బంగారు బాపట్లగా తీర్చిదిద్దుకుందాం | Sakshi
Sakshi News home page

బంగారు బాపట్లగా తీర్చిదిద్దుకుందాం

Published Mon, May 6 2024 8:30 AM

బంగారు బాపట్లగా తీర్చిదిద్దుకుందాం

ఎమ్మెల్యే కోన రఘుపతి

బాపట్ల: బాపట్లను బంగారు బాపట్లగా తీర్చిదిద్దుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. పౌర సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ఎకో హౌసెస్‌ ఏర్పాటు చేసిన వేదికలో సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యుర్థులు పాల్గొన్నారు. ఈ వేదికలో ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ చరిత్ర కలిగిన బాపట్లను.. టెంపుల్‌ టౌన్‌గా అభివృద్ధి చేయటంతో పాటు పర్యాటక కేంద్రంగా మారుస్తానని చెప్పారు. జిల్లా కేంద్ర స్థాయిలో బాపట్లను అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేశామని కోన చెప్పారు. మరో ఐదేళ్లలో రూ.75 కోట్లతో బాపట్ల పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మరాజు, అభ్యుర్థులు వేద శ్రీనివాసరావు, జి.రాజారావు పాల్గొని, తమ పార్టీ అజెండాను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పౌర సమాఖ్య సభ్యులు డాక్టరు పి.విజయ్‌కుమార్‌, డాక్టరు పి.సి.సాయిబాబు, డాక్టరు పి.ఆశా మాధవి, జి.రమాదేవి, జీవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement