రైతులపై ఏనుగుల దాడి | elephants attacked on farmers in chittoor district | Sakshi
Sakshi News home page

రైతులపై ఏనుగుల దాడి

Published Fri, Nov 27 2015 11:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి రైతులపై ఏనుగులు దాడికి తెగబడ్డాయి.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి ఏనుగులు దాడికి తెగబడ్డాయి. గుడిపల్లి మండలం బోయినపల్లిలో పొలంలో నిద్రిస్తున్న రైతులపై ఏనుగులు దాడి చేశాయి.

ఈ దాడిలో గణేశ్, మురుగేశ్ అనే రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం ఏనుగులు అలుగుమానిపల్లె అటవీ ప్రాంతంలోకి వెళ్లాయని స్థానికులు చెప్పుతున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖాధికారులు ఏనుగుల కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement