Gold
-
వరుసగా తగ్గి.. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం ధరలు
ఎండాకాలంలో వచ్చిన వానలాగా.. అలా వచ్చి ఇలా వెళ్లినట్లు, బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గి.. మళ్ళీ అమాంతం పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్ రేటు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 110 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,350 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,840 వద్ద ఉంది.ఇదీ చదవండి: జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వందేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (మార్చి 27) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నటి రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు.. సొంతపార్టీ ఎమ్మెల్యేకి బీజేపీ షాక్!
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ (Basanagouda Patil Yatnal)పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ వచ్చారు. ఇటీవలే, బెంగళూరులో బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. Karnataka BJP MLA Basangouda Patil Yatnal-"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session. I have complete information about her relationships and how the gold was brought in.She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025 కొన్ని వారాల క్రితం మాజీ సీఎం యడియూరప్పపై విమర్శలు చేశారు. ఆయన తన కుమారుడు బి.వై విజయేంద్రపై కాకుండా పార్టీపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాదు, బీ.వై.విజయేంద్ర కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతేడాది డిసెంబర్లో 32 జిల్లా అధ్యక్షులు యత్నాళ్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ నాయకత్వం ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. -
జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వం: బ్యాంకులు మాత్రం..
బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా బుధవారం నుంచి 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' (GMS)ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. బ్యాంకులు తమ స్వల్పకాలిక గోల్డ్ డిపాజిట్ పథకాలను (1-3 సంవత్సరాలు) కొనసాగించవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది.పసిడి దిగుమతులపై దేశం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.. గృహాలు, సంస్థలు తమ బంగారాన్ని ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని 2015 సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నవంబర్ 2024 వరకు 31,164 కేజీల బంగారాన్ని సమీకరించారు.నిజానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. అవి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (1-3 సంవత్సరాలు), మిడ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (5-7 సంవత్సరాలు), లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (12-15 సంవత్సరాలు).బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రభుత్వం తన మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డిపాజిట్లను నిలిపివేయాలని నిర్దారించింది. షార్ట్ టర్మ్ డిపాజిట్ల విషయాన్ని నిర్వహించడం లేదా నిర్వహించకపోవడం అనేది పూర్తిగా బ్యాంకులే నిర్ణయించుకునేలా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.ఇదీ చదవండి: ఈ పాలసీతో వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీనవంబర్ 2024 వరకు సమీకరించిన మొత్తం 31,164 కిలోల బంగారంలో.. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ కింద 7,509 కేజీలు, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభుత్వ డిపాజిట్స్ కింద వరుసగా 9728 కేజీలు, 13926 కేజీల బంగారం ఉంది. కాగా జీఎమ్ఎస్ పథకంలో ఉన్న డిపాజిటర్ల సంఖ్య 5693 మంది. -
బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?
నా బంగారం ఆభరణాలను విక్రయించాలనుకుంటున్నాను? మూలధన లాభానికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుందా? – ప్రణయ్ఇండెక్సేషన్ అంటే ద్రవ్యోల్బణానికి తగినట్టుగా కొనుగోలు ధరను సర్దుబాటు చేయడం. కానీ, బంగారు ఆభరణాలకు ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఆభరణాలను విక్రయించగా వచ్చిన లాభంపై పన్ను ఎంత చెల్లించాలన్నది.. వాటిని ఎంత కాలం పాటు కొని ఉంచుకున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. రెండేళ్లకుపైగా ఉంచుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంపై 12.5% పన్ను పడుతుంది. రెండేళ్లలోపు విక్రయిస్తే ఆ మొత్తం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఇది మీ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు మీ మొత్తం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, ఆ మేరకు పన్ను చెల్లించాలి. ఆభరణాలు వారసత్వంగా మీకు సంక్రమించినా లేక బహుమతి రూపంలో వచ్చినా.. అప్పుడు ఆ ఆభరణం కొన్న అసలు తేదీ, అప్పటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల డివిడెండ్ అప్పెట్టుబడులపై ఎలా..?గోల్డ్ ఈటీఎఫ్ల్లో 2023 ఏప్రిల్ 1, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసి.. 2025 మార్చి 31లోపు విక్రయిస్తే.. లాభం మొత్తం వార్షికాదాయానికి కలుస్తుంది. 2025 ఏప్రిల్ 1, ఆ తర్వాత విక్రయిస్తే.. హోల్డింగ్ పీరియడ్ (ఉంచిన కాలం) ఏడాదికి మించితే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఆభరణాల హోల్డింగ్ పీరియడ్ ఏడాదిలోపు ఉంటే లాభం మొ త్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఫండ్స్ లో 2023 ఏప్రిల్ 1, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసి.. 2025 మార్చి 31లోపు విక్రయిస్తే, వచి్చన లాభం వార్షి కాదాయానికి కలుస్తుంది. 2025 ఏప్రిల్ 1 తర్వాత విక్రయిస్తే, హోల్డింగ్ పీరియడ్ రెండేళ్లకు పైన ఉంటే లాభంపై 12.5% పన్ను చెల్లించాలి. ఆలోపు ఉంటే లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. -
రిలయన్స్ జ్యువెల్స్ పండుగ ఆఫర్లు
రిలయన్స్ జ్యువెల్స్ తన వినియోగదారులకు పండుగ ఆఫర్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఉగాది, మహారాష్ట్రలో గుడిపడ్వా పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారం, వజ్రాభరణాల కొనుగోలుదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.ఈ ఉత్సవాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు రిలయన్స్ జ్యువెల్స్ మార్చి 31 వరకు ప్రత్యేక పండుగ సేల్ను అందిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా కొనుగోలుదారులు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 50% వరకు, వజ్రాభరణాల విలువ, వాటి తయారీ ఛార్జీలపై 35% వరకు తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. నిర్దేశించిన తేదీలోపు దేశంలోని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్ల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్సీక్’!మహారాష్ట్రలో గుడిపడ్వా అనేది పెద్ద పండుగ. ఈ సమయంలో చాలామంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని కంపెనీ తెలిపింది. వీరికోసం ప్రత్యేక డిజైన్లలో నాథ్ (ముక్కు ఉంగరం), చంద్రకోర్ బిందీ, తుషి నెక్లెస్లు.. వంటివి అందిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా తెలుగు వారి తొలి పండుగ ఉగాదిని పురస్కరించుకొని గుట్టపూసలు, నెక్లెస్లు, లక్ష్మీ నాణెం హరాలు, కాసు మాలలు..వంటివి ప్రత్యేక డిజైన్ల్లో రూపొందించినట్లు తెలిపింది. -
బంగారం భద్రం.. రెండు రోజుల్లో ఇచ్చేస్తా
కొత్తపేట((రాజమహేంద్రవరం): రెండు రోజుల్లో తిరిగి వస్తా.. నా షాపులో తాకట్టు పెట్టిన వస్తువులు ఎవరివి వారికి తిరిగిస్తా.. అని షాపు మూసేసి పరారైన తాకట్టు వడ్డీ వ్యాపారి కూర్మదాసు హేమంత్కుమార్ తెలిపాడు. ఆ మేరకు ఆదివారం సాయంత్రం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. స్థానిక మెయిన్రోడ్డులో సత్యసూర్య బ్యాంకర్స్ (తాకట్టు వడ్డీ వ్యాపారం) నిర్వహిస్తున్న హేమంత్కుమార్ గత నెల 1, 2 తేదీల్లో షాపు మూసేసి పరారయ్యాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు గతనెల ఆ షాపు వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా హేమంత్కుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ, తాకట్టు వడ్డీ వ్యాపారంలో తనతో పాటు మరో ఇద్దరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టగా రియల్టర్ వాసు తాను నష్టపోయానని చెప్పి వెళ్లిపోయాడని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తనతో పెట్టుబడి పెట్టిన వారు చంపుతామని బెదిరించడంతో ప్రాణభయంతో పారిపోయానని, తన వద్ద తాకట్టు పెట్టిన వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయని, కరిగించలేదని పేర్కొన్నాడు. కొన్ని తన వద్ద, మరికొన్ని తన వ్యాపార భాగస్వామి సత్యప్రియ శ్రీఘాకోళ్లపు రామకృష్ణ వద్ద, వాళ్ల నాన్న వద్ద ఉన్నాయని, పోలీసుల సహకారంతో తిరిగి వచ్చి ఎవరివి వారికి అప్పగిస్తానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనకు రక్షణ కావాలని పేర్కొన్న వీడియో తాకట్టుదారులకు కొంత ఊరటనిచ్చింది. -
బంగారం వన్స్ మోర్.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మరోసారి తగ్గాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (March 24) మళ్లీ క్షీణించాయి. భారీ ధరలతో నిరుత్సాహపడిన కొనుగోలుదారులకు వరుస తగ్గుదలలు ఊరటనిస్తున్నాయి.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 82,150, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 89,620 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున దిగొచ్చాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.89,770 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,300 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.210, రూ.150 చొప్పున తగ్గాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,620 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,000 వద్ద, ఢిల్లీలో రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఒక్క రోజే వెయ్యి గోల్డ్ కార్డులు
వాషింగ్టన్: అమెరికాలో నివాసంతో పాటు అంతిమంగా పౌరసత్వానికి కూడా వీలు కల్పిస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డులకు డిమాండ్ బాగా పెరుగుతోందని వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఆల్–ఇన్ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. ‘‘ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యి గోల్డ్ కార్డులు అమ్మాం. ఒక్కోదానికి 50 లక్షల డాలర్ల చొప్పున 500 కోట్ల డాలర్లు సంపాదించాం’’అంటూ సంబరపడిపోయారు.డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో అగ్ర రాజ్యం ఫక్తు వ్యాపార రాజ్యంగా మారిపోతోందన్న వాదనలకు బలం చేకూర్చేలా మాట్లాడారు. ‘‘గోల్డ్ కార్డులు పూర్తిగా ట్రంప్ ఆలోచనే. దాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యమున్న వారు ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మంది ఉన్నారు. కనుక 10 లక్షల కార్డులమ్మి 5 లక్షల కోట్ల డాలర్లు సమీకరించడమే ట్రంప్ లక్ష్యం’’అంటూ ప్రకటించారు. మంత్రి వాటిని ట్రంప్ కార్డులుగా సంబోధించడం విశేషం.వాటిని కొనేందుకు 2.5 లక్షల మంది ఇప్పటికే ఆసక్తి చూపారని కూడా ఆయన వెల్లడించారు. గోల్డ్ కార్డు అమ్మకాలను మరింత పెంచేందుకు వాటి పేరును ట్రంప్ కార్డ్గా మార్చే ఆలోచన ఉన్నట్టు అధ్యక్షుడు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో గోల్డ్ కార్డును ప్రవేశపెడుతూ ఆయన నెల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రస్తుతం ఏకంగా 36.1 ట్రిలియన్ డాలర్ల రుణభారంతో కునారిల్లుతోంది. గోల్డ్కార్డుల ద్వారా దాన్ని ఎంతో కొంత తగ్గించుకోవాలన్నది ట్రంప్ యోచన. -
ఊహించని రీతిలో.. మరోమారు తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు పెరుగుదలకు బ్రేక్ పడింది. వరుసగా రెండో రోజు గోల్డ్ రేటు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,980 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు కూడా వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,300 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,980 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,450 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,980 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 22) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,100 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: చాహల్తో విడాకులు.. ధనశ్రీ వర్మకు రూ.4.75 కోట్లు: ఇందులో ట్యాక్స్ ఎంత? -
Gold Prices: పసిడి పరుగులు
-
ఉన్నట్టుండి తగ్గిన బంగారం ధరలు
మూడు రోజుల ధరల పెరుగుదల తరువాత.. గోల్డ్ రేటు ఉన్నట్టుంది తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,220 వద్ద నిలిచాయి. నిన్న రూ. 200, రూ. 220 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,220 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 90,370 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 21) కేజీ సిల్వర్ రేటు రూ. 1,12,100 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,03,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..! -
’గోల్డెన్ డేస్’ ఆగని రేస్!
సాక్షి, స్పెషల్ డెస్క్: పుత్తడి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ‘గోల్డెన్ డేస్’ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం రేటు 3,000 డాలర్లు దాటింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఔన్స్ పసిడి ధర 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు.. అంటే కేవలం 7 నెలలు మాత్రమే పట్టడం. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. అంటే దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు. దీనినిబట్టి పుత్తడి పరుగు ఏ స్థాయిలో వేగం అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే తదుపరి రికార్డు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర 4,000 డాలర్లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold Price) గురువారం రూ.91,650 పలికింది. ఈ నెల 19న రూ.91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. రికార్డులే రికార్డులు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాల ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్–టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా 500 డాలర్ల మార్కును తాకింది. ఆ తదుపరి 500 డాలర్లకు.. అంటే 1,000 డాలర్ల స్థాయిని 2008 మార్చిలో చేరుకుంది. 2011 ఏప్రిల్లో 1,500 డాలర్లకు, 2020 ఆగస్టులో 2,000 డాలర్లు, 2024 ఆగస్టులో 2,500 డాలర్ల మార్కును తాకింది. 500 నుంచి 1,000 డాలర్లను చేరుకోవడానికి 834 రోజులు పట్టింది. అక్కడి నుంచి 1,500 డాలర్లకు 1,132 రోజులు, 1,500 నుంచి 2,000 డాలర్లకు 3,394 రోజుల సమయం తీసుకుంది. 2,000 నుంచి 2,500 డాలర్లను అందుకోవడానికి 1,473 రోజులు పట్టింది. సురక్షితమైన ఆస్తిగా బంగారం పుత్తడి 3,000 డాలర్ల కంటే అధిక ధర వద్ధ స్థిరంగా ఉంటే అదనపు కొనుగోళ్లు ధరను మరింత ప్రేరేపించవచ్చని డబ్ల్యూజీసీ జోస్యం చెబుతోంది.కన్సాలిడేషన్కూ అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారని వివరించింది. గతంలో ప్రతి అదనపు 500 డాలర్ల మార్కును చేరుకున్న తరువాత సగటున తొమ్మిది రోజుల తరువాతే పుత్తడి ధర వెనక్కి వచ్చిందని, అయితే అయిదింటిలో నాలుగు సందర్భాల్లో కొన్ని రోజుల్లోనే బంగారం అదే స్థాయి కంటే పైకి పుంజుకుందని తెలిపింది. భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, బలహీనమైన యూఎస్ డాలర్.. వెరసి పుత్తడిలో పెట్టుబడి డిమాండ్కు బలమైన ప్రోత్సాహకాలను అందిస్తూనే ఉందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ధర ఎగసినా డిమాండ్ తగ్గలేదు అధిక పసిడి ధరలు ఆభరణాల డిమాండ్కు ప్రతికూలతలను సృష్టించవచ్చని డబ్ల్యూజీసీ అంటోంది. ‘ఆభరణాల రీసైక్లింగ్ స్థాయిలను పెంచవచ్చు. పెట్టుబడిదారులలో కొంత లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ అంశాలు బంగారం దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇచ్చే విస్తృత ఆర్థిక, ఆర్థిక చోదకాలను అధిగమించే అవకాశం లేదు’ అని వివరించింది. 2024లో పుత్తడి ధర 27 శాతం ఎగిసినా డిమాండ్ తగ్గలేదు. భారత్లో 808.8 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగాయి. -
గోల్డ్.. నాన్ స్టాప్ ర్యాలీ
న్యూఢిల్లీ: పసిడి నాన్ స్టాప్ ర్యాలీ చేస్తోంది. బుధవారం మరో రూ.700 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు 91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. వివాహాల సీజన్కు ముందు జ్యుయలర్లు భారీ కొనుగోళ్లకు దిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. దీనికితోడు మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ఎగిసిపడడంతో ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.700 పెరిగి రూ.91,500కు చేరుకుంది. మరోవైపు వెండి సైతం కొత్త రికార్డు నమోదు చేసింది. కిలోకి రూ.1,000 పెరగడంతో రూ.1,03,500 జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ పసిడి కాంట్రాక్ట్ (10 గ్రాములు) రూ.288 పెరిగి రూ.89,000 మార్క్ను దాటేసింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్స్ ధర ముందురోజుతో పోల్చి చూస్తే పెద్దగా మార్పు లేకుండా 3,038 డాలర్ల వద్ద ఉంది. ఇంట్రాడేలో 3,045.39 డాలర్ల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆసియా మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర 3,052.31 డాలర్లను తాకింది. అప్ ట్రెండ్ కొనసాగుతోంది..బంగారం ధరలు అప్ట్రెండ్లో ఉన్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. ఫెడ్ పాలసీ ప్రకటన ముందు ఒక పరిధిలో ట్రేడ్ అయినట్టు చెప్పారు. యూఎస్ ఫెడ్ పాలసీ కోసం ట్రేడర్లు వేచి చూస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ సైతం తెలిపారు. ఇదీ చదవండి: ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐఈ ఏడాది చివరికి 4,000 డాలర్లు...అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సెంట్రల్ బ్యాంక్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ వంటి అంశాలతో 2025 చివరికి బంగారం ఔన్స్కు 4,000 డాలర్ల స్థాయిని చేరుకోవచ్చని కమోడిటీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇక్కడ మరో 25 శాతం మేర బంగారం ధరలు పెరిగేందుకు అవకాశాలున్నాయన్నది వారి విశ్లేషణ. ఈ ప్రకారం చూస్తే రూపాయిల్లో బంగారం 10 గ్రాములకు రూ.1.14 లక్షలకు చేరుకోవచ్చని తెలుస్తోంది. -
రూ.91,000 దాటిన బంగారం
న్యూఢిల్లీ: పసిడి మరో కొత్త గరిష్టాన్ని తాకింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.500 లాభపడడంతో రూ.91,250 స్థాయికి చేరింది. అంతకుముందు రోజు సైతం బంగారం రూ.1,300 ర్యాలీ చేయడం తెలిసిందే. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.450 లాభపడి రూ.90,800 స్థాయికి చేరింది. ‘‘అంతర్జాతీయ మార్కెట్తోపాటు దేశీ మార్కెట్లోనూ బంగారం రికార్డు నూతన గరిష్టాలను తాకింది.యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఇటీవలి అమెరికా ఆర్థిక గణాంకాలు సైతం యూఎస్ ఫెడ్ ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువసార్లు వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలను పెంచినట్టు చెప్పారు. ఇది కూడా బంగారానికి మద్దతునిచ్చేదిగా పేర్కొన్నారు.మరోవైపు ఢిల్లీ మార్కెట్లో వెండి కిలో ధర ఫ్లాట్గా రూ.1,02,500 వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టు (10 గ్రాములు) రూ.649 లాభపడి రూ.88,672కు చేరుకుంది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్స్కు 40 డాలర్లు లాభపడి 3,047 డాలర్ల నూతన గరిష్టాలకు చేరుకుంది. అమెరికాలో మాంద్యం రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో బంగారం రికార్డు గరిష్టాలకు చేరినట్టు అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. -
Gold Smuggling: తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అరెస్ట్
-
తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
దేశంలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,560 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.110 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,560 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,710 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఈ రోజు (మార్చి 16) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,900 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
అమాంతం పెరిగి.. తగ్గిన బంగారం: నేటి ధరలు ఇవే..
హొలీ రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు (మార్చి 15) స్వల్పంగా తగ్గించి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,670 వద్ద నిలిచాయి. నిన్న రూ.1,100, రూ.12,00 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.110 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,670 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,820 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. ఈ రోజు (మార్చి 15) కేజీ సిల్వర్ రేటు రూ. 1,12,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,3000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: ఫ్రెషర్లకు డిమాండ్.. ఐటీలో నియామకాలు డబుల్ -
చరిత్రలో తొలిసారి... పసిడి @ 3,000 డాలర్లు
న్యూయార్క్: కొన్నేళ్లుగా నిరవధికంగా మెరుస్తున్న పసిడి తాజాగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లలో తొలిసారి ఔన్స్(31.1 గ్రాములు) 3,000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. తద్వారా వారాంతాన సైతం బులియన్ మార్కెట్ కళకళలాడుతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజీ(కామెక్స్)లో 3 శాతం బలపడి 3,001 డాలర్లకు చేరింది. ఒకానొక దశలో 3,017 డాలర్ల గరిష్టాన్ని కూడా తాకింది. ఈ ప్రభావం దేశీయంగా నేడు(శనివారం) ఆభరణ మార్కెట్లో ప్రతిఫలించనున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి తరతరాలుగా రక్షణాత్మక పెట్టుబడి సాధనంగా తళతళలాడుతున్న బంగారం మరోసారి ప్రపంచ అనిశ్చి తులలో బలాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశాయి. గత 25ఏళ్లలో చూస్తే పసిడి 10 రెట్లు జంప్చేసింది. తద్వారా యూఎస్ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ ఎస్అండ్పీ–500ను సైతం మించి ర్యాలీ చేయడం గమనార్హం. ర్యాలీ తీరిలా గోల్డ్ ఔన్స్ ధర తొలుత 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి 1,000 డాలర్ల మార్క్ను అధిగమించింది. తదుపరి కరోనా మహమ్మారి కాలంలో 2,000 డాలర్ల మైలురాయిని తాకింది. తిరిగి 2023, 2024లలో పరుగందుకుంది. ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్లకు బదులుగా బంగారాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేస్తుండటం ధరల నిరంతర ర్యాలీకి దోహదపడుతున్నట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. గతేడాది చివర్లో యూఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ ఎన్నికయ్యాక పసిడి మరింత దూకుడు చూపుతోంది. 2024లో 26 శాతం బలపడగా.. 2025లోనూ ఇప్పటివరకూ 14%పెరగడం విశేషం!20 ట్రిలియన్ డాలర్లుగత మూడేళ్లుగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు పుత్తడిలో కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో 2022, 2023, 2024లో 1,000 మెట్రిక్ టన్నులు చొప్పున సొంతం చేసుకున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్ విలువ 20.2 ట్రిలియన్ డాలర్లను తాకగా.. గత 13 నెలల్లోనే 7 ట్రిలియన్ డాలర్ల విలువ జత కలిసింది. యూఎస్ లిస్టెడ్ టాప్–10 దిగ్గజాలు యాపిల్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా తదితరాల మార్కెట్ విలువసహా.. బిట్కాయిన్, సిల్వర్ను సైతం పరిగణిస్తే మొత్తం విలువ 19.6 ట్రిలియన్ డాలర్లు మాత్రమే! -
Ranya Rao : మరో బిగ్ షాక్.. రన్యారావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు (Ranya Rao) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో అక్రమంగా బంగారం (Gold) తరలిస్తూ పట్టుబడిన రన్యా రావుకు బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) ఆమెకు బెయిల్ తిరస్కరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు బెంగళూరు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె వెనక గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఉందనే అనుమానం వ్యక్తం చేసింది. .డీఆర్ఐ అధికారుల విచారణ ముమ్మరంఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్టులో రూ.12.56కోట్లు విలువైన గోల్డు బార్స్ని స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI)దర్యాప్తు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రన్యారావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.06కోట్లు విలువ చేసే బంగారం, రూ.2.67కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు కేసులో భర్త?ఈ క్రమంలో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సైతం కేసు విచారణ చేపట్టారు. రన్యా రావు తన భర్త జతిన్ హుక్కేరి క్రెడిట్ కార్డును ఉపయోగించి బెంగళూరు నుండి దుబాయ్కు రౌండ్ ట్రిప్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అతని పాత్ర ఎంత? అనే దిశగా విచారణ ప్రారంభించారు. రన్యారావు భర్తకు తాత్కాలిక ఊరటడైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) బెంగళూరులోని హుక్కేరికి చెందిన పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు తనని అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం హుక్కేరీని అరెస్ట్ను తాత్కాలికంగా నిలిపివేసింది.రన్యారావుకు ఫోన్ చేసింది ఎవరు?డీఆర్ఐ విచారణలో రాన్యా రావుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. సదరు అగంతకులు రన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని ఆదేశించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రన్యారావును విచారించగా.. యూట్యూబ్లో చూసి బంగారం అక్రమంగా ఎలా తరలించాలో నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇక ఆమెను దుబాయ్ ఎయిర్పోర్టులో టెర్మినల్ 3 aగేటు సమీపంలో ఓ వ్యక్తి వద్ద గోల్డ్ను తీసుకున్నానని, అంతకుముందు గోల్డ్ స్మగ్లింగ్ చేయలేదని చెప్పినట్లు సమాచారం. -
స్మగ్లింగ్ ఇదే మొదటిసారి!
బనశంకరి: బంగారం తీసుకు రావడం ఇదే మొదటిసారి.. అని విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన రన్య రావు(Ranya Rao) డీఆర్ఐ అధికారుల విచారణలో చెప్పింది. మార్చి 1వ తేదీన నాకు విదేశీ ఫోన్ నంబరు నుంచి కాల్ వచ్చింది. రెండు వారాలుగా గుర్తుతెలియని విదేశీ నంబర్ల నుంచి అనేక కాల్స్ వస్తున్నాయి. దుబాయ్ విమానాశ్రయం టెర్మినల్ మూడోగేట్–ఏ కు వెళ్లాలని సూచించారు. అక్కడ బంగారం తీసుకుని బెంగళూరుకు తీసుకెళ్లాని చెప్పారు. మార్చి 3వ తేదీన దుబాయ్లో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తి 17 బంగారు బిస్కెట్లు ఉన్న బాక్సు ఇచ్చాడు. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లిన తరువాత టోల్గేటు దాటి సర్వీస్ రోడ్డులో ఆటో నిలిచి ఉంటుంది. అందులో ఉండే వ్యక్తికి బంగారం ఇవ్వాలని చెప్పారని ఆమె తెలిపింది. తరువాత టాయ్లెట్లోకి వెళ్లి శరీరమంతా బంగారు బిస్కెట్లు అంటించుకుని టేప్తో అతికించుకున్నాను. బెంగళూరుకు చేరుకోగానే పట్టుబడ్డానని తెలిపింది. బంగారాన్ని ఎలా తరలించాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నానని పేర్కొంది. భర్త క్రెడిట్ కార్డుతో టికెట్లు ఫోన్ చేసిన వ్యక్తులు ఆఫ్రికన్, అమెరికన్ భాషల్లో మాట్లాడారని రన్య చెప్పింది. తన భర్త జతిన్ విజయ్కుమార్ క్రెడిట్కార్డు ద్వారా విమాన టికెట్లు బుక్ చేశానని రన్య చెబుతోంది. ఫోటోగ్రఫీ, రియల్ఎస్టేట్ పనులపై నేను అప్పుడప్పుడు యూరప్, అమెరికా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లానని తెలిపింది. రన్య చెప్పేది నమ్మశక్యంగా లేదని డీఆర్ఐ అనుమానిస్తోంది. ఆమె మొబైల్, ల్యాప్టాప్లో స్మగ్లింగ్ సంబంధాలు లభించాయని సమాచారం. మరోవైపు తనపై మీడియాలో వ్యతిరేక వార్తలు రాయకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టులో అర్జీ వేశారు.Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ -
దడ పుట్టిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,650 (22 క్యారెట్స్), రూ.87,980 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 పెరిగి రూ.80,800కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.490 పెరిగి రూ.88,130 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నట్లు వెండి ధరల్లోనూ బుధవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) మంగళవారంతో పోలిస్తే రూ.2000 పెరిగి రూ.1,09,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కూతురి స్మగ్లింగ్లో డీజీపీ పాత్ర ఉందా?
బనశంకరి: నటి రన్య రావు పెంపుడు తండ్రి, రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీజీపీ రామచంద్రరావు చిక్కుల్లో పడ్డారు. రన్యకు బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఇవ్వడం గురించి విచారణ చేపట్టి వారంలోగా నివేదిక అందించాలని హోంశాఖను సర్కారు ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ లో ఆయన కుమ్మక్కయ్యారా, ప్రోటోకాల్ దుర్వినియోగానికి పాల్పడడం వెనుక ఆయన హస్తం ఉందా అనే దానిపై వారంలోగా విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. నటి రన్య తన ప్రయాణాల్లో రామచంద్రరావు పేరును విరివిగా వాడుకున్నారు. రన్య కేసు శాసనసభ సమావేశాల్లో తీవ్ర చర్చకు రావడం తెలిసిందే. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రతిపక్ష బీజేపీ మండిపడడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. రన్య ప్రోటోకాల్పై నివేదిక మరోపక్క రన్య రావు ప్రోటోకాల్ దుర్వినియోగం పట్ల పోలీస్ కమిషనర్ దయానంద్కు డీసీపీ నివేదిక అందజేశారు. రన్య రావ్ అరెస్టైనరోజు ప్రోటోకాల్లో ఉన్న కానిస్టేబుల్ బసవరాజుకు ఆమె కాల్ చేసి విమానాశ్రయంలో టెరి్మనల్ వన్ వద్దకు రావాలని తెలిపింది. ఇప్పుడు రాలేను మేడం, వేరే ఆఫీసర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అని బసవరాజు చెప్పాడు. నువ్వే రావాలి లేకపోతే, అప్పాజీ కి చెబుతానని రన్య హెచ్చరించినట్లు నివేదికలో ప్రస్తావించారు. పోలీస్ స్టిక్కర్ వాడొద్దు: హోంమంత్రి దొడ్డబళ్లాపురం: పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సొంత వాహనాలపై పోలీస్ అనే స్టిక్కర్లు వేసుకోవడం మామూలే. ఇది ఏ మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా చట్టాన్ని , నిబంధనలను ఉల్లంఘించడమేనని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పారు. 2022 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇలా స్టిక్కర్లు వేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. శ్రవణబెళగోళ ఎమెల్యే సీఎస్ బాలక్రిష్ణ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు తెలిపారు. రన్య అరెస్టు వెనుక...బనశంకరి: బంగారం దొంగరవాణా కేసులో నటి రన్య రావు పట్టుబడటం వెనుక ఆమె భర్త, ఢిల్లీలో అరెస్టైన ఇద్దరు స్మగ్లర్లు, పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జతిన్ హుక్కేరి అనే వ్యక్తితో రన్యకు బెంగళూరులో ఆర్భాటంగా వివాహం జరిగింది. కానీ వారి మధ్య గొడవలు వచ్చాయి. రన్య పదేపదే విదేశాలకు వెళ్లడం గురించి భర్త ప్రశ్నించేవాడు. ఆయనే డీఆర్ఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. కొన్నిరోజుల కిందట ఢిల్లీలో డీఆర్ఐ అధికారులకు ఇద్దరు స్మగ్లర్లు దొరికారు. రన్య అనే యువతి కూడా బంగారం దొంగ రవాణా చేస్తోందని ఉప్పందించారు. దీంతో ఢిల్లీ నుంచి బెంగళూరు డీఆర్ఐ విభాగానికి అలర్ట్ వచ్చింది. 3వ తేదీ రాత్రి రన్య బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే అదుపులో తీసుకున్నారు. రన్య అంటే పడని బంగారు వ్యాపారులు, ఓ మంత్రి కూడా సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. 28 సార్లు విదేశీ ప్రయాణం నటి రన్య కేసులో తరుణ్రాజు అనే వ్యక్తి అరెస్టు కావడం బెంగళూరులో చర్చనీయాంశమైంది. రన్య వెనుక తరుణ్రాజు ఉన్నాడని తెలుస్తోంది. బెంగళూరు కు బంగారం తెప్పించి హవాలా ద్వారా దుబాయికి డబ్బు పంపించేవారు. రన్య ఖర్చులన్నింటినీ తరుణ్రాజు చూసుకునేవాడు. ఐపీఎస్ అధికారి కూతురు కావడంతో రన్య ద్వారా సులభంగా బంగరాన్ని తెప్పించవచ్చని గుర్తించాడు. రన్య ఒక ఏడాదిలో 28 సార్లు విదేశీ పర్యటనలు చేసింది. గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్కి వెళ్లి వచ్చింది. ఐదోసారి దుబాయ్కి వెళ్లి వస్తుండగా జాతకం మారిపోయింది. -
Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెపై డీఆర్ఐ అధికారులకు ఆమె భర్తే జతిన్ హుక్కేరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలల నుంచి తరచు విదేశాలకు వెళ్తోంది. ఆమె విదేశీ టూర్లతో నిత్యం గొడవలు జరిగేవి.ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో తన భర్త రన్యారావు డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రన్యారావు కదలికలపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు.. ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్కు వెళ్లడంకన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్ డ్రెస్ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇకపోతే రన్యా రావు తండ్రి కర్ణాటక డీజీపీ డాక్టర్ కే.రామచంద్రారావు పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నొవేషన్ కోర్సు చదివాడు. తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్గా పని చేశాడు. లండన్లోనూ ఆర్కిటెక్ట్గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సినిమారన్యా రావు.. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్గా తెరకెక్కింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. -
కన్నడ నటి రన్యా రావ్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
-
దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు?
కన్నడ నటి 'రన్యా రావు' 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దుబాయ్ బంగారం ధరల గురించి చర్చ మొదలైంది. ఇంతకీ దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావాలి?, ఎక్కువ తీసుకురావాలనే ఏమైనా రూల్స్ పాటించాలా? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.భారతదేశంతో పోలిస్తే.. దుబాయ్కు బంగారం ధరలు తక్కువగా ఉంటాయని, చాలామంది అక్కడ నుంచి ఇండియాకు బంగారం తీసుకొస్తూ ఉంటారు. అక్కడ గోల్డ్ రేటు తక్కువగా ఉండటానికి కారణం.. అక్కడ ఆభరణాలపై జీఎస్టీ లేకపోవడం, తయారీ ఛార్జీలు తక్కువగా ఉండటమే.భారతదేశంలోకి బంగారాన్ని తీసుకురావడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నిర్ణయించిన రూల్స్ తప్పకుండా పాటించాల్సిందే. లేకుంటే రన్యా రావు మాదిరిగా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. విదేశాల నుంచి మన దేశానికి బంగారాన్ని తీసుకురావాలంటే.. దిగుమతి సుంకం చెల్లించాలి. ఈ ట్యాక్స్ ఇప్పుడు 6 శాతం వద్ద ఉంది. ఈ సుంకం నుంచి తప్పించుకోవడానికే.. చాలామంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తుంటారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకారం.. దుబాయ్లో ఆరు నెలల (1967 పాస్పోర్ట్ చట్టం) కంటే ఎక్కువ సమయం ఉండి, కస్టమ్స్ డ్యూటీ చెల్లించినవారు.. తమ బ్యాగేజీలో ఒక కేజీ వరకు బంగారం తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ బంగారం తీసుకురావాలనుంటే.. ట్యాక్స్ చెల్లించిన బంగారం అని నిరూపించి తీసుకురావాల్సి ఉంటుంది. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: జీఎస్టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనకస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా.. పురుషులు 20 గ్రా, మహిళలు 40 గ్రా తెచ్చుకోవచ్చు. అయితే వీరు తెచ్చుకునే బంగారం.. గోల్డ్ బార్లు, కాయిన్స్ రూపంలో ఉండాలి. అయితే 15 ఏళ్లలోపు పిల్లలకు 40 గ్రా పరిమితి ఉంది. వీరికోసం కొనుగోలు చేసే బంగారం.. నగలు, గిఫ్ట్స్ రూపంలో ఉండాలి. కస్టమ్స్ డ్యూటీ వెరిఫికేషన్ సమయం.. బంగారం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను చూపించాల్సి ఉంటుంది. పిల్లలకు అయితే.. తల్లితండ్రులు లేదా గార్డియెన్లకు సంబంధించిన ఐడీ కార్డు ఉండాలి.బంగారం ధరలుభారతదేశంలో ఈ రోజు (మార్చి 10) 24 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 87820, 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 80,500గా ఉంది. దుబాయ్లో 10 గ్రా బంగారం విలువ 3,260 AED (దుబాయ్ కరెన్సీ). భారతీయ కరెన్సీ ప్రకారం రూ.77,281.46. అంటే ఇండియాకు.. దుబాయ్కు బంగారం విలువ తేడా సుమారు రూ. 3000. ఈ కారణంగానే చాలా మంది దుబాయ్ నుంచి బంగారం కొనుగోలు చేస్తారు. -
Ranya Rao : రన్యారావు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికి పోయిన కన్ననటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు సంస్థకు గత బీజేపీ ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది.2023 జనవరిలో ఈ కేటాయింపులు జరిగినట్లు కర్ణాటక పారిశ్రామిక బోర్డ్ బయటపెట్టింది. తుముకూరు జిల్లాలో సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ భూమి కేటాయించింది అప్పటి బసవరాజు బొమ్మై సర్కార్. రూ.138కోట్ల పెట్టుబడితో స్టీల్ టీఎంటీ బార్స్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాను అని రన్యారావు సంస్థ ధరఖాస్తు చేసుకోగా సింగిల్ విండో కమిటీ ఆమోదం తెలిపింది. -
కస్టడీలో రన్యా రావు.. కన్నీళ్ల పర్యంతమైన నటి!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న ఆమెను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి దాదాపు 14 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రన్యారావును అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్కు పంపించారు. ప్రస్తుతం రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇవాళ డీఆర్ఐ అధికారుల ముందు విచారణకు హాజరైన రన్యారావు కన్నీళ్ల పర్యంతమైంది. అసలు ఇందులోకి ఎందుకు వచ్చానో అంటూ తన న్యాయవాదులతో అన్నారు. నిద్రలో కూడా ఎయిర్పోర్ట్ గుర్తొస్తోందని.. అస్సలు నిద్రపట్టడం లేదని తెలిపింది. మానసికంగా కృంగిపోయానని తన లాయర్లతో రన్యా రావు చెప్పింది. విచారణ సందర్భంగా ఫుల్ ఎమోషనలైంది రన్యా రావు. మరోవైపు ఆమెపై ఇప్పటికే సీబీఐ అధికారులు కూడా కేసు నమోదు చేశారు.కాగా.. మాణిక్య సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రన్యా రావు కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. ఈ మూవీ తెలుగు సినిమా మిర్చి రీమేక్గా తెరకెక్కించారు. ఆ తర్వాత పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. బంగారు అక్రమ రవాణా చేస్తుండగా మార్చి 3న దుబాయ్ నుంచి వస్తుండగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
రన్యారావు శరీరంపై గాయాలు
-
ఇల్లే బంగారమాయె..
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే.. సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.లగ్జరీకే మొగ్గు.. లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.గోల్డ్, స్టాక్ మార్కెట్.. ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది. -
బంగారం మళ్లీ భారీగా...
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పెరుగుదల బాట పట్టాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన పసిడి ధరలు నేడు (March 8) మళ్లీ ఎగిశాయి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80,400, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,710 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,860 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,550 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.550, రూ.500 చొప్పున పెరిగాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,710 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున భారమయ్యాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,08,100 వద్ద, ఢిల్లీలో రూ. 99,100 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నటి రన్యా రావ్ స్మగ్లింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
బంగారం వరుస తగ్గుదల
దేశంలో పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) రెండు రోజులుగా కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నేడు (March 7) వరుసగా రెండో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. అంతకుముందు వరుస పెరుగుదలతో బెంబేలెత్తించిన బంగారం ధరలు ఇప్పుడు క్షీణిస్తుండటంతో పసిడి ప్రియులు కుదటపడి కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తున్నారు.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,900, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,160 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.300, రూ.330 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,310 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,050 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.330, రూ.300 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,900 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,160 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.300, రూ.330 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు రివర్స్దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా వెండి ధరల్లో మాత్రం నేడు పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,08,100 వద్దకు చేరింది. ఇక ఢిల్లీలో కేజీ వెండి రూ. 99,100 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.100 పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రన్యారావ్ పాత్రధారి మాత్రమే
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కైనట్లు అనుమానం వ్యక్తమైంది.డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం రవాణాలో రన్యారావ్కు రూ.4 లక్ష లనుంచి రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్ను అదికారులు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్ను బలవంతంగా లాక్కెళ్లి.. -
పసిడి పరుగులు.. ఇంకెంత పెరుగుతుందో?
-
బంగారంతో పట్టుబడ్డ కన్నడ హీరోయిన్
-
గోల్డ్ కేసులో ట్విస్ట్.. నటి రన్యారావు వెనక ఓ రాజకీయ నేత!?
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రన్యారావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI) ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారం ఎవరిది? అని ఆరా తీయగా.. ఆ గోల్డ్ను సదరు నేత కొనుగోలు చేసినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావుతో ఆ రాజకీయ నాయకుడే స్మగ్లింగ్ చేయించినట్లు డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకుడు,రన్యారావుల మధ్య ఒప్పందం జరిగింది. గోల్డ్ను దుబాయ్ నుంచి భారత్కు తీసుకు వస్తే కిలోలక్ష ఇస్తానని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. స్మగ్లింగ్ కోసం నటి ఒక్క ఏడాదిలో దాబాయ్కు ౩౦ సార్లు వెళ్లింది. ట్రిప్కు 12 నుంచి 14 లక్షలు సంపాదించిన ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు బంగారం కొనుగోళ్ల సంబంధించిన రసీదులను సేకరించే పనిలో పడ్డారు.మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాజకీయనాయడి హస్తం ఉందనే ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ స్పందించారు.నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరి జోక్యం ఉన్నా దర్యాప్తులో భయటపడుతుందని చెప్పారు. -
పరుగు ఆపిన పసిడి! మళ్లీ అవకాశం రాదేమో..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో(Gold Rate) మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర గురువారం కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. దాంతో ఈ పెళ్లిళ్ల సీజన్లో ఇప్పుడే బంగారం కొనాలని కొందరు సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,200 (22 క్యారెట్స్), రూ.87,490 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,490 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణువిద్యుత్కు రోడ్ మ్యాప్దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 తగ్గి రూ.80,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 తగ్గి రూ.87,640 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు గురువారం తగ్గినా వెండి ధరలు మాత్రం అందుకు విరుద్ధంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే గురువారం వెండి ధరలు(Sliver Rate) స్పల్పంగా పెంజుకున్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నాన్స్టాప్ గోల్డ్ ర్యాలీ
న్యూఢిల్లీ: బంగారం మురిపిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ల నుంచి సామాన్య ఇన్వెస్టర్ల వరకు అందరికీ పసిడిపై పెట్టుబడి కనక వర్షం కురిపిస్తోంది. 2024లో 27 శాతం రాబడితో ఇతర అన్ని సాధనాల కంటే మెరుగైన స్థానంలో నిలిచిన బంగారం.. ఈ ఏడాదీ తన జోరును కొనసాగిస్తోంది. రెండు నెలల్లోనే 12 శాతం ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2,900 డాలర్లను దాటిపోయింది. దేశీయంగా 10 గ్రాముల ధర రూ.89,000 మార్క్పైకి చేరుకుంది. జనవరి 1న రూ.79,000 స్థాయిలో ఉంది. అక్కడి నుంచి చూస్తే రూపాయి మారకంలోనూ 13 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా రాబడుల్లో బంగారమే ముందుంది. టారిఫ్ల విషయంలో ఏ దేశాన్ని విడిచి పెట్టేది లేదంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలు, వాణిజ్య యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న భయాలు, సెంట్రల్ బ్యాంకుల రెండు చేతులా కొనుగోళ్లు.. వెరసి బంగారం ధరలు ఇప్పట్లో శాంతించేలా కనిపించడం లేదు. ఎన్నో అంశాలు.. ఎక్కడైనా ధరలను నిర్ణయించేది డిమాండ్–సరఫరా అన్న విషయం తెలిసిందే. బంగారం ఉత్పత్తి గడిచిన కొన్నేళ్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. కానీ, అదే సమయంలో డిమాండ్ మాత్రం అనూహ్యంగా పెరిగింది. ఆభరణాలు, పెట్టుబడులు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల రూపంలో పసిడికి బలమైన డిమాండ్ కొనసాగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్త డిమాండ్లో 50 శాతం ఆభరణాల రూపంలోనే ఉంది. టెక్నాలజీ, పారిశ్రామిక రంగం వినియోగం 5 శాతంగా ఉంది. 25 శాతం పెట్టుబడుల రూపంలో, మరో 20 శాతం సెంట్రల్ బ్యాంక్ల కొనుగోళ్లు రూపంలో డిమాండ్ నెలకొంది. కొన్ని సందర్భాల్లో ఆభరణాల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఆభరణాల డిమాండ్లో చైనా, భారత్ బలమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంత డిమాండ్?కాలం గడిచేకొద్దీ బంగారం విలువ పెరిగేదే కానీ (స్టోర్ ఆఫ్ వ్యాల్యూ) తరిగేది కాదు. ద్రవ్యోల్బణ ప్రభావానికి మించి దీర్ఘకాలంలో తన విలువను పెంచుకుంటుందని చరిత్ర చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్లు తమ విదేశీ మారకం ఆస్తుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారానికి ప్రాతినిధ్యాన్ని పెంచడం ఇందు వల్లే. 20 ఏళ్ల క్రితం ఔన్స్ బంగారంతో కొనుగోలు చేసుకోతగిన వస్తువులను.. నేడు కూడా ఔన్స్ బంగారంతో కొనుగోలు చేసుకోవచ్చు. కరెన్సీ విషయంలో అది అసాధ్యం. ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమంలో కరెన్సీ విలువ తగ్గుతుంటుంది. దీనికి విరుద్ధంగా పసిడి విలువ పెరుగుతుంది. అందుకే దీన్ని హెడ్జింగ్ సాధనంగా, ఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుంటారు. 2001 సెపె్టంబర్ 11 ఉగ్రదాడి, 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయాల్లో ఇన్వెస్టర్లు స్టాక్స్, ఇతర సాధనాల కంటే బంగారంలో పెట్టుబడులకే మొగ్గు చూపించారు. కానీ, ఇలాంటి అనిశ్చితుల్లో బంగారం ధరలు తాత్కాలికంగా ర్యాలీ చేసి, పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న సంకేతాలు కనిపించగానే మళ్లీ చల్లబడుతుంటాయి. ఈ విడత పరిస్థితులు భిన్నం..కానీ, కరోనా విపత్తు తర్వాత నుంచి చూస్తే.. పసిడి ధరలు పెద్దగా పడిపోకుండా స్వల్ప విరామంతో ర్యాలీ చేస్తుండడాన్ని గమనించొచ్చు. కరోనా సమసిపోయిందనుకుంటున్న తరుణంలో.. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడం పరిస్థితులను మార్చేసింది. రష్యా చర్యను వ్యతిరేకిస్తూ విదేశాల్లో రష్యాకు ఉన్న ఫారీన్ గవర్నమెంట్ బాండ్ హోల్డింగ్స్ను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేశాయి. అంటే రష్యా సెంట్రల్ బ్యాంక్ విదేశీ మారకం ఆస్తుల్లో ఈ మేరకు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది భారత్, చైనా సహా పలు సెంట్రల్ బ్యాంక్లకు కనువిప్పు కలిగించింది. దీంతో బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకోవడం మొదలుపెట్టాయి. ఫలితంగా 2022లో 1,082 టన్నుల బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్లు కొనుగోలు చేశాయి. అంతటితో ఆగలేదు. 2023లోనూ మరో 1,051 టన్నులు, 2024లో 1,041 టన్నుల చొప్పున బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్లు అదనంగా సమకూర్చుకున్నాయి. యూఎస్ డాలర్లకు ఇంతకాలం అధిక ప్రాధాన్యం ఇచి్చన సెంట్రల్ బ్యాంక్లు, ప్రస్తుతం బంగారానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాయి. ఇంతకుముందుతో పోల్చితే కరెన్సీ విలువల్లో ఆటుపోట్లు పెరిగాయి. కరెన్సీ అస్థితరలకు హెడ్జింగ్గా బంగారాన్ని పరిగణిస్తుంటారు. ఈ పరిణామాలన్నీ సెంట్రల్ బ్యాంకులు బంగారానికి వెయిటేజీ పెంచడానికి దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. -
అక్రమ బంగారంతో దొరికిపోయిన హీరోయిన్.. ఏకంగా డీజీపీ కూతురేనట!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్పోర్ట్లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంతకీ ఎవరు ఈ రాన్యా రావు అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఆమె డీజీపీ కూతురు అని చెప్పడంతో పలువురు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలేంటో మీరు చూసేయండి.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్వుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది. 2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్కి రీమేక్గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు.డీజీపీ కూతురే రాన్యా రావ్..మరోవైపు రన్యా రావు డీజీపీ కూతురు అని తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా ఉన్న ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె అని సమాచారం. -
ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై నిబంధనలు కఠినతరం
విలువైన లోహాలపై దిగుమతి సుంకం ఎగవేతను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 99 శాతం స్వచ్ఛత కలిగినవి మినహా ప్లాటినం అల్లాయ్ దిగుమతులు ఇక నుంచి నియంత్రిత కేటగిరీ కిందకు వస్తాయని ప్రకటించింది. దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు కొంతమంది దిగుమతిదారులు బంగారం ఉత్పత్తులను ప్లాటినం అల్లాయ్గా మారుస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్ చాలా కాలంగా దిగుమతి సుంకాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై స్పష్టమైన వర్గీకరణ ఉండడం ద్వారా ప్రభుత్వం వాణిజ్య పద్ధతులపై నియంత్రణను కఠినతరం చేసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ప్లాటినం మిశ్రమ దిగుమతులను ‘ఉచితం’గా వర్గీకరించారు. అంటే ఇది సాపేక్షంగా నియంత్రణ లేని వాణిజ్యానికి అనుమతిస్తుంది. అయితే, దీన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలున్నాయి. దాంతోపాటు ఇటీవల కాలంలో బంగారం ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు అధికమవుతుండడంతో వాటిని ప్లాటినం అల్లాయ్లుగా మార్చి వాణిజ్యానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.ఈ చర్యలు బంగారు నగలు, విలువైన లోహాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. 99 శాతం స్వచ్ఛత కలిగినవి మినహా ప్లాటినం అల్లాయ్ దిగుమతులు ఇక నుంచి నియంత్రిత కేటగిరీ కిందకు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పన్ను ఎగవేతను అరికట్టే ప్రయత్నాలు చేపడుతోంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు మారాల్సిన అవసరాన్ని ఇది చర్చ నొక్కి చెబుతుంది. పరిశ్రమ వ్యూహాలను ఎప్పటికప్పుడు పునఃసమీక్షిస్తూ మందుకుసాగాలని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..ప్రభుత్వ చర్యల ప్రభావం ఇలా..సుంకాల ఎగవేతను అరికట్టడం: అధిక దిగుమతి సుంకాలను దాటవేసేందుకు దిగుమతిదారులు బంగారం ఉత్పత్తులను ప్లాటినం అల్లాయ్గా మలచకుండా నిరోధించడమే ఈ విధానం లక్ష్యం. ఈ లొసుగును కట్టడి చేయడం ద్వారా ప్రభుత్వం ఆదాయ మార్గాలను పరిరక్షించవచ్చు. న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించవచ్చు.ఆభరణాల పరిశ్రమపై ప్రభావం: ప్లాటినం మిశ్రమాలపై ఆధారపడే నగల వ్యాపారులకు ఖర్చులు పెరగడానికి ఈ చర్యలు దారితీయవచ్చు. ఇది ప్లాటినం ఆభరణాల అధిక ధరలకు అవకాశం కల్పిస్తుంది. ఇది వినియోగదారుల డిమాండ్ను ప్రభావితం చేస్తుంది.ప్రాసెసింగ్ను ప్రోత్సహించడం: ఈ చర్య ప్లాటినం మిశ్రమాల దేశీయ ప్రాసెసింగ్ను ప్రోత్సహిస్తుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. -
బెంగుళూరు ఎయిర్పోర్ట్లో కన్నడ నటి అరెస్ట్
బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కన్నడ హీరోయిన్ రాన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగుళూర్కు 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. రాన్యారావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులకు తాను డీజీపీ కూతురినంటూ రన్యారావు చెప్పినట్లు సమాచారం.తరచుగా దుబాయ్ వెళ్లే రన్యారావు.. ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్లో అనుమానంతో ఆమెను అధికారులు చెక్ చేయగా, స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, కన్నడలో సుదీప్తో మాణిక్య సినిమాలో రాన్యా నటించింది. -
మొదలైన పసిడి పరుగు: భారీగా పెరిగిన ధరలు
వారంరోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. నేడు (మార్చి 04) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 760 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 760 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 760 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.2,000 పెరిగింది. దీంతో ఈ రోజు (మార్చి 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1000 పెరిగి.. రూ. 98,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారానికి భవిష్యత్లో మరింత ఆదరణ
న్యూఢిల్లీ: పెట్టుబడులకు కీలకమైన వైవిధ్య సాధనంగా బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్ అన్నారు. బంగారం విలువను కాపాడుకునే సాధనంగానే (స్టోర్ ఆఫ్ వ్యాల్యూ) కాకుండా, ఆభరణంగా, పోర్ట్ఫోలియోకి వైవిధ్యంగా నిలస్తుందన్నారు. అప్పటికి యావ్ ప్రపంచం అంతర్జాతీయంగా ఒకే మానిటరీ వ్యవస్థకు చేరుకుంటుందన్నారు. ఐజీపీసీ–ఐఐఎంఏ బంగారం మార్కెట్ల వార్షిక సదస్సులో భాగంగా నాగేశ్వరన్ మాట్లాడారు. బంగారం ధర గతేడాది 27 శాతం మేర పెరగ్గా, ఈ ఏడాది ఇప్పటికే 12 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విలువను కాపాడుకునే సాధనంగా బంగారం పాత్రను పలుచన చేయకుండానే, బంగారం నిల్వలను ఉత్పాదకత పెంపునకు వినియోగించడానికి మార్గాలను భారత్ కొనుగొనాల్సి ఉందన్నారు. ఇక్కడే విధానపరమైన సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు. గతంలో మాదిరి బంగారం మానిటైజేషన్ (నగదుగా మార్చుకోవడం) తరహా చర్యలను పరిశీలించాలన్నారు. 2015లో బంగారం మానిటైజేషన్ పథకాన్ని కేంద్రం ప్రకటించడం గమనార్హం. బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా దానిపై వడ్డీని పొందే పథకం అది. దిగుమతులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర నాడు దీన్ని తీసుకొచి్చంది. ఆ తర్వాత కొన్నాళ్లకే మరుగునపడింది. రుణ భారం మరింత పెరిగితే కష్టమే.. నేడు ప్రపంచ రుణ భారం జీడీపీతో పోల్చితే ఎన్నో రెట్లకు పెరిగిందని అనంతనాగేశ్వరన్ తెలిపారు. ‘‘ఆ స్థాయి అధిక రుణ భారం తలనొప్పిగా మారుతుంది. భవిష్యత్ ఆదాయం వడ్డీ చెల్లింపులకే వెళుతుంది. అభివృద్ధికి పెద్దగా మిగిలేది ఉండదు. అధిక రుణ భారం నేపథ్యంలో దేశాలు ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించుకుని రుణం విలువను తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు’’అని నాగేశ్వరన్ పేర్కొన్నారు. -
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
నాలుగు రోజులు వరుసగా బంగారం ధరలు తగ్గిన తరువాత.. ఈ రోజు (మార్చి 3) స్థిరంగా ఉన్నాయి. దీంతో పసిడి ధరలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు స్థిరంగా ఉన్నాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద నిలిచాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. నిన్న మాదిరిగానే.. ఈ రోజు కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది.చైన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,620 వద్ద ఉంది.ఇదీ చదవండి: రోజుకో రేటు వద్ద బంగారం.. ఎందుకో తెలుసా?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,770 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలలో ఎలాంటి మార్పు లేదు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలలో కూడా ఎటువంటి మాపు లేదు. నేడు సిల్వర్ రేటు కూడా స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (మార్చి 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే!
వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ రేటు నేడు (మార్చి 1)న గరిష్టంగా రూ. 220 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద నిలిచాయి. నిన్న రూ. 500, రూ. 540 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 220 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,620 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,770 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈ రోజు (మార్చి 1) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఖర్జూర పండులో బంగారం
-
పసిడి ప్రియులకు శుభవార్త: మూడో రోజు తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. వరుసగా మూడోరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 540 తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్త. ఈ రోజు (ఫిబ్రవరి 28) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో.. వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 540 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 28) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం కొనడానికి ఇది మంచి సమయం!.. మళ్ళీ తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరల పెరుగుదలకు.. మహాశివరాత్రి నుంచి బ్రేకులు పడ్డాయి. ఈ రోజు (ఫిబ్రవరి 27) కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో పసిడి ధరలలో మార్పు జరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే.. వివరాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద నిలిచాయి. నిన్న రూ. 250, రూ. 270 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400 , రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద ఉంది. చెన్నైలో నిన్న పసిడి రేట్లు స్వల్పంగా తగ్గాయి.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 27) కేజీ సిల్వర్ రేటు రూ. 1,06,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారంపై ఉపశమనం.. వెండిపై భారీ ఊరట!
దేశంలో కొన్ని రోజులుగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) నేడు (February 26) కాస్త దిగివచ్చాయి. ఆల్టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? ఈపీఎఫ్ విత్డ్రా మరింత ఈజీ.. ఇక నేరుగా యూపీఐ..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80,500, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,820 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.250, రూ.270 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,970 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,650 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.270, రూ.250 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,500 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,820 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.250, రూ.270 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.భారీగా పడిన వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు భారీ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.2000 తగ్గి రూ.1,06,000 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో కేజీ వెండ రూ. 98,000 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.3000 క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్గా కొనుగోలు
దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్ తులం రూ.80,750 (22 క్యారెట్స్), రూ.88,090 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఈ తరుణంలో తక్కువ ధరకు బంగారం దొరికే ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కవ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.దుబాయ్, యుఏఈఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో తక్కువ ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.థాయ్లాండ్ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్లాండ్లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.సింగపూర్తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్ షాపింగ్కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.మలేషియాకౌలాలంపూర్లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.హాంగ్ కాంగ్హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది.ఇదీ చదవండి: ఏప్రిల్ 1 నుంచి సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనల్లో మార్పులుఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో బంగారం ధరలు అధిక ధరకు దోహదం చేసే కొన్ని కీలక అంశాలను తెలుసుకుందాం.దిగుమతి సుంకాలు, పన్నులు: భారతదేశం బంగారంపై గణనీయమైన దిగుమతి సుంకాలు, పన్నులను విధిస్తుంది.ఈ సుంకాలు 12.5% వరకు ఉండవచ్చు. బంగారం కొనుగోళ్లపై అదనంగా 3% వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఉంటుంది. మేకింగ్ ఛార్జీలపై మరో 5 శాతం జీఎస్టీ వడ్డీస్తున్నారు.కరెన్సీ మారకం రేట్లు: అంతర్జాతీయంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి (ఐఎన్ఆర్) బలహీనపడినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. మారకం రేట్లలో ఈ హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి .పండుగలు, పెళ్లిళ్లు: భారతదేశంలో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, దీపావళి, ధంతేరస్, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితి: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇన్వెస్టర్లు సురక్షిత సంపదగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి పెరిగిన డిమాండ్ అధిక ధరలకు దారితీస్తుంది. ఇది భారత మార్కెట్లో ప్రతిబింబిస్తుంది.సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు: అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత రిజర్వ్ బ్యాంక్తో సహా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. ఈ బల్క్ కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్ను పెంచుతాయి. -
పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,750 (22 క్యారెట్స్), రూ.88,090 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.220, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.88,090 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.210 పెరిగి రూ.80,900కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.88,240 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. మంగళవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
హీరోయిన్ కుమార్తెలకు బంగారు గాజులు తొడిగిన స్టార్ హీరో
కోలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత స్నేహన్, నటి కనిక కుమార్తెలకు కమల్ హాసన్ అదరిపోయే కానుక అందించారు. తమిళ చిత్రపరిశ్రమలో పాటల రచయితగా స్నేహన్కు మంచి గుర్తింపు ఉంది. ఆయన తెలుగులో కూడా ప్రియమైన నీకు చిత్రంలో పాటలు రాశారు. మన్మధ, ఆటోగ్రాఫ్,ఆడుకాలం,ఆకాశం నీ హద్దురా, సామీ వంటి తమిళ చిత్రాలతో పాటు రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్,కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఆయన పనిచేశారు.స్నేహన్, కనిక దంపతులు కవల పిల్లలకు ఈ ఫిబ్రవరిలో జన్మనిచ్చారు. అయితే, ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన వెంటనే ఈ జంట కమల్ హాసన్ ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి వెళ్లింది. ఇద్దరూ అమ్మాయిలు చాలా ముద్దుగా ఉన్నారంటూ కమల్ ఆశీర్వదించారు. ఆపై వారిద్దరికీ బంగారు గాజులు ఆయన తొడిగారు. ఆపై కనిక, స్నేహన్లతో పాటు పిల్లలకు బట్టలు కూడా అందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహన్ చాలా రోజులుగా కమల్కు దగ్గరగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యంలో ఆయన క్రియాశీలంగా పనిచేస్తున్నారు. 2019లో తమిళనాడులోని శివగంగ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓటమి చెందినప్పటికీ సుమారు 25వేల ఓట్లు వచ్చాయి.కోలీవుడ్ నటి కనిక రవిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కమల్ హాసన్ సమక్షంలోనే 2021లో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సుమారు పదేళ్ల క్రితం క్రితం వచ్చిన 'దేవరాట్టం' అనే మూవీలో కనిక నటించింది. ఆ మూవీ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయం నుంచి వారు రహస్యంగా ఉంటూ ఉంచారు. అయితే, కొంత కాలం తర్వాత ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో ఆశీర్వదించారు. వారి పెళ్లిని కూడా కమల్ హాసన్ దగ్గరుండి జరిపించడం విశేషం. View this post on Instagram A post shared by Kannika Snekan (@kannikasnekan) -
ఈ కారణాలతోనే.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ధోరణి ఏర్పడింది. ట్రంప్ రక్షణాత్మక విధానం, యుఎస్ డాలర్ హెచ్చు & తగ్గుల కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, వాణిజ్య యుద్ధ భయం మరియు ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలు పెరగడానికి హేతువులవుతున్నాయి.శుక్రవారం మార్కెట్ సెషన్ ముగిసిన తర్వాత.. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఎనిమిదవ వారం లాభాన్ని & దేశీయ మార్కెట్లో వరుసగా ఏడవ వారం లాభాన్ని నమోదు చేశాయి. ఈ ఏడు వారాల్లో, 10 గ్రాముల బంగారం రేటు రూ. 76,544 నుంచి రూ. 86,020లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ రేటు ఏడు వారాల్లో సుమారు రూ. 9,500 కంటే ఎక్కువ పెరిగింది.2025 జనవరి ప్రారంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరగడానికి అనేక కీలక అంశాలు కారణమయ్యాయి. ఇందులో ట్రంప్ ప్రారంభించిన సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరిగిన ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల రేటు కోతలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులకు, ముఖ్యంగా USకి బంగారం వెళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.యూరోపియన్ దేశాల నుంచి USకి ఎగుమతి చేసే బంగారంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన నేపథ్యంలో.. అమెరికాలో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీని ఫలితంగా యూరప్ కంటే అమెరికాలో బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి కేంద్ర బ్యాంకులు లండన్ వాల్ట్ల నుంచి బంగారాన్ని తరలిస్తున్నాయి. గత ఎనిమిది వారాల్లో NY COMEX వాల్ట్లలో బంగారం నిల్వలు సుమారు 20 మిలియన్లు పెరిగాయి, ఇది లండన్ క్యాష్ గోల్డ్ కాంట్రాక్ట్ డిఫాల్ట్ బజ్ను ప్రేరేపించింది.స్టాక్ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం పెరగడానికి కారణాలను గురించి, ఎస్ఎస్ వెల్త్స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్దేవా' మాట్లాడుతూ.. అమెరికా & యూరప్ మధ్య సుంకాల వివాదం ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులను సృష్టించింది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసిందని అన్నారు. అల్యూమినియం, ఉక్కుపై ఇటీవల 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన తర్వాత ట్రంప్ పరిపాలన బంగారంపై సుంకాలు విధించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఈ అంచనా అమెరికాలో డిమాండ్ను పెంచింది, బంగారం ధరలను పెంచిందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: భారత్లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కు చెందిన 'అనుజ్ గుప్తా' మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమెరికన్ బ్యాంకుల కంటే వెనుకబడి లేదు. భారత సెంట్రల్ బ్యాంక్ 2024 మే, అక్టోబర్లలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుంచి 100, 102 టన్నుల బంగారాన్ని రవాణా చేసిందని ఆయన అన్నారు. దీనితో ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 855 టన్నులకు చేరుకున్నాయి, వీటిలో 510.5 టన్నులు భారతదేశంలో నిల్వ ఉన్నాయని అన్నారు.మొత్తం మీద.. బంగారం ధరలు నిరంతరం పెరగడానికి ట్రంప్ సుంకాల విధానం మాత్రమే కారణం కాదు. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు, తక్కువ ఆర్థిక వృద్ధి గురించి ఆందోళనలు కూడా. భారతదేశంలో కొనుగోలుదారుల సంఖ్య, లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. -
ఒకటి తగ్గింది.. ఇంకొకటి పెరిగింది: ఇదీ బంగారం ధరల పరిస్థితి
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 221) బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..➤హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,770 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది. 24 క్యారెట్ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.➤విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 200, రూ. 20 పెరిగింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు కొంత పెరిగింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7770 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు ఓ మోస్తరుగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 300 పెరిగి రూ. 80,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 370 పెరిగి రూ. 87,920 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శనివారం) రూ. 900 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 100 పెరిగి.. మళ్ళీ యధాస్థానానికే (రూ.1,00,500) చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం ధరల్లో భారీ మార్పులు
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 21) బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే..➤హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,100 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ బంగారం ధర పెరిగింది.➤విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7750 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 450, రూ. 290 తగ్గింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7550 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7550 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 550 తగ్గి రూ. 80300 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 640 తగ్గి రూ. 87550 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శుక్రవారం) రూ. 100 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,900 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,400 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఈ రోజు బంగారం ధర చూశారా?.. ఇక కొనడం కష్టమే!
ఇంతింతై.. వటుడింతై అన్న చందాన, బంగారం ధరలు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి 20) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 390 పెరిగింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040 వద్ద నిలిచాయి. నిన్న రూ. 650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 700 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 350, రూ. 390 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 390 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 88,040 వద్ద ఉంది. చెన్నైలో నిన్న పసిడి ధర రూ. 650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 700 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగింది.ఇదీ చదవండి: భారత్లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు మరింత ఊపందుకున్నాయి. ఇక్కడ గోల్డ్ రేట్లు రూ. 80,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,190 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 390ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (20 ఫిబ్రవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు
ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భారత ప్రభుత్వం బంగారం (gold), వెండి (silver) దిగుమతి మూల ధరలను పెంచింది. ఫిబ్రవరి 14న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బంగారం మూల ధర 10 గ్రాములకు 41 డాలర్లు పెరిగి 938 డాలర్లకు చేరుకుంది. వెండి బేస్ రేటు కూడా కేజీకి 42 డాలర్లు పెరిగింది.ట్రెండ్స్కు అనుగుణంగా సర్దుబాటుఅమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సహా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ అంశాల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బేస్ దిగుమతి ధర పెరిగితే వాటి మీద విధించే దిగుమతి సుంకాలు కూడా పెరుగుతాయి. వీటిని బేస్ ధరలో ఒక శాతంగా లెక్కించి వసూలు చేస్తారు. దీని దిగుమతి ధరలో సర్దుబాటు కారణంగా వెండి ధరలు కూడా పెరిగాయి.భారత్లో బంగారం ధరలుప్రపంచ ట్రెండ్ను అనుసరించి సోమవారం (ఫిబ్రవరి 17 ) భారత్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,662, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7,940 చొప్పున ఉన్నాయి. బేస్ ధరల సవరణతో, వ్యాపారులు దేశీయ బంగారం ధరలను తదనుగుణంగా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇది రిటైల్ మార్కెట్లో మొత్తం ధరలను ప్రభావితం చేస్తుంది.వెండి ధర సర్దుబాటుబంగారం లాగే వెండి కూడా అంతర్జాతీయంగా ధరల పెరుగుదలను చూసింది. వెండి బేస్ దిగుమతి ధరను పెంచాలనే ప్రభుత్వం నిర్ణయం ఈ ప్రపంచ మార్పులను చూపిస్తుంది. దిగుమతి ధరలలో మార్పు మార్కెట్కు అనుగుణంగా బేస్ ధరపై సుంకాలు విధించడం ద్వారా పన్నుల వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. ప్రపంచ మార్కెట్ పరిస్థితుల్లో తదుపరి మార్పులను బట్టి తదుపరి సవరణ వరకు కొత్త బేస్ దిగుమతి ధరలు వర్తిస్తాయి. -
ప్రపంచంలోనే అధిక బంగారు నిల్వలున్న దేశాలు
ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి(Gold) ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. మన దేశంలో అయితే దీన్ని మరింత విలువైన లోహంగా భావిస్తారు. కొందరు బంగారాన్ని తమ గౌరవానికి సూచికగా భావిస్తే..ఇంకొందరు దీన్నో పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. దాంతో దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పసిడికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇటీవల దీని తులంధర ఏకంగా రూ.88 వేలు దాటిపోయింది. త్వరలో బంగారం రేటు రూ.ఒక లక్ష కూడా చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో అధికంగా బంగారం నిల్వలున్నాయో కింద తెలుసుకుందాం.యునైటెడ్ స్టేట్స్ 8,133.46 టన్నులుజర్మనీ 3,351.53 టన్నులుఇటలీ 2,451.84 టన్నులుఫ్రాన్స్ 2,436.94 టన్నులుచైనా 2,264.32 టన్నులుస్విట్జర్లాండ్ 1,039.94 టన్నులుభారతదేశం 853.63 టన్నులుజపాన్ 845.97 టన్నులుతైవాన్, చైనా 422.69 టన్నులుపోలాండ్ 419.70 టన్నులుఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..చైనాలో భారీ బంగారు గనిచైనాలోని హునాన్ ప్రావిన్స్లోని పింగ్ జియాంగ్ కౌంటీలో ఇటీవల సుమారు రూ.7,09,577,16,96,000 విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వల గనిని కనుగొన్నారు. ఈ నిక్షేపం వాంగు గోల్డ్ఫీల్డ్స్లో బయటపడినట్లు తెలియజేస్తున్నారు. ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు 2,000 మీటర్ల లోతు వరకు విస్తరించిన 40 బంగారు నిక్షేపాలను గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కనీసం 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని తేలినట్లు సమాచారం. 3,000 మీటర్ల వరకు విస్తరించిన లోతైన ఈ గనిలో మరింత నిల్వలు ఉండవచ్చని అంచనా. దాంతో ఇందులో మొత్తంగా సుమారు 1,000 మెట్రిక్ టన్నుల వరకు బంగారం ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. -
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్ళీ దూసుకెళ్తున్నాయి. నేడు (సోమవారం) గరిష్టంగా రూ. 550 పెరిగింది. దీంతో పసిడి ధరలలో మార్పు జరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?.. పది గ్రాముల బంగారం రేటు ఎలా ఉందనే వివరాలను వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 550 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 550 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,620 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,770 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500 , రూ. 550 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (17 ఫిబ్రవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం లాభాలపై పన్ను ఎంత?
గోల్డ్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడులపై ఏ మేరకు పన్ను ఎలా విధిస్తారు? – గిరిరాజ్మీరు ఏ తరహా బంగారం సాధనంలో ఇన్వెస్ట్ చేశారన్న అంశంపైనే పన్ను ఆధారపడి ఉంటుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్)లో పెట్టుబడులు పెట్టినట్టయితే.. వాటిని రెండేళ్ల పాటు కొనసాగించిన తర్వాత విక్రయిస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వాటిని స్వల్పకాల మూలధన లాభాల పన్ను కింద పరిగణిస్తారు. ఈ మొత్తం వార్షిక ఆదాయానికి కలిపి, నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అన్నవి గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్ కనుక స్వల్ప మొత్తం నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ ఈటీఎఫ్లు అయితే ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. ఏడాది తర్వాత పెట్టుబడులు విక్రయిస్తే వచ్చే లాభంపై 12.5 శాతం పన్ను పడుతుంది. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఫండ్స్ సంస్థ వసూలు చేసే చార్జీ) తక్కువగా ఉంటుంది. వ్యయాల పరంగా చౌక. కాకపోతే వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్, డ్రేడింగ్ అకౌంట్ అవసరం అవుతాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో అయితే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు అవసరం లేకుండానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో రాబడులపై ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రభావం ఉంటుందా? – ఇస్మాయిల్ ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించడంతో 6.25 శాతానికి దిగొచ్చింది. దీనికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని బాండ్లు (అధిక కూపన్ రేటుతో ఉన్నవి) మరింత విలువను సంతరించుకుంటాయి. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లతో పోల్చినప్పుడు అంతకుముందు కొనుగోలు చేసినవి ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి. ఫలితంగా ఆయా బాండ్ల ధరలు పెరుగుతాయి. దీంతో సంబంధిత డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీ కూడా ఆ మేరకు లాభపడుతుంది. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్పై ఎక్కువగా ఉంటుంది. ఇదీ చదవండి: ఇవి రీచార్జ్ చేసుకుంటే ఫ్రీగా జియో హాట్స్టార్అధిక రేటు బాండ్లలో చేసిన పెట్టుబడులతో లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఎక్కువ లాభపడతాయి. దీనికి వ్యతిరేకంగా వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో లాంగ్ డ్యురేషన్ ఫండ్స్పై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. దీంతో అప్పటికే ఫండ్స్ పోర్ట్ఫోలియోలో ఉన్న బాండ్లపై రేటు తక్కువగా ఉండడంతో అవి ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో ఆయా బాండ్ల ధరలు పడిపోతాయి. దీని ఫలితంగా వాటి ఎన్ఏవీ కూడా క్షీణిస్తుంది. ఈ ధరల ఆధారిత ప్రయోజనానికి అదనంగా.. డెట్ ఫండ్స్కు వాటి నిర్వహణలోని బాండ్ల రూపంలో వడ్డీ ఆదాయం కూడా వస్తుంటుంది. వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు డెట్ ఫండ్స్ తిరిగి చేసే పెట్టుబడులపై ఆ మేరకు ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆయా ఫండ్స్లో పెట్టుబడులపై రాబడులను ప్రభావితం చేస్తుంటాయి. డెట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మీ వాటా బంగారం.. మూడు తులాలు!
పసిడి ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో అని భారంగానే నడుస్తోంది. అయితే.. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ఎంత బంగారం ఉందో మీకు తెలుసా?. కేవలం 2, 44,000 మెట్రిక్ టన్నులు మాత్రమే!. అవును.. ఈ భూమ్మీద బంగారు గనుల నుంచి 244,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే గనుల నుంచి బయటకు వెలికి తీయబడింది. ఇందులో ఎక్కువగా.. చైనా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి వెలికి తీసిందే. అయితే.. ఇంత బంగారాన్ని ఒకవేళ భూమ్మీద ఉన్న మనుషులందరికీ పంచగలిగితే!.. భూమ్మీద అధికారికంగా ఇప్పుడున్న ప్రతీ మనిషికి బంగారం గనుక పంచితే(Gold Distribution On Earth).. దాదాపు 30 గ్రాముల(ట్రాయ్ ఔన్స్) దాకా పంచొచ్చట. ప్రపంచ జనాభా.. 816 కోట్లుగా ఓ అంచనా వేసుకుంటే.. ఈ బంగారం ఇలా సరిపోతుందని విజువల్ క్యాపిటలిస్ట్కు చెందిన వోరోనోయి యాప్ లెక్కకట్టి తేల్చింది. 👉అయితే.. అత్యధిక బంగారు నిల్వలు(Gold Reserves) ఉన్నది మాత్రం అమెరికాలో. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఆ తర్వాతి ప్లేస్లో ఉన్న చైనా.. తన నిల్వలను క్రమంగా పెంచుకుంటూ పోతోంది. బంగారు నిల్వల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. 👉ఒకప్పుడు బంగారం ఉత్పత్తి(Gold Production) అంటే.. దక్షిణాఫ్రికా పేరు ప్రముఖంగా వినిపించేది. 1900-1970 మధ్య ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసిన దేశంగా నిలిచిందది. ఒకానొక టైంలో ఏడాదికి 1,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రారాజుగా వెలుగొంది. అయితే.. ఇప్పుడు బంగారం ఉత్పత్తిలో చైనా అద్భుతాలు సృష్టిస్తోంది. 👉అమెరికా, ఆస్ట్రేలియా తరహాలో భారీ బంగారు గనులు లేకపోయినా ఉన్న గనుల నుంచే అత్యధికంగా బంగారాన్ని వెలికి తీస్తోంది. కిందటి ఏడాదిలో రికార్డు స్థాయిలో 380 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బయటకు తీసి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
బంగారం భారీగా తగ్గిందోచ్.. తులానికి ఏకంగా..
దేశంలో కొన్ని రోజులుగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) నేడు (February 15) భారీగా దిగివచ్చాయి. ఆల్టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? టూ వీలర్లకు ఫ్రీగా పెట్రోల్!తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 78,900, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 86,070 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.1000, రూ.1090 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.86,220 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,050 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.1000, రూ.1090 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 78,900 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,070 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.1000, రూ.1090 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,08,000 వద్ద, ఢిల్లీలో రూ. 1,00,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం కొంటున్నారా ఈ విషయాలు మరిచిపోవద్దు
-
లవర్స్డే రోజున బంగారం గిఫ్ట్ ఇస్తున్నారా? తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రేమికుల రోజున లవర్కు బంగారు ఆభరణాలు గిఫ్ట్గా ఇవ్వాలంటే మాత్రం ధరల విషయంగా కొంత ఆలోచించాలని సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.79,900 (22 క్యారెట్స్), రూ.87,160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.79,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,160 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.80,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.87,310 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధరల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై రూ.1,000 పెరిగి రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కరువు సీమలో పసిడి ధగధగలు!.. వైఎస్ జగన్ హయాంలోనే..
సాక్షిప్రతినిధి కర్నూలు: కరువు సీమలో పసిడి ధగధగా మెరవనుంది. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్కు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. పూర్తిస్థాయిలో బంగారం ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మెస్సర్స్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా గోల్డ్ ప్రాసెసింగ్పై ఈ నెల 18వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో గోల్డ్ మైనింగ్ ప్రక్రియ చేపడతారు. మూడు దశాబ్దాల కిందట గుర్తింపు... కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సర్వే చేసి నిర్ధారించింది. అప్పట్లో బంగారు నిక్షేపాల వెలికితీతకు దేశీయంగా ఏ కంపెనీ ముందుకురాలేదు. ⇒ భారత ప్రభుత్వం 2005లో మైనింగ్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది. ⇒ కర్నూలులో గోల్డ్ మైన్ ఏర్పాటు కోసం ఆస్ట్రేలియాకు చెందిన మెస్సర్స్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీకి 2013లో అనుమతులు లభించాయి. ⇒ తుగ్గలి, మద్దికెర మండలాల్లో 1,495 ఎకరాలను ‘జియో మైసూర్’ లీజుకు తీసుకుంది. మరో 70 ఎకరాలను కొనుగోలు చేసింది.⇒ 2021లో ప్రొడక్షన్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేసింది.⇒ మొత్తం 1,495 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30వేల మీటర్లు డ్రిల్లింగ్ చేసింది.⇒ పైలట్ ప్రాజెక్టుగా 2023 ఫిబ్రవరి 15 నుంచి బంగారు వెలికితీతను ప్రారంభించింది. ⇒ ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన బంగారాన్ని బెంగళూరులోని ల్యాబ్కు పంపితే మంచి ఫలితాలు వచ్చాయి. ⇒ అనంతరం రూ.320 కోట్ల పెట్టుబడితో పూర్తిస్థాయి ఉత్పత్తి లక్ష్యంగా పనులు పూర్తి చేసింది. దక్షిణాఫ్రికా, చైనా నుంచి మిషనరీ తెప్పించింది.⇒ బంగారు ఖనిజం ప్రాసెసింగ్ ప్లాంట్ పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు ఈ నెల 18న ప్రజాభిప్రాయసేకరణ జరపనున్నారు. ⇒ తొలుత ఓపెన్ కాస్ట్ మైనింగ్ 10 ఏళ్లపాటు ఉంటుంది. అంతా సవ్యంగా జరిగితే 25 ఏళ్ల వరకు కొనసాగవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ⇒ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజూ 20 టన్నుల మట్టి తవ్వి ప్రాసెసింగ్ చేయగా, 40–50 గ్రాముల బంగారం ఉత్పత్తి అయింది. ప్రధాన ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైతే ఏడాదికి 750 కిలోల బంగారు ఉత్పత్తి కానుంది. ఆ తర్వాత సామర్థ్యాన్ని పెంచనున్నారు.దేశంలో మూడో ‘గోల్డ్ మైన్’మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం 1880లో కోలార్ గోల్డ్ మైన్ను ప్రారంభించారు. రెండోది 1945లో రాయచూర్లోని ‘హట్టి మైన్స్’ను మొదలు పెట్టారు. స్వాతంత్య్రం తర్వాత ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ యూనిట్ను ‘జియో మైసూర్’ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇది దేశంలోనే మూడో గోల్డ్ మైనింగ్ యూనిట్గా గుర్తింపు పొందనుంది. ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1,000 మంది వరకు ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ, పన్నులు రూపంలో మంచి ఆదాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, డీఎంఎఫ్(డిస్ట్రిక్ మినరల్ ఫండ్) పేరిట ఉత్పత్తిలో 4.6శాతం చెల్లిస్తారు. అనంతపురం జిల్లా రామగిరిలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ లీజుకు ప్రయత్నించింది. అప్పట్లో రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. రామగిరి మండలంలో కూడా బంగారు నిక్షేపాలు వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతమవుతుంది. వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. -
భారత్లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?
భారతదేశంలో బంగారంకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. ఇంతకీ గోల్డ్ రేటు ఎలా పెరుగుతుంది? ధరలను ఎవరు నిర్ధారిస్తారు? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.బంగారం స్వచ్చతను బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. అవి 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్. నేడు (ఫిబ్రవరి 11) 22 క్యారెట్స్ 10 గ్రా ధర రూ. 80100, 24 క్యారెట్ తులం ధర రూ. 87380 వద్ద ఉంది. 18 క్యారెట్స్ 10 గ్రా గోల్డ్ రేటు రూ. 65540 వద్ద ఉంది.భారత్లో 'ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్' (IBJA) గోల్డ్ రేటును నిర్ధారించే ప్రధాన సంస్థ. ఇందులో దేశంలోని అతిపెద్ద గోల్డ్ డీలర్స్ ఉంటారు. నిత్యం బంగారం ధరలను నిర్ణయించడానికి ఐబీజేఏ.. వీరితో కలిసి పనిచేస్తుంది. రేటును డీలర్ల కొనుగోలు, దిగుమతి పన్నులు, కరెన్సీ హెచ్చు తగ్గులు, స్థానిక పన్నులు వంటి వాటిని బేరీజు వేసుకుని నిర్ణయించడం జరుగుతుంది.బంగారం రేటు పెరగడానికి కారణంభారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది. -
బంగారం ధర త్వరలో ‘లకారం’! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో(Gold Rates) మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,600 (22 క్యారెట్స్), రూ.87,930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.800, రూ.870 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,930 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.800 పెరిగి రూ.80,750కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1040 పెరిగి రూ.88,080 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. మంగళవారం వెండి ధరలు(Silver Price) స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు రూ.1,07,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 87,000 దాటేసింది. డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా.. స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఓవైపు పసిడి ధరలు పెరుగుతుంటే.. మరోవైపు రూపాయి (డాలర్తో పోలిస్తే) బలహీనపడుతోంది. ఈ సమయంలో చాలామంది పెట్టుబడిదారుల చూపు బంగారంపై పడింది.స్టాక్ మార్కెట్లో వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవడానికి లేదా భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బంగారం మీద పెట్టుబడి సురక్షితమని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రజలు తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలని గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల.. బంగారానికి డిమాండ్ పెరిగిపోతోంది. డిమాండ్ పెరగడం వల్ల పసిడి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాకుండా రష్యా - ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా చాలామంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. రూపాయి పతనం అయినప్పుడు.. ప్రజల చూపు డాలర్ మీద లేక.. బంగారం మీద పడుతుంది.ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చా?స్టాక్ మార్కెట్ల మాదిరిగానే.. బంగారం భవిష్యత్తు మీద కూడా ఖచ్చితమైన అభిప్రాయాలు లేదు. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరలు ఇలాగే పెరుగుతాయని కూడా ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి బంగారంపై ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా.. రేటు తగ్గిన ప్రతిసారీ తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.దీర్ఘకాలికంగా బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొనేవారు.. ఆభరణాలు లేదా బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. కానీ తయారీ చార్జీలు వంటి వాటిని బేరీజు వేసుకోవాలి.ఇదీ చదవండి: చాట్జీపీటీతో లవ్.. హృదయాన్ని కదిలించిన సమాధానం!ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ద్రవ్యోల్బణం కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదో మంచి అవకాశం . అయితే ఈ ట్రెండ్ ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. -
ఆల్టైమ్ హై.. బంగారం కొత్త రేటు వింటే దడే!
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మరింత పెరిగాయి. కొన్ని రోజులుగా ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు నేడు (February 10) భారీగా ఎగిసి ఆల్టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? రతన్ టాటా వీలునామాలో ఊహించని పేరు.. రూ.500 కోట్ల ఆస్తి ఆయనకే..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,800, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,060 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.350, రూ.390 చొప్పున పెరిగాయి.ఇతర ప్రాంతాల్లో.. చైన్నైలో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,800 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,060 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.350, రూ.390 చొప్పున పెరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,210 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,950 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.390, రూ.350 చొప్పున పెరిగాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
తగ్గిన బంగారం అక్రమ రవాణా
న్యూఢిల్లీ: బంగారం అక్రమ రవాణాకు దిగుమతి సుంకం తగ్గింపు కొంత చెక్ పెట్టింది. గతేడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించడం గమనార్హం. అనంతరం అక్రమ రవాణా (స్మగ్లింగ్/దొంగ రవాణా) గణనీయంగా తగ్గినట్టు పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో 847 కిలోల బంగారాన్ని (రూ.544 కోట్లు) డీఆర్ఐ అధికారులు జప్తు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులు, సరిహద్దులు, దేశంలోకి వచ్చే కార్గోల వద్ద అధికారుల నిఘా పెరిగినట్టు సంజయ్ కుమార్ చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు సరిహద్దుల ద్వారా వస్తు అక్రమ రవాణా జరుగుతుండడం తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీఆర్ఐ అధికారులు ఈశాన్య సరిహద్దుల వద్ద 1,319 కిలోల బంగారం అక్రమ రవాణాన్ని అడ్డుకుని, ఆ మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద ఎక్కువ మొత్తం పట్టుబడింది. కస్టమ్స్ విభాగం సహా సీబీఐసీ కలసి గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జప్తు చేసిన బంగారం 4,870 కిలోలుగా ఉంది. దిగుమతి సుంకం తగ్గింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ బంగారం ఆభరణ వర్తకుల (జ్యుయలర్లు) ఆదాయం 22–25 శాతం పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేయడం గమనార్హం. -
రహస్యగదిలో బంగారు నిధి
అమెరికాలోని ఒక పురాతన చర్చి లోపల ఉన్న రహస్యగదిలో శతాబ్దాల నాటి బంగారు నిధిని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్చి లోపలి గోడల్లో చిన్న అల్మరాలా కనిపించే ఒక గదిలో సుమారు 500 సంవత్సరాల నాటి పోలండ్, లిథువేనియా చక్రవర్తుల కిరీటాలు బయటపడ్డాయి. ఈ గదిలో నాణేలు, గొలుసులు, కిరీటాలు, శవపేటిక ఫలకాలు, రాజదండం వంటి ఇతర అమూల్యమైన వస్తువులు కూడా ఉన్నాయి.మొత్తం 59 పురాతన వస్తువులు, కళాఖండాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితోపాటు, వస్తువులను చుట్టిన ఒక వార్తాపత్రిక ఉంది. ఇది జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత, 1939 సెప్టెంబర్ 7వ తేదీ నాటిది. దీని ఆధారంగా ‘అప్పట్లో సైనిక దాడుల నుంచి రాజసంపదను కాపాడటానికి ఈ రహస్య గదిని నిర్మించి, ఇందులో వీటిని భద్రపరచి ఉండచ్చు’ అని పురావస్తు శాస్త్రవేత్త విద్మంతస్ బెజారస్ తెలిపారు. -
మళ్లీ పైకి లేచిన పసిడి!
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. క్రితం రోజున పెరుగుదలకు బ్రేకిచ్చిన పసిడి ధరలు నేడు (February 8) స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? రతన్ టాటా వీలునామాలో ఊహించని పేరు.. రూ.500 కోట్ల ఆస్తి ఆయనకే..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,450, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 86,670 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.86,820 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,960 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.160, రూ.150 చొప్పున పెరిగాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,450 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,670 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
‘గోల్డెన్’ హీరోనా రాబరీ విలనా?
సినిమాల్లో, కథల్లో రాజుల కాలం నాటి గుప్త నిధుల కోసం అన్వేషిస్తుంటారు. ఎన్నో కష్టాలు అనుభవించి నిధిని కనుగొంటారు. ఆ సంపదతో గొప్పవాళ్లుగా మారిపోతుంటారు. ఇదీ అలాంటిదే. కానీ నిజంగా జరిగిన కథ. సముద్రంలో టన్నులకొద్దీ బంగారంతో మునిగిపోయిన ఓడను కనిపెట్టినా.. జైలులో మగ్గుతున్న ఓ ఆధునిక ‘ట్రెజర్ హంటర్’వ్యథ. చివరికి ఓ న్యాయమూర్తి తీర్పుతో త్వరలో విడుదల కాబోతున్న బంగారం నిధి వేటగాడు, శాస్త్రవేత్త ‘టామీ గ్రగరీ థాంప్సన్’గాథ. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఓ నిధి వేటగాడి నిజమైన కథ..అది 1857వ సంవత్సరం.. సుమారు 21 టన్నుల బంగారం తీసుకుని ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా అనే ఓడ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్కు బయలుదేరింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ తుఫానుతో సముద్రం మధ్యలోనే ఓడ మునిగిపోయింది. ‘షిప్ ఆఫ్ గోల్డ్’గా పేరుపొందిన ఆ ఓడ, దానిలోని బంగారం కోసం ఎందరో అన్వేషిoచినా జాడ దొరకలేదు. అలా బంగారం వేటకు దిగినవారిలో శాస్త్రవేత్త టామీ గ్రెగరీ థాంప్సన్ నేతృత్వంలోని బృందం ఒకటి. అప్పటికే కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న థాంప్సన్.. 1988లో సోనార్ సాయంతో సముద్రం అడుగున జల్లెడ పడుతుండగా ‘షిప్ ఆఫ్ గోల్డ్’జాడ పట్టేసుకున్నాడు. బంగారం కరిగించి నాణాలుగా మార్చి..అమెరికాలోని కొందరు ధనికులు థాంప్సన్ పరిశోధనకు స్పాన్సర్ చేశారు. నిధి దొరికితే ఎవరి వాటా ఎంతెంత అని ముందే ఓ మాట అనుకున్నారు. 1988లో ఓడ జాడ దొరికినా.. బంగారం నిధిని రూఢీ చేసుకుని, వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టింది. బయటికి తీసిన బంగారాన్ని కరిగించి నాణాలుగా మార్చారు. అలా మార్చిన బంగారు నాణాల్లో 500 నాణాలు మాయమయ్యాయి. అది చేసినది థాంప్సన్. వాటిని ఏం చేశాడు? తీసుకెళ్లి.. రెండు అమెరికా ఖండాల మధ్య ఉండే ‘బెలిజ్’అనే చిన్న దేశంలో ఓ ట్రస్టుకు దానమిచ్చాడు. అంతే అంతకన్నా ఒక్కముక్క కూడా బయటపెట్టలేదు. పదేళ్లుగా జైల్లోనే.. త్వరలోనే విడుదల.. అధికారులు 2015లో థాంప్సన్ను జైల్లో పెట్టారు. నాణాల జాడ చెప్పనంత కాలం.. రోజుకు వెయ్యి డాలర్లు (సుమారు రూ.87 వేలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సుమారు పదేళ్లుగా థాంప్సన్ జైల్లోనే ఉన్నారు. ఆయన చెల్లించాల్సిన జరిమానా.. 33,35,000 డాలర్లకు (మన కరెన్సీలో రూ.29 కోట్లకు) చేరింది. ఆయన మాయం చేసిన బంగారు కాయిన్ల విలువ 2.5 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.22 కోట్లు)గా అంచనా వేశారు. థాంప్సన్ పదేళ్లుగా జైల్లోనే ఉన్నారు. వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఆయన మాయం చేసిన బంగారం విలువ కంటే.. చెల్లించాలన్న జరిమానానే చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఓ న్యాయమూర్తి థాంప్సన్ను విడుదల చేయాలని తాజాగా తీర్పు ఇచ్చారు. కానీ తన పరిశోధనకు స్పాన్సర్ చేసిన ధనికులు పెట్టిన ఓ క్రిమినల్ కేసులో థాంప్సన్ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. ఆ తర్వాతే బయటికొస్తాడన్నమాట. ఆ బంగారం ఎవరికి ఇచ్చినదీ ఇప్పటికీ థాంప్సన్ బయటపెట్టలేదు. ట్రస్టు ద్వారా పేదలకు సాయం కోసం ఇచ్చిన ‘గోల్డెన్’ హీరోనా? సొమ్ము దోచేసుకున్న విలనా? -
బంగారం ధరలపై ఊరట..
దేశంలో ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. వరుసగా మూడో రోజులుగా దూసుకెళ్లి హ్యాట్రిక్ కొట్టిన పసిడి ధరలు నేడు (February 7) శాంతించాయి. దేశవ్యాప్తంగా పుత్తడి రేట్లు నిలకడగా కొనసాగుతున్నాయి.ఇది చదివారా? రతన్ టాటా వీలునామాలో ఊహించని పేరు.. రూ.500 కోట్ల ఆస్తి ఆయనకే..బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,300, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 86,510 వద్ద ఉన్నాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.86,660 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,450 వద్ద ఉన్నాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,300 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,510 వద్ద కొనసాగుతున్నాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కోటిన్నర బంగారం కేవలం రూ.680కే అమ్మిన టీనేజర్!
ఓ బాలికకు తన స్నేహితుల్లో ధరించిన పోగులు,ముక్క పుడకలు నచ్చాయి. వెంటనే వాటిని కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ చేతిలో డబ్బులు లేవు. ఇంట్లో వాళ్లను అడిగితే కోప్పడతారు. అందుకే ఏదో ఒకటి చేసి గిల్ట్ నగల్ని కొనుగోలు చేయాలని అనుకుంది. ఇందుకోసం తన తల్లి ధరించే రూ.1.16 కోట్ల బంగారాన్ని కేవలం రూ.680కే అమ్మేసింది. ఆ తర్వాత ఏమైందంటే? సౌత్ చౌనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని షాంఘైకు చెందిన బాలిక లిప్ స్టడ్లు, చెవిపోగులు కొనుగోలు చేసేందుకు మిలియన్ యువాన్ (రూ.1.16 కోట్లు) విలువైన తన తల్లి ఆభరణాలను దొంగిలించింది. వాటిని కేవలం 60 యువాన్లకు (రూ.680) విక్రయించింది.కుమార్తె చేసిన నిర్వాకం తెలియని తల్లి వాంగ్ వెంటనే పుటువో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలోని వాన్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో దొంగతనం జరిగిందని, కోట్లు విలువ చేసే బంగారం నగలు మాయమైనట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వాంగ్ ధరించే జేడ్ బ్రాస్లెట్లు, నెక్లెస్లు, డైమండ్లు పొదిగిన ముక్కపుడకల్ని ఆమె కుమార్తె అమ్మినట్లు గుర్తించారు. వాస్తవానికి ఆ బాలిక సైతం తాను అమ్మింది గిల్ట్ నగలనే అనుకుంది. ఇదే విషయంపై తల్లిని ఆరా తీయగా.. తన కుమార్తె లిప్ స్టడ్స్ కోసమే బంగారాన్ని అమ్మినట్లు చెప్పింది. ‘ఆ రోజు నా కుమార్తె నన్ను డబ్బులు అడిగింది. ఎంత అని అడగ్గా 60యువాన్లు అని చెప్పింది. ఎందుకు అని అడగ్గా..తన స్నేహితులు లిప్ స్టడ్స్ ధరించారని, అవి తనకు బాగా నచ్చాయని .. తాను కూడా ధరించాలని తన కోరికను చెప్పింది.లిప్ స్టడ్ ఖరీదు 30 యువాన్లు (రూ.340), మరియు ఆమె 30 యువాన్ల ధరతో మరో జత చెవిపోగులు కావాలని వివరించింది. వాటి మొత్తం ఖరీదు 60 యువాన్లు అని తెలిపింది. కానీ తాను ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పింది. తల్లి,కుమార్తెల మధ్య జరిగిన సంభాషణ విన్న పోలీసులు.. తల్లి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని గిల్ట్ నగలు అనుకుని బంగారాన్ని అమ్మినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అనంతరం, బాలిక బంగారాన్ని ఎక్కడ అమ్మింది? ఎవరికి అమ్మింది? ఎంతకు అమ్మింది? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక తిరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరికి బాలిక బంగారం ఎవరికి విక్రయించిందో గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందించారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది. -
హ్యాట్రిక్ దడ.. మళ్లీ ఎగిసిన బంగారం
దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఆగకుండా పెరుగుతూ కొనుగోలుదారులకు దడ పుట్టిస్తున్నాయి. నేడు (February 6) వరుసగా మూడో రోజూ పసిడి ధరలు దూసుకెళ్లి హ్యాట్రిక్ కొట్టాయి. మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.2500 పెరిగింది. ఇప్పటికే రూ.86 వేలు దాటేసి మరో కొత్త మార్కు దిశగా దూసుకెళ్తోంది.ఇది చదివారా? భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32 వేలు వడ్డీబంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.250 (22 క్యారెట్స్), రూ.270 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,300కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 86,510 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.86,660 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,450 వద్దకు ఎగిశాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.270, రూ.250 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ. 79,300 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.270 ఎగిసి రూ. 86,510 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం డిమాండ్ @ రూ.5.15 లక్షల కోట్లు
ముంబై: పసిడి కొనుగోళ్లు, పెట్టుబడులు 2024లో పండుగలా సాగాయి. గత ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 802.8 టన్నులకు చేరుకుంది. పరిమాణం పరంగా 2023 సంవత్సంతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, విలువ పరంగా చూస్తే ఏకంగా 31 శాతం వృద్ధి కనిపించింది. 2023లో 761 టన్నుల బంగారం కోసం భారతీయులు రూ.3,92,000 కోట్లను ఖర్చు చేయగా, 2024లో 802.8 టన్నుల కోసం ఏకంగా రూ.5,15,390 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ గణాంకాలతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్లూజీసీ) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2025లో బంగారం డిమాండ్ భారత్లో 700–800 టన్నుల మధ్య ఉండొచ్చు. వివాహ సంబంధిత కొనుగోళ్లతో బంగారం ఆభరణాలకు డిమాండ్ కొనసాగుతుంది. దీంతో ధరల పరంగా కొంత స్థిరత్వం ఉండొచ్చు’’అని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు. తగ్గిన ఆభరణాల డిమాండ్ → 2024లో బంగారం ఆభరణాల డిమాండ్ 2 శాతం తక్కువగా 563.4 టన్నులకు పరిమితమైంది. 2023లో ఆభరణాల డిమాండ్ 575.8 టన్నులుగా ఉంది. → గతేడాది జూలైలో బంగారం దిగుమతుల సుంకాన్ని తగ్గించడంతోపాటు, ఇతర మార్కెట్లతో పోలి్చతే భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేయడం సానుకూలించినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. → పండుగల సీజన్కు కీలకమైన 2024 చివరి మూడు నెలల కాలంలో పసిడి డిమాండ్ 265.8 టన్నులుగా ఉంది. 2023 ఇదే త్రైమాసికంలో డిమాండ్ 266.2 టన్నులతో పోల్చితే మార్పు అతి స్వల్పమే. పెట్టుబడులకు ఆకర్షణీయం → అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా పేరొందిన పసిడి.. 2024లో పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది. 2024లో బంగారంపై పెట్టుబడులు 29 శాతం పెరిగి 239.4 టన్నులకు చేరాయి. 2013 తర్వాత తిరిగి ఇదే గరిష్ట స్థాయి. → 2023లో బంగారం పెట్టుబడుల డిమాండ్ 185.2 టన్నులుగా ఉంది. → బంగారం ఈటీఎఫ్ల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. దీంతో పెట్టుబడి పరంగా పసిడికి డిమాండ్ ఇక ముందూ బలంగానే కొనసాగనుంది.జోరుగా ఆర్బీఐ కొనుగోళ్లు → 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. 2023లో 16 టన్నుల కొనుగోలుతో పోలి్చతే నాలుగు రెట్లు అధికంగా గతేడాది సొంతం చేసుకుంది. → బంగారం రీసైక్లింగ్ పరిమాణం 2% తక్కువగా 114.3 టన్నులుగా నమోదైంది. 2023లో రీసైక్లింగ్ పరిమాణం 117.1 టన్నులుగా ఉంది. → బంగారం దిగుమతులు గతేడాది 4 శాతం తక్కువగా 712.1 టన్నులకు పరిమితమయ్యాయి. 2023లో దిగుమతుల పరిమాణం 744 టన్నులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన డిమాండ్ → 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 4,974 టన్నులుగా నమోదైంది. 2023లో డిమాండ్ 4,945.9 టన్నులతో పోల్చితే ఒక శాతం పెరిగింది. → మూడు, నాలుగో త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సెంట్రల్ బ్యాంక్లు రేట్ల కోత ఆరంభించడం, అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇందుకు కారణాలుగా ఉన్నాయి. → సెంట్రల్ బ్యాంక్లు 1,044.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2023లో కొనుగోళ్లు 1,050.8 టన్నులుగా ఉన్నా యి. → పెట్టుబడులకు డిమాండ్ 25% పెరిగి 1,179.5 టన్నులకు చేరింది. 2023లో పసిడి పెట్టుబడుల డిమాండ్ 945.5 టన్నులుగా ఉంది. → బంగారం కాయిన్లు, బార్లకు డిమాండ్ 2023 స్థాయిలోనే 1,186 టన్నులుగా నమోదైంది. → 2024 మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 11 శాతం క్షీణించి 1,877.1 టన్నులకు పరిమితమైంది. 2023లో ఇది 2,110.3 టన్నులుగా ఉంది. → 2025లోనూ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్ల డిమాండ్ బలంగానే కొనసాగొచ్చని డబ్ల్యూజీసీ అంచనా. -
Gold Prices: ఆగని పసిడి పరుగు
న్యూఢిల్లీ: జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి పరుగు కొనసాగుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వరుసగా అయిదో సెషన్లో లాభపడి రూ. 86,000కు మరింత చేరువైంది. 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర మరో రూ. 500 పెరిగి రూ. 85,800కి చేరిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా 8 శాతం పైగా ఎగిసిందని, రూ. 6,410 మేర పెరిగిందని వివరించింది.అటు వెండి ధరల విషయానికొస్తే అయిదు రోజుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ మంగళవారం కేజీకి రూ. 500 తగ్గి రూ. 95,500కి పరిమితమైంది. మరోవైపు, టారిఫ్లపై అమెరికా, కెనడా, మెక్సికో మధ్య చర్చలు జరుగుతుండటంతో పసిడి ర్యాలీ కాస్త నెమ్మదించవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ జతిన్ త్రివేది తెలిపారు. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్టు ఒక దశలో రూ. 208 తగ్గి రూ. 83,075 వద్ద ట్రేడయిందని వివరించారు. అటు అంతర్జాతీయంగాను పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాముల) ధర ఒక దశలో 2,876 డాలర్లకు ఎగిసింది. -
పసిడి పడింది.. ఎట్టకేలకు దిగువకు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఎట్టకేలకు దిగివచ్చాయి. ఐదు రోజులుగా దూసుకెళ్లిన పసిడి రేట్లు నేడు (February 2) నేల చూపు చూశాయి. గడిచిన ఐదు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.2500 పైగా పెరిగింది. ధరలు కాస్త దిగొస్తే కొందామని ఎదురుచూస్తున్న పసిడి ప్రియులకు తగ్గినరేట్లు ఊరట కల్పిస్తున్నాయి.ఇది చదివారా? కొత్త రకం క్రెడిట్ కార్డు.. ఎఫ్డీ, యూపీఐ లింక్తో..బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.400 (22 క్యారెట్స్), రూ.440 (24 క్యారెట్స్) చొప్పున తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,050కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 84,050 వద్దకు దిగివచ్చాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.84,200 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.77,200 వద్దకు దిగివచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.440, రూ.400 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ. 77,050 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.440 క్షీణించి రూ. 84,050 వద్దకు వచ్చింది. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
దేశంలో బంగారం ధరల (Gold Prices) పరుగు ఆగడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పసిడి రేట్లు ఎగిశాయి. క్రితం రోజున ఆల్టైమ్ రికార్డ్కు చేరుకున్న ధరల పెరుగుదల నేడు (February 1) కూడా కొనసాగింది. గడిచిన నాలుగు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.2500 పైగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..ఇది చదివారా? యూపీఐకి క్రెడిట్ కార్డ్ లింక్.. లాభమా.. నష్టమా?బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.160 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,450కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 84,490 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.84,640 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.77,600 వద్దకు చేరాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.160, రూ.150 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. ఎప్పటినుంచంటే?చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ. 77,450 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.160 ఎగిసి రూ. 84,490 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!
కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025లో బంగారం దిగుమతికి సంబందించిన సుంకాలను తగ్గించాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో నేడు (జనవరి 31) బంగారం ధరలు (Gold Price) తారాజువ్వలాగా పైకి లేచాయి. తులం పసిడి రేటు గరిష్టంగా రూ. 1310 పెరిగింది. దీంతో బంగారం ధరల్లో భారీ మార్పులు ఏర్పడ్డాయి.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 77,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,330 వద్ద నిలిచాయి. నిన్న రూ. 150, రూ. 170 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఒక్కసారిగా రూ. 1200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1310 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1200, రూ. 1310 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 77,300 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 84,330 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారం.. మరింత పెరిగే అవకాశం!దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 77450 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 84,480 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1200, రూ. 1310 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి రేటు కూడా పెరిగింది. దీంతో ఈ రోజు (31 జనవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000లకు చేరుకుంది. నిన్నటి కంటే ఈ రోజు ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 99,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
దడపుట్టిస్తున్న బంగారం ధరలు: ఉలిక్కిపడుతున్న జనం!
ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025 (Budget 2025) ప్రవేశపెట్టనున్నారు. అయితే.. అంతకంటే ముందు బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కూడా పసిడి ధర పెరుగుదల దిశగా అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (Gold Price) ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 76,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,020 వద్ద నిలిచాయి. నిన్న రూ. 850, రూ. 920 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 170 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 170 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 76,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 83,020 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 76,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 83,170 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 170 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి! వెండి ధరలు (Silver Price)రూ. 1,04,000 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ రోజు రూ. 1,06,000లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి కంటే ఈ రోజు ధర రూ. 2000 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఒక్కసారిగా.. వామ్మో ఇవేం బంగారం ధరలు..?
దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుముఖంలో ఉన్న పసిడి ధరలు ఉన్నట్టుండి షాకిచ్చాయి. ఇటీవల రోజుల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో నేడు (January 29) బంగారం ధరలు ఎగిశాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవారికి ధరల మోత తప్పని పరిస్థితి.ఇది చదివారా? భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీబంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు ఏకంగా రూ.850 (22 క్యారెట్స్), రూ.920 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 75,950కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,850 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.83,000 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.76,100 వద్దకు చేరాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.920, రూ.850 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. ఎప్పటినుంచంటే?చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.850 పెరిగి రూ. 75,950 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.920 ఎగిసి రూ. 82,850 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్ద, ఢిల్లీలో రూ. 96,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
భలే ఛాన్స్.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర(Gold rate) తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.75,100 (22 క్యారెట్స్), రూ.81,930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.320 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.75,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.81,930 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 తగ్గి రూ.75,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.320 దిగజారి రూ.82,080 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలో ఉన్న తగ్గుదల వెండి ధరలో కనిపించలేదు. సోమవారం ధరతో పోలిస్తే స్థిరంగానే వెండి ధర(Silver Rate) కొనసాగుతుంది. మంగళవారం కేజీ వెండి రేటు రూ.1,04,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. త్వరలో తులం గోల్డ్ రేటు రూ.90 వేలకు చేరే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. అయితే రాబోయే బడ్జెట్లో (ఫిబ్రవరి 1) బంగారంపై దిగుమతి సుంకాలను పెంచితే.. ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని, బంగారం రేటు మరింత పెరుగుతుందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (WGC) పేర్కొంది.గత ఏడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపిందని. అంతేలోనే మళ్ళీ ఈ సుంకాలను పెంచితే.. స్మగ్లింగ్లో పెరుగుదల, దేశీయంగా బంగారం ధరలు పెరగడం వంటివన్నీ.. పరిశ్రమను వెనక్కి నెట్టేస్తాయని డబ్ల్యుజీసీ ఇండియా సీఈఓ 'సచిన్ జైన్' (Sachin Jain) వెల్లడించారు.ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలతో సహా వాటాదారులు కూడా.. ఈ బంగారం ధరలు సానుకూలంగా సాగటానికి సహకరించడం చాలా అవసరం. ఇదే జరిగితే బంగారు పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని జైన్ పేర్కొన్నారు.బంగారు పరిశ్రమ భారతదేశ జీడీపీకి 1.3 శాతం సహకరిస్తుంది. అంతే కాకుండా సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. జూలైలో సమర్పించిన బడ్జెట్ 2024లో బంగారంపై మొత్తం కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఈ చర్య అనధికారిక దిగుమతులను తగ్గించడానికి, అధికారిక మార్గాలను స్థిరీకరించడానికి, దేశీయంగా బంగారం కొనుగోలును ప్రోత్సహించడంలో సహాయపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. -
బంగారం, వెండి ధరల్లో కదలిక..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) కాస్త కరుణించాయి. రోజురోజుకూ అంతకంతకూ పెరుగుతూ కొత్త రేట్లకు చేరుతూ కొనుగుగోలుదారులకు కంగారు పుట్టిస్తున్న పసిడి ధరలు నేడు (January 27) స్వల్పంగా దిగివచ్చాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధరల్లోనూ తగ్గుదల కనిపించింది.ఇది చదివారా? ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. ఎప్పటినుంచంటే?బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.170 (24 క్యారెట్స్) చొప్పున తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 75,400కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,250 వద్దకు దిగివచ్చాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.82,400 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,550 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.170, రూ.150 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీచైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి రూ. 75,400 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.170 క్షీణించి రూ. 82,250 వద్దకు తగ్గాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు తగ్గుదల నమోదైంది. కేజీకి రూ.1000 మేర వెండి ధర దిగివచ్చింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్ద, ఢిల్లీలో రూ. 96,500 వద్ద ఉన్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణాలు ఇవే!
బంగారం ధరలు రోజు రోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. జనవరి ప్రారంభంలో రూ.78,000 వున్న బంగారం ధర, ఇప్పుడు ఏకంగా రూ. 82,420 వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ రేటు ఒక్క నెల రోజుల్లోనే ఎంత వేగంగా పెరిగిందో.. అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.త్వరలో రూ. 90వేలు?2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ప్రతి ఏటా 2 నుంచి 3 శాతం పెరుగుతుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. బంగారం 90000 రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. -
అమాంతం పెరిగిన బంగారం ధరలు: ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్!
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి దూసుకెళ్తున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా పసిడి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను తాకింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,420 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,420 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 75,700 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 82,570 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..వెండి ధరలు (Silver Price)ఆరు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 1000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 10,5000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఈ రోజు బంగారం ధరలు ఇవే..
బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు (గురువారం) మాత్రం గోల్డ్ రేట్లలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,090 వద్ద నిలిచాయు. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 75,250 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,090 వద్ద ఉంది.ఇక దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. తులం రేటు ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఎక్కువే అని స్పష్టమవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.82,240 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,400 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ, వెండి ధరలు వారం రోజుల నుంచి స్థిరంగానే ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 10,4000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 96,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఊహించనిస్థాయిలో.. దడ పుట్టిస్తున్న బంగారం కొత్త ధర!
దేశంలో బంగారం కొత్త ధరలు (Gold Prices) కొనుగోలుదారులకు దడ పుట్టిస్తున్నాయి. నిన్నటి రోజున ధరల పెరుగుదలకు బ్రేక్ ఇచ్చిన పసిడి నేడు (January 22) ఊహించనిస్థాయిలో పెరిగి షాక్ ఇచ్చింది. భారీగా ఎగిసి కొత్త మార్క్కు చేరుకుంది.పసిడి ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు ఏకంగా రూ.750 (22 క్యారెట్స్), రూ.860 (24 క్యారెట్స్) చొప్పున ఎగిశాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 75,250కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,090 వద్దకు పెరిగాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.82,240 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,400 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.860, రూ.750 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీచైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ. 75,250 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.860 పెరిగి రూ. 82,090 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్ద, ఢిల్లీలో రూ. 96,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పడిలేసిన పసిడి.. స్థిరంగా వెండి
బంగారం ధరలు దూసుకెళ్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గరిష్టంగా 120 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 81230 వద్దకు చేరింది. అయితే ఈ రోజు (జనవరి 20) దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో గోల్డ్ రేటు వరుసగా రూ.150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.120 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 74,500లకు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 81,230 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా అడుగులు వేసాయి.చైన్నైలో కూడా బంగారం ధరల పెరిగాయి. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 74,500 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 81,230 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 120 పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ రోజు 24 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.81,380 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.150, రూ.120పెరిగింది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 10,4000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 96,500 వద్ద ఉంది.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
హ్యాట్రిక్కు బ్రేక్.. దిగొచ్చిన బంగారం!
దేశంలో బంగారం కొనుగోలుదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. పసిడి హ్యాట్రిక్ ధరలకు బ్రేక్ పడింది. మూడురోజులుగా వరుసగా పెరిగిన బంగారం రేట్లు నేడు (January 18) దిగివచ్చాయి. తగ్గుదల స్పల్పంగానే ఉన్నప్పటికీ ఇది కొనసాగుతుందని పసిడి ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.160 (24 క్యారెట్స్) చొప్పున తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,350కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,110 వద్దకు క్షీణించాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.81,260 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,500 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.160, రూ.150 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఈపీఎఫ్వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి రూ. 74,350 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.160 క్షీణించి రూ. 81,110 వద్దకు వచ్చాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్ద, ఢిల్లీలో రూ. 96,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
గోల్డ్ మరో హ్యాట్రిక్.. ఊహించని రేటుకు చేరిన బంగారం
దేశంలో బంగారం ధరలు (Gold Price) మళ్లీ భగ్గుమన్నాయి. పండుగకు ముందు వరుసగా పెరిగిన పసిడి రేట్లు మరోసారి హ్యాట్రిక్ కొట్టాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 17) భారీగా ఎగిశాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మాత్రం తగ్గం లేదు.పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు ఏకంగా రూ.600 (22 క్యారెట్స్), రూ.650 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,500కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,270 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.81,420 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,650 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.600, రూ.650 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.600 పెరిగి రూ. 74,500 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 ఎగిసి రూ. 81,270 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు హ్యాట్రిక్ పెరుగుదలను కనబర్చాయి. వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్దకు, ఢిల్లీలో రూ. 96,500 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నేటి బంగారం ధర ఎలా ఉందంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.73,400 (22 క్యారెట్స్), రూ.80,070 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.73,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.80,070 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర(Gold Price) రూ.100 పెరిగి రూ.73,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 ఎగబాకి రూ.80,220 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగినట్లే వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర(Silver rates) కేజీకి రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పండగ వేళ పసిడి ప్రియులకు గుడ్న్యూస్
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం(Gold) పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే పండగవేళ(Festive Time) మంగళవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.73,300 (22 క్యారెట్స్), రూ.79,960 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్స్పై రూ.100, 24 క్యారెట్స్పై రూ.110 చొప్పున తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.73,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.79,960 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 తగ్గి రూ.73,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 దిగజారి రూ.80,110 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కేజీ వెండి(Silver Price) రేటు రూ.2,000 తగ్గి రూ.1,00,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పండగొచ్చింది.. బంగారం ధర పెరిగింది
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు గోల్డ్ రేటు (Gold Price) రూ.80 వేలు దాటేసింది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు గరిష్టంగా రూ.430 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ నేటి (సోమవారం) బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో గోల్డ్ రేటు వరుసగా రూ.400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.430(24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,400లకు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,070 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా అడుగులు వేసాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 73,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 80,070 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 430 పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ రోజు 24 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.80,220 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,550 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.400, రూ.420 పెరిగింది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 10,2000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 94,500 వద్ద ఉంది.2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. చాలా మంది గోల్డ్ మీదనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం బంగారం ధరలు రోజు రోజుకు గణనీయంగా పెరగడమే. ఇందులో నష్టాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. ఆర్ధిక పరిస్థితుల అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. 2025లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 85,000 నుంచి రూ. 90,000లకు చేరుకునే అవకాశం ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..
ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది. సింధు నదిలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (GSP) వెల్లడించింది. సుమారు 32.6 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలని (రూ.18 వేలకోట్ల కంటే ఎక్కువ) అంచనా.సింధునది, హిమాలయాల దిగువన టెక్నోనిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల.. బంగారం అణువులు ఏర్పడుతున్నాయని, ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ.. పాకిస్తాన్ పరీవాహక ప్రాంతాల్లో వ్యాపించినట్లు జీఎస్పీ స్పష్టం చేసింది. ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఇక మంచి రోజులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.సింధు నదిలో సుమారు 32 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి.. చర్యలు చేపట్టనున్నట్లు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖామంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ వెల్లడించారు. ప్రస్తుతం పంజావ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తున్వా ప్రావీన్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?పేద దేశంగా.. దిగజారిపోతున్న తరుణంలో పాకిస్తాన్కు మంచి రోజులు వచ్చాయి. ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడంతో.. దేశం ఊపిరి పీల్చుకోనుంది. మళ్ళీ అభివృద్ధివైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తున్న పాక్.. భవిష్యత్తు మారే రోజులు వచ్చినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.సింధు నదిసింధు నది ప్రపంచంలోని పురాతన, పొడవైన నదులలో ఒకటి. ఇది ప్రారంభ నాగరికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సింధు లోయ నాగరికత 3300 - 1300 BCE మధ్య దాని ఒడ్డున అభివృద్ధి చెందింది. 1947 విభజనకు ముందు, సింధు నది పూర్తిగా భారతదేశంలోనే ఉండేది. అయితే విభజన తరువాత లేదా ఇప్పుడు సింధు నది రెండింటి గుండా ప్రవహిస్తుంది. -
రూ.14.37 కోట్ల బంగారం స్వాదీనం
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన 17.90 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకొని.. ఒక మహిళ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను విజయవాడ కస్టమ్స్ కమిషనర్ ఎస్.నరసింహారెడ్డి ఆదివారం మీడియాకు తెలియజేశారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు విజయవాడ కస్టమ్స్(ప్రివెంటివ్) కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు.తాడిపత్రి, నెల్లూరు రైల్వేస్టేషన్తో పాటు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద కస్టమ్స్(ప్రివెంటివ్), తిరుపతి, గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్లో విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న 17.90 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పారు. నిందితులను విశాఖపట్నం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు నరసింహారెడ్డి తెలిపారు. -
కొత్త రేటుకు బంగారం.. మళ్లీ పెరిగిందా.. తగ్గిందా?
దేశంలో బంగారం (Gold Price) కొత్త ధరలను నమోదు చేసింది. వరుసగా నాలుగో రోజూ ఎగిశాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 11) స్వల్పంగానే పెరిగినప్పటికీ ధరలు దిగిరాకపోవడంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. నాలుగు రోజుల్లో తులం (10 గ్రాములు) బంగారం రూ.900 పైగా పెరిగింది.దేశంలో పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.170 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,000కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,640 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,800 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,150 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.180, రూ.150 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలుచైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ. 73,000 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.170 బలపడి రూ. 79,640 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్ద, ఢిల్లీలో రూ. 93,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
హ్యాట్రిక్ కొట్టిన పసిడి.. ఎగిసిన వెండి
దేశంలో బంగారం ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. వరుసగా మూడో రోజూ ఎగిసి హ్యాట్రిక్ కొట్టాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 10) స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ధరలు దిగిరాకపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించలేదు.దేశంలో పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.250 (22 క్యారెట్స్), రూ.270 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,850కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,470 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,620 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,000 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.350, రూ.380 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ. 72,850 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.270 బలపడి రూ. 79,470 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు పెరుగుదలను కనబర్చాయి. వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్దకు, ఢిల్లీలో రూ. 93,500 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మరింత ఖరీదైన బంగారం.. కొనాలంటే..
దేశంలో బంగారం ధరలు (Gold Price) వరుసగా రెండో రోజూ మరింత పెరిగాయి. మూడు రోజులు స్థిరంగా ఉన్న పసిడి ధరలు క్రితం రోజున ఉన్నట్టుండి స్వల్పంగా పెరిగాయి. ఈ పెరుగుదలను కొనసాగిస్తూ నేడు (January 9) మరింతగా ఎగిశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.350 (22 క్యారెట్స్), రూ.380 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,600కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,200 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,350 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,750 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.350, రూ.380 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.350 పెరిగి రూ. 72,600 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.380 బలపడి రూ. 79,200 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ. 92,500 వద్ద ఉన్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పసిడి రుణాలే కీలకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పసిడి రుణాలకు డిమాండ్ పెరుగుతోందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ) డిప్యూటీ సీఈవో రాజీవ్ యాదవ్ తెలిపారు. రాబోయే 3–5 ఏళ్లలో తమ బ్యాంకు వృద్ధి వ్యూహాల్లో గోల్డ్ లోన్లు కీలక పాత్ర పోషించగలవని సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఇరవై నిమిషాల్లోపే రుణాల మంజూరుతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ పసిడికి డిమాండ్ పటిష్టంగానే ఉంది. ఐబీఈఎఫ్ అధ్యయనం ప్రకారం, పసిడిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెపె్టంబర్ మధ్య కాలంలో గోల్డ్కు డిమాండ్ 18 శాతం పెరిగింది. ఆర్థిక అనిశి్చతులతో పాటు ఫైనాన్సింగ్ ఆప్షన్గా బంగారం రుణాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గోల్డ్ లోన్లకు డిమాండ్ పెరుగుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్లో కుటుంబాల వద్ద 25,000 టన్నుల పైగా బంగారం ఉన్నట్లు అంచనా.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సత్వరం, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకోవాలనుకునే వ్యక్తులు, వ్యాపారవర్గాలకు బంగారం రుణాలు ఆకర్షణీయమైన ఆప్షన్గా మారాయి. మేము తక్కువ డాక్యుమెంటేషన్, సరళతరమైన ప్రక్రియతో కస్టమర్లకు సేవలు అందిస్తున్నాం. 12.99 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటు, 20 నిమిషాల్లోపే వేగవంతంగా రుణ వితరణ, వ్యక్తిగత పరిస్థితులను బట్టి సరళతరమైన రీపేమెంట్ ఆప్షన్లు మొదలైన మార్గాల్లో మేము కస్టమర్లకు సరీ్వసులు అందిస్తున్నాం. విశ్వసనీయత, పారదర్శకత, సౌకర్యానికి పెద్ద పీట వేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భిన్నమైన ధోరణులు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గోల్డ్ లోన్ ధోరణులు భిన్నంగా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ ఖర్చులు, చిన్న వ్యాపారాలు, అత్యవసర పరిస్థితుల కోసం బంగారం రుణాలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ రుణ సాధనాల లభ్యత పరిమితంగా ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల కోసం గ్రామీణ ప్రాంతాల కస్టమర్లు బంగారం రుణాలపై ఆధారపడుతుంటారు. ఇక పట్టణ ప్రాంతాల విషయానికొస్తే.. గోల్డ్ లోన్లను నిర్వహణ మూలధన అవసరాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తల వెంచర్లు, లైఫ్ స్టయిల్ ఖర్చులు మొదలైన వాటికోసం తీసుకుంటున్నారు.పట్టణ ప్రాంతాల కస్టమర్లు సౌకర్యం, వేగానికి ప్రాధాన్యమిస్తూ సత్వరమైన, టెక్ ఆధారిత సొల్యూషన్స్ను కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మేమూ సరీ్వసులు అందిస్తున్నాం. పసిడి ధరలు ఆల్–టైమ్ గరిష్ట స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో ఇటు బ్యాంకు అటు కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా ఏయూ ఎస్ఎఫ్బీ పటిష్టమైన రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు పాటిస్తుంది. మెరుగైన లోన్–టు–వేల్యూ (ఎల్టీవీ) నిష్పత్తులను పాటిస్తుంది. ఎప్పటికప్పుడు పసిడి ధరల ధోరణులు, మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, పాలసీలను అలాగే పథకాలను తదనుగుణంగా మార్చుకుంటూ ఉంటోంది. వృద్ధి ప్రణాళికలు .. మా పసిడి రుణాల పోర్ట్ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 1,986 కోట్లుగా ఉంది. క్యూ1లో ఇది రూ. 1,791 కోట్లు. వచ్చే 3–5 ఏళ్లలో బ్యాంకు వృద్ధి వ్యూహాల్లో గోల్డ్ లోన్లు కీలక పాత్ర పోషించనున్నాయి. మా రిటైల్, ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియోలను విస్తరించడంలో పసిడి రుణాలు గణనీయంగా తోడ్పడే అవకాశముంది. టెక్నాలజీని వినియోగించుకుంటూ, బ్రాంచ్ నెట్వర్క్ను విస్తరించి, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆఫర్లను అందించడం ద్వారా మా గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోను మరింతగా పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయి. -
బంగారం, వెండి ధరల అప్డేట్.. తులం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Price) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,150 (22 క్యారెట్స్), రూ.78,710 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు(Gold Rate) వరుసగా రూ.72,150 రూ.78,710గా ఉంది.ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.72,300గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.78,860గా ఉంది. మంగళవారం బంగారం ధరల మాదిరి కాకుండా వెండి ధర(Silver price)ల్లో మార్పులొచ్చాయి. ఈ రోజు వెండి ధర కేజీకి రూ.1000 పెరిగి రూ.1.00,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి కాంతుల్లో సెంట్రల్ బ్యాంకులు
ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాలతో ప్రపంచ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 నవంబర్లో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల 53 టన్నుల పసిడి నిల్వలను పెంచుకోగా, ఇందులో భారత్ రిజర్వ్ బ్యాంక్ వాటా 8 టన్నులు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → 2024లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని స్థిరమైన, భద్రమైన అసెట్గా భావించి, కొనుగోళ్లకు ఆసక్తి ప్రదర్శించాయి. ముఖ్యంగా 2024 చివరి భాగాన్ని పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపాయి. → అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్లో బంగారం ధరలు తగ్గాయి. దీనిని కొనుగోళ్లకు ఒక మంచి అవకాశంగా సెంట్రల్ బ్యాంకుల భావించాయి. → నవంబర్లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు అయ్యింది. దీనితో భారత్ సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి. → 2024లో రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ కొనసాగింది. మొదటి స్థానంలో పోలాండ్ ఉంది. పోలాండ్ నేషనల్ బ్యాంకు నవంబర్లో 21 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. → ఉజ్బెకిస్తాన్ కేంద్ర బ్యాంకు 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.దీనితో ఈ దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 382 టన్నులకు చేరాయి. → కజికిస్గాన్ నేషనల్ బ్యాంక్ నవంబర్లో 5 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, మొత్తం దేశ బంగారం నిల్వలు 295 టన్నులకు చేరాయి. → చైనా పీపుల్స్ బ్యాంక్ (పీబీఓసీ) ఆరు నెలల విరామం తర్వాత బంగారం కొనుగోళ్లను పునఃప్రారంభించి, నవంబర్లో 5 టన్నులు కొనుగోళ్లు జరిగింది. వార్షికంగా నికర కొనుగోళ్లు 34 టన్నులు. మొత్తం పసిడి నిల్వలు 2,264 టన్నులకు (మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలో 5 శాతం) చేరాయి. → జోర్డాన్ నవంబర్లో 4 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగింది. జూలై తర్వాత దేశం పసిడి కొనుగోళ్లు జరిపింది నవంబర్లోనే కావడం గమనార్హం. దేశం మొత్తం పసిడి నిల్వలు 73 టన్నులకు ఎగశాయి. → టర్కీ నవంబర్లో జరిపిన కొనుగోళ్ల పరిమాణం 3 టన్నులు. → చెక్ నేషనల్ బ్యాంక్ వరుసగా 21 నెలలుగా కొనుగోళ్లు జరుపుతోంది. నవంబర్లో జరిపిన కొనుగోళ్లు 2 టన్నులు. వార్షికంగా కొనుగోళ్లు 20 టన్నులు. దీనితో బ్యాంకు వద్ద మొత్తం నిల్వలు 50 టన్నులపైకి ఎగశాయి. → ఘనా నేషనల్ బ్యాంక్ నవంబర్లో టన్నుల కొనుగోళు చేయగా, వార్షికంగా చేసిన కొనుగోళ్లు 10 టన్నులు. దీనితో దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 29 టన్నులకు చేయాయి. ఎకానమీ స్థిరత్వానికి పసిడి నిల్వలు కీలకమని ఘనా భావిస్తోంది.సింగపూర్ అమ్మకాలు.. కాగా, సింగపూర్ మానిటరీ అథారిటీ నవంబర్లో 5 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2024లో ఇప్పటి వరకు 7 టన్నుల నికర అమ్మకాలు జరిపింది. దీనితో మొత్తం నిల్వలు 223 టన్నులకు తగ్గాయి. -
స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2025 సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,150 (22 క్యారెట్స్), రూ.78,710 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72,150 రూ.78,710గా ఉంది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి(Gold) ధర రూ.72,300గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.78,860గా ఉంది. సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేనట్లే వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు వెండి ధర(Silver Price) కేజీకి రూ.99,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం తగ్గిందండోయ్.. కొత్త ఏడాదిలో తొలిసారి..
