లాకర్ సదుపాయాన్ని ఎంచుకునేటప్పుడు ధర మాత్రమే ముఖ్యం కాదు. లభ్యత, ఎంత దగ్గరలో ఉంది, లాకర్ పరిమాణం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ముందస్తు సరెండర్ పాలసీలు లేదా రిజిస్ట్రేషన్ ఫీజులు వంటివి ఏవైనా అదనపు నిబంధనలు ఉన్నాయేమో చూసుకోవాలి. -
గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే..
విలాసవంతంమైన ఆహారపదార్థాలను ఎన్నో చూశాం. కానీ ఐస్క్రీం డిజర్ట్లలో గోల్డ్తో చేసింది చూసుండరు. దీన్ని విక్రయించే వ్యక్తి సైతం గోల్డ్ మ్యాన్లా మెరిసిపోతుండటం విశేషం. ఇంతకీ ఎక్కడ ఈ గోల్డ్ కుల్ఫీని అమ్ముతున్నారంటే..ఇండోర్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పురాతన సరఫా బజార్లో ఈ 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ దొరకుతుంది. అక్కడ ఈ విలాసవంతమైన డెజర్ట్ తోపాటు ఫలూడా, ది గోల్డ్ మ్యాన్ జామున్, రబ్డీ వంటి వివిధ రుచులను సైతం అందిస్తోంది. ఇక్కడ ప్రత్యేకతే ఏంటంటే..ఈ గోల్డ్ కుల్ఫీని అందించే వ్యక్తి ఒంటి నిండా గోల్డ్తో ధగ ధగ మెరిసిపోతూ కనిపిస్తుంటాడు. బహుశా అదే అతడి సేల్స్ ట్రిక్ ఏమో గానీ..చూడటానికి మాత్రం ఏదో లగ్జరీయస్ హోటల్కి వచ్చామా..! అనే డౌటు వచ్చేస్తుందని అంటున్నారు అక్కడ స్థానికులు. అత్యంత ఆడంబరంగా కనపించే వీధి దుకాణమే ఇది. ఒరిజనల్ గోల్డ్తో తయారయ్య ఈ కుల్ఫీ ధర వచ్చేసి రూ. ₹351-401ల మధ్య ఉంటుందట. ఇది శతాబ్దాల నాటి పాక సంప్రదాయానికి పరాకాష్ట. ఇండోర్ సందర్శించడానికి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా ఈ కుల్ఫీని తిని చూడకుండా వెళ్లరట. 'సరఫా' అనే పేరు ఎలా వచ్చిందంటే..హోల్కర్ రాజవంశం సమయంలో 18వ శతాబ్దం నాటి ఈ మార్కెట్ బంగారం, వెండి వ్యాపారుల వాణిజ్య కేంద్రంగా ఉండేదట. అందుకే దీనికి "సరఫా" అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక హిందీలో దీని అర్థం బులియన్. కానీ చీకటి పడుతుందనగా.. ఈ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాలు మూతపడిపోతాయి..రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..అత్యంత ఫేమస్ అయిన ఈ గోల్డ్ కుల్ఫీ దుకాణం అమ్మకాలు ప్రారంభమవుతాయట. చిరుతిండికి ఫేమస్ ఈ బజార్. ఈ కుల్ఫీ దుకాణమే కాకుండా రుచికరమైన జిలేబీలు, స్పైసీ దాల్ బఫ్లా వంటి చిరుతిండ్లకు చిరునామా ఇది. భద్రత దృష్ట్యా మొదలైన ఈ మార్కెట్ క్రమంగా విస్తరించిందట. చివరగా ఈ సరఫా బజార్లో ది గోల్డ్మ్యాన్ విక్రేత అందించే బంగారు కుల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా హైలెట్గా నిలిచిన డెజర్ట్. ఇది ఒక రకంగా రుచితోపాటు..సర్వ్ చేసే వ్యక్తి దృశ్యం.. కస్టమర్ని ప్రభావితం చేసేలా అమ్మకాలు జోరందుకుంటాయనే విషయాన్ని హైలెట్ చేసింది.(చదవండి: టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!) -
ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటి. బంగారాన్ని వేలాది సంవత్సరాలుగా ఐశ్వర్యానికి, హోదాకు ప్రతిరూపంగా పరిగణిస్తూ వస్తున్నారు. బంగారం మంచి విద్యుత్ వాహకం. దీని ఉపయోగాలు ఎలా ఉన్నా మృదువైన, అరుదైన, సులభంగా ఆకృతులు చేసేందుకు అనువైన ఈ లోహాన్ని ముఖ్యంగా ఆభరణాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. డిమాండ్ కారణంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ అత్యంత ఖరీదైన లోహంగా మారింది. అందుకే దీన్ని పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. శతాబ్దాలుగా మాంద్యం సమయంలో మంచి పెట్టుబడి మార్గంగా బంగారం కొనసాగుతోంది.ఈ దేశం బంగారు భూమిఘనాను బంగారు భూమి అంటారు. ఈ ప్రదేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. వైవిధ్యమైన బంగారు వనరులు, అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం కారణంగా అరబ్ వ్యాపారులు ఘనాకు ఆ పేరు పెట్టారు. బంగారం ఈ ప్రాంత అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది.అంతేకాకుండా జపాన్ లోని సాడో ద్వీపాన్ని కూడా ఎడో కాలంలో బంగారు భూమిగా పిలిచేవాళ్లు. ఎందుకంటే ఈ ప్రదేశం ఆ సమయంలో జపాన్ మొత్తం బంగారు ఉత్పత్తిలో దాదాపు సగం ఉత్పత్తి చేసేది. అపారమైన సంపదకు, బంగారానికి నిలయంగా ఉండే ఇండోనేషియాలోని ఒకప్పటి శ్రీవిజయ నగరాన్ని కూడా బంగారు ద్వీపంగా పరిగణించేశాళ్లు.👉ఇది చదవారా? బంగారం మాయలో పడొద్దు..టాప్ 10 అతిపెద్ద బంగారం ఉత్పత్తి దేశాలువరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల జాబితా ఇలా ఉంది. దేశం బంగారం ఉత్పత్తి (టన్నులు)1 చైనా 378.22 రష్యన్ ఫెడరేషన్ 321.83 ఆస్ట్రేలియా 293.84 కెనడా 191.95 యునైటెడ్ స్టేట్స్ 166.76 ఘనా 135.17 ఇండోనేషియా 132.58 పెరూ 128.89 మెక్సికో 126.610 ఉజ్బెకిస్తాన్ 119.6 -
ఉన్నట్టుండి భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి అనుకునే లోపే.. ఈ రోజు (మే 16) మళ్ళీ భారీగా పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,130 వద్ద నిలిచాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ రోజు కూడా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,130 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,280 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1100, రూ. 1200 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం.. -
పసిడికి అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: పసిడి ఒకే రోజు భారీగా నష్టపోయింది. చైనా దిగుమతులపై విధించిన టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో సురక్షిత సాధనమైన బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్–పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం సైతం అమ్మకాలకు ఆజ్యం పోసింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.3,400 నష్టపోయి రూ.96,550కు దిగొచ్చింది.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..యూఎస్–చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాలు వెలువడడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత చల్లబడడం బంగారం ధరల పతనానికి దారితీసినట్టు మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. వెండి కిలోకి రూ.200 నష్టపోయి రూ.99,700 స్థాయికి చేరింది. 2024 జూలై 23 తర్వాత ఒకే రోజు బంగారం ఎక్కువగా నష్టపోవడం ఇదే మొదటిసారి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్లను 30%కి తగ్గించడానికి అమెరికా ఒప్పుకుంది. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 10%కి తగ్గించేందుకు ముందుకు వచ్చింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య సంధి కుదరొచ్చన్న సంకేతాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. -
సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చాలామందికి గోల్డ్ కొనుగోలు చేయడం, ఇకపై సాధ్యమేనా అనే అనుమానులు కూడా పుడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సీఈఆర్ఎన్)లోని భౌతిక శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ సాధించారు.CERN విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సీస కేంద్రకాల అధిక శక్తి.. ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. స్విట్జర్లాండ్లోని జెనీవా సమీపంలోని సీఈఆర్ఎన్ ప్రయోగశాలలో సీసాన్ని బంగారంగా మార్చారు.మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల (సీసానికి 82, బంగారానికి 79) వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే అయినప్పటికీ.. కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాలలోని అయాన్లు అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనకుండా ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం.. శక్తి పల్స్ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి మూడు ప్రోటాన్లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు'సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్' అని పిలువబడే మరొక సీఈఆర్ఎన్ యాక్సిలరేటర్.. 2002 నుంచి 2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించిందని న్యూయార్క్లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త 'జియాంగ్యాంగ్ జియా' చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయి. ఈ విధానంలో బంగారాన్ని మరింత ఎక్కువ సృష్టించవచ్చని ఆయన అన్నారు.ఈ పద్దతిలోనే మరింత గోల్డ్ ఉత్పత్తి చేస్తే.. బంగారం సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గిపోతాయి. అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చేస్తుంది. -
అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,750 (22 క్యారెట్స్), రూ.99,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.500, రూ.540 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.500 పెరిగి రూ.90,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.540 పెరిగి రూ.99,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)లు కూడా భారీగానే పెరిగాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి.. మళ్లీ లక్షకు చేరువలో
న్యూఢిల్లీ: పసిడి మరోసారి ర్యాలీ చేసింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 లాభపడి రూ.99,750 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా టారిఫ్లపై చేసిన ప్రకటన, భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. జ్యుయలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.2,400 పెరిగి రూ.99,300 వద్ద స్థిరపడింది. ‘‘ట్రంప్ ఫార్మాస్యూటికల్స్పై, అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్లను ప్రతిపాదించారు. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి, అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో సురక్షిత సాధనమైన బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. బుధవారం యూఎస్ ఫెడ్ పాలసీ సమీక్ష వివరాల కోసం మార్కెట్ భాగస్వాములు ఎదురుచూస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో వెండి ధర కిలోకి రూ.1,800 పెరిగి రూ.98,500కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 3,400 డాలర్లపైకి అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. ఔన్స్కు 100 డాలర్ల వరకు పెరిగి 3,422 డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా డాలర్ బలహీనత సైతం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.