కొత్త ఏడాది ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Price) తొలిసారి ఈరోజు (January 4) తగ్గాయి. క్రితం రోజున బంగారం ధర 10 గ్రాములకు గరిష్టంగా రూ.870 పెరిగింది. జనవరి 1 నుంచి 3 వరకు రూ.1,640 వరకూ పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 80వేలకు చేరువయింది. ఈ క్రమంలో నేడు పసిడి ధరలు దిగరావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగింది.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.450 (22 క్యారెట్స్), రూ.490 (24 క్యారెట్స్) తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,150కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 78,710 వద్దకు దిగి వచ్చాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.78,860 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,300 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.450, రూ.490 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.450 తగ్గి రూ. 72,150 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.490 క్షీణించి రూ. 78,710 వద్దకు దిగివచ్చాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు2025 ఏడాదిలో వెండి ధరలు కూడా నేడు తొలిసారి తగ్గుదలను నమోదు చేశాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న వెండి ధరలు క్రితం రోజున ఏకంగా రూ. 2000 పెరిగింది. దీంతో నిరాశచెందిన కొనుగోలుదారులకు ఈరోజు ఊరట కలిగింది.హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధర కేజీకి రూ. 1000 చొప్పున తగ్గి రూ.99,000 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో కూడా రూ.1000 క్షీణించి రూ. 91,500 వద్దకు తగ్గింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం ఎక్కడైనా బంగారమే : అసలేంటీ క్యారెట్ కథ
ప్రపంచంలో ఏ దేశంలోనైనా బంగారం(Gold) అత్యంత విలువైన లోహంగా గౌరవం అందుకుంటోంది. బంగారం స్వచ్ఛత గురించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నిష్పత్తిని అనుసరిస్తుంటారు. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారట్ (Carot) ల బంగారం. ఆభరణం తయారు చేయాలంటే కొన్ని ఇతర లోహాల మిశ్రమాన్ని బంగారంలో కలుపుతారు. బంగారం మెత్తటి లోహం. కాబట్టి ఆభరణం ఆకారం గట్టిదనం కోసం ఇతర లోహాలను కలపాలి. అలా లోహపు మిశ్రమాల కలయిక తర్వాత ఆభరణం తయారు చేయడానికి ఉపయోగించే బంగారం స్వచ్ఛత 22 క్యారట్లు ఉంటుంది. క్యారట్ అనే పదం అయోమయానికి గురి చేస్తుంది. బంగారం స్వచ్ఛత విషయంలో ఉపయోగించే క్యారట్ అనే పదం ఇంగ్లిష్ అక్షరం ‘కె’తో సూచిస్తారు. మరో క్యారట్ రాళ్ల (వజ్రంతో సహా అన్ని రకాల రాళ్లు) బరువును సూచించే పదం. ఈ క్యారట్ను ‘సి’తో అనే అక్షరంతో సూచిస్తారు. ఒక క్యారట్ అంటే 200 మిల్లీగ్రాములు. బంగారం ధర పెరగడం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారట్లకు బదులు 18, 14, 9 క్యారట్ స్వచ్ఛతతో ఆభరణాలు చేస్తున్నారు. క్యారట్ స్వచ్ఛత తగ్గేకొద్దీ గట్టిదనం పెరుగుతుంది. వజ్రాలు పొదిగే ఆభరణాలకు సాధారణంగా 18 క్యారట్ బంగారం ఉపయోగిస్తారు. ఇప్పుడు 9 క్యారట్ బంగారంతో కూడా వజ్రాల ఆభరణాలు చేస్తున్నారు. తక్కువ క్యారట్ బంగారు ఆభరణాలను కొంటే తిరిగి అమ్మేటప్పుడు ఆ బంగారానికి విలువ రాదనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం కొన్న ఆభరణంలో ఎంత నిష్పత్తి బంగారం ఉందో కరిగించినప్పుడు ఆ మేరకు బంగారమే తిరిగి వస్తుంది. బీఐఎస్ హాల్మార్క్ వేసిన 18 క్యారట్ బంగారాన్ని కరిగిస్తే 75 శాతం బంగారం వస్తుంది. అంతకంటే క్యారట్ తగ్గితే ఆ మేరకే బంగారం వస్తుంది. అంతే తప్ప తిరిగి ఏమీ రాదనేది అ΄ోహ మాత్రమే. సర్టిఫికేట్లో ఆభరణంలో ఉన్న బంగారం స్వచ్ఛతతో పాటు క్యారట్ వివరం తాలూకు పర్సెంటేజ్ కూడా ఉంటుంది. – విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్ ఇదీ చదవండి: Sankranti 2025 : పర్ఫెక్ట్ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు -
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు: 2025లో ఇదే గరిష్టం
కొత్త ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గోల్డ్ రేటు (Gold Price) గరిష్టంగా రూ.870 పెరిగింది. జనవరి 1 నుంచి ఈ రోజు (January 3) వరకు 10 గ్రాముల పసిడి ధర గరిష్టంగా రూ.1,640 పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 80వేలకు చేరువయింది. ఈ కథనంలో నేటి బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.79,350 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,750 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.870, రూ.800 పెరిగినట్లు స్పష్టమవుతోంది.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 72,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 79,200 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 800, రూ. 870 పెరిగినట్లు తెలుస్తోంది.ఇక హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో గోల్డ్ రేటు వరుసగా రూ.800 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.870 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,600కు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,200 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.వెండి ధరలు2025 ప్రారంభం నుంచి నిశ్చలంగా ఉన్న వెండి ధరలు ఈ రోజు ఏకంగా రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 1,00,000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 92,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
భర్త నుంచి.. వామ్మో ఇవేం కోరికలు.. కానుకలు!
దుబాయ్కి (Dubai) చెందిన ఒక మిలియనీర్ భార్య తాను గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్తను కోరిన కోరికలను వింటే మతిపోతుంది. తన సంపన్నమైన, విలావంతమైన జీవనశైలిని తెలియజెప్పేలా ఫొటోలను, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేరే లిండా ఆండ్రేడ్ (Linda Andrade) అనే మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్త నుంచి తాను ఏమేమి కోరిందో పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ లిస్ట్ విని వామ్మో ఇవేం డిమాండ్లు అని ముక్కున వేలేసుకోవడం నెటిజన్ల వంతైంది.ఎప్పుడూ షాపింగ్ చేస్తూ విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసే లిండా, తనను తాను "అసలైన దుబాయ్ గృహిణి" అని అభివర్ణించుకుంటుంది. ఆమె రికీ అనే మిలియనీర్ను వివాహం చేసుకుంది. “ఇవి సరిపోతాయా?” అనే క్యాప్షన్తో షేర్ చేసిన వీడియోలో లిండా తన భర్త నుంచి ఖరీదైన లంబోర్గిని కారు (Lamborghini), 9 క్యారెట్ల డైమండ్ రింగ్, కేజీలకొద్దీ బంగారం (gold), ఇతర వస్తువులను కానుకలుగా అడిగినట్లు వెల్లడించింది."దుబాయ్లో హాట్ మామ్స్ మాత్రమే ఉంటారు" అంటూ భర్త తన కోసం కొన్న సరికొత్త విల్లాను పరిచయం చేసింది. అలాగే ఇటీవల భర్త కొనిచ్చిన ఖరీదైన హీర్మేస్ క్రోకోడైల్ హ్యాండ్బ్యాగ్ను కూడా ఫాలోవర్లకు చూపించింది. అంతేకాదు భర్త నుంచి సరికొత్త లంబోర్ఘిని కారును బహుమతిగా పొందినట్లు పేర్కొంది. ఆమె డిమాండ్లు ఇక్కడితో ఆగలేదు. తొమ్మిది నెలల గర్భానికి సంకేతంగా 9 క్యారెట్ డైమండ్ రింగ్.. ప్రసవించే ముందు తన బిడ్డ బరువుకు సమానమైన బంగారం కూడా కానుకల జాబితాలో ఉన్నాయి.ఈ వీడియోకు 1.16 లక్షల లైక్లు, 2,700 పైగా కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఆమె వీడియోకు ప్రతిస్పందించారు. లిండా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇటువంటివి అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ ఆమె కొనుగోలు చేసిన కొత్త ఉత్పత్తులను చూపుతుంటుంది. కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు షేర్ చేసిన వీడియోలో 2 లక్షల డాలర్ల వాచ్, 67,000 డాలర్ల విలువైన వైవ్స్ సెయింట్ లారెంట్ ఆర్కైవల్ పీస్తో సహా తాను కొన్న ఖరీదైన వస్తువులను పంచుకుంది. View this post on Instagram A post shared by Linda Andrade (@lionlindaa) -
మహిళలు వెయిట్ పెంచండి..!
ఒంటి పైన బంగారం ఉన్న మహిళ వరలక్ష్మిలా ఉంటుంది. అదేంటి! ధన లక్ష్మిలా కదా ఉండాలి? అవుననుకోండి. బంగారం.. ధనానికి (సంపదకు) ఒక రూపం మాత్రమే. బంగారానికి పూర్తి స్వరూపం మాత్రం స్త్రీమూర్తే.భారతీయ స్త్రీ బంగారానికి ప్రాణం ఇస్తుంది అంటారు కానీ, నిజానికి అనవలసింది.. బంగారానికే ఆమె ప్రాణం పోస్తుందని. గనుల్లో ఉండే బంగారానికి ఏం ‘వెయిట్’ ఉంటుందని! ఇంతులు ధరిస్తేనే కదా తులాలకు విలువ!బంగారం ప్రతి దేశంలోనూ ఉంటుంది. బంగారాన్ని ఇష్టంగా, అదొక నిష్ఠగా, వేడుకగా, అందంగా, ఆచారంగా.. వాటన్నిటినీ కలిపి నిండుగా ధరించే మహిళలు మాత్రం మన దేశంలోనే ఉంటారు. ఎంత నిండుగానో తెలుసా? ‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ తాజా సర్వే ప్రకారం భారతీయ మహిళల దగ్గరున్న బంగారం 24 వేల టన్నులు!అత్యధికంగా బంగారం ఉన్న మొదటి ఐదు దేశాల కంటే కూడా మన మహిళల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువ. అమెరికా ఎంత తవ్వి తలకెత్తుకున్నా ఆ దేశంలో ఉన్నది 8,000 టన్నుల బంగారం మాత్రమే. ఆ తర్వాతి స్థానం జర్మనీది. అక్కడున్నది 3,300 టన్నులు. ఇటలీ 2,450 టన్నుల బంగారంతో మూడో స్థానంలో ఉంది. నాలుగు, ఐదు స్థానాల్లో ఫ్రాన్స్ (2,400 టన్నులు), రష్యా (1,900) ఉన్నాయి. మొత్తం కలిపినా భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. మన దగ్గర కూడా దక్షిణాది మహిళల దగ్గరే ఎక్కువ (40 శాతం వరకు) బంగారం ఉంది. ఆ నలభైలో 28 శాతం తమిళనాడు మహిళలదే.బంగారం ధరించిన మహిళల్ని వరలక్ష్ములు అనటం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర్నుంచి కూడా వారు ‘వరాలు’ పొందారు. వివాహిత స్త్రీలు ఎలాంటి పన్నూ చెల్లించకుండానే అరకిలో వరకు బంగారాన్ని కొనుక్కోవచ్చు. అవివాహిత మహిళలకు పావు కిలో వరకు పన్నులుండవు. మరి పురుషులకు? వంద గ్రాములు దాటితే వారిపై కన్ను, పన్ను రెండూ పడతాయి. కనుక, ఈ కొత్త సంవత్సరంలో బంగారం వెయిట్ పెంచే బాధ్యత మహిళలదే. ఒంటిపైన బంగారం ఉన్న మహిళ మాత్రమే కాదు, మహిళ ఒంటిపై ఉన్న బంగారం కూడా వరలక్ష్మీ అమ్మవారే! (చదవండి: 'జీరో వేస్ట్ వెడ్డింగ్'! పర్యావరణమే మురిసే..) -
బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే!
భారత దేశంలో బంగారాన్ని (Gold) సంపదకు, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. మన సంప్రదాయాలలో పసిడి లోతుగా పాతుకుపోయింది. బంగారం కొనడాన్ని భారతీయులు అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా పండుగ సందర్భాలలో పుత్తడి కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. నాణేలు, ఆభరణాలు.. ఇలా వివిధ రూపాల్లో బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటారు.అంతటి ప్రాధాన్యత ఉన్న బంగారాన్ని కొనడానికి ముందు దానికి సంబంధించిన నిబంధనలను తెలుసుకోవడం, అనుసరించడం కూడా అంతే ముఖ్యం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్గదర్శకాల ప్రకారం, డిక్లేర్డ్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం, సహేతుకమైన గృహ పొదుపులు లేదా చట్టబద్ధంగా సంక్రమించిన ఆస్తులతో కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి పన్నులు ఉండవు. ఇలా కాకుండా వేరే మార్గాల ద్వారా సమకూర్చుకున్న బంగారం పరిమితులకు మించి ఉంటే అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.ఎంత బంగారం ఉండొచ్చు?వివాహిత మహిళలు: 500 గ్రాముల వరకుఅవివాహిత స్త్రీలు: 250 గ్రాముల వరకుపురుషులు (వివాహితులు, అవివాహితులు ఎవరైనా): 100 గ్రాముల వరకుబంగారం.. పెట్టుబడి మార్గంస్టాక్లు, మ్యూచువల్ ఫండ్లు బాండ్లతో పాటు బంగారం కూడా చాలా కాలంగా విశ్వసనీయ పెట్టుబడి ఎంపికగా ఉంది. సంపదను పెంచుకోవడానికి ఇది నమ్మదగిన మార్గంగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) వంటి బంగారు పెట్టుబడుల కొత్త రూపాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ భౌతిక బంగారాన్ని ఇష్టపడుతున్నారు. వివిధ రకాల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు వాటి నిబంధనలను పరిశీలిస్తే..ఫిజికల్ గోల్డ్: పురుషులు 100 గ్రాముల వరకు కలిగి ఉండవచ్చు. వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత స్త్రీలు 250 గ్రాములు గరిష్టంగా కలిగి ఉండవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత భౌతిక బంగారాన్ని విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతంతోపాటు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వల్పకాలిక అమ్మకాలపై ఆదాయ స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను ఉంటుంది. అలాగే కొనుగోళ్లపైనా 3% జీఎస్టీ (GST) ఉంటుంది.డిజిటల్ గోల్డ్: ఇది మరింత అనుకూలమైన ఎంపిక. డిజిటల్ గోల్డ్లో నిల్వ అవాంతరాలు ఉండవు. ఉపసంహరణపై మాత్రమే పన్నులు వర్తిస్తాయి. దీనిపై పెట్టే రోజువారీ ఖర్చు రూ. 2 లక్షలకు పరిమితం.సావరిన్ గోల్డ్ బాండ్: ఈ బాండ్లు సంవత్సరానికి 4 కిలోల వరకు పెట్టుబడిని అనుమతిస్తాయి. దీనిపై 2.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. అయితే ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత వీటి నుండి వచ్చే లాభాలు పన్ను రహితంగా ఉంటాయి.గోల్డ్ ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్లు: వీటి నుండి వచ్చే లాభాలపై భౌతిక బంగారంతో సమానంగా పన్ను ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలపై మూడేళ్ల తర్వాత 20 శాతం పన్ను విధిస్తారు. -
ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2025 ఏడాది మొదటిరోజు బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,500 (22 క్యారెట్స్), రూ.78,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.71,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 అధికమై రూ.78,150 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుఏడాది ప్రారంభ రోజు బుధవారం బంగారం ధరలు పెరిగినట్లుగా వెండి ధరల్లో మార్పులేమి రాలేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర మారకుండా స్థిరంగా కేజీకి రూ.98,000 వద్దే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం రూ. 90వేలు?: 2025లో ధరలు..
2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ధరలు పెరగడానికి కారణం ఏమిటి? గోల్డ్ రేటు పెరిగితే కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతుందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. చాలా మంది గోల్డ్ మీదనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం బంగారం ధరలు రోజు రోజుకు గణనీయంగా పెరగడమే. ఇందులో నష్టాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి.ఆర్ధిక పరిస్థితుల అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. 2025లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 85,000 నుంచి రూ. 90,000లకు చేరుకునే అవకాశం ఉంది. 2024 అక్టోబర్ 30న బంగారం రేటు రూ.82400 వద్ద ఆల్టైమ్ గరిష్టాలను తాకింది. కేజీ వెండి ధర కూడా ఏకంగా లక్ష రూపాయల మార్క్ అధిగమించేసింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మాత్రమే కాకుండా.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు వంటివి 2025లో గోల్డ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024తో పోలిస్తే వృద్ధి రేటు 2025లో మితంగా ఉండవచ్చని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది పేర్కొన్నారు. వెండి ధర 2025లో రూ. 1.25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గే అవకాశం లేదని సమాచారం.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న మస్క్.. వినడానికే వింతగా ఉంది!సాధారణంగా బంగారం ధరలు ప్రతి ఏటా 2 నుంచి 3 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంతో క్రిప్టో కరెన్సీ వాల్యూ పెరుగుతోంది. దీని వద్ద బంగారం కొనుగోళ్లు కొంత మందగించి అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.మోదీ ప్రభుత్వం జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాలను 6 శాతం తగ్గించింది. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ తరువాత పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఆ తరువాత వచ్చిన పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ వంటివి మళ్ళీ బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. కాగా వచ్చే ఏడాది గోల్డ్ రేట్లు మరింత పెరుగుతాయని స్పష్టమవుతోంది. -
లాస్ట్ డే.. భలే ఛాన్స్.. బంగారం తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీ(Equity)ల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర(Gold Rate Today) తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం 2024 ఏడాది చివరి రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,100 (22 క్యారెట్స్), రూ.77,560 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,560 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 తగ్గి రూ.71,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 దిగజారి రూ.77,710 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,900 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కొత్త ఏడాది బంగారం కొనడం కష్టమే!.. ఎందుకో తెలుసా?
దేశంలో బంగారం ధరలు మరోమారు పెరిగాయి. నేడు (డిసెంబర్ 27) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.270 పెరిగింది. దీంతో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఈ రోజు బంగారం ధరలను గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 78,150 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,650.పసిడి ధరలు చెన్నైలో కూడా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.71,500 వద్ద ఉంది. ధరలు ఎలా ఉన్నా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు కొంత పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,00,000 వద్ద నిలిచింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల.. కొత్త ఏడాది ప్రారంభంలో గోల్డ్, సిల్వర్ కొనాలనుకునే.. కొనుగోలుదారులు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
గులాబ్ జామూన్తో మాజీ మంత్రికి చిక్కులు
దొడ్డబళ్లాపురం: శ్వేతా గౌడ అనే మహిళ మాజీ మంత్రి పేరు చెప్పుకుని బెంగళూరు కమర్షియల్ వీధిలో ఓ జ్యువెలరీ షాప్ నుంచి రూ. 2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బు ఇవ్వకుండా టోకరా ఇచ్చిన కేసు మలుపు తిరిగింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్ భారతినగర పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిందితురాలు.. ఆయన ముద్దుగా పిలుచుకునే గులాబ్ జామూన్.. శ్వేతాగౌడ ఇచ్చిన మొత్తం రూ.12.50 లక్షల విలువైన నగదు, గిఫ్ట్లు, బంగారు నగలను పోలీసు అధికారులకు అప్పగించారు. శ్వేతగౌడ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఆమె అడగకుండానే కానుకలు ఇచ్చిందని పోలీసులకు వర్తూరు తెలిపారు. తన పేరు చెప్పగానే జ్యువెలరీ షాప్ యజమాని కోట్ల విలువైన నగలను ఆమెకు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.ఫేస్బుక్లో పరిచయమై..అయితే శ్వేతా గౌడ, వర్తూరు ప్రకాశ్ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని, అనేకసార్లు మైసూరు చాముండి కొండకు వెళ్లారని, తిరుమల కొండకు వెళ్లడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి మూడు నగల షాపుల్లో షాపింగ్ చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. 6 నెలల క్రితం శ్వేతాగౌడ వర్తూరుకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైందని, తరువాత వాట్సాప్, మెసెంజర్లలో ఘాటుగా చాటింగ్ చేసుకున్నారని, శ్వేతగౌడ మొబైల్ నంబర్ను గులాబ్ జామూన్ అని వర్తూరు ప్రకాశ్ సేవ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.మరో ఆభరణాల మోసం..యశవంతపుర: మాజీ ఎంపీ డికే సురేశ్ చెల్లినని చెప్పుకొంటూ మహిళ ఒకరు 14.6 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి మోసం చేసిన ఘటన బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఐశ్యర్య గౌడ, నటుడు ధమేంద్ర, హరీశ్ అనే వ్యక్తులపై కేసు నమోదైంది. ఐశ్వర్య.. ఓ నగల దుకాణానికి వెళ్లి 11 సార్లు బంగారాన్ని కొనుగోలు చేసి మాజీ ఎంపీ పేరు చెప్పి వెళ్లిపోయింది. దీంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం(Gold)లో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Price) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.100 దిగజారి రూ.77,600 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగినట్లే వెండి ధరల్లో మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర కేజీకి రూ.100 పెరిగి రూ.99,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీ(Equity)ల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,900 (22 క్యారెట్స్), రూ.77,350 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100 చొప్పున తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,350 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 తగ్గి రూ.71,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.100 దిగజారి రూ.77,500 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. కానీ వెండి ధర(Silver Rate)ల్లో మాత్రం నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి రేటు రూ.98,900 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం ఇప్పుడు కొనండి!.. ఎందుకంటే?
డిసెంబర్ నెల ప్రారంభం నుంచి పడుతూ.. లేస్తూ.. వస్తున్న బంగారం ధరలు నేడు (డిసెంబర్ 23) స్థిరంగా ఉన్నాయి. కాబట్టి పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ నగరంలో ధరలు ఎక్కువగా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ (విజయవాడ), తెలంగాణ (హైదరాబాద్)లలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 77,450 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 77,600 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,150. ధరలు ఎలా ఉన్నా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.చెన్నైలో పసిడి ధరలు నిశ్చలంగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.77,450 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.71,000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ వెండి ధరలు కూడా రూ.1,00 మాత్రమే తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ. 98,900 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
Hyderabad: సొంత తమ్ముడే సూత్రధారి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని దోమలగూడ ఠాణా పరిధిలో ఈ నెల 12న తెల్లవారుజామున చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసును మధ్య మండల టాస్్కఫోర్స్ పోలీసులు ఛేదించారు. బాధితుడి తమ్ముడే దీనికి సూత్రధారిగా తేల్చారు. దొంగతనానికి పథకం ఓ న్యాయవాది వేయగా... ఇద్దరు రౌడీషీటర్లు తమ అనుచరులతో కలిసి అమలు చేసినట్లు గుర్తించారు. మొత్తం 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.1.2 కోట్ల విలువైన సొత్తు, వాహనం, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డీసీపీలు అక్షాంశ్ యాదవ్, వైవీఎస్ సుదీంద్రలతో కలిసి బంజారాహిల్స్లోని టీజీ సీసీసీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. తన వ్యసనాలకు అన్నను బాధ్యుణ్ని చేస్తూ.. పశ్చిమ బెంగాల్ కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘోరాయ్, ఇంద్రజిత్ ఘోరాయ్ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. దోమలగూడలోని అరి్వంద్నగర్లో ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో నివసిస్తూ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తున్నారు. రంజిత్ ప్రస్తుతం 50 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరగా... ఇంద్రజిత్ తనకు ఉన్న వ్యవసాలు, ఆన్లైన్ బెట్టింగ్, జల్సాలతో ఆర్థికంగా చితికిపోయాడు. ఇటీవలే రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు ఖరీదు చేశాడు. దీంతో అన్నపై ఇంద్రజిత్ ఈర‡్ష్య పెంచుకున్నాడు. అన్న వద్ద ఉండే బంగారం వివరాలు గమనిస్తూ వచి్చన ఇంద్రజిత్.. ఇటీవల ఆ వివరాలను తన వాకింగ్ మేట్స్ అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్లకు చెప్పాడు. ఆ బంగారం దోచుకుని తీసుకువస్తే అందరికీ లాభమని అన్నాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్ విషయాన్ని బాలాపూర్కు చెందిన రౌడీషిటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా షేక్ మైలార్దేవ్పల్లికి చెందిన షబ్బీర్కు చెప్పాడు. గ్యాంగ్తో రంగంలోకి దిగిన అర్బాజ్.. ఇంద్రజిత్ ద్వారా రంగంలోకి దిగిన మైలార్దేవ్పల్లి రౌడీషిటర్ మహ్మద్ అర్బాజ్ దోపిడీ చేయడానికి అంగీకరించాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని వాటాపై బేరసారాలు చేసుకున్నారు. ఇవి కొలిక్కిరావడంతో అర్బాజ్ తన అనుచరులైన షోయబ్ ఖాన్, షేక్ ఉస్మాన్, షేక్ అల్లాఉద్దీన్, షేక్ అక్రమ్, షహబాజ్, నజీర్, జహీర్లతో కలిసి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తో చర్చించడంతో పాటు వాహనం ఖరీదు చేసిన అర్బాజ్.. రంజిత్ ఇంటి వద్ద రెక్కీ సైతం పూర్తి చేయించాడు. ఈ నేరం ఎలా చేయాలి? పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలు చర్చించడానికి వీళ్లు బహదూర్పురకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం తీసుకున్నారు. నేరం చేయడానికి పది రోజుల ముందు మైలార్దేవ్పల్లిలోని ఓ రెస్టారెంట్లో కీలక నిందితులతో సమావేశమైన నూరుల్లా పథకం అమలు చేయడం ఎలా? ఆధారాలు లేకుండా జాగ్రత్తపడటం ఎలా? అనే అంశాలను వారికి వివరించాడు. షబ్బీర్ ఇంటి నుంచి బయలుదేరిన ఆరుగురు... ఈ నెల 12 రాత్రి అర్బాజ్ నేతృత్వంలో హబీబ్ హుస్సేన్, షోయబ్, సైఫ్, గులాం మగ్దూం, షేక్ అల్లావుద్దీన్.. షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి వాహనంలో షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి రంజిత్ ఇంటి వద్దకు వచ్చారు. తమతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ భారీ గొడ్డలితో పాటు ఇతర గొడ్డళ్లు, కత్తులు, తుపాకీ మాదిరిగా కనిపించే లైటర్ తీసుకువచ్చారు. ఇంద్రజిత్ సాయంతోనే ఇంట్లోకి ప్రవేశించిన వీళ్లు రంజిత్ కుటుంబాన్ని బంధించి, వారి పిల్లల మెడపై కత్తి పెట్టి, అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని గాయపరిచి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఆపై ఇంట్లో ఉన్న రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండితో పాటు పూజ గదిలో ఉన్న రెండు కేజీల ఇత్తడి సామాను సైతం దోచుకుపోయారు. పోలీసులకు ఏమాత్రం ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ కేసు ఛేదించడానికి మధ్య మండల టాస్్కఫోర్స్ రంగంలోకి దిగింది. బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా?ముమ్మర గాలింపుతో.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న ఈ కేసు చిక్కుముడి విప్పడానికి ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్కుమార్, నాగేష్ శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేసి సాంకేతిక ఆధారాలు సేకరించారు. షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన 12 మందిని ఆదివారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1,228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని కొత్వాల్ ఆనంద్ తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు ప్రత్యేక రివార్డులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
తులం బంగారం ధర ఎలా ఉందంటే..
ఇటీవల కాలంలో మదుపర్లు స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆదివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శనివారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేరు.చెన్నైలో ఆదివారం బంగారం ధరలు వరుసగా రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)వద్ద ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా పసిడి ధరలో మార్పు లేదు.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్థిరంగానే ఉంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.77,600గా ఉంది. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే బంగారంలాగే ఎలాంటి మార్పులేదు. దాంతో కేజీ వెండి రూ.99,000 వద్దే స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధర ఈ రోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 పెరిగింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 పెరిగి రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 పెరిగి రూ.77,600 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరగడంతోపాటు వెండి ధరల్లో మార్పులు జరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర రూ.1,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.99,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే శుక్రవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,400 (22 క్యారెట్స్), రూ.76,800 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 తగ్గింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.76,800 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 తగ్గి రూ.70,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 దిగజారి రూ.76,950 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. గురువారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.1,000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మరింత పెరగనున్న బంగారం కొనుగోళ్లు: సంచలన రిపోర్ట్
విలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ- ఇక్రా పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14 శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023–24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.ఇక్రా నివేదిక ప్రకారం, బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ వినియోగదారుల డిమాండ్ తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం, బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్ కూడా పసిడి డిమాండ్కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది. పెరుగుతున్న దిగుమతులు..భారత్ బంగారం దిగుమతులు సైతం భారీగా పెరుగుతుండడం గమనార్హం. భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16% కాగా, దక్షిణాఫ్రికా వాటా 10%గా ఉంది. దేశంలోకి వచ్చీ – పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది.2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30% పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడనికి ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం - యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫై అయ్యింది.ఎకానమీకి సవాలు: జీటీఆర్ఐదేశంలోకి భారీగా పసిడి దిగుమతులు వాణిజ్య సమతౌల్యకు, కరెంట్ అకౌంట్ లోటుకట్టు తప్పడానికి.. తద్వారా ఎకానమీ పురోగతిని దెబ్బతీయడానికి దారితీసే అంశమని ఆర్థిక విశ్లేషణా సంస్థ–జీటీఆర్ఏ ఒక నివేదికలో పేర్కొంది. పసిడి దిగుమతుల విలువ పెరగడం ఆందోళనకరమైన విషయమని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం నవంబర్లో పసిడి దిగుమతుల విలువ ఆల్టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు. -
మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధర
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గిన నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే గురువారం బంగారం ధర భారీగా తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,700 (22 క్యారెట్స్), రూ.77,130 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.650, రూ.710 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.650, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,130 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.650 తగ్గి రూ.70,850కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.710 దిగజారి రూ.77,280 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. బుధవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.1,000 తగ్గి రూ.99,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మోడర్న్ ఆల్కెమీ.. లాబ్లో బంగారం
పసుపు రంగులో ధగధగలాడే బంగారం అంటే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో అంతులేని మోజు. బంగారం అరుదుగా దొరుకుతుంది. బంగారు గనులు అతి పరిమితంగా ఉంటాయి. అందుకే బంగారానికి అంత విలువ. ఇబ్బడి ముబ్బడిగా దొరికే తక్కువ విలువ చేసే లోహాలతో బంగారం తయారీకి మధ్య యుగాల్లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. శతాబ్దాల ప్రయత్నాల తర్వాత శాస్త్రవేత్తలు లాబొరేటరీల్లో విజయవంతంగా బంగారాన్ని తయారు చేయగలిగారు. లాబొరేటరీల్లో బంగారాన్ని తయారు చేసే ప్రక్రియలనే ‘మోడర్న్ ఆల్కెమీ’గా అభివర్ణిస్తున్నారు. మోడర్న్ ఆల్కెమీ కథా కమామిషూ తెలుసుకుందాం.బంగారం విలువ ఎక్కువ కాబట్టి దానికి అంత గిరాకీ. పురాతన కాలంలో నగలకే కాదు, నాణేలకూ బంగారమే వినియోగించేవారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు కూడా బంగారమే కీలకం. అరుదుగా ఉండే గనులను అన్వేషించి, వాటిని తవ్వి, ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలంటే రకరకాల దశల్లో రకరకాలుగా మనుషులు శ్రమించాల్సి ఉంటుంది. అంత శ్రమ లేకుండా, తక్కువ విలువైన లోహాలతో బంగారం తయారీ చేస్తే బాగుంటుందనే ఆలోచన మనుషులకు పురాతన కాలం నుంచే ఉండేది. తక్కువ విలువైన లోహాలతో బంగారం తయారీ ఎలా చేయాలనే దానిపై నానా రకాల ప్రక్రియలను ఊహించారు. వాటిపై రకరకాలుగా ప్రయోగాలు చేశారు. క్రమంగా ఈ ప్రక్రియలకు సంబంధించిన ‘శాస్త్రం’ ఒకటి రూపుదిద్దుకుంది. మనవాళ్లు దీనిని ‘పరుసవేది’ అని, ‘రసవిద్య’ అని అన్నారు. పాశ్చాత్యులు ‘ఆల్కెమీ’ అన్నారు. ‘అల్–కిమియా’ అనే అరబిక్ పదం నుంచి ‘ఆల్కెమీ’ అనే మాట వచ్చింది. దాదాపు నాలుగువేల ఏళ్ల కిందట ఆల్కెమీ ఆసియా, యూరోప్, ఆఫ్రికా ఖండాల్లోని వివిధ రాజ్యాల్లో విస్తృత ప్రాచుర్యంలో ఉండేది. పురాతన గ్రీకు, రోమన్ రాజ్యాల కాలంలో పాశ్చాత్య ప్రపంచంలో విపరీతమైన వేలంవెర్రి ఉండేది. అప్పట్లో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం ఆల్కెమీ పరిశోధనలకు కేంద్రంగా ఉండేది. అదేకాలంలో, ప్రాచ్య ప్రపంచంలో భారత ఉపఖండం, చైనా ఆల్కెమీ ప్రయోగాలకు ఆలవాలంగా ఉండేవి. ఆనాటి కాలంలో వేర్వేరు దేశాల్లోని రసవేత్తలు సీసం వంటి తృణలోహాలతో బంగారం తయారు చేసే ప్రక్రియ సహా కృత్రిమ పద్ధతుల్లో విలువైన రత్నాలను తయారు చేయడం, నకిలీ బంగారం, నకిలీ వెండి వంటి లోహాలను తయారు చేయడం వంటి ప్రక్రియలను వివరిస్తూ గ్రంథాలు రాశారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి రసవిద్య ఒక మార్మికశాస్త్రం స్థాయికి చేరుకుంది. ఆల్కెమీ పేరుతో ఆనాటి సమాజంలో రకరకాల మోసాలు కూడా జరిగేవి. ఈ పరిస్థితిని భరించలేక ఇంగ్లండ్లో కింగ్ హెన్రీ–ఐV ఆల్కెమీని నిషేధించాడు.అప్పట్లో దగ్గరగానే ఊహించారుమిగిలిన లోహాలతో పోల్చుకుంటే, పాదరసంతో బంగారం తయారీ కొంత సులువు. పాదరసం ఎక్కడ? బంగారం ఎక్కడ? ఈ రెండింటికీ పోలిక ఏమిటి? పాదరసంతో బంగారం తయారీ ఏమిటి? అని కొట్టి పారేయకండి. రసాయనిక శాస్త్రంతో కనీస పరిచయం ఉంటే, రెండింటికీ సంబంధం ఏమిటో సులువుగానే అర్థమవుతుంది. ఆవర్తన పట్టికలో పక్కపక్కనే ఉండే మూలకాలు బంగారం, పాదరసం. వీటిలో బంగారం పరమాణు సంఖ్య 79, పాదరసం పరమాణు సంఖ్య 80. సాంకేతికంగా అర్థం చేసుకోవాలంటే, పాదరసం పరమాణువులోని 80వ ప్రోటాన్ను తొలగించగలిగితే, అది బంగారం పరమాణువుగా మారుతుంది. ఆధునిక కాలంలో కృత్రిమంగా బంగారాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పాదరసాన్నే ఎంపిక చేసుకున్నారు. కొందరు శాస్త్రవేత్తలు 1941లో ప్రయోగాత్మకంగా పాదరసం పరమాణువుల్లోని 80వ ప్రోటాన్ను తొలగించి, బంగారాన్ని సృష్టించగలిగారు. దీనికోసం వారు కాంతివేగంతో న్యూట్రాన్ కిరణాలను పంపి, పాదరసం పరమాణువుల్లోని 80వ ప్రోటాన్ను తొలగించారు. ఈ ప్రక్రియను ‘న్యూట్రాన్ బాంబార్డ్మెంట్’ అంటారు. ఈ ప్రయోగంలో తయారైన బంగారం పరమాణువులు అణుధార్మికతతో ఉండటమే కాకుండా, బాహ్య వాతావరణానికి బహిర్గతమైనప్పుడు రసాయనిక చర్యలకు లోనై, నశించిపోయాయి. ప్రయోగశాలలో బంగారాన్ని సృష్టించే ప్రక్రియల్లో ఇది తొలి పాక్షిక విజయం. అంతకంటే ముందు పురాతన రసవేత్తలెవరూ తక్కువ విలువైన లోహాలతో బంగారాన్ని తయారు చేసిన దాఖలాల్లేవు.ఆవర్తన పట్టిక అంటే ఏమిటో తెలియని కాలంలో, మూలకాల పరమాణు సంఖ్యలపై ఏమాత్రం అవగాహన లేని కాలంలో మన భారతీయ రసవేత్తలు పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయడం సాధ్యమేనని ఊహించారు. క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందిన బౌద్ధ గురువులు సిద్ధ నాగార్జునుడు, సిద్ధ నిత్యానందుడు పాదరసం నుంచి బంగారం తయారీ సాధ్యమేనని ప్రగాఢంగా విశ్వసించారు. నాగార్జునుడు తన ‘రసేంద్ర మంగళం’, నిత్యానందుడు తన ‘రసరత్నాకరం’ గ్రంథాల్లో పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయడం గురించి విపులంగా రాశారు. బంగారానికి, పాదరసానికి గల దగ్గరి సంబంధం వాళ్లకు ఎలా తెలిసిందనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయమే! బంగారం బాదరబందీలుప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయడం సాధ్యమేనని ఇప్పటికే శాస్త్రవేత్తలు స్థూలంగా రుజువు చేయగలిగారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ప్రయోగశాలల్లో బంగారం తయారీ చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో గనుల్లో దొరికే బంగారానికి ప్రత్యామ్నాయంగా ప్రయోగశాలల్లో తయారైన బంగారాన్ని పరిగణించడం సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ఇప్పటి పద్ధతుల్లో బంగారాన్ని ప్రయోగశాలల్లో భారీ స్థాయిలో తయారు చేయడం వీలయ్యే పరిస్థితులు కూడా లేవు. గనుల్లో దొరికే బంగారం కంటే చౌకగా ప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయగల పద్ధతులు అభివృద్ధి చెందితే తప్ప జనాలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటి వరకు ఇన్ని ఫలితాలను సాధించిన శాస్త్రవేత్తలు కొన్నాళ్లకు ప్రయోగశాలల్లో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పరిమాణంలో బంగారాన్ని తయారు చేయగల పద్ధతులను రూపొందించ గలుగుతారనే ఆశాభావం కూడా ఉంది. ఒకవేళ శాస్త్రవేత్తలు ఆ ప్రయత్నాల్లో విజయం సాధించినా, ప్రయోగశాలల్లో తయారైన బంగారానికి మార్కెట్లో అంత త్వరగా ఆమోదం లభించకపోవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. సంప్రదాయ పద్ధతులకు అలవాటు పడిన జనాలు గనుల్లో దొరికిన బంగారానికే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో కృత్రిమ వజ్రాలను విజయవంతంగా తయారు చేస్తున్నారు. వీటిని ఆభరణాల్లో కూడా విరివిగా వాడుతున్నారు. గనుల్లో దొరికిన వజ్రాలతో పోల్చుకుంటే, కృత్రిమ వజ్రాలకు గిరాకీ తక్కువగా ఉంటోంది. ఆ అనుభవంతోనే ప్రయోగశాలల్లో తయారైన కృత్రిమ బంగారానికి కూడా ఆశించిన గిరాకీ ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. గనుల్లో దొరికే బంగారానికి, ప్రయోగశాలల్లో తయారు చేసిన కృత్రిమ బంగారానికి స్వచ్ఛతలో, నాణ్యతలో ఎలాంటి తేడా లేకపోయినా, కృత్రిమ బంగారానికి జనాదరణ ఏమేరకు ఉంటుందనేదే అనుమానం.కృత్రిమ బంగారంతో లాభాలుగనుల్లోంచి తవ్వి తీసిన బంగారంతో పోల్చుకుంటే, ప్రయోగశాలల్లో తయారు చేసిన కృత్రిమ బంగారంతో చాలా లాభాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గనుల్లోంచి తవ్వి తీసిన బంగారం కంటే చౌకగా ప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయగలిగితే, గనుల తవ్వకం వల్ల పర్యావరణానికి కలిగే చేటును పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు. గనుల్లోంచి బంగారాన్ని తీయడం వల్ల అడవుల నాశనం విపరీతంగా జరుగుతోంది. ముడి ఖనిజం నుంచి బంగారాన్ని వేరు చేయడానికి సైనైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన విషపదార్థాలను ఉపయోగించాల్సి వస్తోంది. గనుల్లో కార్మికుల శ్రమదోపిడీ విపరీతంగా జరుగుతోంది. బంగారు గనుల్లో పనిచేసే కార్మికులు తరచుగా ప్రమాదాల బారినపడటం, ప్రమాదకర రసాయనాలతో పనిచేయడం వల్ల వ్యాధిగ్రస్థులు కావడం జరుగుతోంది. ప్రయోగశాలల్లో చౌకగా బంగారాన్ని తయారు చేయగలిగితే, గనుల్లోని బంగారానికి ప్రత్యామ్నాయంగా జనాలు కృత్రిమ బంగారాన్ని ఆమోదించగలిగితే, ఇప్పటి వరకు గనుల వల్ల జరుగుతున్న అన్ని అనర్థాలనూ అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.బిస్మత్ నుంచి బంగారంపాదరసం నుంచి బంగారాన్ని సృష్టించడం సాధ్యమైనా, ఆ ప్రయోగం పాక్షికంగా మాత్రమే విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు మరింత మెరుగైన ఫలితాలను సాధించే దిశగా ప్రయోగాలను ప్రారంభించారు. అమెరికన్ రసాయనిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గ్లెన్ సీబోర్గ్ 1980లో బిస్మత్ నుంచి బంగారాన్ని విజయవంతంగా తయారు చేయగలిగాడు. బిస్మత్ పరమాణు సంఖ్య 83. బిస్మత్ పరమాణువుల్లోని అదనపు ప్రోటాన్లను ‘న్యూట్రాన్ బాంబార్డ్మెంట్’ కాకుండా వేరే ప్రక్రియలో విజయవంతంగా తొలగించగలిగాడు. పార్టికల్ యాక్సిలరేటర్ ద్వారా సీబోర్గ్ అదనపు ప్రోటాన్లను తొలగించి, బిస్మత్ను బంగారంగా మార్చగలిగాడు. ఈ ప్రయోగాన్ని సీబోర్గ్ తన బృందంతో కలసి లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీలో విజయవంతంగా జరిపాడు. ఈ ప్రక్రియ బాగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో దీనికి ఆదరణ లభించలేదు. ఈ పద్ధతిలో తయారు చేసిన బంగారం, గనుల్లోంచి తీసిన బంగారం కంటే ఎక్కువ ఖరీదు కావడంతో ప్రయోగం విజయవంతమైనా, జనాలకు ఉపయోగం లేకుండా పోయింది. పాదరసం నుంచి, బిస్మత్ నుంచి బంగారాన్ని తయారు చేసే ప్రక్రియల్లో మూలకాల పరమాణు నిర్మాణాన్ని మార్చడమే కీలకం. తక్కువ విలువ గల మూలకాల్లోని అదనపు ప్రోటాన్లను తొలగించడం ద్వారా వాటిని బంగారం పరమాణువులుగా మార్చడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు రుజువు చేయగలిగారు.మరిన్ని పద్ధతుల్లోనూ ప్రయోగాలుప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయడం కోసం మరిన్ని పద్ధతుల్లోనూ శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతులు:1 రసాయనిక పద్ధతి బంగారం రకరకాల భారలోహ సమ్మేళనాల ద్రావణం నుంచి బంగారు కణాలను వేరు చేసేందుకు శాస్త్రవేత్తలు లేజర్ పద్ధతిని కనుగొన్నారు. సమ్మేళనాల ద్రావణంలోకి శక్తిమంతమైన లేజర్ కాంతిని పంపడం ద్వారా బంగారు నానో కణాలను వేరు చేయగలిగారు. చాలా ఖర్చుతో కూడిన ఈ పద్ధతిలో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే బంగారం తయారీ సాధ్యమవుతోంది. కాబట్టి బంగారం తయారీకి ఈ పద్ధతి వల్ల ఉపయోగం అంతంత మాత్రమే!2లేజర్ పద్ధతిబంగారం రకరకాల భారలోహ సమ్మేళనాల ద్రావణం నుంచి బంగారు కణాలను వేరు చేసేందుకు శాస్త్రవేత్తలు లేజర్ పద్ధతిని కనుగొన్నారు. సమ్మేళనాల ద్రావణంలోకి శక్తిమంతమైన లేజర్ కాంతిని పంపడం ద్వారా బంగారు నానో కణాలను వేరు చేయగలిగారు. చాలా ఖర్చుతో కూడిన ఈ పద్ధతిలో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే బంగారం తయారీ సాధ్యమవుతోంది. కాబట్టి బంగారం తయారీకి ఈ పద్ధతి వల్ల ఉపయోగం అంతంత మాత్రమే!3 బ్యాక్టీరియా పద్ధతిబ్యాక్టీరియాకు, బంగారానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యం కలుగుతోందా? కొన్ని రకాల బ్యాక్టీరియాలకు బంగారాన్ని తయారు చేసే శక్తి ఉంది. ‘క్యూప్రియావిడస్ మెటాలిడ్యూరన్స్’ వంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలకు బంగారం కలిసిన వివిధ సమ్మేళనాల నుంచి బంగారం అయాన్లను గ్రహించి, వాటిని స్వచ్ఛమైన బంగారు కణాలుగా మార్చే సామర్థ్యం ఉంది. భారలోహ సమ్మేళనాల నుంచి బంగారాన్ని వేరు చేసేందుకు ఇలాంటి బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి. వీటివల్ల విషపూరితమైన భారలోహాల కాలుష్యం తగ్గి, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్టులు కాజేమ్ కషేఫీ, ఆడమ్ బ్రౌన్ తొలిసారిగా భారలోహ సమ్మేళనాల నుంచి బంగారాన్ని వేరుచేయగల బ్యాక్టీరియాను గుర్తించారు. -
పోలీసులకు సవాల్గా మారిన విజయ హత్య కేసు
కాజీపేట: ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కొట్టి చంపి ఏడాది కాలం గడిచినా.. హంతకుల ఆనవాళ్లు పోలీసులకు చిక్కకపోవడం చర్చనీ యాంశంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం 62వ డివిజన్ రహమత్ నగర్ కాలనీలో ఉండే కోన విజయ (68) అనే మహిళ గత ఏడాది డిసెంబర్ 14న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి విగతజీవిగా ఇంటి పక్క సందులో కనిపించింది. విజయ మృతదేహంపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతోపాటు బంగారు నగలు కనిపించకుండాపోయాయి. వెంటనే స్థానికుల సాయంతో విజయ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విభిన్న కోణాల్లో పోలీసుల విచారణ.. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సభ్యులు, డ్వాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ దాదాపు 16 గంటలపాటు పట్టణంలో ఎక్కడ ఉంది.. ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నిందితులు హత్యచేసి ఇంటి వద్ద పడేసి ఉంటారా.. లేక తెల్సిన వాళ్లకు అప్పుడప్పుడు చిన్న మొత్తంలో నగదును ఇస్తుండే విజయను మరెవరైనా హత్య చేశారా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినా ఆచూకీ లభించలేదు. అయితే .. విజయను ఏమార్చి కిడ్నాప్ చేసిన నిందితులు తలపై బలంగా కొట్టి చంపడంతోపాటు శరీరాన్ని పూర్తిగా సబ్బు పెట్టి కడిగి మృతురాలి ఇంటి పక్కన ఉన్న గల్లీలోనే అర్ధరాత్రి వేళ పడేసి వెళ్లారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో వెతికినా హత్యప్రదేశాన్ని గుర్తించకుండా ఉండేందుకు నిందితులు సబ్బుతో కడిగి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగల కోసమే హత్య చేసి ఉంటారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉంటాయా.. అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పోలీసులకు నిందితులకు సంబంధించిన ఆచూకీ చిక్కకపోవడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తుంది. హత్య జరిగినప్పుడు ఉన్న అధికారులు బదిలీపై వెళ్లడంతో కొత్తగా వచ్చిన అధికారులు హత్య కేసు ఫైల్ను తిరిగి తెరచి విచారణ జరుపుతున్నారు. ఘటనా సమయంలో ఉన్న అధికారులు ఒక క్రమపద్దతిలో విచారణ చేయకపోవడం కారణంగానే సమస్య తీవ్రత పెరగడంతోపాటు నిందితులు దొరక్కుండా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇప్పటి వరకు సుమారు 100మందిని విచారించారు. చిన్న క్లూ దొరికినా విడిచి పెట్టకుండా నేరస్తుల ఆట కట్టిస్తున్న పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. విజయ కేసులో నానాటికీ చిక్కుముడులు పెరుగుతున్నాయి. మొదట్లో కేసును సునాయాసంగా పరిష్కరించవచ్చని భావించిన పోలీసులకు గతంలో వచ్చిన దృశ్యం సినిమాను జ్ఞప్తికి తేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సీపీ అంబర్ కిశోర్ ఝా క్రైమ్ సమీక్ష సమావేశాల్లో తరచూ ఈ కేసును పరిష్కరించాలంటూ ఆదేశిస్తున్నప్పటికీ పోలీసుల విచారణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. -
మేలిమి బంగారంతో ఖరీదైన క్రిస్మస్ ట్రీ, ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా పవిత్ర క్రిస్మస్ సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానమైంది క్రిస్మస్ ట్రీని తయారు చేయిడం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ వార్తల్లో నిలిచింది. జర్మనీ ఈ స్పెషల్ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని మేలిమి బంగారు నాణాలతో రూపొందింది ఆవిష్కరించింది. ఆశ్చర్యంగా ఉంది కదా..రండి దీని విశేషాల గురించి తెలుసుకుందాం.అద్బుతమైన బంగారపు ట్రీని మ్యూనిచ్లోని బులియన్ డీలర్స్ ప్రో ఆరమ్ (Pro Aurum) తయారు చేసిందట. 10 అడుగుల ఎత్తు, దాదాపు 60 కిలోల బరువు, 2,024 (ఏడాదికి గుర్తుగా) బంగారు వియన్నా ఫిల్హార్మోనిక్ నాణేలతో ఈ ట్రీని తయారు చేశారు. ఈ నాణేం ఒక్కోటి ఒక ఔన్స్ బరువు ఉంటుంది. ఈ క్రిస్మస్ ట్రీల పైభాగంలో నక్షత్రం లేదా దేవదూత స్థానంలో 24 క్యారెట్ల బంగారు నాణెంతో(ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణేల్లో ఇదొకటి) వినియోగించారు. ఈ ట్రీని వియన్నా మ్యూసిక్వెరిన్ గోల్డెన్ హాల్ లాగా కనిపించే ఒక వేదికపై ఉంచారు. దీని విలువ ఏకంగా రూ.46 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇది అత్యంత ఖరీదైన క్రిస్మస్ చెట్లలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.కంపెనీ ప్రతినిధి బెంజమిన్ సుమ్మ అందించిన వివరాల ప్రకారంప్రతీ ఏడాది ఇలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది తమ కంపెనీ 35వ వార్షికోత్సవానికి చిహ్నంగా ఈ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇది కేవలం పండుగ అలంకరణ మాత్రమే కాదనీ, బంగారం విలువ తెలియ చేయడం కూడా ఒక ముఖ్య అంశమని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు అత్యంత ఖరీదైన చెట్టుగా రికార్డుల్లో నిలిచిన ఘనత మాత్రం అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్లో ప్రదర్శించిన క్రిస్మస్ ట్రీకే దక్కుతుంది.2010లొ 43అడుగులతో 11.4 మిలియన్ డాలర్లు వెచ్చించి వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, ఇతర విలువైన రాళ్లతో దీన్ని తయారు చేశారు. -
‘ఫోన్ పే’ పట్టించింది
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్బీఐ)లో 19 కిలోల బంగారం చోరీ కేసులో ముగ్గురు నిందితులను వరంగల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గత నెల 18వ తేదీ అర్ధరాత్రి చోరీ చేసిన ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా కా రులో వరంగల్ మీదుగా హైదరాబాద్కు వెళ్లి అక్కడి నుంచి మహారా ష్ట్ర వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.నాందేడ్లోని ఓ పెట్రోల్ బంక్లో ఇంధనం కోసం ఫోన్ పే ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయడంతో ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఈ కేసును ఛేదించగలి గారు. తమపైన పోలీసుల నిఘా ఉందని తెలియడంతో తిరిగి తెలంగాణకు వచ్చిన వీరిని చాకచాక్యంగా పట్టుకొని 2.520 కిలోల బంగారు ఆభరణాలు, ఒక కారు, రూ.పదివేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రిలోనే కుదిరిన స్నేహం యూపీకి చెందిన మహమ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్లు అన్నదమ్ములు. వీరికి సమీప గ్రామస్తులైన అర్షాద్ అన్సారీ, షాఖీర్ఖాన్ ఆలియాస్ బోలెఖాన్లు స్నేహితులు. ఓ దొంగతనం కేసులో మహ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్లు రాజ మండ్రి జైలుకు వెళ్లారు. ఈ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన హిమాన్షు బిగాం చండ్ జాన్వర్, సాగర్ భాస్కర్ గోర్, అక్ష య్ గజానన్ అంబోర్లతో పరిచయం ఏర్పడింది. 2024, ఫిబ్ర వరి 8న కాకినాడ జిల్లా పత్తిపాక ఎస్బీఐ బ్యాంక్లో రూ.30 లక్షల నగదు, కోటిన్నర విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. సరిగ్గా 40 రోజుల క్రితం కర్ణాటకలోని ఓ ఎస్బీఐ బ్యాంక్ లో రూ12.95 కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లారు. ఆ తర్వాత గత నెల 19న గూగుల్ మ్యాప్ ద్వారా రాయపర్తి ఎస్బీఐ లొకే షన్ గుర్తించడంతోపాటు అక్కడ భద్రతా సిబ్బంది లేకపో వడాన్ని రెక్కీ చేసుకొని నిర్ధారించుకున్నాకే దొంగతనం చేశారు. రెండున్నర కిలోల బంగారం, కారు స్వాధీనం : వరంగల్ సీపీబంగారం చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో నలుగురి కోసం గాలిస్తున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. వీరి నుంచి 2 కిలోల 520 గ్రా ముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్ రాయపర్తి మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ చోరీ అనువైనదిగా గుర్తించిన తర్వాతే ఈ బ్యాంక్లో బంగారం ఎత్తుకెళ్లారన్నారు. నవంబర్ 19న నిందితులు 3 బృందాలుగా విడిపోయి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కు తిరిగివెళ్లిపోయారు.ఈ భారీ చోరీపై అప్రమత్త మై వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నేతృత్వంలోని వర్థన్న పేట ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఏసీపీ భోజరాజు, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో పదికిపైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల పట్టుకున్నామని సీపీ కిశోర్ ఝా తెలి పారు. అరెస్టయిన వారిలో అర్షాద్ అన్సారీ, షాఖీర్ ఖాన్ అలి యాస్ బోలెఖాన్, హిమాన్షు బిగాం చండ్ జాన్వర్ ఉన్నారు. -
1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!
దేశంలోకి విభిన్న మార్గాల ద్వారా అక్రమంగా రవాణా చేయాలని చూసిన 7,348.68 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. 2023-24లో స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వివరాలు వెల్లడించింది. 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నివేదిక విడుదల చేసింది. బంగారంతోపాటు వెండి, డ్రగ్స్, విలువైన లోహాలను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు తరచు వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.2023-24 లెక్కల ప్రకారం డీఆర్ఐ తెలిపిన వివరాల కింది విధంగా ఉన్నాయి.8,223.61 కిలోల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించి 109 కేసులు నమోదయ్యాయి.రూ.974.78 కోట్ల విలువ చేసే 107.31 కిలోల కొకైన్రూ.365 కోట్ల విలువ చేసే 48.74 కిలోల హెరాయిన్రూ.275 కోట్ల విలువ చేసే 136 కిలోల మెథాంఫెటమైన్236 కిలోల మెఫెడ్రోన్రూ.21 కోట్ల విలువ చేసే 7,348.68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ పేర్కొంది.విమాన మార్గం ద్వారా కొకైన్ అక్రమ రవాణా పెరుగుతోంది. కొకైన్కు సంబంధించి 2022-23లో 21 కేసుల నమోదవ్వగా 2023-24లో అది 47కు పెరిగింది.ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ సరఫరా అధికమవుతోంది.కస్టమ్స్ అధికారులకు సహకరిస్తూ..గతంలో కంటే బంగారం అక్రమ తరలింపు ఈసారి పెరిగిందని అధికారులు తెలిపారు. 2023-24లో డీఆర్ఐ 1,319 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అందులో భూమార్గం 55 శాతం, వాయుమార్గం 36 శాతం కట్టడి చేసినట్లు చెప్పింది. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం అదనంగా 4,869.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!స్మగ్లింగ్ కోసం సిండికేట్లు‘ప్రధానంగా మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఇండియాకు వచ్చే సరిహద్దు మార్గాల్లో నిత్యం తనిఖీ నిర్వహించి బంగారం స్మగ్లింగ్ను కట్టడి చేస్తున్నాం. ఇటీవల కొన్ని ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు స్మగ్లింగ్ కార్యకలాపాలకు కీలక ప్రదేశాలుగా మారాయి. ఇండియాలో బంగారం స్మగ్లింగ్ కోసం సిండికేట్లను నియమించుకుంటున్నారు. విదేశీ పౌరులు, విదేశాలకు వెళ్లొస్తున్న కుటుంబాలు, ఇతర వ్యక్తులు ఇందులో భాగమవుతున్నారు. చాలాచోట్ల విమానాశ్రయాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడా అక్రమ రవాణాలో సహకరిస్తున్నారు’ అని డీఆర్ఐ నివేదిక తెలిపింది. -
ఎంత మంచి వాడివయ్యా!
ఘంటసాల: సామాన్య పౌరుడు నిజాయతీ చూపించాడు. రోడ్డుపై పడి ఉన్న బంగారాన్ని గమనించి సదరు నగలు ఎవరివో ఆరా తీసి అప్పగించాడు. ఈ సంఘటన బుధవారం ఘంటసాలలో జరిగింది. స్థానిక అంబేడ్కర్ నగర్కు చెందిన గంజి శాంతశ్రీ స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖలో గోల్డ్ లోను చెల్లించి రూ.90 వేల విలువైన 13 గ్రాముల బంగారాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో బ్యాంక్ పాస్బుక్, నగలతో ఉన్న కవర్ పడిపోయింది. కవర్ పడిపోయిన సంగతి చూసుకోని శాంతశ్రీ ఇంటికి వెళ్లిన తర్వాత గమనించి తీవ్ర ఆందోళనకు గురైంది. కాగా రోడ్డుపై పడి ఉన్న కవరును మల్లాయి చిట్టూరు గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు గమనించగా, బంగారం, ఎస్బీఐ పాస్ బుక్ కనిపించాయి. దీంతో సుబ్బారావు బ్యాంకు వెళ్లి బ్రాంచ్ మేనేజర్ సునీల్ కుమార్కు అప్పిగించాడు. వాటిని పరిశీలించిన బ్యాంకు మేనేజర్ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించి శాంతశ్రీకి సమాచారం అందించారు. ఆందోళన చెందుతూ రోడ్డుపై వెతుక్కుంటూ వస్తున్న శాంతశ్రీ బ్యాంకు వారి నుంచి వచ్చిన సమాచారంతో ఊపిరి పీల్చుకుంది. బ్యాంకుకు వచ్చిన శాంతశ్రీకి బీఎం సునీల్ కుమార్ సిబ్బంది సమక్షంలో బంగారం అప్పగించారు. రోడ్డుపై దొరికిన బంగారం నిజాయతీగా తెచ్చి అప్పగించిన సుబ్బారావును బ్యాంకు అధికారులు అభినందించి బహుమతి అందించారు. దొరికిన బంగారం తమకు అప్పగించిన సుబ్బారావుకు శాంతశ్రీ, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయతీజగ్గయ్యపేట అర్బన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న సుమారు 25 వేల విలువైన బంగారు చెవి దిద్దులు, జుకాలను బస్సులో వెతికి తిరిగి వాటిని ప్రయాణికురాలికి అందజేసిన కండక్టర్ శ్రీదేవిని పలువురు అభినందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీరేణుకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రాంతానికి చెందిన ఆరేపల్లి నాగమణి ఈనెల 26వ తేదీ రాత్రి 7.30కు విజయవాడలో ఉన్న బిడ్డ వద్దకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. ప్రయాణం మధ్యలో బిడ్డకు చెందిన నగలు చెవి దిద్దులు, జూకాలు ఆమె వద్ద నుంచి జారి సీటు కింద పడిపోయాయి. ఈ విషయం గమనించని ఆమె విజయవాడలోని భవానీపురం స్టేజి వద్ద దిగి బిడ్డ ఇంటికి వెళ్లి చూసుకుంది. బ్యాగులో ఉన్న నగలు కనిపించకపోవడంతో బస్సులోనే పడిపోయి ఉంటాయని భావించి విజయవాడ బస్టాండ్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె టికెట్ను బట్టి ఆ బస్సు కండక్టర్ వి.శ్రీదేవి అని తెలుసుకొని ఆమెకు చెప్పారు. అప్పటికే బస్సులో ప్రయాణికులు ఎక్కడంతో 3వ సీటు కింద చూడగా ఆభరణాలు ఉన్నాయి. దీంతో కండక్టర్ శ్రీదేవి అధికారుల సమక్షంలో బాధితురాలి భర్త ఆరేపల్లి వెంకటేశ్వర్లుకు వాటిని అందజేశారు. -
మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సెషన్ల నుంచి ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుతున్నాయి. ఇప్పటివరకు కొంత సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,800 (22 క్యారెట్స్), రూ.77,240 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1200, రూ.1310 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1310 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,240 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1200 తగ్గి రూ.70,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1310 దిగజారి రూ.77,390 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,650 (22 క్యారెట్స్), రూ.77,070 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.760, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,070 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.700 పెరిగి రూ.70,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.760 పెరిగి రూ.77,220 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్సిల్వర్ ధరలుబంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా మంగళవారం భారీగానే పెరిగాయి. సోమవారంతో పోలిస్తే ఈరోజు కేజీకి రూ.2,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,01,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్గా శోభిత పెళ్లి చీర
టాలీవుడ్లో మోస్ట్ ఎవైటింగ్ వెడ్డింగ్ అంటే హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళదే. ఈ లవ్బర్డ్స్ వచ్చే నెల(డిసెంబర్ 4, 2024న) మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు జోరుగా చేస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య , శోభితా వివాహ ఆహ్వాన పత్రం కూడా ఆన్లైన్లో వైరల్గా మారింది. మరోవైపు శోభితా పెళ్లి చీర, షాపింగ్ వివరాలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తన జీవితంలో అతి ముఖ్యమైన ఈరోజుకోసం శోభిత చాలా ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం ఎలాంటి డిజైనర్ లేకుండానే తెలుగు వారసత్వాన్ని చాటుకునేలా స్వయంగా తానే దుస్తులను ఎంపిక చేసుకుంటోందట శోభితా ధూళిపాళ. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అమ్మతో కలిసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో షాపింగ్లో బిజీబిజీగా గడుపుతోంది. తన పెళ్లిలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోందట. పెళ్లి రోజు కోసం ప్యూర్ గోల్డ్ జరీతో నేసిన కంజీవరం పట్టుచీరలో అందంగా మెరిసిపోనుంది. అలాగే కాబోయే వరుడు నాగ చైతన్య కోసం కూడా మ్యాచింగ్ సెట్ను సెలెక్ట్ చేసినట్టు తెలిప్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని పొందూరులో నేసిన తెల్లటి ఖాదీ చీరను కూడా కొనుగోలు చేసిందట.కాగా ఇటీవల నిశ్చితార్థ వేడుకలు పసుపు దంచడం లాంటి కీలకమైన వేడుకల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా శోభితా ధూళిపాళ చీరలో అందంగా కనిపించింది. పెళ్లి పనులు మొదలు పెట్టిన సందర్భంలో బంగారు, ఆకుపచ్చ క్రీమ్ షేడ్స్లో, ఆరెంజ్ కలర్ బార్డర్చీరతో కనిపించిన సంగతి తెలిసిందే. -
గోల్డ్ ఈటీఎఫ్లు కళకళ
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) అక్టోబర్లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
పసిడి ప్రియులకు చేదువార్త...! మళ్లీ రేటెక్కిన బంగారం..
-
బుల్లి వాచీకి భారీ ధర
వందేళ్ల క్రితం 1,500 మందికి పైగా ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన టైటానిక్ నౌక విషాదం అందరికీ తెలిసిందే. ఆ విపత్తు బారి నుంచి 700 మందిని కాపాడినందుకు ఆర్ఎంఎస్ కర్పతియా నౌక కెప్టెన్ ఆర్థర్ రోస్ట్రన్కు బహూకరించిన పాకెట్ వాచీ ఇది. ఈ బుల్లి బంగారు వాచీ తాజాగా వేలంలో 20 లక్షల డాలర్లు పలికింది! -
ధర పెరిగినా, తగ్గినా.. భారత్లోనే బంగారం చీప్!
ఒమన్, ఖతార్, సింగపూర్, యూఏఈ వంటి దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు కొంత తక్కువగా ఉన్నాయని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక పేర్కొంది.2024 నవంబర్ 16 నాటికి భారతదేశంలో బంగారం ధరలు రూ.75,650 (24 క్యారెట్ల 10గ్రా), రూ.69,350 (22 క్యారెట్ల 10గ్రా)గా ఉన్నాయి. నవంబర్ 1వ తేదీ ధరలతో పోలిస్తే.. ప్రస్తుత ధరలు చాలా క్షీణించినట్లు తెలుస్తోంది.యూఏఈలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,204. సింగపూర్లో రూ.76,805, ఖతార్లో రూ.76,293, ఒమన్లో రూ.75,763గా ఉంది. ఈ ధరలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు కొంత తక్కువే అని స్పష్టంగా అర్థమవుతోంది.భారత్లో బంగారం తగ్గుదలకు కారణంమార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. బంగారం ధర తగ్గడానికి కారణం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగియడం, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అని తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గుదల కూడా గోల్డ్ రేటు తగ్గడానికి దోహదపడింది.ఇదీ చదవండి: జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్భారతదేశంలో బంగారం మీద పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఒమన్, ఖతార్, సింగపూర్, యుఏఈ వంటి దేశాల్లో మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇది కూడా అక్కడ బంగారం ధరల పెరుగుదలకు కారణం అయింది. -
6 శాతం తగ్గిన బంగారం ధరలు..
దసరా, దీపావళి సమయంలో బంగారం ధరలు తారాజువ్వలా పైకి లేసాయి. ఈ పండుగలు ముగియడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వడం జరిగిన తరువాత పసిడి ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. దీపావళి నుంచి గోల్డ్ రేట్లు దాదాపు 6 శాతం క్షీణించాయి.2024 నవంబర్ 1న 80,710 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 16) 75,650 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెల ప్రారంభంలో ఉన్న ధరలకు, ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమవుతోంది.బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా డిమాండ్ మాత్రం తగ్గే అవకాశం లేదు. ముఖ్యంగా భారతదేశంలో కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్ బంగారం విక్రయాలను గణనీయంగా పెంచాయని మల్హోత్రా జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ధృవ్ మల్హోత్రా పేర్కొన్నారు. అయితే బంగారం ధరల తగ్గుదల మరింత ఎక్కువ మందిని బంగారం కొనేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడుల కంటే కూడా.. బంగారం మీద పెట్టే పెట్టుబడులు చాలా సురక్షితమని చాలామంది భావిస్తున్నారు. ఈ కారణంగానే.. పెట్టుబడిదారులు కూడా బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడింది. ప్రస్తుత పరిస్థితి మాదిరిగానే.. బంగారం రేటు తగ్గుతూ పోతే మళ్ళీ పాత ధరలకు చేరుకునే అవకాశం ఉంది. -
బంగారం Vs బిట్కాయిన్.. ఏది బెస్ట్..?
-
మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్మార్కింగ్’
బంగారు ఉత్పత్తులకు అందించే హాల్మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ)ను మరో 18 జిల్లాల్లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు తప్పనిసరి హాల్మార్కింగ్ విధానంతో 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు, వస్తువులు ఈ గుర్తింపు పొందాయి. ఇది మార్కెట్లో బంగారు ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారుల విశ్వాసాన్ని, ఉత్పత్తుల పారదర్శకతను పెంపొందిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.‘గోల్డ్ జువెల్లరీ అండ్ గోల్డ్ ఆర్ట్ఫ్యాక్ట్స్ ఎమెండమెంట్ ఆర్డర్-2024’ ప్రకారం బంగారు ఉత్పత్తులపై తప్పనిసరి హాల్మార్కింగ్ ఉండాలి. అందులో భాగంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 5, 2024 నుంచి హెచ్యూఐటీ నాలుగో దశను ప్రారంభించింది. ఇందులో అదనంగా 18 జిల్లాలను చేర్చారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా హాల్మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగా చేరిన జిల్లాలతో కలిపి తప్పనిసరి హాల్మార్కింగ్ విధానం అమలులో ఉన్న జిల్లాల సంఖ్య 361కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని జిల్లాల్లో తప్పనిసరి హాల్మార్కింగ్ విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.ఇదీ చదవండి: 17,000 మంది ఉద్యోగుల తొలగింపు!తప్పనిసరి హాల్మార్కింగ్ విధానం ప్రారంభమైన జూన్ 23, 2021 నుంచి నమోదిత నగల వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విధానం అమలు ప్రారంభంలో వీరి సంఖ్య 34,647గా ఉండేది. ప్రస్తుతం అది దాదాపు ఐదురెట్లు పెరిగి 1,94,039కు చేరింది. హాల్మార్కింగ్ కేంద్రాల సంఖ్య 945 నుంచి 1,622కి పెరిగింది. -
బంగారం ధర భారీగా పతనం .. ఎంతంటే?
-
Gold Prices: తగ్గుతున్న బంగారం ధరలు
-
కొండెక్కిన బంగారం ధరలు..
-
ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడడంతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠం ఎక్కనున్నారు. ఇప్పటివరకు కొంత సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నాట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు గురువారం యూటర్న్ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,000 (22 క్యారెట్స్), రూ.78,560 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1650, రూ.1790 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1650, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1790 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.72,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,560 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1650 తగ్గి రూ.72,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1790 దిగజారి రూ.78,710 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. బుధవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.3,000 తగ్గి రూ.1,02,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నిన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క: నేటి బంగారం ధరలు ఇవే..
నవంబర్ నెల ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పసిడి రేటు మళ్ళీ పెరిగింది. ఈ కథనంలో నేడు (నవంబర్ 6) దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడా తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ) 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,350 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు పసిడి ధర వరుసగా రూ. 100, రూ. 110 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, వైజాగ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,350 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 పెరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. చెన్నైలో బంగారం ధరలు ఒకే మాదిరిగా ఉన్నాయి.దేశ రాజధానిలో బంగారం ధర రూ. 110 (10 గ్రా 24 క్యారెట్స్) & రూ. 100 (10 గ్రా 22 క్యారెట్స్) పెరిగింది. అయితే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేట్లు వరుసగా రూ. రూ. 80,500.. రూ. 73,800 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్న ప్రాంతం ఢిల్లీ అని స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 5) పసిడి రేటు గరిష్టంగా రూ.160 తగ్గింది. దీంతో గోల్డ్ ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. కాబట్టి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేటు ఎలా ఉందనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఆంధ్రప్రదేశ్ (విజయవాడ), తెలంగాణ (హైదరాబాద్) వంటి తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,240.. 22 క్యారెట్ల ధర రూ.73,550 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు రూ. 150 (10 గ్రా 24 క్యారెట్స్) & రూ. 160 (10 గ్రా 22 క్యారెట్స్) తగ్గింది. ధరలు ఎంత తగ్గినప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధానిలో బంగారు ధరలు ఈ రోజు రూ. 80,390, రూ. 73,700 వద్ద నిలిచాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,240 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,550 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా రూ.1,000 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ. 1,05,000 వద్ద నిలిచింది. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా బంగారం, వెండి ధరలు ఏ మాత్రం పెరగలేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మారని ధరలు: బంగారం కొనడానికి ఇదో మంచి ఛాన్స్!
అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. నవంబర్ ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టాయి. అయితే గత రెండు రోజులుగా ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు (నవంబర్ 4) దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి?.. ఏ రాష్ట్రంలో గోల్డ్ రేటు ఎక్కువగా ఉందనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే గత మూడు రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?ఢిల్లీలో గోల్డ్ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధానిలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.చెన్నైలో కూడా పసిడి ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ డబ్బు రవాణాపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అందులో భాగంగా అక్టోబరు 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముంబై, ఉప నగరాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తనిఖీలు, నాకా బందీలు నిర్వహించారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, విదేశీ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు. అయితే ఈ సొత్తు ఎవరిది..? ఎవరికి అందజేయడానికి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. రూ.187 కోట్ల విలువైన నగదు స్వాధీనం ఎన్నికలు సమీపించడంతో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా కావడం పరిపాటిగా మారింది. నాకాబందీలు, తనిఖీలు నిర్వహించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అవుతూనే ఉంది. అయినప్పటికీ పోలీసులు, వివిధ శాఖల అధికారులు డేగ కళ్లతో కాపుకాస్తూ కోట్లలో అక్రమ డబ్బు, డ్రగ్స్, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చన తరువాత వివిధ శాఖల పోలీసులు, అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.187.88 కోట్లు విలువచేసే సొత్తు హస్తగతం చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా రూ.75 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.60 కోట్లు, ఆదాయ పన్ను శాఖ ద్వారా రూ.11 కోట్లు, మిగతా ఎన్నికల అధికారుల ద్వారా పట్టుకున్న సొత్తు ఉంది. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై 2,637 కేసులు నమోదు చేశారు. అందుకు బాధ్యులైన 2,460 నిందితులపై చర్యలు తీసుకున్నారు.అలాగే రూ.9.61 కోట్లు విలువచేసే మద్యం నిల్వలను జప్తు చేశారు. జప్తు చేసిన మద్యంలో విదేశీ, దేశీ, నాటుసారా, తెల్లకల్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు తాము ప్రయతిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్పర్ కమిషనర్ ప్రసాద్ సుర్వే అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం వినియోగించే అవకాశాలుంటాయి. దీంతో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు, తనఖీలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రహస్య పార్టీలపై నిఘా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పరితపిస్తున్నారు. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. కార్యకర్తలు సహా ఓటర్లను సంతోష పెట్టేందుకు రహస్యంగా మద్యం పారీ్టలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంటింటికి వెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతుంటారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి రహస్య పారీ్టలపై నిఘా వేస్తున్నారు. అందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 164 మంది కార్యకర్తలను అదపపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాకు చెక్ పేట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 25 పరి్మనెంట్ చెక్ పోస్టులు, 26 తాత్కాలిక చెక్ పోçస్టులను ఏర్పాటు చేశారు. టోల్ నాకాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహిల్యనగర్–పుణే జాతీయ రహదారిపై పార్నెర్ తాలూకా హద్దులో ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ వాహనంలో సుమారు రూ.25 కోట్లు విలువచేసే బంగారం పట్టుకున్నారు. అయితే కార్టన్ బాక్స్లో ప్యాకింగ్ చేసిన ఈ బంగారం ఎవరిచ్చారు..? ఎవరికిచ్చేందుకు తీసుకెళుతున్నారనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వాహనంలో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 45 కేజీల వెండి కడ్డీలు లభించాయి. దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు బయటపడవని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 160 చెరుకు క్రషింగ్ ఫ్యాక్టరీలు, 36 దేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, 45 బీరు తయారుచేసే ఫ్యాక్టరీలు, 65 వైనరీ, 48 విదేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు అలాగే 216 నాటుసారా విక్రయించే షాపులు, 262 విదేశీ మద్యం విక్రయించే షాపులు, 1,734 వైన్ షాపులు, 4,155 దేశీ మద్యం విక్రయించే షాపులున్నాయి. దీంతో ఓటింగ్, కౌంటింగ్ తంతు పూర్తయ్యేంత వరకు హోల్సెల్, రిటైల్ మద్యం షాపులపై సీసీ టీవీ కెమరాల ద్వారా నిఘా వేయనున్నారు. ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దు.. ఎన్నికలకు ముందు విచ్చల విడిగా అక్రమంగా డబ్బు రవాణా జరుగుతుంది. అందుకు సొంత, అద్దె వాహనాలతోపాటు పోలీసు వ్యాన్లను కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదు. అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ కొందరు నేతలు పోలీసు జీపులు, వ్యాన్లలో డబ్బు రవాణా చేసే ఆస్కారముంది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో, నగరాలు, పట్టణాల్లో నాకాబందీలు, తనిఖీలు చేసే సమయంలో పోలీసు వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయకుండా వదిలిపెట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది.